ఆరు నెలల్లో అమరావతి పూర్తి కావాలి -హై కోర్టు

ఆంధ్ర ప్రదేశ్ హై కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. రాష్ట్ర ప్రభుత్వం ఆరు నెలల్లో ఆంద్ర ప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం పూర్తి చేయాలని స్పష్టం చేసింది. రాజధానిని ఎలా వీలుంటే అలా ఒక చోటి నుండి మరొక చోటికి మార్చే హాక్కు గాని, లేదా ప్రభుత్వ అంగాలను చిత్తం వచ్చిన రీతిలో ముక్కలు చేసే అధికారం గానీ రాష్ట్ర ప్రభుత్వానికి లేదు అని హై కోర్టు తీర్పు చెప్పింది. మూడు రాజధానుల చట్టాన్ని రద్దు చేస్తున్నట్లు…

రష్యా మిలటరీ ఆపరేషన్ ఆపాలి -ఐరాస

రష్యా ఉక్రెయిన్ లో సాగిస్తున్న మిలట్రీ ఆపరేషన్ ను వెంటనే ఆపాలని ఐక్యరాజ్య సమితి తీర్మానం ఆమోదించింది. 193 సభ్య దేశాలున్న ఐక్య రాజ్య సమితి (యూ‌ఎన్‌ఓ) జనరల్ అసెంబ్లీ బుధవారం జనరల్  అసెంబ్లీ సమావేశం జరిపింది. ఉక్రెయిన్ అంశం ఎజెండాగా అత్యవసర జనరల్ అసెంబ్లీ సమావేశం జరపాలా లేదా అన్న అంశంపై ఐరాస భద్రతా సమితి నిన్న ఓటింగ్ నిర్వహించింది. 5 శాశ్వత సభ్య దేశాలతో పాటు 10 తాత్కాలిక సభ్య దేశాలు ఓటింగ్ లో…

ఆఫ్ఘన్ పై పట్టు: రేసులో అమెరికా ముందంజ (ఇప్పటికి!)

తన భౌగోళిక రాజకీయ ప్రయోజనాల కోసం ఎలాంటి అడ్డదారి తొక్కడానికైనా అమెరికా ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. రొయ్యలు ఒంటికి మంచిది కాదని ఊరంతా నీతులు చెప్పి రొయ్యల బుట్ట తానే మాయం చేసేసి లొట్టలు వేస్తూ భుజిస్తుంది. ఈ సంగతి మరోసారి రుజువు చేసుకుంది అమెరికా. ఎవరికీ చెప్పా పెట్టకుండా, కనీసం సంకేతాలు కూడా ఇవ్వకుండా తాలిబాన్ కు నిధులు అందించే మార్గాన్ని అమెరికా తెరిచి పట్టుకుంది. తద్వారా ఆఫ్ఘనిస్తాన్ దేశం ఆర్ధిక మూలాలు తన చేతుల్లో…

ప్రధాని భద్రత: కేంద్రానికి సుప్రీం కోర్టు తలంటు

ప్రధాన మంత్రి  నరేంద్ర మోడి జనవరి 5 తేదీన పంజాబ్ పర్యటనకు వెళ్ళిన సందర్భంగా ఆయనకు భద్రత కల్పించడంలో పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా విఫలం అయిందని కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఆరోపణలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ప్రధాన మంత్రి సైతం నాటకీయమైన వ్యాఖ్యలతో రాజకీయ డ్రామాకు తెరలేపారు. డ్రామాను రక్తి కట్టించడం కోసం ఎస్‌పి‌జి భద్రతా ప్రోటోకాల్స్ అనీ, బ్లూ బుక్ ఉల్లంఘన అనీ చెబుతూ పంజాబ్ అధికారులకు కేంద్రం ఏకపక్షంగా దోషిత్వాన్ని నిర్ధారించి…

మోడి అహంకారి! -మేఘాలయ గవర్నర్

ప్రధాన మంత్రి నరేంద్ర మోడి అహంకారి అని మేఘాలయ గవర్నర్ సత్య పాల్ మాలిక్ అభివర్ణించారు. రైతుల సమస్య గురించి చర్చించడానికి వెళితే ఇద్దరం వాదులాడుకోవలసిన పరిస్ధితి ఏర్పడిందని ఆయన చెప్పుకొచ్చారు. (ఇండియన్ ఎక్స్^ప్రెస్, జనవరి 3, 2022) బి‌జే‌పి నేతృత్వం లోని కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని అదురు బెదురు లేకుండా విమర్శించే బి‌జే‌పి నేతల్లో సత్య పాల్ మాలిక్ ఒకరు. రెండు అధికార కేంద్రాలు (నరేంద్ర మోడి, ఆర్‌ఎస్‌ఎస్) ఉన్న చోట…

చట్టం అమలు: మెజారిటీలకి ఒకటి, మైనారిటీలకి ఒకటి

మునవర్ ఫరూకి ఒక స్టాండప్ కమెడియన్. జనాన్ని నవ్వించడం ఈ యువ కళాకారుడి వృత్తి, ప్రవృత్తి. జనవరి 1, 2021 తేదీ ఇండోర్ (మధ్య ప్రదేశ్) పట్టణంలో అతను ప్రదర్శన ఇవ్వబోతుండగా పోలీసులు అరెస్టు చేశారు. సెక్షన్ 295 ఏ కింద కేసు పెట్టారు. నేరం ఏమిటని విలేఖరులు అడిగితే “తన కామెడీ షోలో ఇతరుల మత భావాలను నమ్మకాలను అవమానపరిచాడు” జిల్లా ఎస్‌పి అని చెప్పాడు. “మునవర్ ఆరోజు అసలు షో మొదలు పెట్టకుండానే అరెస్ట్…

స్వతంత్రం రెచ్చగొడితే తీవ్ర చర్యలు తప్పవు! -తైవాన్ తో చైనా

చైనా మరోసారి తైవాన్ ను తీవ్రంగా హెచ్చరించింది. ‘స్వతంత్రం’ పేరుతో జనాన్ని రెచ్చగొడుతూ ఉంటే తీవ్ర చర్యలు తప్పవు, అని చైనా ప్రభుత్వం తైవాన్ ను హెచ్చరించింది. “స్వతంత్రం ప్రకటించుకునే వైపుగా ఏ మాత్రం అడుగు వేసినా చర్యలు తప్పవు” అని తైవాన్ అఫైర్స్ ఆఫీస్ ప్రతినిధి మా చియావో గువాంగ్ బుధవారం మీడియాతో మాట్లాడుతూ హెచ్చరించాడు. తైవాన్ తో శాంతియుతంగా ఐక్యం కావడానికి కృషి చేసేందుకు చైనా దేశం సిద్ధంగా ఉందనీ అయితే స్వతంత్రత ప్రకటించుకునే…

హిందూ దేశంగా మార్చుతామని ప్రతిజ్ఞ, పోలీసులకు ఫిర్యాదు

హిందూత్వ గణాలు దేశంలో, ముఖ్యంగా ఉత్తర భారతంలో చెలరేగిపోతున్నాయి. ఢిల్లీ లోని గోవింద్ పురి మెట్రో స్టేషన్ సమీపంలో ‘హిందూ యువ వాహిని’ అనే సంస్ధ ఆద్వర్యంలో జరిగిన సదస్సు మరో విడత పరమత విద్వేష ప్రసంగాలకు, ప్రతిజ్ఞలకు వేదికగా నిలిచింది. ఈసారి భారత దేశం మొత్తాన్ని హిందూ దేశంగా మార్చేందుకు చంపడానికి, చావడానికి కూడా సిద్ధమంటూ సభికుల చేత నిర్వాహకులు ప్రతిజ్ఞ చేయించారు. ముస్లింలు, క్రైస్తవులపై జీనోసైడ్ (సామూహిక హత్యాకాండ) జరపాలని, మాజీ ప్రధాని మన్మోహన్…

ప్రియాంక పిల్లల ఇన్స్టా హ్యాకింగ్ చేసిన ప్రభుత్వం?

ప్రియాంక గాంధీ వాద్ర ఈ రోజు (డిసెంబర్ 21, 2021) ఒక నమ్మశక్యం కానీ విషయాన్ని వెల్లడి చేశారు. ఆమె పిల్లల ఇన్స్టాగ్రాం ఖాతాలను ప్రభుత్వం హ్యాక్ చేసిందట! ఇది నిజంగా నిజమేనా?! ఇది నిజమే అయితే బహుశా అంతకంటే దరిద్రమైన ఆరోపణ మోడి ప్రభుత్వం ఇక ఎదుర్కోబోదేమో! ప్రియాంక గాంధీకి ఇద్దరు పిల్లలు. ఒక అబ్బాయి, ఒక అమ్మాయి. అబ్బాయి పేరు రైహన్ వాద్రా, వయసు 20 సం.లు. అమ్మాయి పేరు మిరాయ వాద్రా, వయసు…

త్వరలో మోడి, జిన్^పింగ్, పుతిన్ ల సమావేశం?

బ్రిక్స్ కూటమిలో ప్రధాన రాజ్యాలైన చైనా, రష్యా, ఇండియా దేశాల అధినేతలు త్వరలో సమావేశం కానున్నట్లు సమాచారం. వ్లాదిమిర్ పుతిన్, ఛి జిన్^పింగ్ ల మధ్య ఇటీవల జరిగిన వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా ఇరువురు నేతలు త్రైపాక్షిక సమావేశం జరపాలన్న అంశాన్ని చర్చించినట్లు తెలుస్తోంది. రష్యా అధ్యక్షుడు పుతిన్ సహాయకుడు యూరీ ఉషకోవ్ ఈ విషయాన్ని వెల్లడించినట్లు రష్యన్ వార్తా సంస్ధ టాస్ (TASS) తెలియజేసింది. పుతిన్, ఛి ల మధ్య జరిగిన వీడియో కాన్ఫరెన్స్ తాలూకు…

పీఎం కేర్స్ ఫండ్ లోగో లో ప్రధాని బొమ్మ తీసెయ్యండి -పిటిషన్

బాంబే హై కోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. PM CARES ఫండ్ ఎంబ్లమ్ లో నుండి ప్రధాని నరేంద్ర మోడీ బొమ్మ, జాతీయ జెండా బొమ్మ వెంటనే తొలగించాలని ఈ పిటిషన్ సారాంశం. జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ ఎం ఎస్ కార్నిక్ లతో కూడిన బెంచి ఈ పిటిషన్ విచారణకు స్వీకరించింది. విచారణ క్రిస్మస్ సెలవుల తర్వాత తేదికి వాయిదా వేయాలని అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ అనిల్ సింగ్ కోరారు. “ఇది ముఖ్యమైన పిటిషన్ మిస్టర్…

జులియన్ అసాంజేని అమెరికికాకు ఇచ్చేస్తారట! -కార్టూన్

బ్రిటన్ హై కోర్టు అసాంజే ను అమెరికాకు extradite చెయ్యడానికి ఓకే చెబుతూ తీర్పు చెప్పింది. దానితో అయన హక్కులకు చివరికి ప్రాణాలకు కూడా ముప్పు వచ్చింది. అసాంజేను లాక్కెళ్లి జైల్లో కుక్కడానికి, ఆయనను చిత్ర హింసలు పెట్టి కక్ష తీర్చుకోవడానికి అమెరికా అనేక ఏళ్లుగా ఉవ్విళ్లూరుతోంది. బ్రిటన్ పై తీవ్ర ఒత్తిడి తెస్తూ వచ్చింది. అమెరికా ఒత్తిళ్లు ఫలించాయి. అసాంజేను అమెరికాకు అప్పగిస్తే అంకుల్ సామ్ ఏం చేస్తాడో కార్టూన్ చెబుతోంది. డిప్లొమాటిక్ కేబుల్స్ తో…

2+2 ఫార్మాట్ చర్చలు అంటే?

భారత విదేశాంగ విధానంలో గత కొన్నేళ్లుగా వినిపిస్తున్న మాట “2+2 ఫార్మాట్ డైలాగ్” (2+2 నమూనా లో జరిగే చర్చలు)! సాధారణ పాఠకుల్లో చాలా మందికి ఈ పద బంధం అర్ధం ఏమిటన్నది తెలియదు. తెలియని అంశాల కోసం ఇంటర్నెట్ ని వెతికి చదివే అలనాటు ఉన్నవాళ్లకి తప్ప ఇతరులకి తెలిసే అవకాశాలు తక్కువ ఉంటాయి. ఈ పద బంధాన్ని విదేశాంగ విధానం, విదేశీ సంబంధాల రంగంలో ఉపయోగిస్తారు. ఈ పేరే దాని అర్ధం ఏమిటో చెబుతోంది.…

అంబేద్కర్ రచనల ప్రచురణ నిలిపివేత, సుమోటు కేసు నమోదు

మహారాష్ట్ర ప్రభుత్వం డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ రచనలు, ప్రసంగాలను ప్రచురించే ప్రాజెక్టును నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం మహారాష్ట్ర ప్రాంతీయ పత్రిక లోక్ సత్తా ఒక వార్త ద్వారా వెలుగులోకి తెచ్చింది. సదరు వార్తను పరిగణలోకి తీసుకున్న బొంబే హై కోర్టు, ప్రచురణ ప్రాజెక్టు నిలిపివేయడాన్ని ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా సుమోటుగా డిసెంబర్ 1 న స్వీకరించింది. మరాఠీ పత్రిక లోక్ సత్తా నవంబర్ 24 తేదీన అంబేద్కర్ రచనలు, ప్రసంగాల ప్రచురణను నిలిపివేసిన…

5 ని.ల్లో రద్దు బిల్లు మూజువాణి ఆమోదం, నోటితో నవ్వుతూ…

పార్లమెంటరీ సంప్రదాయాలు, నియమ నిబంధనలు, నియమావళి, సుస్ధిర ప్రక్రియలు ఒక్కొక్కటిగా మాయమైపోతున్నాయి. దాదాపు ఆరున్నర దశాబ్దాల పార్లమెంటరీ ఆచరణలో తామే నెలకొల్పుకున్న సో-కాల్డ్ ప్రజాస్వామిక సభా సూత్రాలు రద్దయిపోతూ వాటి స్ధానంలో పార్లమెంటరీ నియంతృత్వ సూత్రాలు ప్రవేశిస్తున్నాయి. ప్రజలు తమ ప్రతినిధులుగా ఎన్నుకున్న సభ్యులు నిరసనలను గౌరవించడం మాట అటుంచి కనీసం పట్టించుకోవడమే ఒక గొప్ప అంశంగా మారే రోజులు వచ్చాయి. ప్రజాస్వామ్య దేవాలయంగా ఇన్నాళ్లూ మన పాలకులు డప్పు కొట్టుకున్న పార్లమెంటు ఉభయ సభల్లో బిల్లులు…