4 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు -కార్టూన్

అస్సాం, బెంగాల్, కేరళ, తమిళనాడు ఎన్నికల ఫలితాలను అభివర్ణిస్తున్న ఈ కార్టూన్, మన ముందు పరిచిన తమాషాను చెప్పుకుని తీరాలి. ఎడమ-పైన నుండి గడియారం ముల్లు తిరుగు దిశలో… 1. అస్సాం: బి‌జే‌పి అధ్యక్షుడు అమిత్ షాకు ఢిల్లీ ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్ కొట్టిన దెబ్బకి తల బొప్పి కట్టింది. బీహార్ ఎన్నికల్లో లాలూ, నితీష్ లు ఉమ్మడిగా కొట్టిన దెబ్బకు ఆ బొప్పి మరింత వాచిపోయింది. అస్సాం ఎన్నికల్లో వాచిపోయిన బొప్పి కాస్త ఒంటి కొమ్ము…

ఈజిప్టు విమానం అదృశ్యం!

ఈజిప్టు విమానం ఒకటి మధ్యధరా సముద్రంపై ప్రయాణిస్తుండగా అదృశ్యం అయింది. ప్యారిస్ నుండి ఈజిప్టు రాజధాని కైరోకు తిరిగి వస్తుండగా దుర్ఘటన చోటు చేసుకుంది. ప్రయాణానికి ముందు విమానాన్ని పూర్తిగా తనిఖీ చేశామనీ, యాంత్రిక వైఫల్యం కారణం కావడానికి అవకాశాలు దాదాపు లేవని ఈజిప్టు ప్రభుత్వం, ఈజిప్టుఎయిర్ విమానయాన సంస్ధ ప్రకటించాయి. యాంత్రిక లోపం కంటే ఉగ్రవాద చర్యే ప్రమాదానికి కారణం అయి ఉండవచ్చని ఈజిప్టు ప్రభుత్వం చెబుతోంది. ఎయిర్ బస్ కంపెనీ తయారీ అయిన విమానం…

ఎన్నికల ఫలితాలు: ఎగ్జిట్ పోల్స్ నిజమయ్యాయి!

4 రాష్ట్రాల (పుదుచ్చేరి మినహా) ఎన్నికల ఫలితాలు  ఎగ్జిట్ పోల్స్ అంచనాలను దాదాపుగా ఖాయం చేశాయి. ఒక్క తమిళనాడులోనే అంచనాలు తారుమారు అయ్యాయి. అయితే ఏ‌ఐ‌ఏ‌డి‌ఎం‌కే మెజారిటీ బాగా తగ్గిపోయింది. మళ్ళీ జయలలిత అధికారంలోకి వస్తుందని రెండు సంస్ధల ఎగ్జిట్ పోల్స్ లో తెలిసినందున రెండు శిబిరాల మధ్యా పోటా పోటీ నెలకొంటుందని పరిశీలకులు భావించగా అదే నిజమైంది. అస్సాంలో బి‌జే‌పి కొత్తగా, మొదటిసారిగా అధికారం సాధించింది. పశ్చిమ బెంగాల్ ను మమత బెనర్జీ నిలబెట్టుకోవడమే కాకుండా…

భారత వ్యవసాయంలో వర్తక పెట్టుబడి, అధిక వడ్డీ

(19వ భాగం తరువాత….) భారత వ్యవసాయ రంగంలో మార్పులపై ఒక నోట్ -పార్ట్ 20 D) భారత వ్యవసాయంలో వర్తక పెట్టుబడి, అధిక వడ్డీ సరుకుల ఉత్పత్తి, వర్తక పెట్టుబడుల నుండి పెట్టుబడిదారీ ఉత్పత్తి, పారిశ్రామిక పెట్టుబడిలోకి జరిగే మార్పు సంక్లిష్టమైనది, సుదీర్ఘమైనది. ఇది అభివృద్ధి చెందిన దేశాల లోణూ, తక్కువ అబివృద్ధి చెందిన దేశాల లోనూ భిన్నమైన రూపాలు ధరిస్తుంది. వర్తక పెట్టుబడి వలయం (circuit)నిర్మాణాత్మకంగా సాధారణ పెట్టుబడి వలయంతో పోల్చితే ఒకటిగానే ఉంటుంది. తేడా…

బ్రెగ్జిట్ కు పెరుగుతున్న ఆదరణ!

బ్రిటన్ + ఎగ్జిట్ = బ్రెగ్జిట్ యూరోపియన్ యూనియన్ నుండి బ్రిటన్ బైటికి వెళ్లిపోవడాన్ని బ్రెక్సిట్ అంటున్నారు. యూరోపియన్ యూనియన్ నుండి మరిన్ని రాయితీలు పొందే లక్ష్యంతో బ్రిటన్ ప్రధాని కామెరాన్ నిర్వహిస్తున్న రిఫరెండం కాస్తా నిజంగానే ఈ‌యూ ఎగ్జిట్ వైపుకు తీసుకెళ్తున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటి వరకు జరిగిన ఒపీనియన్ పోల్స్ అన్నింటి లోనూ ‘ఇన్’ (ఈ‌యూలోనే కొనసాగుదాం) శిబిరానికే అధిక ఆదరణ ఉన్నట్లు చెబుతూ వచ్చాయి. కానీ సోమవారం జరిగిన ఒక పోలింగు లో మొట్ట…

స్టేషన్ల చుట్టూ తిప్పారు, తిట్టారు, కొట్టారు, ఉమ్మారు!

హంద్వారా (కాశ్మీర్) అమ్మాయి ఎట్టకేలకు నోరు విప్పింది. పోలీసులే తన చేత బలవంతంగా అబద్ధం చెప్పించారని చెప్పింది. పోలీసులు ప్రచారం చేసుకున్న వీడియోలో తాను చెప్పినది నిజం కాదని వెల్లడి చేసింది. పోలీసులు చెప్పమన్నట్లు వీడియోలో చెప్పానని తెలిపింది. ఆ వీడియో రికార్డు చేసిన జిల్లా ఎస్‌పిని వీడియోను ఎవరికి చూపవద్దని కోరానని, కానీ అదే వీడియోను ఉపయోగించి తనపై దుష్ప్రచారం చేశారని తెలిపింది. తన కూతురును నిర్బంధంలో ఉంచుకుని ఆమె చేత అబద్ధం చెప్పించారని ఆమె…

పెట్టుబడిదారీ రైతు కోసం వెతుకులాట! -19

(C) పెట్టుబడిదారీ రైతు కోసం అన్వేషణ “వ్యవసాయంలో పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానానికి పెట్టుబడిదారీ రైతు ప్రధానమైన, ఖచ్చితమైన సంకేతం” (Ranjit Sau: On the Essence and Manifestation of Capitalism in Indian Agriculture –Mode of Production Debate, edited by Utsa Patnaik– P-116) పై పుస్తకంలో అశోక్ రుద్ర తన వ్యాసంలో పెట్టుబడిదారీ రైతుకు కొన్ని ప్రమాణాలను పేర్కొన్నారు. (Ibid, P-27) (1) పెట్టుబడిదారీ రైతు తన భూమిని లీజుకి ఇవ్వడం…

బ్రెజిల్ లో ప్రభుత్వ మార్పు -ది హిందు ఎడ్..

(Regime change in Brazil శీర్షికన మే 13 తేదీన వెలువడిన ది హిందు సంపాదకీయానికి యధాతధ అనువాదం.) ********* అది మరో పేరుతో జరిగిన తిరుగుబాటు కుట్ర. సెనేట్ అభిశంసన ఓటు ద్వారా అధ్యక్షులు దిల్మా రౌసెఫ్ ను అధికార పదవి నుండి సస్పెండ్ చేయడం ద్వారా బ్రెజిల్ ప్రతిపక్షం అరుదైన విజయాన్ని సాధించింది. 55-22 ఓట్ల తేడాతో నెగ్గిన అభిశంసన 13 సం.ల వర్కర్స్ పార్టీ (పి‌టి) పాలనకు అంతం పలికింది. రౌసెఫ్ ఇప్పుడు…

ఈ‌యూ ఆధిపత్యం నిలువరించే ఆయుధం: రిఫరెండం

రిఫరెండం అంటే భారత పాలకవర్గాలకు ఎనలేని భయం. వారికి జనం అభిప్రాయాల పట్ల అస్సలు గౌరవం ఉండదు. జనం గొర్రెలు అని వారి నిశ్చితాభిప్రాయం. ఎన్నికల సమయంలో మాత్రమే వారికి జనం అభిప్రాయాలు కావాలి. అభిప్రాయాలూ అంటే అభిప్రాయాలు కాదు. ఓటు ద్వారా వ్యక్తం అయ్యే వారి ఆమోదం మాత్రమే కావాలి. ఆ ఓటు సంపాదించడానికి ఎన్ని జిత్తులు వేయాలో అన్నీ వేస్తారు. ఆనక వారిని నట్టేట్లో వదిలేసి పోతారు. ఐరోపా దేశాల్లో అలా కాదు. రిఫరెండం…

ఉత్తరఖండ్ నుండి పాఠాలు -ది హిందు ఎడ్..

[Lessons from Uttarakhand శీర్షికన ఈ రోజు ప్రచురితం అయిన ది హిందు ఎడిటోరియల్ కు యధాతధ అనువాదం] ******** తొమ్మిది మంది కాంగ్రెస్ శాసన సభ్యులు విశ్వాస పరీక్షలో పాల్గొనకుండా సుప్రీం కోర్టు నిషేధం విధించిన దరిమిలా ఉత్తర ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హరీష్ రావత్, అసెంబ్లీ పరీక్షలో నెగ్గడం ముందుగానే ఖాయం అయింది. మిగిలిన 27 మంది అనుయాయులు, ఆరుగురు సభ్యుల కూటమిల ఓట్లు ఆయన పరీక్షలో గెలిపించాయి. సుప్రీం కోర్టు ధృవీకరించిన ఈ…

వేదిక్ ఇండియన్లు గోమాంస భక్షకులు -ఆది గాడ్రెజ్

ఆవు పూజ భారతీయ ప్రాచీన సంస్కృతిగా చెప్పడం వాస్తవ విరుద్ధం అని భారత బడా పారిశ్రామిక కుటుంబాల్లో ఒకటయిన గాడ్రెజ్ అధినేత ఆది గాడ్రెజ్ స్పష్టం చేశారు. గో వధ, ఆవు మాంసం లపై నిషేధం వలన భారత ఆర్ధిక వ్యవస్ధకు నష్టం వాటిల్లుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. “(మోడి ప్రవేశ పెట్టిన) కొన్ని విధానాలు భారత ఆర్ధిక వృద్ధికి నష్టం కలగజేస్తున్నాయి. ఉదాహరణకి కొన్ని రాష్ట్రాల్లో ఆవు మాంసంపై విధించిన నిషేధం.” అని ఆయన…

#పోబిడ్డామోడి! -కేరళీయుల తిరస్కారం

‘కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు పుడతాడు’ అని సామెత. ‘కాలం కలిసి రాకపోతే తాడే పామై కరుస్తుంది’ ఇది కూడా సామెతే. 2014 సాధారణ ఎన్నికల్లో మొదటి సారి సంపూర్ణ మెజారిటీతో బి‌జే‌పిని అధికారంలోకి తెచ్చే వరకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడి మొదటి సామెతలో లబ్ది పొందారు. అధికారం చేపట్టాక మోడి దశ తిరిగినట్లే పరిణామాలు జరుగుతున్నాయి. 28 సీట్లు గెలిచిన ఢిల్లీ అసెంబ్లీలో రెండంటే రెండే సీట్లు దక్కించుకుని అతి చిన్న ఏ‌ఏ‌పి పార్టీ…

ప్రధాని పట్టా అసలా నకిలీయా -ఔట్ లుక్ సర్వే

ఇది ఆంగ్ల వార పత్రిక ఔట్ లుక్ జరిపిన/జరుపుతున్న సర్వే. మే 9 తేదీన ప్రారంభం అయిన ఈ సర్వే మే 23 తేదీన ముగుస్తుంది. పత్రిక కింది భాగంలో చెప్పినట్లుగా ఈ సర్వే శాస్త్రోక్తంగా జరిగినది/జరుగుతున్నది కాదు. కేవలం పత్రికను సందర్శిస్తున్న వారు మాత్రమే ఓటు వేయగా వచ్చిన/వస్తున్న ఫలితాలు. సర్వేలో ఓటు వేసిన వారికి మాత్రమే ఓటు ఫలితాలు కనిపిస్తాయి. పత్రిక వెబ్ సైట్ నుండి స్క్రీన్ షాట్ తీసి ప్రచురించడం జరుగుతోంది. మే…

MAలో మోడి సబ్జెక్టులు లేవు -ప్రొఫెసర్

ప్రధాన మంత్రి నరేంద్ర మోడి డిగ్రీ వివాదం ముదురుతుండగానే ఆయన పి‌జి గురించిన వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. నరేంద్ర మోడి గుజరాత్ యూనివర్సిటీలో ఎం‌ఏ చదివినప్పటి కాలంలో అక్కడ ప్రొఫెసర్/ఫ్యాకల్టీ మెంబర్ గా పని చేసిన జయంతి పటేల్ తన ఫేస్ బుక్ పేజీలో వెల్లడి చేశారు. గుజరాత్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ నరేంద్ర మోడి తమ వద్ద పి‌జి పూర్తి చేశారని చెబుతూ పార్ట్ – 2 లో ఆయనకు ఏయే సబ్జెక్టులలో ఎన్నెన్ని మార్కులు…

చెవిలో జోరీగ బాధ ఇంతింత కాదయా! -కార్టూన్

చట్టం ముందు అందరూ సమానులే అని రాజ్యాంగం చెబుతుంది. ఆచరణ ఇందుకు పూర్తిగా భిన్నం అని రాజకీయ పార్టీల, నాయకుల రాజకీయ ఆచరణ రుజువు చేసింది. ఏ‌ఏ‌పి లాంటి జోరీగలు లేకపోతే ఈ ఆటలు ఇంకా కొనసాగుతాయి. ఏ‌ఏ‌పి ఆవిర్భావం కుళ్ళిపోయిన రాజకీయ పరిస్ధితుల నుండి పుట్టిన అనివార్యత! రాజకీయ, సామాజిక, ప్రాకృతిక పరిస్ధితులు ఎల్లప్పుడూ ఒక సమతాస్ధితి (ఈక్విలిబ్రియమ్) కోసం అంతర్గతంగా కృషి చేస్తూ ఉంటాయి. సమతా స్ధితి తప్పినప్పుడు తిరిగి సమతా స్ధితి పొందడం…