పిల్లల ఊహాశక్తికి నిదర్శనం ఈ పెయింటింగ్ లు -ఫొటోలు

‘ది హిందూ’ పత్రిక ప్రతి సంవత్సరం వివిధ ప్రాంతాల్లో స్కూల్ పిల్లలకు పెయింటింగ్ పోటీలు నిర్వహిస్తుంది. ఈ పోటీల్లో పాల్గొనే పిల్లలు వేసే పెయింటింగ్ లు చాలా సార్లు అబ్బురం కలిగిస్తాయి. తన చుట్టూ ఉన్న పరిసరాలపైన, ముఖ్యంగా ప్రకృతి పైన వీరికి ఉన్న ఊహాశక్తిని అభినందనించకుండా ఉండలేం. ప్రకృతితో పాటు సమాజం, సంస్కృతి, దేశ భక్తి లాంటి అంశాలపై కూడా వీరి అభిప్రాయాలను అక్కడక్కడా చూడగలం. ప్రధానంగా పాఠ్య పుస్తకాల ద్వారా తమకు అందే విజ్ఞానాన్నే…

ఇజ్రాయెల్ అక్రమ సెటిల్ మెంట్ల పై విచారణకు ఐక్యరాజ్య సమితి ఆదేశం

పాలస్తీనా భూభాగాలను అక్రమంగా ఆక్రమించుకుని నిర్మించిన సెటిల్ మెంట్ల పై విచారణ చేయాలని ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల సంస్ధ తీర్మానం ఆమోదించింది. ఒక్క అమెరికా తప్ప ఇతర సభ్యులందరూ తీర్మానానికి అనుకూలంగా ఓటు వేయడమో లేక ఓటింగ్ లో పాల్గొనకపోవడమో చేశారు. ఇజ్రాయెల్ సాగించే అక్రమ వలస పాలనకూ, పాలస్తీనీయులపై అది సాగించే దౌర్జన్యాలకూ నిరంతరం వత్తాసు వచ్చే అమెరికా, మానవ హక్కుల సంస్ధ తీర్మానం ఇజ్రాయెల్ కి వ్యతిరేకంగా పక్ష పాతంగా కూడి ఉందని…

Pirate of the Malvinas

‘వలస బుద్ది’ వీడన్ బ్రిటన్ -కార్టూన్

రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా ప్రపంచ దేశాలను కబళించే అగ్రరాజ్యంగా అవతరించడంతో ‘రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం’ అస్తమించింది. అనేకవలసల నుండి విరమించుకున్న బ్రిటన్ అమెరికాకి ఉపగ్రహ రాజ్యంగా మారిపోయింది. స్వతంత్ర దేశాలపై అమెరికా సాగిస్తున్న దురాక్రమణ యుద్ధాల్లో జూనియర్ పార్టనర్ గా చేరింది. అయితే అదింకా అర్జెంటీనా కి చెందిన ‘మాల్వినాస్’ (బ్రిటన్ దీనిని ఫాక్ లాండ్స్ గా పిలుస్తుంది) ద్వీపకల్పాన్ని ఇంకా తన వలసగానే పరిగణిస్తోంది. మాల్వినాస్ ని సముద్రాలకు ఆవల ఉన్న…

Coal scam-Wind fall gains

“బొగ్గు నష్టం” నివేదికపై చర్చలు ఇంకా పూర్తి కాలేదు -కాగ్

ప్రవేటు, ప్రభుత్వ కంపెనీలకు బొగ్గు గనులను చౌకగా కేటాయించడం వల్ల కేంద్ర ఖజానాకు రు. 10.67 లక్షల కోట్ల నష్టం వచ్చిందంటూ తాను తయారు చేసిన నివేదిక పై చర్చలు ఇంకా పూర్తి కాలేదని కాగ్ ప్రధాన మంత్రికి రాసిన లేఖలో పేర్కొన్నది. చర్చలు పూర్తిగా కాక మునుపే, నివేదికను ఇంకా పూర్తి చేయక ముందే లీక్ కావడం తమను నిశ్చేష్టుల్ని చేసిందని కాగ్ తన లేఖలో తెలిపింది. తాను పేర్కొన్నంత నష్టం వాస్తవానికి సంభవించిందీ లేనిదీ…

రు. 10.67 లక్షల కోట్ల ‘బొగ్గు కుంభకోణం’ బట్టబయలు చేసిన సి.ఏ.జి

వేలం వేయకుండా ప్రవేట్, పబ్లిక్ కంపెనీలకు బొగ్గు గనులను అప్పనంగా కట్టబెట్టడం వలన కేంద్ర ప్రభుత్వ ఖజానాకి ఏకంగా 10.67 లక్షల కోట్ల రూపాయలు నష్టం వాటిల్లిందని రాజ్యాంగ బద్ధ సంస్ధ ‘కంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్’ (సి.ఏ.జి) గురువారం వెల్లడించింది. విలువ రీత్యా 1.76 లక్షల కోట్ల 2 జి కుంభ కోణం కంటే ఇది ఆరు రెట్లు పెద్దది. 2004-2009 మధ్య కాలంలో 155 ఏకరేజ్ ల బొగ్గు గనులను వేల వేయకుండా 155 కంపెనీలకు…

అంతిమ ఘడియల్లో ‘పిచ్చుకలు -ఫొటోలు

పిచ్చుకలు మన చిన్ననాటి నేస్తాలు. పదిహేను, ఇరవై యేళ్ళ క్రితం వరకూ పిచ్చుకలు లేని చోటంటూ కనపడేది కాదు. ముఖ్యంగా భారత దేశ గ్రామాల్లో అవి దాదాపు పెంపుడు పక్షులుగా కనపడుతుండేవి. పొద్దున లేచింది మొదలు దైనందిన జీవితంలో మనుషులు చేరే ప్రతి చోటా పిచ్చుకలూ చేరి తమ కార్యకలాపాల్లో మునిగితేలుతుండేవి. ఇంటి చూరులో, కిటికీ తలుపులపైనా, స్కూలు గది గోడలపైనా, చెట్ల కొమ్మల చివర్లలో, బట్టలు ఆరేసుకునే దండేలపైనా, పొట్ట పోసుకున్న వరి చేలల్లో, బిళ్లంగోడు…

బి.జె.పి ఎమ్మెల్యేల నీలి లీలలు: మొన్న కర్ణాటక, ఇపుడు గుజరాత్

కర్ణాటక అసెంబ్లీ లో బి.జె.పి ఎమ్మెల్యేల నీలి భాగోతం మర్చిపోక ముందే గుజరాత్ బి.జె.పి ఎమ్మేల్యేలు తాజాగా ‘నీలి’ వీధికెక్కారు. ప్రజాస్వామ్య కేంద్రాలు అని పాలక వర్గ పార్టీలు ఎంతో గొప్పగా చెప్పుకునే అసెంబ్లీ లంటే తమకు లెక్కే లేదని తేల్చేశారు. ఓ వైపు అసెంబ్లీలో కార్యకలాపాలు సాగుతుండగానే, తాము వెంట తెచ్చుకున్న ఐ ప్యాడ్ లో నీలి చిత్రాలు వీక్షించి తరించారు. తమ తలలపైనే ఉన్న జర్నలిస్టులు గమనించి స్పీకర్ కి ఫిర్యాదు చేశాక ‘అదేం…

మమత హిపోక్రసీ: పాలు, విద్యుత్ రేట్లు పెంచి, రైలు చార్జీలపై నాటకం

అధికారంలోకి వచ్చిన సంవత్సరం లోపే పశ్చిమ బెంగాల్ ముఖ్య మంత్రి మమత బెనర్జీ మూడు సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచింది. ట్రామ్ వేస్ కార్పొరేషన్ కి ఇస్తున్న సబ్సిడీ రద్దు చేయడమే కాక త్వరలో ఛార్జీలు కూడా పెంచబోతోంది. ప్రతి వంట గదిలో అత్యవసరంగా ఉపయోగించే పాల ఛార్జీలు పెంచింది. ఇన్ని చేసిన మమత రైలు ఛార్జీలు పెంచాడంటూ తన పార్టీ నాయకుడిని కేంద్ర మంత్రి పదవి నుండే తొలగించింది. “రైల్వే ఏ.సి ఛార్జీలు పెంచినా ఫర్వాలేదు…

Seventeen-year-old prostitute Hashi talks to a customer as Maya waits to get a customer

ఆకలికమ్ముడుబోయిన అపరంజి బొమ్మలు -ఫొటోలు

మానవత్వం పెదవిపైన మాసిన చిరు నవ్వులు మనసులేని కౌగిలిలో నలిగిపడిన పువ్వులు బుసకొట్టే కామాగ్నికి విసిరేసిన సమిధలు కొడిగట్టిన జీవంతో మిణుకుమనే ప్రమిదలు వసివాడని బాల్యంతో కసి తీర్చే దేహాలు వలువులు విడిచిన విలువల సాక్ష్యాత్కారాలు చెక్కిలి వన్నెలు చెరిగిన చిగురాకు రెమ్మలు నవ్వలేక ఏడ్వలేక నిట్టూర్చే శవాలు కసి దాగిన, కలతల కాగిన జీవచ్ఛవాలు ఎవరు వీరు? ఎవరు వీరు? మనం జారవిడుచుకున్న మన జాతి పరువులు మనిషి జారవిడిచిన మానవ జాతి విలువలు ఈ…

Jobs and wars

ఉద్యోగాలు, యుద్ధాలు -కార్టూన్

దురాక్రమణ యుద్ధాలవల్ల ఆర్ధిక వ్యవస్ధలు కులారిల్లుతున్నప్పటికీ, అవే యుద్ధాల వల్ల కంపెనీల లాభాలు ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతున్న పరిస్ధితి ఉంది. యుద్ధాలు చేసి దురాక్రమించి ప్రపంచ వనరులు గుప్పెట్లో పెట్టుకోవడం పశ్చిమ దేశాల ‘మిలట్రీ-ఇండస్ట్రియల్ కాంప్లెక్స్’ దురాశ కాగా, యుద్ధాలకు ఎదురొడ్డి నిలిచే శక్తుల వల్లా, యుద్ధోన్మాదుల అదుపులో లేకుండా పోయే యుద్ధ ఖర్చుల వల్లా ఆర్ధిక సంక్షోభాలు అనివార్యంగా ఎదురవుతున్న పరిస్ధితి. ఈ పరిస్ధితుల్లో నిరుద్యోగ సైన్యానికి ఉద్యోగాలు దొరకడం దుర్లభం అవుతున్నా, యుద్ధాలు మాత్రం…

ఖమ్మం స్కూల్ బస్ కాలవలో పడి 14 మంది పిల్లల మృతి

ఖమ్మం జిల్లాలో ఘోరం జరిగింది. స్కూల్ బస్సు కాలవలో పడిపోవడంతో 14 మంది స్కూల్ పిల్లలు చనిపోయారని ఎన్.డి.టి.వి తెలిపింది. మంగళవారం మధ్యాహ్నం ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. మొత్తం 40 మంది పిల్లలు దుర్ఘటన సమయంలో బస్సులో ప్రయాణిస్తున్నట్లు ఎన్.డి.టి.వి తెలిపింది. కొత్త గూడెం మండలం లో ఎల్.వి.రెడ్డి స్కూల్ కి చెందిన బస్సు ఎదురుగా వస్తున్న బైక్ ను తప్పించబోయి కాల్వలో బోల్తా పడిందని ఎన్.డి.టి.వి తెలిపింది. గాయపడిన 18 మంది పిల్లలను ఆసుపత్రిలో…

ఇరాన్ ఆయిల్ కొనవద్దు, ఇండియాకి అమెరికా బెదిరింపు

తన మాట వినని దేశాలను బెదిరించి దారికి తెచ్చుకునే అమెరికా ఇండియాపై కూడా బెదిరింపులు మొదలు పెట్టింది. ఇరాన్ పై అమెరికా, యూరప్ లు ఆంక్షలు విధించినప్పటికీ ఇరాన్ ఆయిల్ కొనడం ఆపేది లేదని భారత దేశం చెప్పటంపై అమెరికా కన్నెర్ర చేస్తోంది. ఇరాన్ నుండి ఆయిల్ దిగుమతులను తగ్గించుకోని పక్షంలో అమెరికా బ్యాంకులను ఇండియాకి అందకుండా చేయడానికి తాము వెనకాడేది లేదని అమెరికా అధికారిని ఉటంకిస్తూ బ్లూమ్ బర్గ్ పత్రిక తెలిపింది. అమెరికా తాను విధించిన…

ఇద్దరు స్త్రీలను రేప్ చేసి తర్వాత హత్యాకాండ జరిపారు -ఆఫ్ఘన్ పార్లమెంటరీ కమిటీ

హత్యాకాండ జరిగిన రాత్రి అమెరికా సైనికులు జరిపిన అకృత్యాలు ఒక్కొక్కటే వెలుగులోకి వస్తున్నాయి. అమెరికా సైనికులు హత్యాకాండకి ముందు ఇద్దరు ఆఫ్ఘన్ స్త్రీలను రేప్ చేసి అనంతరం హత్యాకాండ జరిపారని పార్లమెంటరీ విచారణ కమిటీ సభ్యులు, శనివారం ఆఫ్ఘన్ పార్లమెంటులో ప్రకటించారు. హత్యాకాండలో చనిపోయిన నలుగురు స్త్రీలలో రేప్ కి గురికాబడిన ఇద్దరు స్త్రీలు ఉన్నారని కమిటీ సభ్యులు పార్లమెంటుకి తెలియజేశారు. జంగాబాద్ ప్రాంతంలో అమెరికా ట్యాంకర్ ఒకదానిని మందుపాతరతో పేల్చివేసినందుకు ప్రతీకారంతోనే అమెరికా సైనికులు ఈ…

20 మంది అమెరికా సైనికులు హత్యాకాండలో పాల్గొన్నారు -ఆఫ్ఘన్ పార్లమెంటరీ కమిటీ

మార్చి 12 తెల్లవారు ఝామున, కాందహార్ సమీప గ్రామాల్లో ఆఫ్ఘనిస్ధాన్ పౌరులపై జరిపిన హత్యాకాండలో 20 మంది వరకూ అమెరికా సైనికులు పాల్గొన్నారని ఆఫ్ఘనిస్ధాన్ పార్లమెంటరీ విచారణా కమిటీ తేల్చింది. ఆఫ్ఘనిస్ధాన్ పార్లమెంటు సభ్యులతో ఏర్పడిన పార్లమెంటరీ విచారణ కమిటీ హత్యా కాండ బాధిత గ్రామాలను సందర్శించి వాస్తవాలు సేకరించింది. ప్రత్యక్ష సాక్షులతో మాట్లాడి వివరాలు సేకరించింది. హామీద్జాయ్ లాలి, అబ్దుల్ రహీమ్ ఆయుబి, షకీబా హష్మి, సయ్యద్ మహమ్మద్ ఆఖుండ్, బిస్మిల్లా ఆఫ్ఘన్మాల్, షకీలా హష్మి…

Perfect war

పక్కా యుద్ధం (Perfect war) -కార్టూన్

– “పక్కా యుద్ధాన్నే మేం ప్రారంభించాం! ఇప్పుడంతా యుద్ధంలో మునిగిపోయారు. కాని తమ శత్రువు ఎవరో ఇప్పుడు చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు” – ‘టెర్రరిజం పై యుద్ధం’ పేరుతో అమెరికా ప్రారంభించిన యుద్ధానికి ఇప్పుడు దిక్కూ, దరీ లేదు. ‘టెర్రరిస్టులపై యుద్ధమే’ లక్ష్యం అయితే ఆ లక్ష్య శుద్ధి ప్రారంభంలోనే లేదు. ఆల్-ఖైదాతో యుద్ధం అని చెప్పి, అదే ఆల్జ్-ఖైదాతో కుమ్మక్కై ప్రభుత్వాలు ఏర్పరుస్తున్నారు. ఆఫ్ఘనిస్ధాన్ లో ఆల్-ఖైదాతో యుద్ధం, లిబియాలో ఆల్-ఖైదాతో కుమ్మక్కై…