ప్రపంచ స్ధాయి రేపిస్టులు వీళ్ళు -ఫొటోలు

లైంగిక అత్యాచారాలకు పాల్పడి ప్రపంచ స్ధాయిలో పేరు పొందిన రాజకీయవేత్తలు వీళ్లు. ఈ ఫొటోలను ఫస్ట్ పోస్ట్ అందించింది. ఆయా దేశాలలో ఉన్నత పదవులను అధిష్టించినవారు తమ తమ దేశాల్లోని ఉన్నత సాంస్కృతిక విలువలకు అద్దం పట్టేలా జీవించాలి. ఆయా దేశాల జీవన విధానాలకు అద్దం పట్టడమే కాక మొత్తం ప్రపంచ స్ధాయి విలువలను కూడా వీరి ప్రతిబింబించాల్సి ఉంటుంది. మానవ నాగరికతలో కుటుంబ జీవనానికి అత్యున్నత రూపం అయిన మోనోగమీ (ఒక భర్తకు ఒకే భార్య)…

‘ప్రాస్టిట్యూషన్ రింగ్’ లో పెట్టుబడిదారీ సిద్ధాంత ప్రభోధకుడు స్ట్రాస్ కాన్

ప్రపంచ దేశాలను పెట్టుబడిదారీ “స్వేచ్ఛా మార్కెట్ ఆర్ధిక వ్యవస్ధ” (Free Market Economy) వైపు నడిపించడానికి శ్రమించే ‘అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్ధ’ (ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్) మాజీ అధినేత, ఫ్రాన్సు సోషలిస్టు పార్టీ నాయకుడు ‘డొమినిక్ స్ట్రాస్ కాన్’, ప్రాస్టిట్యూషన్ రింగ్ నడుపుతున్నాడని ఆరోపిస్తూ ఫ్రాన్సు పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతానికి లక్ష యూరోల బెయిల్ పై ఉన్న స్ట్రాస్ కాన్, విచారణలో పాల్గొంటున్నవారితోనూ, మీడియాతోనూ మాట్లాడరాదన్న షరతులను ఎదుర్కొంటున్నాడు. ఫ్రాన్సు న్యాయ వ్యవస్ధ…

1989; Sachin Tendulkar

సచిన్ హెయిర్ స్టైల్స్ ఇలా మారుతూ వచ్చాయి -ఫొటోలు

రింగుల జుట్టుతో భారత క్రికెట్ లోకి అడుగు పెట్టిన సచిన్ టెండూల్కర్ ఇప్పుడు దాదాపు టార్జాన్ హెయిర్ స్టయిల్ లాంటి పొడుగు జుట్టు తో కనిపిస్తున్నాడు. వివిధ దశల్లో అతని హెయిర్ ఎలా రూపం మారుతూ వచ్చిందో చూపుతున్న ఈ ఫొటోల్ని ‘ఫస్ట్ పోస్ట్’ పత్రిక ప్రచురించింది. –

అవినీతిపై విచారణ కోరినందుకు అధికారిని పిచ్చాసుపత్రిలో చేర్చబోయిన యు.పి ప్రభుత్వం

మాయావతి పాలన అవినీతి మయం అయిందంటూ ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిన సమాజ్ వాదీ పార్టీ, రాష్ట్ర ప్రభుత్వ స్కీముల్లో జరుగుతున్న అవినీతి పై విచారణ కోరుతూ ధర్నా చేస్తున్న రాష్ట్ర అధికారిని పిచ్చాసుపత్రిలో చేర్చడానికి ప్రయత్నించింది. అధికారిని చేర్చుకోవడానికి డాక్టర్లు నిరాకరించడంతో పోలీసులు వెనుదిరగవలసి వచ్చింది. రెండేళ్ల క్రితం మాఫియా కాల్పుల్లో కన్ను కోల్పోయినప్పటికీ అవినీతి వ్యతిరేక పోరాటం కొనసాగిస్తున్నందుకు ‘రింకు సింగ్ రాహి’ని పిచ్చివాడుగా ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. గూండా పాలనను…

లంచం ఆరోపణలపై చర్య తీసుకోడానికి ఆర్మీ చీఫ్ ఇష్టపడలేదు -రక్షణ మంత్రి

మాజీ రిటైర్డ్ ఆర్మీ అధికారి తనకు రు. 14 కోట్లు లంచం ఇవ్వజూపాడని ఆర్మీ చీఫ్ చేసిన ఆరోపణల వ్యవహారం మంగళవారం కొత్త మలుపు తిరిగింది. లంచం విషయం తనకు చెప్పినపుడే చర్యలు తీసుకోవాలని ఆర్మీ చీఫ్ కి సూచించాననీ, అయినా చర్యలు తీసుకోవడానికి ఆయన ఆసక్తి చూపలేదనీ, “ఆ విషయంలో మరింత ముందుకెళ్ళాలనుకోవడం లేద”ని ఆర్మీ చీఫ్ తనతో అన్నాడనీ రక్షణ మంత్రి ఏ.కె.ఆంటోని రాజ్య సభలో ప్రకటించాడు. ఆ సమయంలో లంచం విషయంలో మరింత…

Obama-Decorations

అధ్యక్షుడుగా ఒబామా సాధించేమిటి? -కార్టూన్

ఇరాక్, ఆఫ్ఘన్ యుద్ధాలు ముగించి అమెరికా సైనికుల్ని తిరిగి స్వదేశం రప్పిస్తానని గత అధ్యక్ష ఎన్నికల్లో వాగ్దానం చేసిన బారక్ ఒబామా మళ్ళీ ఎన్నికలు వస్తున్నా తన హామీ నిలుపుకోలేదు. పైగా పదవిని అధిష్టించినవెంటనే ఆఫ్ఘనిస్ధాన్ కి ‘ట్రూప్ సర్జ్’ పేరుతో మరో 30,000 సైనికుల్ని పంపించాడు. అధ్యక్ష ఎన్నికలు జరిగే 2012 చివరి నాటికి ఈ ముప్ఫై వేలమంది సైనికుల్ని ఉపసంహరిస్తున్నానని గత సంవత్సరం ప్రకటించాడు. అంటే, ఎన్నికల సంవత్సరంలో ‘సైనికుల ఉపసంహరణ’ పేరుతో తాను…

చైనా అధ్యక్షుడి రాకను నిరసిస్తూ ఢిల్లీలో టిబెటన్ ఆత్మాహుతి -ఫొటోలు

చైనా అధ్యక్షుడు హు జీంటావో భారత దేశం సందర్శించడాన్ని నిరసిస్తూ టిబెట్ జాతీయుడొకరు న్యూఢిల్లీలో ఆత్మాహుతికి పాల్పడ్డాడు. ఢిల్లీలో నిరసన ప్రదర్శన జరుగుతుండగా దుర్ఘటన చోటు చేసుకుంది. తనకు తాను నిప్పంటించుకున్న జాన్ఫెల్ యేషి హు సందర్శనను వ్యతిరేకిస్తూ నినాదాలు ఇచ్చుకుంటూ యాభై మీటర్లు పరిగెత్తాడు. దానితో వెంటనే మంటలు ఆర్పడానికి చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదు. బాధితుడిని సమీపంలోని ఆసుపత్రిలో చేర్చారు. శరీరం ఎంతవరకు కాలిందీ వివరాలు తెలియలేదని పత్రికలు చెప్పాయి. టిబెట్ స్వతంత్రాన్ని కాంక్షిస్తూ…

రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ విదేశీ ప్రయాణాల ఖర్చు రు.205 కోట్లు

రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ జులై 2007 లో పదవిలోకి వచ్చినప్పటి నుండి తన విదేశీ ప్రయాణాల కోసం రు.205 కోట్లను నీళ్లలా ఖర్చు పెట్టేసింది. 12 సార్లు విదేశీ ప్రయాణాలు చేసిన ప్రతిభా 22 దేశాలను చుట్టి వచ్చిందని ప్రభుత్వం వెల్లడించిన వివరాలు చెబుతున్నాయి. మరో నాలుగు నెలల్లో ఆమె పదవీ కాలం ముగుస్తున్నప్పటికీ త్వరలో దక్షిణాఫ్రికా బయలుదేరనున్నారని తెలుస్తోంది. రాష్ట్రపతి చేసే ప్రతి విదేశీ ప్రయాణంలోనూ కుటుంబ సభ్యులందరూ వెంట వెళ్ళేవారని తెలుస్తోంది. గత రాష్ట్రపతులెవరూ…

పనికిరాని వాహనాల కొనుగోలుకు ఆర్మీ చీఫ్ కి రు.14 కోట్ల లంచం ఆఫర్

600 సబ్ స్టాండర్డ్ వాహనాల కొనుగోలుకు ఆర్మీలోనే ఉన్న మరొక ఉన్నతాధికారి తనకు రు.14 కోట్ల లంచం ఇవ్వజూపారని ఆర్మీ చీఫ్ జనరల్ వి.కె.సింగ్ వెల్లడించాడు. తనకు లంచం ఇవ్వజూపిన అధికారి ప్రస్తుతం రిటైర్ అయ్యాడని ఆయన తెలిపాడు. సంఘటన జరిగిన వెంటనే ఈ విషయం రక్షణ మంత్రి ఏ.కె.ఆంటోని కి తెలియజేశానని వి.కె.సింగ్ తెలిపాడు. అయితే వి.కె.సింగ్ పత్రికలకు ఈ సంగతి వెల్లడించాక మాత్రమే, సోమవారం, రక్షణ మంత్రి సి.బి.ఐ విచారణకు ఆదేశించడం గమనార్హం. “ఆరోపణలు…

అమెరికా యుద్ధ నేరాలకు మచ్చుతునక ‘కోలేటరల్ మర్డర్’ -వీడియో

“అబద్ధాలు నిజాలుగా ధ్వనించడానికీ, హత్యలు గౌరవనీయమైనవిగా చేయడానికీ, ఒట్టి గాలిని సైతం గట్టి పధార్ధంగా చూపడానికీ రాజకీయ పరిభాష ఉద్దేశించబడింది” -జార్జ్ ఆర్వెల్ “Political language is designed to make lies sound truthful and murder respectable, and to give the appearance of solidity to pure wind.” -George Orwell మార్చి 22 న ఐక్య రాజ్య సమితి మానవ హక్కుల సంస్ధలో అమెరికా ఒక తీర్మానం ప్రవేశపెట్టింది. ఎల్.టి.టి.ఈ…

పరీక్ష హాలులో దళిత బాలికల బట్టలిప్పించిన ఇన్విజిలేటర్లు

పరీక్షల్లో ఎవరైనా విద్యార్ధులు కాపీ కొడుతున్నట్లు అనుమానం వస్తే ఇన్విజిలేటర్లు ఏం చేయాలి? సాధారణంగా జేబుల్లో కాపీ స్లిప్పులు ఏమైనా ఉన్నాయేమో చూస్తారు. కాగితాల కింద దాచి పెట్టారేమో చెక్ చేస్తారు. ఇంకా దాచిపెట్టడానికి ఉన్న అవకాశాలని పరిశీలించి వెతుకుతారు. జామెట్రీ బాక్సుల్లో, రిస్ట్ వాచీ కిందా ఇలాంటి చోట్ల. అయితే దళిత బాలికలైతే ఇవేవీ అవసరం లేదు. పరీక్ష రాస్తున్న వారు 15 సంవత్సరాల బాలికలైనా, సంస్కార హీనమని తెలిసినా వారు దళిత బాలికలైతే అందరి…

ఫుకుషిమా కంటే ‘ఇరాన్ పై ఆంక్షలే’ మాకు పెను ప్రమాదం -జపాన్

2011 లో సంభవించిన ఫుకుషిమా అణు ప్రమాదం కంటే ఇరాన్ పై పశ్చిమ దేశాలు విధించిన ఆంక్షల వల్లనే తమకు పెను ప్రమాదంగా పరిణమిస్తాయని జపాన్ భావిస్తోంది. అమెరికాలో జరిగిన ఒక సదస్సులో మాట్లాడుతూ ‘ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజన్సీ’ మాజీ డైరెక్టర్ నోబువో తనాకా ఈ మేరకు ఆందోళన వెలిబుచ్చాడు. ఇరాన్ పై విధించిన ఆంక్షల వల్ల తమ దేశానికి జరిగే గ్యాస్, ఆయిల్ సరఫరాలు ఆగిపోతాయనీ, దానివల్ల 2011 లో ఫుకుషిమా అణు ప్రమాదం వల్ల…

బ్లాక్ టీనేజర్ హత్య: అమెరికా వ్యాపితంగా నిరసనలు -ఫొటోలు

బ్లాక్ టీనేజర్ ట్రేవాన్ మార్టిన్ (17 సం.) ను తెల్ల పోలీసు కాల్చి చంపిన కేసును ‘జాత్యహంకార హత్య’ గా భావిస్తున్నారు. హత్య చేసిన పోలీసు ‘ఆత్మ రక్షణ’ నిమిత్తం టీనేజర్ ని కాల్చిచంపానని చెప్పడంతో అతనిని పోలీసులు అరెస్టు చేయలేదు. దానితో రెండు వారాలుగా అమెరికా అంతటా నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి. ప్రారంభంలో ఫ్లోరిడా రాష్ట్రంలో కేంద్రీకృతమైన ఈ ప్రదర్శనలు క్రమంగా అమెరికా అంతటా విస్తరించాయి. ఫిలడెల్ఫియా, న్యూయార్క్, లాస్ ఏంజిలిస్ తదితర నగరాల్లో ‘మిలియన్…

బ్లాక్ టీనేజర్ హత్య పై అట్టుడుకుతున్న అమెరికా

ఫిబ్రవరి 26 వ తేదీన ఫ్లోరిడా రాష్ట్రంలో తెల్ల జాతికి చెందిన పోలీసు ఒకరు నల్ల జాతికి చెందిన టీనేజర్ ను కాల్చి చంపిన విషయంలో అమెరికా అంతటా నిరసనలు చెలరేగుతున్నాయి. 17 యేళ్ళ వయసు కలిగిన ట్రేవాన్ మార్టిన్  నిరాయుధుడుగా ఉన్నప్పటికీ పోలీసు (జిమ్మర్ మేన్ – 28 సం.) అతనిని ‘ఆత్మ రక్షణ’ కోసం చంపినట్లుగా చెబుతున్నాడు. బ్లాక్ టీనేజన్ హత్యలో పోలీసులు ఇంతవరకూ ఎవరినీ అరెస్టు చేయకపోవడంతో దానికి కారణం జాతి పక్ష…

అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న భారతీయులు 2.4 లక్షలు

అమెరికాలో నివసిస్తున్న వారిలో భారతీయుల సంఖ్య ఏడవ స్ధానంలో ఉందని అమెరికా హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ విభాగం తెలిపింది. 2.4 లక్షల మంది భారతీయులు ఎటువంటి చట్టబద్ధమైన డాక్యుమెంట్లు లేకుండా అమెరికాలో నివసిస్తున్నారని, 2000, 2011 సంవత్సరాల మధ్య వీరి సంఖ్య దాదాపు రెట్టింపు అయిందని అమెరికా తెలిపింది. ఇదే కాలంలో  అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న విదేశీయుల సంఖ్య 84.6 లక్షల నుండి 1.151 కోట్లకు పెరిగిందని కూడా హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ విభాగం తెలిపింది. మెక్సికోకి …