రైలు ఛార్జీల పెంపుదల మమత కి ముందే తెలుసు -ఎన్.డి.టి.వి

తమ పార్టీకి చెందిన రైల్వే మంత్రి దినేష్ త్రివేది తనకు చెప్పకుండా రైలు ప్రయాణ ఛార్జీలు పెంచాడని ఆరోపిస్తూ, అతని సేత రాజీనామా కూడా చేయించిన మమతకి చార్జీల పెంపుదల సంగతి ముందే తలుసని ఎన్.డి.టి.వి వెల్లడించింది. రైల్వే బడ్జెట్ ప్రతిపాదిస్తున్న సమయంలోనే మమతతో రైల్వే ఛార్జీల పెంపు విషయాన్ని ప్రభుత్వ పెద్దలు చర్చించారని అభిజ్ఞ వర్గాలను ఉటంకిస్తూ ఎన్.డి.టి.వి తెలిపింది. ఒక్క మమతనే కాకుండా ప్రధాన ప్రతిపక్ష పార్టీలను కూడా ప్రభుత్వం సంప్రదించిందనీ, రైలు ఛార్జీలు…

అతను మనిషి, ఆస్తి కాదు -ఎంబసీ బాంబు కేసులో మేజిస్ట్రేట్

ఇజ్రాయెల్ ఎంబసీ కారుపై బాంబు దాడి జరిగిన కేసులో నిందితుడిని విచారించడానికి ఇజ్రాయెల్ గూఢచార సంస్ధ ‘మొస్సాద్’  అనుమతించారన్న ఆరోపణలపై కోర్టు తీవ్రంగా స్పందించింది. “అనుమానితుడు మనిషి, ఆస్తి కాదు” అని తీవ్రంగా వ్యాఖ్యానించింది. నిందితుడిని విచారించినవారి జాబితాను తన ముందుంచాలని ఢిల్లీ పోలీసులను ఆదేశించింది. నిందితుడిపై జరిపిన విచారణపై తక్షణం ‘డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్’ స్ధాయికి తగ్గని పోలీసు అధికారి అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. “ప్రయోగశాలలో పరీక్షలు జరిపే పందిగా నిందితుడిని మార్చారన్న”…

శ్రీలంక కిల్లింగ్ ఫీల్డ్స్, ఈ దారుణాలు చూడగలరా? -ఫొటోలు

సాటి మనుషుల్ని ఇంత పైశాచికంగా హింసించడం ‘మనిషి’ గా చచ్చిపోతే తప్ప సాధ్యం కాదు. ‘క్లినికల్లీ డెడ్’ లాగా ‘హ్యూమన్లీ డెడ్’ లాంటి ఓ కొత్త పదం కనిపెడితే తప్ప శ్రీలంక సైనికుల ఘోర కృత్యాలను వర్ణించలేము. శ్రీలంక లో సింహళుల జాతి వివక్షను వ్యతిరేకిస్తూ ఎల్.టి.టి.ఇ ప్రారంభించిన యుద్ధం ‘ప్రత్యేక ఈలం’ ను డిమాండ్ చేసేవరకూ వెళ్లింది. రెండు దశాబ్దాల పాటు సాగిన వారి ఘర్షణలో శ్రీలంక సైన్యం 2009 లో పై చేయి సాధించడంతో…

Agri labour

‘ఉపాధి హామీ పధకం’ కి బడ్జెట్ లో నిధుల కత్తిరింపు

ఓట్ల కోసమే తప్ప తమకు ప్రజా సంక్షేమం పట్ల చిత్తశుద్ధి లేదని కాంగ్రెస్ ప్రభుత్వం రుజువు చేసుకుంది. ప్రజా సంక్షేమం చూసే పార్టీగా చెప్పుకోవడానికి కాంగ్రెస్ ప్రముఖంగా చూపించే పధకం ‘ఉపాధి హామీ పధకం’. ఈ పధకం వల్లనే కాంగ్రెస్ పార్టీ రెండవ సారి వరుసగా అధికారంలోకి వచ్చిందని కాంగ్రెస్ నాయకులు అనేకసార్లు చెప్పారు. దీనిని సోనియా గాంధీ ప్రసాదించిన వరంగా కూడా కాంగ్రెస్ పెద్దలు చెప్పుకోవడం కద్దు. అలాంటి పధకానికి 2012-13 ఆర్ధిక సంవత్సరానికి ప్రతిపాదించిన…

శ్రీలంక పాలకుల ‘తమిళ జాతి హత్యాకాండ’ పై రెండో డాక్యుమెంటరీ

ఎల్.టి.టి.ఈ పై యుద్ధంలో చివరి రోజుల్లో తమిళ పౌరులపై శ్రీలంక పాలకుల పనుపున శ్రీలంక సైన్యం జరిపిన ‘జాతి హత్యాకాండ’ పై రెండవ వీడియో డాక్యుమెంటరీ వెలువడింది. “శ్రీలంకాస్ కిల్లింగ్ ఫీల్డ్స్: వార్ క్రైంస్ అన్ పనిష్డ్” పేరుతో పేరుతో బ్రిటన్ కి చెందిన చానెల్ 4 ఈ డాక్యుమెంటరీ తీసింది. ఇదే చానెల్ సంవత్సరం క్రితం వెలువరించిన డాక్యుమెంటరీకి ఇది కొనసాగింపు. ఈ వీడియోను బూటకం గా శ్రీలంక ప్రభుత్వం అభివర్ణించింది. వీడియో సాధికారతను, విశ్వసనీయతను…

వంద సెంచరీల సచిన్ -ఫొటోలు

మార్చి 16 2012 తేదీన ఆసియా కప్ టోర్నమెంట్ లో బంగ్లాదేశ్ పై సచిన్ టెండూల్కర్ తన వందవ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ సెంచరీ కోసం భారత క్రికెట్ ప్రేమికులు సంవత్సర కాలంగా ఎదురు చూస్తున్నారు. సచిన్ వందవ సెంచరీ సందర్భంగా ‘ది హిందూ’ పత్రిక అందించిన ఫొటోలు ఇవి. – –

Budget 2012-13

2012-13 బడ్జెట్ -కార్టూన్

(ఫస్ట్ పోస్టు నుండి) సోనియా: “గత సంవత్సరం వచ్చిన మంచి అనుభవంతో ఇసారి మెరుగైన బడ్జెట్ ఇస్తారని ఆశిస్తున్నా” గత సంవత్సరం బడ్జెట్ లో అనుకున్న లక్ష్యాలు చెరుకోలేదని భారత ప్రభుత్వంపైన అనేకమంది విమర్శలు చేస్తున్నారు. వారిలో స్వదేశీ, విదేశీ పత్రికలు, కార్పొరేట్ కంపెనీలు, పెట్టుబడిదారుల సంఘాలైన ఆసోచామ్, ఫిక్కీ, సి.ఐ.ఐ లూ వీరిలో ముఖ్యులు. గత బడ్జెట్లో బడ్జెట్ లోటు జిడిపిలో 4.6 శాతం ఉంటుందని అంచనా వేసినా దాన్ని చేరుకోలేక 5.9 శాతానికి ప్రభుత్వం…

బడ్జెట్ 2012-13 ముఖ్యాంశాలు

2012-13 ఆర్ధిక సంవత్సరానికి గాను ఆర్ధిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ శుక్రవారం పార్లమెంటు లో బడ్జెట్ ప్రతిపాదించాడు. ఇందులో ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి. అంచనాలు: మొత్తం బడ్జెట్ అంచనా: రు. 14.9 లక్షల కోట్లు (14,90,925 కో). ఇది 2011-12 బడ్జెట్ కి 29 శాతం ఎక్కువ. ప్రణాళికా ఖర్చు: రు. 5,21,025 కోట్లు. గత సంవత్సరం కంటే 18 శాతం ఎక్కువ. మొత్తం ఖర్చులో ఇది 35 శాతమే. ప్రణాళికేతర ఖర్చు: రు. 9,69,900 కోట్లు.…

Railway budget 2012-13

మమత, త్రివేది, రైల్వే బడ్జెట్ -కార్టూన్

రైల్వే మంత్రి దినేష్ త్రివేది తృణమూల్ నేత. ఆయన మమత మాటను జవదాటేవాడేమీ కాదు. భారత దేశంలో రాజకీయ పార్టీలు భూస్వామ్య వ్యవస్ధలకు ప్రతీకలుగా ఉన్నాయే తప్ప ప్రజాస్వామ్య బద్ధగా లేవు. పార్టీ కార్యకర్తల కంటే పార్టీ నాయకులే అక్కడ సుప్రీం. అలాంటి ప్రజాస్వామ్య రహిత పార్టీల్లో తృణమూల్ కూడా ఒకటి. అదీ కాక ఎన్.డి.ఎ ప్రభుత్వంలో మమత రైల్వే మంత్రిగా పని చేసింది. యు.పి.ఎ ప్రభుత్వంలో కూడా మూడేళ్ళు రైల్వే మంత్రిగా పని చేసింది. బెంగాల్…

All options for Greece

అన్నీ టెబుల్ మీదే ఉన్నాయి -కార్టూన్

“అన్ని అవకాశాలనూ పరిశీలిస్తున్నాం” ఇది ప్రభుత్వాలకూ, రాజకీయ నాయకులకూ ఊత పదం. దీన్నే ఆంగ్లంలో “ఆల్ ఆప్షన్స్ ఆర్ ఆన్ టేబుల్” అని అంటుంటారు. అమెరికా అధ్యక్షుడు ఒబామా దగ్గర్నుండి, యూరప్ పాలకుల మీదుగా, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ, ఇండియా ప్రధాని మన్మోహన్ ల వరకూ దీన్ని పదే పదే వాడుతుంటారు. దానర్ధం నిజంగా అన్ని అవకాశాలను పరిశీలిస్తున్నట్లు కాదని అనేక సార్లు రుజువయ్యింది. యూరప్ రుణ సంక్షోభం, ఇరాన్ అణు ప్రమాదం, సిరియా కిరాయి తిరుగుబాటు,…

భగత్ సింగ్ వీర మరణాన్ని అవమానించిన రైల్వే మంత్రి

తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన దినేష్ త్రివేది గురువారం రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఛార్జీలు పెంచి రు. 36,200 కోట్లు అదనంగా ఈ సంవత్సరం ఆదాయం పెంచబోతున్నట్లు ఆయన ప్రకటించాడు. అంత పెద్ద మొత్తం లో ఛార్జీలు వడ్డించి కూడా తాను చాలా తక్కువ పెంచానని ప్రకటించాడు. పైగా సామాన్య మానవుడిని దృష్టిలో పెట్టుకుని ఛార్జీలు పెంచానని చెప్పడానికి కూడా సాహసించాడు. ఛార్జీలు పెంచి ఐ.సి.యు లో ఉన్న రైల్వేలను బైటికి తెచ్చానని గొప్పలు…

భారత ప్రయాణీకుల ఉమ్మడి ఆత్మ ‘భారత రైల్వే’ -ఫొటోలు

‘ఇండియన్ రైల్వేస్’ కి భారత దేశ ప్రయాణీకుల అంతరంగంలో ఉత్కృష్ట స్ధానం ఉంది. కాశ్మీరు నుండి కన్యాకుమారి వరకూ లక్షల కొద్దీ పల్లెలనూ, పట్నాలనూ కలుపుతూ వ్యాపించిన భారత రైల్వేలు లేకుండా భారతీయుడికి రోజు గడవదు. భారత దేశంలో ప్రజలకు జీవనాడిగా ఉన్న వేల కొద్దీ వృత్తులూ, ఉద్యోగాలూ ఏదో ఒక రూపంలో రైల్వేలతో సంబంధం లేకుండా లేవు. అది ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగం ఐనా, ప్రవేటు కంపెనీ సమకూర్చిన ఉద్యోగం అయినా, స్వయం ఉపాధి అయినా……

‘మందుపాతర’కు ప్రతీకారమే ‘ఆఫ్ఘన్ హత్యాకాండ’

ఆఫ్ఘనిస్ధాన్ ప్రజల అత్యాధ్మిక రాజధాని కాందహార్ సమీపాన అమెరికా సైనికులు రెండు గ్రామాల్లో (బలాంది, అల్కోజాయ్), మూడు ఇళ్ళల్లో జొరబడి 16 మంది పౌరులను చంపింది మతి భ్రమించి కాదని, హత్యాకాండకు కొద్ది రోజుల ముందు అమెరికా సైనిక కాన్వాయ్ పైన తాలిబాన్ ప్రయోగించిన మందుపాతర’ కు ప్రతీకారమేనని రాయిటర్స్ వార్తా సంస్ధ కధనం వెల్లడించింది. ఆ కధనం ఇలా ఉంది. DEMAND FOR TRIAL in AFGHANISTAN The U.S. military hopes to withdraw…

ఛార్జీలు పెంచిన రైల్వే బడ్జెట్ 2012-13

కొత్త రైల్వే మంత్రి దినేష్ త్రివేది ఛార్జీలు పెంచడానికే నిర్ణయింకుకున్నాడు. 2012 ఏప్రిల్ నెల నుండి ప్రారంభమయ్యే ఆర్ధిక సంవత్సరానికి గాను మార్చి 14, బుధవారం ఆయన రైల్వే బడ్జెట్ ప్రవేవేశపెట్టాడు. కొద్దిగానే పెంచానని మంత్రి చెబుతున్నప్పటికీ పెంచినవన్నీ ప్రయాణీకులపై భారం పడవేసేవే. రెండు సంవత్సరాలుగా కొనసాగుతున్న ద్రవ్యోల్బణం వల్ల ప్రభుత్వ, ప్రవేటు వేతన జీవుల నిజ వేతనాలు బాగా పడిపోయినందున ఎంత పెంచినా ప్రయాణీకుల జేబుకు ఇప్పటికే ఉన్న చిల్లుల్ని పెద్దవి చేసేవే. కిలో మీటరుకి…

సునిశిత హాస్యం ఈ గీతల సొంతం -స్ట్రీట్ ఆర్ట్ ఫొటోలు

ఈ వీధి చిత్రాల్లో కళాకారులు పెద్దగా కష్ట పడినట్లు కనిపించదు. సహజ సిద్ధంగా ఏర్పడిన కొన్ని గీతలనీ, రోజువారీ ఉపయోగం కోసం ఏర్పాటు చేసుకున్న కొన్ని నిర్మాణాలనూ, ఉపకరణాలనూ ఆధారం చేసుకుని వారు అర్ధవంతమైన చిత్రాలు రాబట్టారు. తరచుగా ఈ చిత్రాల్లో కేవలం కొన్ని గీతలో, కొంత పాఠ్యమో, మహా అయితే రోజూ చూసే చిన్న చిన్న బొమ్మలో కనిపిస్తాయంతే. ఇలాంటి వీధి చిత్రాలు సృష్టించడంలో బ్యాంక్సీ (ఇంగ్లండ్) సిద్ధహస్తుడు. ఓక్ ఓక్ (ఫ్రాన్సు) కూడా. వీరద్దరు…