మార్కెట్ హెవీ వెయిట్ ‘రిలయన్స్ ఇండస్ట్రీస్’ రేటింగ్ తగ్గింపు

భారత షేర్ మార్కెట్‌కు హెవీ వెయిట్ గా పేరుపొందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ రేటింగ్‌ను వాల్‌స్ట్రీట్ స్ట్రీట్ దిగ్గజం మోర్గాన్ స్టాన్లీ తగ్గించేసింది. పెట్టుబడి ఎక్కువ చేసి చూపిందని ఆరోపణ ఎదుర్కొంటున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ చుట్టూ ఇటీవల అనేక ఆరోపణలు చుట్టుముడుతున్నాయి. గ్యాస్ నిక్షేపాలు అధికంగా ఉన్నాయని భావిస్తున్న కెజి బేసిన్ లో అనుకున్నంత స్ధాయిలో నిల్వలు లేవన్న అనుమానాలు తలెత్తాయి. సమీప భవిష్యత్తులో రిలయన్స్ ఇండస్ట్రీట్ కంపెనీకి అనుకూలంగా పనిచేసే పరిణామాలేవి సంభవించవని మోర్గాన్ స్టాన్లీ ఇన్‌వెస్ట్‌మెంట్…

భారత షేర్ల సూచి ‘సెన్సెక్స్’ టార్గెట్‌ అంచనా తగ్గించిన యు.బి.ఎస్ బ్యాంకు

ప్రవేటు వెల్త్ మేనేజ్‌మెంట్ వ్యాపారంలో ప్రపంచంలోనే రెండవ అతి పెద్ద ఇన్‌వెస్ట్‌మెంట్ బ్యాంకుగా ప్రసిద్ధి చెందిన యూనియన్ బ్యాంక్ ఆఫ్ స్విట్జర్లాండ్ (యుబిఎస్) భారత దేశానికి చెందిన బోంబే స్టాక్ ఎక్ఛేంజ్ (సెన్సెక్స్) సూచిపై గతంలో తాను అంచనా వేసిన లక్ష్యాన్ని బాగా తగ్గించింది. యు.బి.ఎస్ సెన్సెక్స్ సూచి 22,500 పాయింట్లకు చేరుకుంటుందని అంచనా వేయగా, ప్రస్తుతం దానిని 21,000 పాయింట్లకు తగ్గించింది. లాభాల సంపాదనలో ప్రతికూల ఒరవడిలో ఉన్నందున సెన్సెక్స్ లక్ష్యాన్ని తగ్గిస్తున్నట్లుగా అది తెలిపింది.…

పాక్ విలేఖరి హత్యలో పాక్ ప్రభుత్వ హస్తం -అమెరికా మిలట్రీ అధికారి ముల్లెన్

మే నెలాఖరులో జరిగిన పాకిస్ధాన్ విలేఖరి షహజాద్ హత్యలో పాకిస్ధాన్ ప్రభుత్వంలోని కొన్ని శక్తుల హస్తం ఉందని అమెరికా మిలట్రీ ఉన్నతాధికారి మైక్ ముల్లెన్ వెల్లడించాడు. అమెరికా మిలట్రీలో ఉన్నత స్ధాయి అధికారి ఒకరు ఈ విధంగా జర్నలిస్టు హత్య కేసు విషయంలో ఆరోపణలు చేయడం ఇదే మొదటిసారి. విలేఖరి హత్యలో ఐ.ఎస్.ఐ హస్తం ఉందని తాను చెప్పలేనని కూడా ఆయన అన్నాడు. విలేఖరి హత్యకు పాక్ ప్రభుత్వానికి సంబంధించిన నిర్ధిష్ట ఏజన్సీతో సంబధం ఉందనడానికి మద్దతుగా…

2జి కుంభకోణం: మంత్రివర్గంలో రాలిపడే తదుపరి తల కపిల్ సిబాల్?

2జి స్పెక్ట్రం కుంభకోణం ఫలితంగా కేంద్ర మంత్రివర్గం నుండి దొర్లిపడే తదుపరి తల విద్యా, టెలికం శాఖల మంత్రి కపిల్ సిబాల్‌ది కావచ్చనడానికి తగిన పరిణామాలు ప్రారంభమైనట్లు కనిపిస్తోంది. మాజీ టెలికం మంత్రి, డి.ఎం.కె పార్టీ నాయకుడు ఎ.రాజా, సి.బి.ఐ దర్యాప్తు ఫలితంగా జైలు పాలు కావడంతో ఆయన స్ధానంలో కపిల్ సిబాల్ టెలికం శాఖ బాధ్యతలు చేపట్టాడు. ఆయన వచ్చీ రావడంతోనే 2జి స్పెక్ట్రం కేటాయింపుల్లో కంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్ (సి.ఎ.జి) నివేదించినట్లు, కేంద్ర ప్రభుత్వం…

తెలంగాణ డిమాండ్‌పై అంతర్జాతీయ పెట్టుబడుల దృక్పధం ఎలా ఉంది?

తెలంగాణ రాష్ట్రం డిమాండ్ చేస్తూ ఆ ప్రాంతంలో ఉద్యమాలు సాగుతున్నందున రాష్ట్రానికి రావలసిన పెట్టుబడులు వెనక్కి పోతున్నాయని గత సంవత్సరం నుండి ఆరోపణలు వస్తున్నాయి. నిరంతరం ఎదో ఒక ఆందోళన జరుగుతున్నందున రవాణా సౌకర్యం దెబ్బతిని కంపెనీల కార్యకలాపాలు దెబ్బతింటున్నాయని వార్తా సంస్ధలు కూడా రాస్తున్నాయి. వివిధ అంతర్జాతీయ సంస్ధల సిబ్బంది తమ తమ కార్యాలయాలకు చేరుకోవడంలో విఫలమవుతున్నందున నష్టం జరుగుతున్నదని అవి తెలుపుతున్నాయి. ముఖ్యంగా హైద్రాబాద్ బ్రాండ్ నేమ్ అంతర్జాతీయంగా మారుమోగుతున్న సందర్భంలో తెలంగాణ కోసం…

2జి కుంభకోణంలో రాలిపడిన రెండో తల, కేంద్ర టెక్స్‌టైల్స్ మంత్రి దయానిధి మారన్ రాజీనామా

2జి స్పెక్ట్రం కుంభకోణంలో రెండో తలకాయ రాలిపడింది. బుధవారం సుప్రీం కోర్టుకి సి.బి.ఐ సమర్పించిన స్టేటస్ రిపోర్ట్ లో కేంద్ర టెక్స్‌టైల్స్ శాఖా మంత్రి దయానిధి మారన్ పాత్రపై వివరాలు పొందుపరిచిన సంగతి విదితమే. చెన్నైకి చెందిన శివరామ కృష్టన్, తన ఎయిర్ సెల్ కంపెనీ లోని మెజారిటీ షేర్లను మలేషియాకి చెందిన మేక్సిస్ కంపెనీకి అమ్మేలా ఒత్తిడి చేశాడనీ, తద్వారా మేక్సిస్ కంపెనీ చేత తన కుటుంబానికి చెందిన సన్ టి.వి లో 600 కోట్ల…

అణు సాంకేతిక పరిజ్ఞానం కోసం పాక్ మిలట్రీ అధికారులకు లంచం చెల్లించిన ఉత్తర కొరియా

పాకిస్ధాన్‌కు అణుశాస్త్ర, అణ్వస్త్ర పితామహుడుగా పేరుపొందిన అబ్దుల్ ఖదీర్ ఖాన్ పాక్ మిలట్రీ పరువు తీస్తూ అణుబాంబు పేల్చినంత పని చేశాడు. పాకిస్ధాన్ ప్రభుత్వంతో సంబంధం లేకుండా ఉత్తర కొరియాకు అణు సాంకేతిక పరిజ్ఞాన్ని ఉత్తర కొరియాకు బదలాయించాడని పాక్ ప్రభుత్వం ఖదీర్ ఖాన్‌పై ఇప్పటివరకూ ఆరోపిస్తూ వచ్చింది. ఆ అరోపణలకు భిన్నంగా అణు సాంకేతికత బదలాయింపులో పాక్ మిలట్రీకే నేరుగా సంబంధం ఉందనీ, అందుకు మిలట్రీ అధికారి ఒకరు 3 మిలియన్ డాలర్లు, మరొక అధికారి…

తెలంగాణ రాష్ట్రం కోసం 48 గంటల బంద్ -ఫొటోలు

రెండు రోజు తెలంగాణ బంద్ విజయవంతమైంది. ఒక్క సైబరాబాద్ మినహా తెలంగాణ ప్రాంతంలోని పది జిల్లాల్లోనూ బంది సక్సెస్ అయింది. కేంద్రం మాత్రం తొందరపడడం లేదు. డిసెంబరు 9, 2009 నాటి ప్రకటన అనంతరం సీమాంధ్ర జిల్లాల్లో ప్రజా ప్రతినిధుల రాజినామాలతో పాటు, రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ప్రజలు కూడా ఉద్యమించడంతో కొద్ది రోజులకే ఆ ప్రకటనను కేంద్రం వెనక్కి తీసుకోవలసి వచ్చింది. ఆ అనుభవం ఇంకా పీడకలగా కాంగ్రెస్‌ను వెన్నాడుతోంది. దానితో ఏ నిర్ణయమూ తీసుకోకుండా…

2జి స్పెక్ట్రమ్ కుంభకోణం: కేంద్ర మంత్రి దయానిధి మారన్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు

సి.బి.ఐ ని తనపని తనను చేసుకోనిస్తే తగిన ఫలితాలను చూపించగల సత్తా ఉన్న సంస్ధ అని నిరూపించుకుంటోంది. కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణ నుండి సి.బి.ఐ ని తాత్కాలికంగా తప్పించి సుప్రీం కోర్టు పర్యవేక్షణలో పని చేస్తున్నందున ఒక్కో తీగా లాగుతూ అనేక డొంకల్ని కదిలిస్తోంది. సి.బి.ఐ బుధవారం సుప్రీం కోర్టుకి సమర్పించిన ‘స్టేటస్ రిపోర్ట్’ లో ప్రస్తుతం కేంద్రంలో టెక్స్ టైల్స్ శాఖ మంత్రిగా ఉన్న దయానిధి మారన్ అఘాయిత్యాన్ని పొందుపరిచింది. మలేషియా కంపెనీకి మేలు చేయడానికీ,…

తీవ్రమవుతున్న యూరప్ అప్పు సంక్షోభం, పోర్చుగల్ రేటింగ్ ఢమాల్

గత సంవత్సరం రెండో అర్ధ భాగం అంతా ప్రపంచ కేపిటల్ మార్కెట్లను వణికించిన యూరప్ అప్పు సంక్షోభం మళ్ళీ మరొకసారి విశ్వరూపం ప్రదర్శిస్తోంది. గత మే, జూన్ నెలల్లో గ్రీసు సంక్షోభమే ప్రపంచ మార్కెట్ల సెంటిమెంట్లను ఆవరించింది. గ్రీసుకు రెండో బెయిలౌట్ ఇవ్వడానికి ఇ.యు ఒక ఒప్పందానికి రావడమూ, గ్రీసు తాజాగా సరికొత్త పొదుపు చర్యలను అమలు చేసే బిల్లును ఆమోదించడమూ విజయవంతంగా ముగియడంతో గ్రీసు తాత్కాలికంగా చర్చలనుండి పక్కకు తప్పుకుంది. తాజాగా మూడీస్ ఇన్వెస్టర్ సర్వీసెస్…

బిన్ లాడెన్ కుటుంబం అప్పగింతకు పాకిస్ధాన్ నిరాకరణ

ఒసామా బిన్ లాడెన్ భార్యలను, పిల్లలను తమ స్వస్ధాలకు పంపడానికి పాకిస్ధాన్ దాదాపుగా నిరాకరించింది. ఒసామా బిన్ లాడెన్ మరణానంతరం అతని భార్యలను, పిల్లలను పాక్ ప్రభుత్వం అదుపులోకి తీసుకుంటున్నట్లు ప్రకటించింది. లాడెన్ హత్యపై విచారణకు ప్రభుత్వం నియమించిన కమిషన్ అంగీకరిస్తే తప్ప ఆయన కుటుంబాన్ని ఇతర దేశాలకు అప్పగించబోమని పాక్ ప్రభుత్వ పానెల్ ప్రకటించింది. ముగ్గురు భార్యలు, 13 మంది పిల్లలతో కూడిన ఒసామా కుటుంబం ప్రస్తుతం పాకిస్ధాన్ ప్రభుత్వ రక్షణలో ఉన్నారు. మే 2…

రెండు రోజుల బంద్‌తో తెలంగాణలో స్తంభించిన సాధారణ జనజీవనం

తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ జె.ఎ.సి ఇచ్చిన 48 గంటల బంద్ విజయవంతమైందనే చెప్పాలి. రెండో రోజు వరసగా సాధారణ జన జీవనం స్తంబించిపోయింది. స్కూళ్ళు, కాలేజిలు, షాపులు, పెట్రోల్ పంపులు ఇంకా ఇతర వ్యాపార సంస్ధలన్నీ మూసివేశారు. వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు స్తంభనకు గురయ్యాయి. రవాణా వ్యవస్ధ తెలంగాణలోని పది జిల్లాల్లోనూ ప్రతిష్టంభనకు గురయ్యింది. హైద్రాబాదులో కూడా బందు పూర్తిగా విజయవంతమైందని పత్రికా సంస్ధలు తెలిపాయి. ఎ.పి.ఎస్.ఆర్.టి.సి ముందు జాగ్రత్తతో వ్యవహరించి బస్సులను గ్యారేజిలకే పరిమితం చేశారు.…

జర్నలిస్టు హత్యలో ఐ.ఎస్.ఐ హస్తం లేదు -పాక్ ప్రభుత్వం

ఏసియా టైమ్స్ విలేఖరి సయ్యద్ సలీమ్ షహజాద్ హత్యలో పాక్ గూఢచార సంస్ధ ఐ.ఎస్.ఐ హస్తం ఉందనడాన్ని పాకిస్ధాన్ ప్రభుత్వం తిరస్కరించింది. రహస్య గూఢచర్య సమాచారం విలేఖరి హత్యలో ఐ.ఎస్.ఐ ప్రత్యక్ష జోక్యం ఉందని నిరూపిస్తున్నట్లుగా వచ్చిన వార్తలను పాక్ ఖండించింది. పాకిస్ధాన్ భద్రతా బలగాల పరువు ప్రతిష్టలకు భంగం కలిగించడానికే జరుగుతున్న అంతర్జాతీయ కుట్రలో భాగమే ఈ కధనాలని ఆరోపించింది. ఐ.ఎస్.ఐ కి చెందిన సీనియర్ ఉన్నాధికారులు షహజాద్ హత్యకు పురమాయించారని న్యూయార్క్ టైమ్స్ పత్రిక…

“సల్వా జుడుం” ఏర్పాటు చట్ట విరుద్ధం -చత్తిస్‌ఘడ్ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు గడ్డి పెట్టిన సుప్రీం కోర్టు – 2

“(సల్వా జుడుం యొక్క) రాజ్యాంగబద్ధమైన సమ్మతిని కొలవడానికి ఆ బలగాల ప్రభావశీలత (effectiveness) ఒక్కటే కొలబద్ద కాజాలదు, కాగూడదు కూడా. ఛత్తీస్ ఘఢ్‌లో మావోయిస్టు/నగ్జలైట్ల కార్యకలాపాలకు వ్యతిరేకంగా ఎస్.పి.ఓ లు ప్రభావవంతంగా ఉన్నాదన్న అంశం తప్పుడు ప్రతిపాదన, కాకుంటే అనుమానాస్పదమైన ప్రతిపాదన. వాదన కోసం నిజంగానే ఎస్.పి.ఓలు మావోయిస్టులు/ నగ్జలైట్లకి వ్యతిరేకంగా ప్రభావవంతంగా ఉపయోగపడుతున్నారని అంగీకరించినా, తద్వారా వారివలన చేకూరుతున్నాయంటున్న అనుమానాస్పద లాభాలు, రాజ్యాంగంపై ఉండవలసిన పవిత్ర నమ్మకం, గౌరవాలను పెద్ద ఎత్తున కోల్పోవడానికీ, సామాజిక క్రమబద్ధత…

“సల్వా జుడుం” ఏర్పాటు చట్ట విరుద్ధం -చత్తిస్‌ఘడ్ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు గడ్డి పెట్టిన సుప్రీం కోర్టు – 1

కేంద్ర ప్రభుత్వానికి, ఛత్తిస్ ఘడ్ రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టు గడ్డి పెట్టినంత పని చేసింది. ఛత్తిస్ ఘఢ్ లో మావోయిస్టులను ఎదుర్కోవడానికి గిరిజన తెగల్లోనే ఒక తెగకు శిక్షణ ఇచ్చి తుపాకులిచ్చి స్పెషల్ పోలీస్ ఆఫిసర్లుగా పేరుపెట్టి రిగిజనంపైకి వదిలింది. దీనివలన గిరిజన తెగల్లో తీవ్ర ఘర్షణలు తలెత్తి ఒక తెగపై మరొక తెగ దారుణంగా మారణ కాండకు తలపడడం మొదలైంది. గిరిజనులకూ, గిరిజనులకూ పెట్టి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు వినోదం చూశాయి. ఈ పద్దతిని…