అమెరికా కంపెనీలు లాభాల్లో, అమెరికా ఆర్ధిక వ్యవస్ధ నష్టాల్లో

2007-08 ప్రపంచ ఆర్ధిక సంక్షోభం ఫలితంగా అమెరికా ఆర్ధిక వ్యవస్ధ తీవ్రంగా దెబ్బతింది. 2009 వరకూ అమెరికాలోని కంపెనీలు కూడా తీవ్రమైన ఆర్ధిక కష్టాల్లో ఉన్నట్లు ప్రకటించాయి. లేమేన్ లాంటి ఫైనాన్సి దిగ్గజం నిట్ట నిలువునా కూలిపోవడంతో ప్రపంచం నిర్ఘాంతపోయింది. వాల్ స్ట్రీట్ లోని బహుళజాతి ద్రవ్య సంస్ధలైన ఇన్‌వెస్ట్‌మెంట్ బ్యాంకులన్నీ తోటి బ్యాంకులపై నమ్మకం కోల్పోయి ఒక్క సెంటు కూడా చేబదుళ్ళు, అప్పులు ఇవ్వడానికి నిరాకరించడంతో అప్పు దొరకడం గగనమైంది. “క్రెడిట్ క్రంచ్” గా పేర్కొన్న…

చైనా బ్యాంకుల్లో పేరుకుపోయిన తిరిగి రాని అప్పులు $0.5 ట్రిలియన్లు -మూడీస్ హెచ్చరిక

చైనా బ్యాంకుల్లో తిరిగి రాని అప్పులు పేరుకుపోయాయనీ, అవి అలానే కొనసాగితే చైనా బ్యాంకుల క్రెడిట్ రేటింగ్ తగ్గించాల్సి ఉంటుందని మూడీస్ క్రెడిట్ రేటింగ్ సంస్ధ హెచ్చరించింది. 2008లో ఆర్ధిక సంక్షోభం సంభవించినపుడు, దాని బారిన పడకుండా ఉండడానికి చైనా పెద్ద ఎత్తున బెయిల్ ప్యాకేజీని అమలు చేసింది. బెయిలౌట్ ప్యాకేజితో పాటు దేశంలోపల విచ్చలవిడిగా అప్పులు మంజూరు చేసింది. ఉత్పత్తి కార్యక్రమాలకు బదులుగా వినియోగ సరుకులైన కార్లు, టి.విలు, ఫ్రిజ్ లు కొనుగోలు చేయడానికి అప్పులు…

స్ట్రాన్ కాన్ పై మరొక రేప్ కేసు, ఎనిమిదేళ్ళనాటి పాపం వెంటాడిన ఫలితం

ఐ.ఎం.ఎఫ్ మాజీ అధ్యక్షుడు డొమినిక్ స్ట్రాస్ కాన్ స్వదేశం ఫ్రాన్సులో మరొక రేప్ కేసు ఎదుర్కొంటున్నాడు. న్యూయార్క్ లోని ఒక లగ్జరీ హోటల్ మెయిడ్ పై అత్యాచారానికి ప్రయత్నించాడని ఆరోపణలు రావడంతో స్ట్రాస్ కాన్ ఐ.ఎం.ఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ పదవికి రాజీనామా చేసిన సంగతి విదితమే. అయితే రేప్ నేరం ఆరోపించిన మహిళ తన వివరాల గురించి అబద్ధాలు చెప్పిందనీ, రేప్ ప్రయత్నం జరిగిన తర్వాత తాను చేసిన ఫోన్ కాల్స్ పై కూడా అబద్ధాలు చెప్పిందనీ…

మే నెలలో 111 శాతం పెరిగిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు

2011-12 ఆర్ధిక సంవత్సరంలో మే నెలలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్.డి.ఐ) 111 శాతం పెరిగాయని ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. ఒక్క మే నెలలోనే ఎఫ్.డి.ఐ లు 4.66 బిలియన్ డాలర్లు దేశంలోకి వచ్చాయని ప్రభుత్వం సంబరంగా ప్రకటించింది. ఇది గత ఆర్ధిక సంవత్సరంలో మే నెలలో వచ్చిన 2.21 బిలియన్ డాలర్ల ఎఫ్.డి.ఐ లతో పోలిస్తే 111 శాతం అధికమని ప్రభుత్వం తెలిపింది. అంతే కాక గత 11 సంవత్సరాల్లో రెండవ అతి పెద్ద మొత్తం…

కేంద్రానికి సుప్రీం కోర్టు ఝలక్, నల్లడబ్బు విచారణ పర్యవేక్షణకు ‘సిట్’ నియామకం

సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వానికి గట్టి సవాలే విసిరింది. నల్ల డబ్బు వెలికి తీయడానికి కేంద్రం నియమించిన ‘హై లెవల్ కమిటీ’ (హెచ్.ఎల్.సి) పై పర్యవేక్షణకు “స్పెషల్ ఇన్‌వెష్టిగేషన్ టీం” (ఎస్.ఐ.టి – సిట్) ని ఏర్పాటు చేసింది. సుప్రీం నియమించిన సిట్ కు ఛైర్మన్‌గా రిటైరైన జస్టిస్ బి.పి.జీవన్ రెడ్డిని నియమించింది. డిప్యుటీ ఛైర్మన్ గా మరొక రిటైర్డ్ జస్టిస్ ఎం.బి.షా ను నియమించింది. ప్రభుత్వం నియమించిన హెచ్.ఎల్.సి ఇకనుండి సిట్ లో భాగంగా పనిచేస్తుంది.…

రాజీనామాలు చేసింది రాజ్యాంగ సంక్షోభం సృష్టించడానికి కాదు -కాంగ్రెస్ మంత్రులు

తాము రాజీనామా చేసింది రాజకీయ లేదా రాజ్యాంగ సంక్షోభం సృష్టించడానికో, కాంగ్రెస్ హైకమాండ్‌ను ధిక్కరించడానికో కాదనీ తెలంగాణ ప్రజల్లో ప్రత్యేక రాష్ట్రం పట్ల ఉన్న బలీయమైన ఆకాంక్షను కాంగ్రెస్ హైకమాండ్ కి తెలియజేయడానికేనని సీనియర్ మంత్రి జానారెడ్డి విలేఖరులతో మాట్లాడుతూ చెప్పారు. అనివార్య పరిస్ధితుల రీత్యానే తెలంగాణ ఎం.ఎల్.ఎ లు తమ పదవులకు రాజీనామా చేస్తున్నారని, తమ రాజీనామాలద్వారా తెలంగణ రాష్ట్ర సంక్షోభానికి పరిష్కారం కనుగునడానికి వారు ప్రయత్నిస్తున్నారని ఆయన తెలిపాడు. డిసెంబరు 9, 2009 తేదీన…

13 ఏళ్ళ బాలుడిని కాల్చి చంపిన డిఫెన్సు కాంప్లెక్స్ సెక్యూరిటీ గార్డు

చెట్టు కాయను కోసుకు తిందామని మిలట్రీ కాంప్లెక్సులోకి గోడదూకి వెళ్ళీన 13 ఏళ్ళ బాలుడిని ఆ కాంప్లెక్సు సెక్యూరిటీ గార్డు తుపాకితో కాల్చి చంపాడు. ఆ సైనికుడు ముందూ వెనకా చూడకుండా విచక్షణా రహితంగా తుపాకికి పనిచెప్పి ఓ తల్లి గర్భశోకానికి కారణమయ్యాడు. రక్షణ బలగాలు నివసించే నివాస కాంప్లెక్స్ లోకి దిల్షాన్ అనే బాలుడు తన ఇద్దరు మిత్రులతో కలిసి గోడ దూకి ప్రవేశించాడు. చెట్టుకి కాసిన పండుని కోసుకు తిందామని చెట్టు ఎక్కుతుండగా సెక్యూరిటీ…

తెలంగాణ కోసం అంతిమ సమరం, కాంగ్రెస్, టిడిపి పార్టీల ఎం.ఎల్.ఎల రాజీనామా అస్త్ర ప్రయోగం

తెలంగాణ రాష్ట్రం కోసం అంతిమ సమరం ప్రారంభమైనట్లు కనిపిస్తోంది. తెలంగాణ ప్రాంతానికి చెందిన ప్రజా ప్రతినిధులలో సగం కంటే ఎక్కువమంది సోమవారం రాజీనామా చేశారు. పాలక కాంగ్రెస్ పార్టీకి చెందిన 37 మంది ఎం.ఎల్.ఎ లు, పతిపక్ష తెలుగుదేశం పార్టీకి చెందిన 28 మంది ఎం.ఎల్.ఎ లు తమ రాజీనామా లేఖలను డిప్యుటీ స్పీకర్‌కు అందించినట్లు ప్రకటించారు. అంద్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఇంత జరుగుతున్నా, కేంద్ర హోం మంత్రి చిదంబరం ఎ.పి లొ పరిస్ధితి అదుపులోనే ఉందనీ,…

నాటో దాడులకు వ్యతిరేకంగా లిబియా ప్రజల అతి పెద్ద ప్రదర్శన -వీడియో

లిబియా ప్రజలు గడ్డాఫీని తిరస్కరిస్తున్నారనీ, గడ్డాఫి పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్నారనీ గడ్దాఫీ ప్రభుత్వ బలగాలు లిబియా ప్రజలను చంపుతుంటే వారిని కాపాడ్డానికే తాము లిబియాపై బాంబులు మిసైళ్ళతో దాడులు చేస్తున్నామనీ అమెరికా, బ్రిటన్, ఫ్రాన్సు దేశాలు ఊదరగొడుతున్న సంగతి తెలిసిందే. కాని నాటో దాడుల ఫలితంగా గడ్డాఫీని వ్యతిరేకిస్తున్న వారు సైతం తమ వ్యతిరేకతను పక్కన పెట్టి విదేశీ మూకల దాడులను దృఢంగా వ్యతిరేకిస్తున్నారు. జులై 1 జరిగిన లిబియా ప్రజలు పాల్గొన్న అతి పెద్ద…

అమెరికాలో ఆరు బ్యాంకుల అధికారులకు చెల్లించిన జీతాలూ, బోనస్ ల మొత్తం కాన్సాస్ రాష్ట్ర జీడీపీ కి సమానం

అమెరికాలో ఫైనాన్స్ సంస్ధలు దోపిడీకి పెట్టింది పేరు. వాళ్ళు ఎన్ని నేరాలు చేసినా అది అమెరికా ఆర్ధిక వృద్ధి కోసమే. వాళ్ళవలన ప్రపంచ ఆర్ధిక సంక్షోభం సంభవించి అమెరికా, యూరప్ లు అతలాకుతలమైనా అది ప్రపంచ ఆర్ధిక వృద్ధికీ, ప్రపంచ ప్రజల సంతోషం కోసమే. ప్రపంచ ప్రజల సంతోషం కోసం అహోరాత్రాలూ కష్టపడుతున్న బ్యాంకు ఎగ్జిక్యూటివ్ సిబ్బంధికి బ్యాంకులు ఇచ్చే జీతాలూ, బోనస్^లూ, వివిధ సదుపాయాల మొత్తం ఎంతో రాయిటర్స్ సంస్ధ లెక్కేసింది. వాల్ స్ట్రీట్ బ్యాంకుల్లో…

లిబియా ప్రజలకు ‘నాటో’ ప్రసాదించిన ప్రజాస్వామ్యం -కార్టూన్

గడ్డాఫీని కూలదోసి లిబియా ప్రజలకు ప్రజాస్వామ్యం ప్రసాదించడానికి అమెరికా, బ్రిటన్, ఫ్రాన్సు అనే గొప్ప ప్రజాస్వామ్య దేశాలు నడుం బిగించాయి. నాటో యుద్ధ విమానాలు లిబియాపై బాంబుదాడులు చేసి ప్రజలను చంపినా, అది వారిని కాపాడడానికే. గడ్డాఫీ బతికున్నంతవరకూ లిబియాను ఆయననుండి కాపాడ్డానికీ, లిబియా ప్రజలకు ప్రజాస్వామ్యం ప్రసాదించడానికి బాంబుదాడులు చేస్తూ ప్రజలు చంపుతూనే ఉంటాయట! కాని అది ప్రజలను గడ్డాఫీనుండి కాపాడ్డానికేనంటే నమ్మాలి మరి, తప్పదు! ఎందుకంటే చెప్తున్నది అమెరికా, బ్రిటన్, ఫ్రాన్సులు గనక. అమెరికా,…

ఇరాన్, వెనిజులా సంబంధాలపై మితవాదుల అనుమానాలు -కార్టూన్

ఆర్ధిక సూత్రాలకు సంబంధించినంతవరకూ మితవాదులంటే ప్రజలకు ఇచ్చే ప్రతి సంక్షేమ సౌకర్యాన్ని వ్యతిరేకించడం, ప్రభుత్వ రంగ పరిశ్రమలని గుదిబండలని చెబుతూ ప్రవేటోళ్ళకి అమ్మేయాలనడం, ప్రభుత్వం ప్రజలకు ఉద్యోగాలు ఇవ్వనవసరం లేదనడం, ఒక పద్ధతిలో ఆర్ధిక వ్యవస్ధను నిర్వహించుకోవడాన్ని తిరస్కరిస్తూ అంతా మార్కెట్లో ఉండే ప్రవేటు బహుళజాతి గుత్త సంస్ధల ఇష్టాయిష్టాలకి వదిలేయాలని ప్రభోధించడం. ఒక్క ముక్కలో చెప్పాలంటె మితవాదం ప్రజల సుఖ సంతోషాలకు వ్యతిరేకం, కోటీశ్వరులు లేదా బిలియనీర్ల ధనదాహానికి అనుకూలం. చూశారా, చూశారా! ఇరాన్ ఇచ్చిన…

ఇరాక్, ఆఫ్ఘనిస్ధాన్‌లకు ఇరాన్ ఆయుధాల సరఫరా -అమెరికా

ఇరాక్, ఆఫ్ఘనిస్ధాన్‌లలో అమెరికా సైనికులపై పోరాటం చేస్తున్న వారికి ఇరాన్‌కి చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కాప్స్ (ఐ.ఆర్.జి.సి) ఆయుధాలు, మందుగుండు సరఫరా చేస్తున్నదని అమెరికా శనివారం వెల్లడించింది. ఇరాక్, ఆఫ్ఘనిస్ధాన్ లనుండి అమెరికా సేనలు త్వరగా వెళ్ళిపోవడానికి ఇరాన్ ఈ విధంగా చేస్తున్నదని అమెరికా అధికారులు చెప్పారు. అయితే ఇరాన్ ఈ సమాచారాన్ని కొట్టిపారేసింది. అమెరికా సైనికులను సుదీర్ఘకాలం పాటు ఇరాక్, ఆఫ్ఘనిస్ధాన్ లలో కొనసాగించాలని, అమెరికా భావిస్తోంది. దానికోసమే ఇరాన్‌పై ఇలాంటి కధలు ప్రచారం…

ఇండియా విదేశీ మారక ద్రవ్య నిల్వలు $309.02 బిలియన్లు

భారత దేశ విదేశీ మారక ద్రవ్య నిల్వలు జూన్ 24 తో ముగిసిన వారంలో అంతకు ముందు వారం కంటె తగ్గిపోయాయని రిజర్వు బ్యాంకు తెలిపింది. జూన్ 17 నాటికి భారత విదేశీ మారక ద్రవ్య నిల్వలు 310.562 బిలియన్ డాలర్లు ఉండగా జూన్ 24 నాటికి 309.020 బిలియన్ డాలర్లకు తగ్గాయని ఆర్.బి.ఐ శుక్రవారం తెలిపింది. విదేశీ మారక ద్రవ్యంలో ఐ.ఎం.ఎఫ్ లో ఇండియాకు ఉండే ఎస్.డి.ఆర్ హోల్డింగ్స్ కూడా కలిసి ఉంటాయి. విదేశీ మారక…

భారత దేశానికి ఆయిల్ సరఫరాలో ఆటంకాలు రానివ్వం -ఇరాన్

భారత దేశ ఆయిల్ రిఫైనరీలు పాత బాకీలు చెల్లించనట్లయితే వాటికి ఆయిల్ సరఫరాను ఆగష్టు నెలనుండి బంద్ చేస్తామని ప్రకటించిన ఇరానియన్ ప్రభుత్వ ఆయిల్ కంపెనీ “నేషనల్ ఇరానియన్ ఆయిల్ కంపెనీ” (ఎన్.ఐ.ఒ.సి), భారత దేశానికి సరఫరా చేయడంలో ఆటంకాలు రానివ్వబోమని ప్రకటించింది. ఇండియా ఆయిల్ రిఫైనరీలు తమకు 2 బిలియన్ డాలర్లు బకాయి ఉన్నాయనీ అది చెల్లించడానికి తగిన మార్గాన్ని త్వరగా చూపనట్లయితే ఆయిల్ సరఫరా ఆపడం తప్ప మరొక మార్గం లేదని ఎన్.ఐ.ఒ.సి ప్రకటించిన…