గూఢచారుల బహిష్కరణతో పాక్‌పై అమెరికా కక్ష సాధింపు, $800 మిలియన్ల సాయం నిలిపివేత

పాకిస్ధాన్‌లో వివిధ పేర్లతో పని చేస్తున్న సి.ఐ.ఏ సిబ్బందిలో మూడింట రెండో వంతు మందిని అమెరికాకి వెనక్కి పంపివేయడంతో అమెరికా పాకిస్ధాన్‌పై కక్ష సాధింపు చర్యలు చేపట్టింది. టెర్రరిస్టు వ్యతిరేక యుద్ధంలో తమ సైనికులు పాల్గొంటున్నందుకు గాను పాకిస్ధా‌న్‌కి అమెరికా విడుదల చేయవలసి ఉన్న 800 మిలియన్ డాలర్ల సహాయాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. వైట్ హౌస్ సిబ్బంది ఉన్నతాధికారి  బిల్ డాలీ, ఎబిసి టెలివిజన్‌తో మాట్లాడుతూ “సహాయంలో కొంత భాగాన్ని నిలిపివేయడానికి దారి తీసేలా పాకిస్ధాన్ కొన్ని…

ప్రమాద దశకు యూరప్ అప్పు సంక్షోభం, ఇటలి అప్పు సంక్షోభంపై ఎమర్జెన్సీ సమావేశం?

యూరప్ అప్పు సంక్షోభం ప్రమాద దశకు చేరుకున్నట్లు కనిపిస్తోంది. యూరోపియన్ యూనియన్‌ దేశాల్లో మూడవ అతి పెద్ద ఆర్ధిక వ్యవస్ధను కలిగి ఉన్న ఇటలీ అప్పు గురించి చర్చించడానికి యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు హెర్మన్ వాన్ రోంపీ సోమవారం ఉన్నతాధికారుల అత్యవసర సమావేశం ఏర్పాటు చేశాడు. రోంపి ప్రతినిధి సోమవారం నాటి సమావేశంలో ఇటలి గురించి చర్చించడం లేదని చెబుతున్నప్పటికీ యూరోపియన్ సెంట్రల్ బ్యాంకు అధికారులు ఇద్దరు ఇటలీ గురించి చర్చించడానికే సమావేశమని చెప్పినట్లుగా రాయిటర్స్ వార్తా…

కల్కా మెయిల్ పట్టాలు తప్పడంతో 35 మంది దుర్మరణం, 200 మందికి పైగా గాయాలు -‘ది హిందూ’ ఫోటోలు

భారత రైల్వేల కీర్తి కిరీటంలో మరో కలికితురాయి వచ్చి చేరింది. హౌరా నుండి ఢిల్లీ వెళ్తున్న కల్కా మెయిల్ ఉత్తర ప్రదేశ్ లోని ఫతేపూర్ వద్ద మధ్యాహ్నం గం.12:20 ని.లు సమయంలో పట్టాలు తప్పింది. మొత్తం 15 బోగీలు పట్టాలు తప్పగా 10 బోగీల షేపులు మారిపోయాయి. సిగ్నల్స్, ఫిష్ ప్లేట్లు అన్ని బాగానే ఉన్నాయని ప్రాధమిక విచారణలో తేలింది. డ్రైవర్ తాగిలేడని రైల్వే అధికారులు నిర్ధారించారు. కారణం ఇంకా స్పష్టం కాలేదు. తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నామని రైల్వే…

నాటో దళాలపై తిరగబడ్డ ఆఫ్ఘన్ సైనికుడు, దాడిలో ఇద్దరి మరణం

ఆఫ్ఘనిస్ధాన్‌లో దురాక్రమణ సేనలపైన వారు శిక్షణ ఇస్తున్నామని చెబుతున్న ఆఫ్ఘన్ సైనికులే తిరగబడడం కొనసాగుతోంది. నాటో బలగాలను ఠారెత్తిస్తున్న ఇలాంటి దాడులు 2011 సంవత్సరంలో అమెరికా బలగాలకు తీవ్రం నష్టం చేకూర్చాయి. ఆఫ్ఘనిస్ధాన్‌లో అమెరికా తదితర నాటో దేశాల సైనికులకు అత్యంత భద్రత కలిగిన ప్రాంతం అని చెప్పుకుంటున్న ప్రాంతాల్లోనే ఇటువంటి ఘటనలు జరగడం విశేషం. ఆఫ్ఘనిస్ధాన్ రాజధాని నగరమైన కాబూల్, పష్తూనేతరులు నివసించే ఉత్తర రాష్ట్రాలు మిలిటెన్సీ తక్కువగా ఉన్న ప్రాంతాలనీ, భద్రమైన ప్రాంతాలనీ నాటో…

మరోసారి నిరవధిక ఆందోళనలో ఈజిప్టు ప్రజానీకం, ముబారక్ అవశేషాల కోనసాగింపుపై ఆగ్రహం

18 రోజుల నిరవధిక దీక్షతో 30 సంవత్సరాల నియంతృత్వ పాలనను కూలదోసి, నియంత ముబారక్‌ను జైలుపాలు చేసిన ఈజిప్టు ప్రజానీకం మరొకసారి పోరాటబాట చేపట్టారు. ఈజిప్టు విప్లవం చేసిన డిమాండ్లను నెరవేర్చడంలో తాత్కాలిక సైనిక ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తున్నదనీ, డిమాండ్లు నెరవేర్చడానికి ఎటువంటి ప్రయత్నమూ చేయడం లేదనీ ఈజిప్టు ప్రజలు ఆరోపిస్తున్నారు. ఈజిప్టు విప్లవం ప్రారంభ కాలంలో నిరసనకారులను కాల్చి చంపడానికి కారణమైన సైనికాధికారులనూ, పోలీసులనూ విచారించడం లేదనీ, వారిని స్వేచ్ఛగా వదిలేస్తున్నారనీ పైగా నిరసన కారులపై…

13 ఏళ్ళ బాలుడి హత్య కేసులో రిటైర్డ్ ఆర్మీ అధికారిని అరెస్టు చేసిన సి.బి-సి.ఐ.డి

తమిళనాడులోని మిలట్రీ నివాస సముదాయం వద్ద బాదం కాయకోసం చెట్టెక్కుతున్న 13 సంవత్సరాల బాలుడు దిల్షాన్‌ను తుపాకితో కాల్చి హత్య చేసిన కేసులో సి.బి-సి.ఐ.డి విభాగం ఒక రిటైర్డ్ ఆర్మీ అధికారిని అరెస్టు చేసింది. బాలుడిపై కాల్పులు జరిపింది తానేనని ఆయన అంగీకరించినట్లు సమాచారం. బాలుడు చనిపోయిన రోజున మిలట్రీ నివాస సముదాయం వద్ద సాయుధ సెక్యూరిటీ గార్డులను తాము నియమించలేదని ఆర్మి అధికారులు చెప్పారు. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత, కేసును సీరియస్‌గా తీసుకోవడంతో కేసులో పురోగతి…

చైనాలో మరింత క్షీణించిన వ్యాపార వృద్ధి, రికార్డు స్ధాయిలో వాణిజ్య మిగులు

చైనాలో జూన్ నెలలో వ్యాపార కార్యకలాపాలు మరింత నెమ్మదించాయని తాజా గణాంకాలు తెలుపుతున్నాయి. మే నెలలో కంటే జున్ నెలలో కూడా దిగుమతులు పడిపోయాయి. దానితో చైనాకు వాణిజ్య మిగులులో మరింత పెరుగుదల రికార్డయ్యింది. ప్రపంచంలో రెండవ అతి పెద్ద ఆర్ధిక వ్యవస్ధ కలిగిన చైనా, ఆదివారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం వాణిజ్య మిగులు 22.2 బిలియన్ డాలర్లకు పెరిగింది. మే నెలలో దిగుమతుల వృద్ధి రేటు 28.4 శాతం ఉండగా, జూన్ నెలలో అది…

పోర్నోగ్రఫీ ధుష్ప్రభావం: ఐదేళ్ళ పాప హత్య కేసులో పదేళ్ళ బాబు అరెస్టు

అభం శుభం తెలియని పసి పిల్లలపై పోర్నోగ్రఫీ ఎంత దుష్ప్రభావం పడేస్తుందో ఈ సంఘటన తెలుపుతుంది. ఐదేళ్ళ బాలిక చెరువులో పడి మృతి చెందిన కేసులో పదేళ్ళ బాలుడిని శనివారం పోలీసులు అరెస్టు చేశారు. కేరళ రాష్ట్రంలోని ఇడుక్కి జిల్లాలో నెడుంగండం గ్రామంలో బుధవారం సాయంత్రం ఈ దుర్ఘటన చోటు చేసుకుందని “ది హిందూ” పత్రిక తెలిపింది. బాలిక శవం నెడుంగండం లోని ఎస్టేట్ ఏరియా వద్దనున్న చెరువులో లభించిందని పత్రిక తెలిపింది. బాలుడు చేసిన రేప్…

జులై 9న వెలసిన కొత్త దేశం, 196వ దేశంగా దక్షిణ సూడాన్

ప్రపంచ పటంలోకి మరొక కొత్త దేశం వచ్చి చేరింది. ఈ సంవత్సరం ఫిబ్రవరిలో జరిగిన రిఫరెండంలో దక్షిణ సూడాన్ ప్రజలు 90 శాతానికి పైగా కొత్త దేశాన్ని కోరుకున్నారు. ప్రజల నిర్ణయాన్ని అమలు పరుస్తూ జులై 9, శనివారం తెల్లవారు ఝాము ప్రారంభ క్షణాల్లో దక్షిణ సూడాన్ ను ఏర్పాటు చేస్తూ ప్రకటన జారీ అయింది. ఐక్యరాజ్య సమితి అధ్యక్షుడు బాన్ కి మూన్, ఐక్య సూడాన్ అధ్యక్షుడు ఆల్-బషర్, 30 ఆఫ్రికా దేశాల ప్రతినిధుల సమక్షంలో…

సుదీర్ఘ లక్ష్య క్షిపణులను మొదటిసారి హిందూ మహాసముద్రంలోకి పేల్చి పరీక్షించిన ఇరాన్

ఈ సంవత్సరం ప్రారంభంలో తన సుదీర్ఘ లక్ష్య క్షిపణులను మొట్టమొదటిసారిగా హిందూ మహాసముద్రంలోకి పేల్చడం ద్వారా పరీక్షించినట్లు ఇరాన్ ప్రభుత్వం ప్రకటించింది. శనివారం, ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్‌లొ ఈ ప్రకటన వెలువడింది. రెండు లాంగ్-రేంజ్ మిసైళ్ళను పరీక్షించినట్లు ఇరాన్ వెల్లడించింది. “బహమాన్ నెలలో (జనవరి 21 నుండి ఫిబ్రవరి 19 వరకు) 1900 కి.మీ దూరంలో ఉన్న లక్ష్యాలను ఛేదించగల క్షిపణులను ఉత్తర ఇరాన్ లో గల సెమ్‌నాన్ రాష్ట్రం నుండి హిందు మహాసముద్రం ముఖద్వారం వద్దకు…

3 సం.ల అత్యధిక స్ధాయిలో చైనా ద్రవ్యోల్బణం, చైనా ఆర్ధిక వృద్ధిపై భయాలు

జూన్ నెలలో చైనా ద్రవ్యోల్బణం గత మూడు సంవత్సరాల అత్యధిక స్ధాయికి చేరింది. ద్రవ్యోల్బణం కట్టడి చేయడానికి వీలుగా చైనా ఆర్ధిక వ్యవస్ధలో ద్రవ్య చలామణిని తగ్గించడానికి సెంట్రల్ బ్యాంకు వడ్దీ రేట్లను మరింత పెంచే అవకాశాలు పెరగడంతో, వడ్డీ రేట్ల పెంపుదల వలన చైనా ఆర్ధిక వృద్ధి రేటు పడిపోయే ప్రమాదం ఉందని ప్రపంచ పెట్టుబడుదారులు, విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధ వృద్ధి రేటును ముందుకు తీసుకెళ్ళడంలో చైనా ఆర్ధిక వ్యవస్ధ…

నాటో దాడుల నుండి రక్షణ కోసం నడుం బిగించిన లిబియా మహిళలు -వీడియో

అమెరికా, ఫ్రాన్సు, బ్రిటన్ దేశాలు లిబియాపై దాడులకు సిద్ధమవుతున్న ప్రారంభ కాలంలో లిబియా అధిపతి గడ్దాఫీ లిబియాను రక్షించుకోవడం కోసం ప్రజలకు ఆయుధాలిస్తామని హెచ్చరించాడు. నాటో వైమానిక దాడులకు ముందు గడ్దాఫీ సుదీర్ఘపాలనతో విసిగి ఉన్న లిబియన్లు కూడా విదేశాల దాడులకు వ్యతిరేకంగా నిలబడిన గడ్దాఫీ వెనక అనివార్యంగా సమీకృతులయ్యారు. లిబియా ప్రజల రక్షణ కోసమే లిబియాపై బాంబింగ్ జరుపుతున్నామన నాటో దేశాల మోసపు మాటలలో నిజం ఎంత ఉందో లిబియన్లకు బాగానే తెలుసు. లిబియాలో ఇప్పుడు…

స్పెయిన్‌లో ఉద్యొగాల పరిస్ధితి -కార్టూన్

యూరప్ అప్పు సంక్షోభం యూరప్ దేశాలకు శాపంగా మారింది. ఖచ్చితంగా చెప్పాలంటే యూరప్ అప్పు సంక్షోభం యూరప్ ప్రజలకు శాపంగా మారింది. అప్పు కొండలా పేరుకు పోయి మార్కెట్ నుండి ట్రెజరీ బాండుల ద్వారా తేలికగా అప్పు సేకరించలేని పరిస్ధితిని అప్పు సంక్షోభంగా పిలుస్తున్నారు. ఇప్పటివరకూ గ్రీసు, ఐర్లండ్, పోర్చుగల్ దేశాల ప్రజలు దీని బారిన పడి నిరుద్యోగం, ఉద్యోగాల కోత, పెన్షన్ల కోత, సంక్షేమ సదుపాయాల రద్దు లాంటి అనేక సమస్యలతో అల్లాడుతున్నారు. స్పెయిన్ కార్టూనిస్టు…

రిలయన్స్ కంపెనీకి నేను మేలు చేయలేదు -కపిల్ సిబాల్ తొండాట

తనపై సుప్రీం కోర్టులో ఒక ఎన్.జి.ఒ సంస్ధ ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం దాఖలు చేసిన మరుసటి రోజు కేంద్ర టెలికం మంత్రి కపిల్ సిబాల్ స్పందించాడు. పత్రికా సమావేశం నిర్వహించి ఇచ్చిన వివరణలో కపిల్ సిబాల్ “ఆకుకూ అందక, పోకకూ పొందక” అన్నట్లు సమాధానాలిచ్చి తొండాట ఆడటానికి ప్రయత్నించాడు. రిలయన్స్ కమ్యూనికేషన్స్ కంపెనీ వినియోగదారులకు చెప్పకుండా నిర్ధిష్ట సేవలను ఆపేసినందుకుగాను డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ అధికారులు ఆ కంపెనీపై సర్కిల్ కి రు.50 కోట్ల చొప్పున మొత్తం…

జులై 1 కి భారత విదేశీ మారక ద్రవ్య నిల్వలు 315.715 బిలియన్లు

భారత దేశ విదేశీ మారక ద్రవ్య నిల్వలు జూన్ 24 తో ముగిసిన వారంతో పోలిస్తే జులై 1 తో ముగిసిన వారంలో 2.17 శాతం పెరిగాయి. జూన్ 24 అన్ని రకాల విదేశీ మారక ద్రవ్య నిల్వలు మొత్తం 309.020 బిలియన్ డాలర్లు ఉండగా అది జులై 1 కి 315.715 బిలియన్ డాలర్లకు చేరుకుంది. భారత రిజర్వ్ బ్యాంకు శుక్రవారం విడుదల చేసిన వారం వారీ ప్రకటనలో తెలిపింది. డాలర్లలో లెక్కించిన విదేశీ మారక…