దక్షిణ చైనా సముద్రం ప్రపంచ ఆస్తి -ఎస్.ఎం.కృష్ణ

దక్షిణ చైనా సముద్రంలో భారత ప్రభుత్వ ఆయిల్ కంపెనీ ఓ.ఎన్.జి.సి విదేశ్ సాగిస్తున్న ఆయిల్ వెతుకులాటపై చైనా వ్యక్తం చేసిన అభ్యంతరాలను భారత ప్రభుత్వం తిరస్కరించింది. దక్షిణ చైనా సముద్రం ప్రపంచానికి చెందిన ఆస్తి అని దానిపై ఏ దేశానికి హక్కులు లేవనీ భారత విదేశాంగ మంత్రి ఎస్.ఎం.కృష్ణం వ్యాఖ్యానించాడు. దేశాల జోక్యాన్నుండి దక్షిణ చైనా సముద్రంలో జోక్యం ఉండరాదని ఆయన ప్రకటించాడు. “దక్షిణ చైనా సముద్రం ప్రపంచానికి చెందిన ఆస్తి అని భారత దేశం భావిస్తోంది.…

Gas prices

ఆయిల్ కంపెనీల దోపిడి -కార్టూన్

శక్తి జనించడానికి ఇంధనం అత్యవసరం. ఆధునిక సమాజంలో ఆయిల్, విద్యుత్ లే ప్రధాన శక్తి జనితాలుగా ఉండడంతో ఆయిల్ కంపెనీల దోపిడి కి అడ్డు లేకుండా పోతోంది. పౌరులందరికీ సమాన స్ధాయిలో అందుబాటులో ఉండవలసిన ప్రకృతి వనరులు కొద్ది మంది పెట్టుబడిదారుల చేతిలో లాభార్జనా సాధనంగా మిగిలిపోయింది. వారికి ప్రభుత్వాలు అండదండలిస్తున్నాయి. ఫలితంగా ఆయిల్ క్రమంగా లగ్జరీ సరుకు గా మారిపోతోంది. సగటు జీవికి మళ్లీ సైకిలే ప్రధాన రవాణా సాధనంగా మారిపోయే పరిస్ధితులు తలెత్తుతున్నాయి. మరో…

అమెరికా, నెంబర్ 1 ఇంటర్నెట్ స్వేచ్చా హంతకి

స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం లపై ప్రపంచానికి సుద్దులు చెప్పే అమెరికా స్వయంగా ఇంటర్ నెట్ స్వేచ్చని హరిస్తోందని ఫారెన్ పాలసీ (ఎఫ్.పి) పత్రిక ప్రకటించింది. చైనా, ఇరాన్, సిరియా, ఈజిప్టు, ట్యునీషియా, లిబియా మున్నగు దేశాలలో ప్రజాస్వామ్య ఉద్యమకారులు పరస్పరం సంప్రదించుకోకుండా ఆంక్షలు విధించడం ద్వారా ప్రజాస్వామ్య ఆకాంక్షలను హరించివేశారని ఆందోళన వ్యక్తం చేసిన అమెరికా ప్రభుత్వమే అమెరికా ప్రజల ప్రజాస్వామిక స్వేచ్చని హరిస్తోందని ఎఫ్.పి సంచలనాత్మక కధనం ప్రచురించింది. ఇంటర్నెట్ స్వేచ్ఛను హరిస్తున్నట్లు తాను ఎవరినైతే ఆడిపోసుకుంటున్నదో…

Free app

ఈ ఆప్ మీకు ఉచితం -కార్టూన్

ఇంటర్నెట్ సంస్ధలు, సాఫ్ట్ వేర్ డవలపర్లు ఉచితంగా ‘అప్లికేషన్లు’ ఆఫర్ చేస్తూ వినియోగదారుల ప్రైవసీ ని తీవ్రంగా కొల్లగొడుతున్నాయి. వారిలో గూగుల్ అగ్ర స్ధానంలో ఉంది. వినియోగదారుల సమాచారాన్ని రహస్యంగా, అనుమతి లేకుండా దొంగిలించి నిలవ చేస్తున్నందుకు గూగుల్ పైన అమెరికా ఫెడరల్ ట్రేడ్ కమిషన్ విచారణ చేస్తోంది. జర్మనీ, ఫ్రాన్సు, బ్రిటన్ లాంటి దేశాల పార్లమెంటులు గూగుల్ దుర్మార్గాలను తీవ్ర స్ధాయిలో ఖండించాయి. యూరోప్ లో చాలా ప్రభుత్వాలు గూగుల్ వ్యాపార పద్ధతులపైనా, మోసాలపైనా విచారణ…

మరో బాంబు వదిలిన ఆర్మీ చీఫ్, భావి ఆర్మీ చీఫ్ పై సి.బి.ఐ విచారణకి ఆదేశం

గత కొద్ది రోజులుగా ప్రభుత్వంతో తలపడుతున్నట్లు కనిపిస్తున్న ఆర్మీ చీఫ్ జనరల్ వి.కె.సింగ్ సంచల రీతిలో మరో బాంబు వదిలాడు. రానున్న మే నెలలో తాను రిటైరయ్యాక తన స్ధానాన్ని నింపేవారిలో రెండవ స్ధానంలో ఉన్న ఆర్మీ అధికారిపై వచ్చిన అవినీతి ఆరోపణలను విచారించవలసిందిగా సి.బి.ఐ కి లేఖ రాశాడు. ప్రధానికి రాసిన తాను రాసిన లేఖను లీక్ చేసింది తాను కాదని ఆయన సూచించిన కొద్ది గంటలకే సి.బి.ఐ కి రాసిన లేఖ సంగతి బైటికి…

ఖమ్మం స్కూల్ బస్ కాలవలో పడి 14 మంది పిల్లల మృతి

ఖమ్మం జిల్లాలో ఘోరం జరిగింది. స్కూల్ బస్సు కాలవలో పడిపోవడంతో 14 మంది స్కూల్ పిల్లలు చనిపోయారని ఎన్.డి.టి.వి తెలిపింది. మంగళవారం మధ్యాహ్నం ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. మొత్తం 40 మంది పిల్లలు దుర్ఘటన సమయంలో బస్సులో ప్రయాణిస్తున్నట్లు ఎన్.డి.టి.వి తెలిపింది. కొత్త గూడెం మండలం లో ఎల్.వి.రెడ్డి స్కూల్ కి చెందిన బస్సు ఎదురుగా వస్తున్న బైక్ ను తప్పించబోయి కాల్వలో బోల్తా పడిందని ఎన్.డి.టి.వి తెలిపింది. గాయపడిన 18 మంది పిల్లలను ఆసుపత్రిలో…

ఇటలీ ఇండియా రాయబార యుద్ధంలో ఇండియా పై చేయి

కేరళ రాష్ట్ర సమీపంలోని సముద్ర జలాల్లో ఇద్దరు భారతీయ జాలర్లను కాల్చి చంపిన కేసులో ఇటలీ, ఇండియాల మధ్య రాయబార సంబంధాలలో ఉద్రిక్తతలు తలెత్తి కొనసాగుతున్నాయి. ఈ ఘర్షణలో ప్రస్తుతానికి ఇండియాడే పై చేయిగా కనిపిస్తోంది. ఇద్దరు ఇటాలియన్ మెరైన్లు ఇప్పటికీ కేరళ పోలీసుల కస్టడీలో కొనసాగుతుండడంతో ఇటలీ ప్రభుత్వంపై స్ధానికంగా ఒత్తిడులు తీవ్రం అవుతున్నాయి. ప్రభుత్వం సమర్ధవంతంగా వ్యవహరించలేదంటూ ఇటలీ ప్రతిపక్షాలు ప్రభుత్వంపైన దుమ్మెత్తి పోస్తుండడంతో ఇటలీలోని ఇండియా రాయబారిని పిలిపించుకుని తమ మెరైన్ల నిర్బంధం…

‘గాలి’ సొమ్ము లాయర్లకు బహు తీపి

అక్రమ పద్ధతుల్లో సంపాదించిన ‘గాలి’ జనార్ధన రెడ్డి గారి సొమ్ము అంటే బెంగుళూరు లాయర్లకు ఎంత ఇష్టమో బెంగుళూరు కోర్టు వద్ద శుక్రవారం జరిగిన ఘటనలు వెల్లడించాయి. బెంగుళూరు కోర్టు ఆదేశాల మేరకు కోర్టులో విచారణకు హాజరయిన ‘గాలి జనార్ధన రెడ్డి’ ని మీడియా ఫోటోగ్రాఫర్లు ఫోటో తీయకుండా అడ్డుకోవడానికి వారు పెద్ద యుద్ధమే చేశారు. గుంపులు గుంపులు గా మీడియా ఫోటో గ్రాఫర్లను అడ్డుకోవడానికి ప్రయత్నించినప్పటికీ తమ వల్ల కాకపోవడంతో వారిపై రాళ్ళ దాడికి కూడా…

ఇండియాలో కాల్ సెంటర్లకు వ్యతిరేకంగా అమెరికా కాంగ్రెస్ లో చట్టం

ఇండియూతో సహా అనేక మూడో ప్రపంచ దేశాలకు స్వేచ్ఛా మార్కెట్ సిద్ధాంతాలను ప్రభోధించే అమెరికా, ఆ సిద్ధాంతాలు తమకు నష్టకరంగా పరిణమిస్తే తానే వాటిని అనుసరించనని చాటి చెప్పింది. అభివృద్ధి చెందుతున్న దేశాల వనరులను దోచుకోవడానికీ, అక్కడి మార్కెట్లను కొల్లగొట్టడానికి సరళీకరణ, ప్రవేటీకరణ, ప్రపంచీకరణ సిద్ధాంతాలను బలవంతంగా రుద్దిన అమెరికా తన ప్రయోజనాల విషయానికి వస్తే అవే విధానాలను తాను నిస్సందేహంగా తిరస్కరిస్తానని మరోసారి నిరూపించుకుంది. ఎండు చేపలు తినకూడనిది ఊరివాళ్ళే గానీ తాను కాదని తన…

చైనా-అమెరికా వాణిజ్య యుద్ధం, అమెరికా ఎగుమతులపై చైనా అదనపు సుంకాలు

చైనా, అమెరికాల వాణిజ్య యుద్ధంలో మరో ముందడుగు పడింది. చైనా నుండి ఎగుమతి అవుతున్న గ్రీన్ ఉత్పత్తుల వలన అమెరికా గ్రీన్ ఉత్పత్తులకు నష్టం వాటిల్లుతున్నదంటూ అమెరికా ఉత్పత్తిదారులు ఇచ్చిన ఫిర్యాదును పురస్కరించుకుని అమెరికా ప్రభుత్వం దర్యాప్తు కమిటీని నియమించిన తర్వాత చైనా ప్రతీకార చర్య చేపట్టింది. అమెరికానుండి కార్లు పెద్ద ఎత్తున డంప్ చేస్తున్నారని ఆరోపిస్తూ అక్కడి నుండి దిగుమతి అవుతున్న కార్లపైన చైనా వివిధ స్ధాయిల్లో అదనపు సుంకాలను విధించింది. అమెరికా కేవలం దర్యాప్తు…

రిటైల్ రంగంలో ఎఫ్.డి.ఐ ల నిర్ణయం సస్పెన్షన్ -కార్టూన్

విపక్షాలతో పాటు, స్వపక్షాలు కూడా రిటైల్ రంగంలో ఎఫ్.డీ.ఐ లు ఆహ్వానించాలని తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించడంతో మన్మోహన్ ప్రభుత్వం తన నిర్ణయాన్ని సస్పెండ్ చేసింది. ఏకాభిప్రాయం సాధించి తిరిగి ప్రవేశపెడతానని పరోక్షంగా తెలిపింది. ప్రతిపక్షాలు మాత్రం అంగీకరించేది లేదని చెబుతున్నాయి. బి.జె.పి ప్రభుత్వంలో జస్వంత్ సింగ్ ఆర్ధిక మంత్రిగా పని చేసిన కాలంలో రిటైల్ రంగంలో వంద శాతం విదేశీ పెట్టుబడుల్ని అంగీకరించాలని వాదించాడు. ఇప్పుడా పార్టీ యు-టర్న్ తీసుకున్నానని చెబుతోంది. చూద్దాం, ఎంతకాలమో! –…

యురేనియంను ఇండియాకు అమ్మితే మాకూ అమ్మాలి, ఆస్ట్రేలియాతో పాకిస్ధాన్ -2

రష్యా, ఫ్రాన్సు, జర్మనీ, బ్రిటన్ దేశాల అధ్యక్షులు, ప్రధానులు వచ్చి అణు రియాక్టర్ల వ్యాపారం విషయమై ఇండియా తో చర్చించి వెళ్ళారు గానీ అమెరికా నుండి అణు రియాక్టర్ల అమ్మకానికి సంబంధించి ఇంతవరకూ ఒక్క అడుగూ ముందుకు పడలేదు. దానికి కారణం కూడా ఇండియాపైనే మోపుతోంది. అణు రియాక్టర్లు, అణు పదార్ధాలు సరఫరా చేసే అమెరికా కంపెనీలు (జనరల్ ఎలక్ట్రిక్, తోషిబా, వెస్టింగ్ హౌస్ ఎలక్ట్రిక్) నాసిరకం పరికరాలు సరఫరా చేసినందువలన గానీ, లోపాలతో కూడిన రియాక్టర్లు…

గ్రీన్ టెక్న్లాలజీ రంగంలో అమెరికా, చైనాల మధ్య వాణిజ్య యుద్ధం?

పర్యావరణ సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించిన వాణిజ్యంలో అమెరికా, చైనా ల మధ్య వాణిజ్య యుద్ధం తలెత్తే సూచనలు కనిపిస్తున్నాయి. చైనాకు చెందిన పర్యావరణ సాంకేతిక ఉత్పత్తులు అమెరికా కంపెనీల ఉత్పత్తులకు హానికరంగా పరిణమించాయని భావిస్తూ ‘అమెరికా ఇంటర్నేషనల్ ట్రేడ్ కమిషన్’ విచారణ చేయడానికి నిర్ణయించడంతో ఈ పరిస్ధితి ఏర్పడింది. అమెరికా చర్యలు వాణిజ్యంలో ‘రక్షణాత్మక విధానాలతో’ (ప్రొటెక్షనిజం) సమానమని చైనా అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇతర దేశాలనుండి వచ్చే దిగుమతులతో పోటీ పడలేక అటువంటి దిగుమతులపైన పెద్ద…

రిటైల్ రంగంలో విదేశీ పెట్టుబడుల నిర్ణయం సస్పెన్షన్ తాత్కాలికమే

రిటైల్ రంగంలో విదేశీ పెట్టుబడుల అనుమతిస్తూ కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని సస్పెండ్ చేయడం తాత్కాలిక చర్య మాత్రమేనని కేంద్ర ప్రభుత్వంలో పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ అధికారిని ఉటంకిస్తూ రాయిటర్స్ వార్తా సంస్ధ తెలిపింది. “ఇవి కేవలం భారతీయ రాజకీయాలు మాత్రమే” అని ఆ అధికారి అన్నట్లుగా రాయిటర్స్ తెలిపింది. “నమ్మదగని భారత ప్రభుత్వం (ఫికిల్ ఇండియా గవర్నమెంట్) విదేశీ సూపర్ మార్కెట్ల నిర్ణయాన్ని పక్కనబెట్టింది” అన్న హెడ్డింగ్ తో  రాయిటర్స్ వార్తా సంస్ధ ఓ…

రిటైల్ రంగంలో విదేశీ పెట్టుబడుల నిర్ణయాన్ని కేంద్రం సస్పెండ్ చేసింది -మమత

రిటైల్ రంగంలో ‘విదేశీ పెట్టుబడుల’ నిర్ణయం శనివారం అనూహ్యంగా మలుపు తిరిగింది. సూపర్ మార్కెట్లలో 51 శాతం మేరకు విదేశీ పెట్టుబడులను అనుమతిస్తూ కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం సస్పెండ్ చేసిందని శనివారం బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ ప్రకటించింది. కేంద్ర ఆర్ధిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ తనకు ఆ విషయం తెలిపినట్లుగా మమతా బెనర్జీ విలేఖరులకు తెలిపింది. పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైనప్పటి నుండీ ఇప్పటివరకూ ఎటువంటి చర్చా జరగలేదు. ప్రతిపక్ష పార్టీలు ప్రతి రోజూ…