ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో ‘ఓటుకు నోటు’ సర్వసాధారణం -వికీలీక్స్

ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో నోట్లతో ఓట్లు కొనడం సర్వసాధారణమని అమెరికా డెప్యుటీ రాయబారి అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ కి పంపిన కేబుల్ లో పేర్కొన్నాడు. 2009 లోక్ సభ ఎన్నికల్లో రాజకీయ నాయకులు వారి అనుచరులు డబ్బులు పంచామని రాయబారి దగ్గర అంగీకరించినట్లుగా వికీలీక్స్ బైట పెట్టిన కేబుల్ ద్వారా తెలిసింది. నోట్లే కాకుండా వినియోగ సరుకులు, సేవలు కూడా ఓట్ల సంపాదనకి వినియోగించారు. చెన్నైలోని అమెరికా రాయబార కార్యాలయంలో ఏక్టింగ్ ప్రిన్సిపల్ ఆఫీసర్ గా పనిచేసిన…

‘ది హిందూ’ చేతిలో ఇండియాకి సంబంధించిన ‘వికీ లీక్స్’ డాక్యుమెంట్లు

అమెరికా తరపున ప్రపంచవ్యాపితంగా నియమించబడిన రాయబారులు తాము నియమించబడిన దేశాల్లో గూఢచర్యం నెరుపుతూ సంపాందించిన వివరాలను కేబుల్ ద్వారా అమెరికా స్టేట్ డిపార్ట్ మెంటుకు పంపిస్తారు. 1960 నుండి 2010 ఫిబ్రవరి వరకూ అలా పంపిన కేబుల్స్ ‘వికీ లీక్స్’ సంస్ధకు అందిన విషయం తెలిసిందే. వికీ లీక్స్ సంస్ధ తనకు అందిన ‘డిప్లొమాటిక్ కేబుల్స్’ ను 2010 నవంబరు నెలాఖరు నుండి తన వెబ్ సైట్ లో ప్రచురిస్తున్న విషయం కూడా తెలిసిందే. ఇప్పుడు ఇండియాకు…

వెస్ట్ బ్యాంక్ లో కొత్త సెటిల్మెంట్ నిర్మాణానికి ఇజ్రాయెల్ ఆమోదం

1967 యుద్ధంలో ఇజ్రాయెల్ ఆక్రమించుకున్న పాలస్తీనా భూభాగం “వెస్ట్ బ్యాంక్” లో మరో కొత్త సెటిల్మెంటు నిర్మాణానికి ఇజ్రాయెల్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మంత్రుల కమిటీ శనివారం ఈ నిర్మాణానికి ఆమోదముద్ర వేసినట్లు ఇజ్రాయెల్ అధికారులు తెలిపారు. భవిష్యత్ లో జరిగే ఎటువంటి శాంతి ఒప్పందంలో నైనా తన ఆధీనంలో ఉండాలని ఇజ్రాయెల్ భావిస్తున్న భూభాగం పైనే కొత్త సెటిల్మెంట్ నిర్మానం జరుగుతుందని ఆ అధికారులు తెలిపారు. ఇజ్రాయెల్ నిర్ణయాన్ని పాలస్తీనా అధికారులు ఖండించారు. “ఈ నిర్ణయం…

టాంక్ బండ్ విగ్రహాల ధ్వంసంపై సో-కాల్డ్ మేధావుల (అ)ధర్మాగ్రహం

మిలియన్ మార్చ్ సందర్భంగా తెలుగుజాతి మహనీయుల విగ్రహాలు ధ్వంసం కావడం నిస్సందేహంగా ఖండనార్హమే. కానీ ఏనాడూ ప్రజల ఈతి బాధల గురించి కించిత్ ఆందోళన సైతం ప్రకటించనివారు, వేలకొద్దీ జరిగిన రైతుల ఆత్మహత్యలపై ఎన్నడూ స్పందించనివారు, సోంపల్లి, కాకరాపల్లి ప్రజల కూడు, గూడు నాశనం చేయడమేకాక అదేమని అడిగినందుకు కాల్చి చంపడం ద్వారా సమాధానం ఇచ్చిన ప్రభుత్వాన్ని మర్యాదకు కూడా ప్రశ్నించని వారు ఈ నాడు మేధావులమంటూ విగ్రహాల ధ్వంసంపై ధర్మాగ్రహం ప్రకటించడం ఏ కోవలోకి వస్తుందో…

తిరుగుబాటుదారులనుండి ఆయిల్ పట్టణాన్ని స్వాధీనం చేసుకున్న గడ్డాఫీ బలగాలు

లిబియా రాజధానికి పశ్చిమంగా 48 కి.మీ దూరంలో ఉన్న జావియా పట్టణాన్ని ఈ వారం మొదట్లో తిరుగుబాటుదారుల నుండి స్వాధీనం చేసుకున్న గడ్డాఫీ బలగాలు, శనివారం నాటికి ట్రిపోలీకి తూర్పు దిశలో 600 కి.మీ దూరంలో ఉన్న ఆయిల్ పట్టణం ‘రాస్ లానుఫ్’ ను స్వాధీనం చేసుకున్నారు. రాస్ లానుఫ్ లో ఉన్న తిరుగుబాటు బలగాలను రాసులానుఫ్ పట్టణ శివార్లనుండి 20 కి.మీ తూర్పుకు నెట్టివేసినట్లుగా తిరుగుబాటుదారుల నాయకులు విలేఖరులకు తెలిపారు. గడ్డాఫీ మంత్రివర్గంలో హోం మంత్రిగా…

తెలుగునాట మరో కుటుంబ పార్టీ ఆవిర్భావం

పార్టీ పేరు: వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్టీని ఆవిర్భవింప జేసినవారు: వై.ఎస్.ఆర్ తనయుడు పార్టీ జెండాను ఆవిష్కరించినవారు: వై.ఎస్.ఆర్ సతీమణి విజయమ్మ పార్టీలోని ముఖ్య నాయకులు: వై.ఎస్.ఆర్ ద్వారా పదవులు పొందినవారు పార్టీ జెండాపై ఉన్నది: వై.ఎస్.ఆర్ బొమ్మ ఇదీ క్లుప్తంగా తెలుగునాట కొత్తగా ఆవిష్కృతమయిన రాజకీయ పార్టీ ప్రొఫైల్. ఇప్పటి వరకూ భారతదేశంలో పుట్టిన పార్టీలన్నీ తమ జెండాపై దేశ సంస్కృతికి సంబంధించిన గుర్తుగానీ, దేశ ప్రజల జీవన విధానానికి సంబంధించిన గుర్తుగానీ, దేశ చరిత్రను…

మిలియన్ మార్చ్ లో అపశృతులు, పోలీసులూ, ప్రభుత్వానిదే బాధ్యత

తెలంగాణ వాదులు గురువారం, మార్చి 10 తేదీన తలపెట్టిన “మిలియన్ మార్చ్” విజయవంతం అయిందని తెలంగాణ జెఏసి ప్రకటించింది. మార్చ్ ను అడ్డుకోవడానికి పోలీసులు శాయశక్తులా ప్రయత్నించినప్పటికీ ప్రజలు ట్యాంక్ బండ్ కు చేరుకున్నారు. అయితే కార్యకర్తలు టాంక్ బండ్ మీద ఉన్న కొన్ని విగ్రహాలను ధ్వంసం చేశారు. మార్చ్ ను అడ్డుకోవడానికి పోలీసులు, ప్రభుత్వం అడ్డుకోకపోయినట్లయితే ప్రశాంతంగా జరిగి ఉండేదని తెలంగాణ జెఏసి ఛైర్మన్ కోదండరాం అన్నారు. జెఏసి ఛైర్మన్ కోదండరాంను పోలీసులు జెఏసి ఆఫీసు…

“స్టక్స్ నెట్” వైరస్ సృష్టికర్తలు అమెరికా, ఇజ్రాయెల్ దేశాలే -పరిశోధకులు

ఇరాన్ అణు కార్యక్రమాన్ని ధ్వంసం చేయడానికి అమెరికా, దేశాలు “స్టక్స్ నెట్” కంప్యూటర్ వైరస్ సృష్టించారని సెక్యూరిటీ నిపుణుడు రాల్ఫ్ లాంగ్నర్ తేల్చాడు. కాలిఫోర్నియాలో జరిగిన ఒక కార్ఫెన్స్ లో మాట్లాడుతూ లాంగ్నెర్ ఈ విషయం వెల్లడించాడు. ఈ వైరస్ సృష్టించడంలో చోదక శక్తి మాత్రం అమెరికా అని ఆయన చెప్పాడు. ఇజ్రాయెల్ సహాయంతో అమెరికా ఈ వైరస్ ను ఇరాన్ లో అణు ఇంధనాన్ని శుద్ధి చేయడానికి వినియోగించిన కంప్యూటర్ వ్యవస్ధను నాశనం చేయడానికి సృష్టించిందని…

ఈజిప్టు పోలీసులపై ఆందోళనకారుల దాడి

  ఈజిప్టులోని అలెగ్జాండ్రియా పట్టణంలో ఈజిప్టు పోలీసుల ప్రధాన కార్యాలయంపై ప్రజలు దాడి చేశారు. పోలీసులు ముబారక్ కాలం నాటి డాక్యుమెంట్లను నాశనం చేస్తున్నారని తెలియడంతో ఆందోళనకారులు వారిని అడ్డుకోవడానికి కార్యాలయం పైకి వెళ్ళారు. పోలీసులు ఆందోళనకారులపై కాల్పులు జరపడంతో పలువురు గాయపడ్డారు. ఆందోళనకారులు కార్యాలయం కింది అంతస్ధులోకి జొరబడి పోలీసులతో ఘర్షణకు దిగారు. సైన్యం వచ్చి పోలీసు కార్యాలయాన్ని స్వాధీనం చేసేవరకూ ఘర్షణ కొనసాగింది. ఈజిప్టు పోలీసులు ముబారక్ పాలననాతి తమ చర్యల ద్వారా ప్రజల్లో…

లిబియా తిరుగుబాటుదారుల పురోగమనం, చర్చలకు ససేమిరా

  లిబియా తిరుగుబాటుదారులు పురోగమిస్తున్నారు. గడ్డాఫీ బలగాలకూ, తిరుగుబాటుదారులకూ మధ్య యుద్దం మెల్లగా ఊపందుకుంటోంది. రాజధాని ట్రిపోలిలో శుక్రవారం నాదు మధ్యాహ్న ప్రార్ధనల అనంతరం ప్రదర్శనకు తిరుగుబాటుదారులు పధక రచన చేశారు. ప్రదర్శన జరగకుండా అడ్డుకోవడానికి గడ్డాఫీ బలగాలు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. రాజధానీ ట్రిపోలీకి తూర్పున గల శివారు ప్రాంతం “టజౌరా” లో ఇరుపక్షాల మధ్య ఉద్రిక్తత పరిస్ధితులు నెలకొని ఉన్నాయి. విదేశీ విలేఖరులను వారున్న హోటల్ నుండి బైటికి రాకుండా గడ్డాఫీ బలగాలు అడ్దుకున్నాయి.…

ఛీఫ్ విజిలెన్స్ కమిషనర్ గా ధామస్ నియామకాన్ని రద్దుచేసిన సుప్రీం కోర్టు

  సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్ హెచ్ కపాడియా ఛీఫ్ విజిలెన్స్ కమిషనర్ గా పి.జె.ధామస్ నియామకాన్ని రద్ధు చేస్తూ తీర్పునిచ్చారు. కేరళలొ సీనియర్ ఐ.ఏ.ఎస్ అధికారిగా ఉండగా 1992లో పామాయిల్ ను అధిక ధరలకు దిగుమతి చేసుకున్నారన్న ఆరోపణలపై విచారణ జరుగుతున్న పి.జె.ధామస్ ను సి.వి.సి గా నియమించడం చెల్లదని న్యాయమూర్తి తీర్పునిచ్చారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీ “సుప్రీం తీర్పు ప్రధానికీ, ఆయన ప్రభుత్వానికీ పెద్ద దెబ్బ” అని పేర్కొంది. సి.వి.సి ప్రతిష్ట సుప్రీం…

తెలంగాణ ప్రక్రియను వేగవంతం చేసిన కావూరి వ్యాఖ్యలు

బుధవారం నాడు తెలంగాణ లాయర్లు తనకు వినతి పత్రం ఇవ్వడానికి తన ఇంటికి వచ్చిన సందర్భంగా ఏలూరు ఎం.పి కావూరి, తెలంగాణ ప్రాంతానికి చెందిన తెలంగాణ + సీమాంధ్ర = ఆంధ్ర ప్రదేశ్ ఎం.పిలు, ఎం.ఎల్.ఏలు, ఎం.ఎల్.సిలపై విరుచుకు పడటం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు దిశగా పరిణామాలు ఒకింత వేగం పుంజుకోవడానికి దోహదం చేసింది. గురువారం జరిగిన, జరుగుతున్న పరిణామలు ఆ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. తెలంగాణ లాయర్లు తమ ఇంటిని ముట్టడించారని కావూరి ఆరోపణ. కాదు,…

లిబియాలో దాడులు ప్రతిదాడులు, కొనసాగుతున్న ప్రతిష్టంభన

బుధవారం ఆయిల్ పట్టణమయిన బ్రెగాపై విమాన దాడులు నిర్వహించి గడ్డాఫీ బలగాలు కొన్ని గంటల పాటు స్వాధీన పరచుకున్నప్పటికీ తిరుగుబాటుదారులు ప్రతిదాడితో మళ్ళీ పట్టణాన్ని వశపరచుకున్న సంగతి విదితమే. బ్రెగా పట్టణాన్ని తిరిగి కైవశం చేసుకున్నామన్న ఆనందంలో తిరుగుబాటుదారులు ఉండగానే గడ్డాఫీ బలగాలు గురువారం మరొకసారి బ్రెగా పట్టణంపై విమానాలనుండి బాంబులు జారవిడిచారు. ఆయిల్ కంపినీకి పౌరుల ఆవాసాలకు మధ్య బాంబులు పడినట్లుగా తిరుగుబాటుదారులు తెలిపారు. బ్రెగాపై బాంబు దాడిలో ఎవరూ గాయపడలేదని తెలిసింది. అయితే అజ్దాబియా…

ముబారక్ నియమించిన ఈజిప్టు ప్రధాని రాజీనామా

  ఈజిప్టు మాజీ అధ్యక్షుడు తన చివరి రోజులలో నియమించిన ప్రధాని అహ్మద్ షఫిక్ గురువారం రాజీనామా చేశాడు. ముబారక్ కు సన్నిహితుడుగా భావిస్తున్న షఫిక్ తొలగింపు కూడా ఆందోళనకారుల డిమాండ్లలో ఒకటి. మిలట్రీ కౌన్సిల్ షఫిక్ రాజీనామాను ఆమోదించినట్లుగా తన ఫేస్ బుక్ పేజీ లో ప్రకటించింది. రవాణా శాఖ మాజీ మంత్రి ఎస్సామ్ షరాఫ్ ను కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా కోరినట్లుగా కూడా కౌన్సిల్ తెలిపింది. సోమవారం నాడు ముబారక్, అతని కుటుంబ…

పిలవని పేరంటానికి అమెరికా, లిబియా వద్ద యుద్ధ వాతావరణం

  అమెరికాకి ఈ జన్మలో బుద్ధిరాదు. ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్ లలొ చావుతప్పి కన్ను లొట్టబోయినా ఇంకా పాఠాలు నేర్చుకోలేదు. తగుదునమ్మా అంటూ పిలవని పేరంటానికి బయలుదేరింది. లిబియా ప్రాంతంలో తమ యుద్ధ పరికరాలు, సైనికులను లిబియాపై చర్యకు అనుకూలంగా ఉండేలా మొహరిస్తున్నట్టు అమెరికా రక్షణ శాఖ ప్రకటించింది. నిర్ణయాలు తీసుకున్న వెంటనే చర్య ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిపింది. నాటో తదితర మిత్రులతో చర్చలు జరుపుతున్నామనీ, గడ్డాఫీ సైన్యానికి చెందిన విమానాలు తిరగకుండా ఉండటానికి లిబియా గగన తలాన్ని…