ఢిల్లీ బాంబు పేలుడు – అనుమానితుల ఊహా చిత్రాలు

ఢిల్లీ బాంబు పేలుడు దుర్ఘటనలొ ఢిల్లీ పోలీసులు అనుమానితుల ఊహా చిత్రాలను విడుదల చేశారు. వీటిని ఫస్ట్ పోస్ట్ మ్యాగజైన్ ప్రచురించింది. ప్రత్యక్ష సాక్షుల వర్ణనల ఆధారంగా గీసిన చిత్రాలివి. —

ఢిల్లీ బాంబు పేలుడు -ఫోటోలు

బుధవారం ఉదయం ఢిల్లీ హైకోర్టు గేటు వద్ద జరిగిన బాంబు పేలుడు ఘటనలో 11 మంది చనిపోగా 65 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో 15 మంది పరిస్ధితి విషమంగా ఉందని కేంద్ర హోం శాఖ వర్గాలు తెలిపాయి. గత మే 25 తేదీన ఇదే కోర్టు ప్రాంగణంలో తక్కువ శక్తితో బాంబు పేలింది. ఆ ఘటనలో ఎవరికీ హాని జరగలేదు. ఈ రోజు జరిగిన బాంబు పేలుడుకి మే నెలలో జరిగిన పేలుడు ట్రయల్ గా…

ఢిల్లీ హైకోర్టులో బాంబు పేలుడు, అఫ్జల్ గురు విడుదల కోసం? (అప్‌డేట్స్)

ఢిల్లీ హైకోర్టు వద్ద నాలుగు, ఐదవ గేట్ల మధ్య శక్తివంతమైన బాంబు పేలిన దుర్ఘటనలో మరణించినవారి సంఖ్య 11 కి పెరిగిందని హోంశాఖ వర్గాలు తెలిపాయి. ఉదయం గం.10:14ని.లకు పేలిన ఈ బాంబు పేలుడు ఘటన ఢిల్లీలో నాలుగు నెలల్లో రెండవది. మే25 తేదీన, ఇదే హైకోర్టు ప్రాంగణంలో పాలిధీన్ కవర్ లో పెట్టిన తక్కువ తీవ్రతతో కూడిన బాంబు పేలింది. ఆ పేలుడులో ఆస్తి, ప్రాణ నష్టాలు జరగలేదు. ఓ కారు స్వల్పంగా దెబ్బతినడం తప్ప…

ఢిల్లీ హైకోర్టులో బాంబు పేలుడు, 9 మంది దుర్మరణం

ముంబై బాంబు పేలుళ్ళ అనంతరం టెర్రరిస్టులు మరోసారి తెగబడ్డారు. ఈ సారి ఢిల్లీని లక్ష్యంగా చేసుకున్నారు. ఢిల్లీ హైకోర్టు వద్ద జరిగిన బాంబు పేలుళ్ళలో కనీసం 9 మంది మరణించగా, 65 మంది గాయపడ్డారు. పేలుళ్ళకు తామే బాధ్యులమని ‘తెహరీక్’ అనే సంస్ధ ప్రకటించినప్పటికీ కేంద్ర హోం మంత్రి పి.చిదంబరం ఇప్పుడే చెప్పలేమని ప్రకటించాడు. బంగ్లాదేశ్ పర్యటనలో ఉన్న ప్రధాని మన్మోహన్ బాంబు పేలుళ్ళు పిరికిపందల చర్య అని వ్యాఖ్యానించాడు. యధావిధిగా ‘మళ్ళీ జరగకుండా కఠిన చర్యలు…

బి.జె.పి పై రాస్తే వికీలీక్స్ అబద్ధం, మాయావతిపై రాస్తే పక్కా!

రాజకీయ పార్టీల ద్వంద్వ విలువలు భారత ప్రజలకి కొత్త కాదు. అయినా తమ ద్వంద్వ విధానాలు ప్రజలు మర్చిపోతారేమో అన్నట్లుగా సందర్భం వచ్చినప్పుడల్లా అవి తమ బుద్ధిని బైట పెట్టుకుంటూ ఉంటాయి. ద్వంద్వ ప్రమాణాల విషయంలో ఒక్కో పార్టీది ఒక్కో స్టైలు. కొంతమంది చాలా తెలివిగా ద్వంద్వ ప్రమాణాలు అని తెలియనంతగా చెలాయిస్తే, మరి కొందరు తాము నిన్నొక మాట అన్నామన్న సంగతి తామే మర్చిపోయినట్లుగా మరుసటి రోజే దానిని మార్చేస్తూ ఉంటారు. మీడియాపైకి నెట్టేయడం రాజకీయులకి…

‘ఓటుకి నోటు’ కుంభకోణం, రాజకియ దళారీ ‘అమర్ సింగ్’ కస్టడీకి

కేంద్ర స్ధాయిలో చాన్నాళ్ళుగా రాజకీయ దళారిగా చురుగ్గా వ్యవహరిస్తూ వచ్చిన అమర్ సింగ్‌ కటకటాల పాలయ్యాడు. ‘ఓటుకి నోటు’ కుంభకోణంలో చురుకైన పాత్ర పోషించాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న సమాజ్‌వాదీ పార్టీ మాజీ నాయకుడు అమర్ సింగ్, మొదట ఆరోగ్య కారణాల రీత్యా కోర్టు హాజరునుండి మినహయింపు కోరుతూ పిటిషన్ వేసినప్పటికీ, చివరి నిమిషంలో కోర్టుకి హజరు కావడానికే నిశ్చయించుకున్నాడు. ఇటీవలే కిడ్నీ మార్పిడి చికిత్స జరిగినందున, కిడ్నీ ఇన్‌ఫెక్షన్ సోకిందనీ, ఇంకా ఇతర ఆరోగ్య సమస్యలున్నాయనీ కనుక…

గడ్డాఫీ నైగర్‌కు తరలివెళ్ళడానికి సహకరించిన ఫ్రాన్సు?

లిబియాకు దక్షిణాన ఉన్న నైగర్ దేశానికి క్షేమంగా వెళ్లడానికి ఫాన్సు, గడ్డాఫీకి సహకరించినట్లుగా వార్తలు వస్తున్నాయి. లిబియా ఆర్మీకి చెందిన 200 నుండి 250 వరకూ గల వాహనాల కాన్వాయ్ లిబియా సరిహద్దులను దాటి నైగర్ లోకి ప్రవేశించినట్లుగా రాయిటర్స్, బిబిసి లు వార్తా సంస్ధలు తెలిపాయి. అత్యంత పేద దేశమయిన నైగర్ ఫ్రాన్సుకి మాజీ వలస. ఫ్రాన్సు, నైగర్ ల మిలట్రీ వర్గాలనుండి అందిన సమాచారం మేరకు గడ్డాఫీ పునరావాసం కోసం జరిగిన రహస్య చర్చలు,…

జులియన్ అస్సాంజ్ పిచ్చోడు, ఆయన్ని పిచ్చాసుపత్రికి పంపండి -మాయావతి

వికీలీక్స్ విడుదల చేసిన కేబుల్స్‌ ద్వారా వెల్లడయిన సమాచారంలో తనపై ఆరోపణలు రావడం పట్ల మాయావతి స్పందించింది. ఆమె వికీలీక్స్ అధిపతి జులియన్ అస్సాంజ్ పైన విరుచుకుపడింది. జులియన్ పిచ్చోడని చెబుతూ ఆయన దేశం వాళ్ళు ఆయనని పిచ్చాసుపత్రికి పంపాలని కోరింది. వికీలీక్స్ సొంతదారు తన రాజకీయ ప్రత్యర్ధుల చేతుల్లో ఉండడమో లేక పిచ్చోడుగా మారడమో అయి ఉండాలని చెప్పింది. “ఆయన దేశ ప్రభుత్వాన్ని ఆయనను మానసిక రోగుల పునరావాస కేంద్రంలో చేర్చమని విజ్ఞప్తి చేస్తాను. వారి…

మాయావతి ఓ అనుమాన పిశాచి, డిక్టేటర్ -అమెరికా రాయబారి (వికీలీక్స్)

ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి మాయావతి ఒక అనుమాన పిశాచి అనీ, డిక్టేటర్‌ను పోలి ఉండే అలవాట్లు గల వ్యక్తి అనీ అమెరికా రాయబారి, అమెరికా ప్రభుత్వానికి పంపిన కేబుల్‌లో పేర్కొన్న సంగతి వికీలీక్స్ ద్వారా వెల్లడయ్యింది. “పోర్ట్రయిట్ ఆఫ్ ఎ లేడీ” అన్న హెడ్డింగ్‌తో రాసిన ఈ కేబుల్‌లో మాయావతి దళిత కార్డుని ఉపయోగిస్తున్నప్పటికీ ఆమె ప్రభుత్వం దళితుల అభ్యున్నతికి చేస్తున్నదేమీ లేదనీ, అభివృద్ధికి సైతం చేస్తున్నదేమీ లేదని రాయబారి పేర్కొన్నాడు. 2007 నుండి 2009 వరకూ…

బంగ్లాదేశ్‌కు రు.3375 కోట్ల రుణం మంజూరు చేసిన ఇండియా

ఓ వైపు బడ్జెట్ లోటు తగ్గించడానికి ప్రభుత్వ రంగ సంస్ధలను తెగనమ్ముతున్న కేంద్ర ప్రభుత్వం తగుదునమ్మా అని తనకు మాలిన ధర్మాన్ని అనుసరిస్తోంది. భారత దేశంలో రోడ్లు, రైల్వేలు లాంటి మౌలిక రంగాల నిర్మాణం ఆధినిక సౌకర్యాలతో లేనందున సరఫరా నష్టాలు ఏర్పడి ధరలు పెరుగుతున్నాయనీ, దానితో ద్రవ్యోల్బణం అదుపు తప్పుతున్నదనీ ప్రధాని మన్మోహన్, మాంటెక్ సింగ్ అహ్లూవాలియా చెబుతున్నారు. ఆ పేరుతో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సౌకర్యాల కోసం నిధులు సంపాదించడానికి కేంద్ర ప్రభుత్వం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ బాండులను గత…

అక్రమ మైనింగ్‌పై సి.బి.ఐ కొరడా, గాలి జనార్ధన్, మరొకరి అరెస్టు

గాలి బ్రదర్స్‌లో నాయకత్వ పాత్రలో కనిపించే గాలి జనార్ధన రెడ్డి, ఓబులాపురం మైనింగ్ కంపెనీ (ఓ.ఎం.సి) ఎం.డి బి.శ్రీనివాస రెడ్డిలను సి.బి.ఐ సోమవారం అరెస్టు చేసింది. సి.బి.ఐ డెప్యుటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ వి.వి.లక్ష్మీనారాయణ నేతృత్వంలోని బృందం బళ్ళారి చేరుకుని స్వయంగా గాలి జనార్ధన రెడ్డి, బి.శ్రీనివాస రెడ్డిలను అరెస్టు చేసి రోడ్డు మార్గంలో హైద్రాబాద్ కి తీసుకువచ్చారు. ఇద్దరిని అరెస్టు చేశామని సాయంత్రంలోగా సి.బి.ఐ ప్రత్యేక కోర్టులో హాజరు పరుస్తామనీ సి.బి.ఐ ప్రతినిదులు తెలిపారు. గాలి జనార్ధన…

ముంబై దాడుల దోషి హేడ్లీ అప్పగింతకు ఇండియా సీరియస్‌గా లేదు -మాజీ భద్రతాధికారి

ముంబై దాడుల నిందితుడు హేడ్లీని అమెరికానుండి ‘నేరస్ధుల అప్పగింత ఒప్పందం’ కింద ఇండియాకి రప్పించడానికి, భారత ప్రభుత్వం అంత సీరియస్ గా లేదని అమెరికా రాయబారితో చెప్పిన విషయం వికీలీక్స్ వెల్లడించిన కేబుల్ ద్వారా బైటపడింది. లష్కర్ ఎ తొయిబా సభ్యుడు డేవిడ్ కోలమన్ హేడ్లీని ఇండియాకి రప్పించడానికి అమెరికాపై ఒత్తిడి చేసున్నట్లు పైకి కనిపించినప్పటికీ వాస్తవానికి ‘ఈ సమయంలో’ హేడ్లీని రప్పించడానికి భారత్ సిద్ధంగా లేదని భారత ప్రభుత్వ మాజీ భద్రతా సలహాదారు ఎం.కె.నారాయణన్ అమెరికా…

టర్కీ దేశస్ధుల హత్య – ఇజ్రాయెల్‌పై అంతర్జాతీయ కోర్టుకి వెళ్ళనున్న టర్కీ

గాజా ప్రజలకోసం అంతర్జాతీయ సహాయం తీసుకెళ్తున్న ఓడలపైన ఇజ్రాయెల్ రక్షణ బలగాలు దాడి చేసి తొమ్మింది మంది టర్కీ దేశస్ధులను చంపివేశాక టర్కీ ప్రభుత్వం ఇజ్రాయెల్ దేశంపై కారాలు మిరియాలు నూరుతోంది. పాలస్తీనీయులకు చెందిన గాజా ప్రాంతాన్ని సైన్యంతో చుట్టుముట్టి ఎటువంటి సరుకులూ అందకుండా కాపలా కాస్తుండడంపై ‘అంతర్జాతీయ న్యాయ స్ధానం’ ను ఆశ్రయించాలని టర్కీ ప్రభుత్వం నిర్ణయించింది. అంతర్జాతీయ సహాయాన్ని పట్టుకెళ్తున్న ఓడల వరుసపైన ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ (ఐడిఎఫ్) బలగాలు, అంతర్జాతీయ జలాల్లో ఉండగానే…

‘వికీలీక్స్’లో తెలంగాణ, అమెరికా రాయబారితో స్పీకర్ భేటి

తెలంగాణ ఉద్యమంపై, అసెంబ్లీ మాజీ డిప్యుటి స్పీకర్, ప్రస్తుత స్పీకర్ నాదెండ్ల మనోహర్ అమెరికా రాయబారితో అభిప్రాయాలు పంచుకున్న సంగతి వికీలీక్స్ బైటపెట్టింది. భారత దేశంలోని అమెరికా రాయబారి అమెరికా ప్రభుత్వానికి రాసిన కేబుల్ ఉత్తరంలో తెలంగాణ ఉద్యమం గురించి విశ్లేషణ రాశాడు. ఈ విశ్లేషణ లోని అంశాలు ఇప్పటికే తెలంగాణ అంశంపై జరుగుతున్న చర్చలలో నానుతున్నవే అయినప్పటికీ, స్పీకర్ ద్వారా అమెరికా రాయబారికి చేరడమే, తెలంగాణ వాదుల్లో వ్యతిరేకతను రగిలిస్తోంది. నాదెండ్ల వెలిబుచ్చిన అభిప్రాయాల్లో కొన్ని…

అన్నా బృందం నాకు వ్యతిరేకంగా కుట్ర పన్నారు -స్వామి అగ్నివేష్

అన్నా బృందంతో కలిసి కొంతకాలం పాటు నడిచిన స్వామి అగ్నివేష్, ఆ బృందం సభ్యులు కొందరు తనకు వ్యతిరేకంగా కుట్రపన్నారని శుక్రవారం ఆరోపించాడు. తమ బృందం నుండి అగ్నివేష్‌ను తప్పించిన ‘టీమ్ అన్నా’ దీక్ష ముగిశాక అగ్నివేష్ మాట్లాడినదని చెబుతూ ఒక సి.డిని విడుదల చేశారు. అవతలి వ్యక్తితో అన్నా బృందానికి అంతకాలం అవకాశం ఇచ్చి ఉండాల్సింది కాదని చెబుతున్న ఈ సిడిలో కొంతభాగం మార్చారని ఆరోపించాడు. అగ్నివేశ్ ‘కపిల్‌జీ’ అని సంబోధించడాన్ని బట్టి అవతలి వ్యక్తిని…