గడ్డాఫీని చంపడానికి పశ్చిమ దేశాల బాంబు దాడులు

లిబియా పౌరుల్ని రక్షించే పేరుతో లిబియా ప్రభుత్వ సైనిక సంపత్తిని నాశనం చేసే పనిలో ఉన్న పశ్చిమ దేశాలు మళ్ళీ గడ్డాఫీని చంపే ప్రయత్నాలను తీవ్రం చేశాయి. గడ్డాఫీ నివాస భవనాలపై సోమవారం నాటో సేనలు శక్తివంతమైన బాంబులను ప్రయోగించాయి. లిబియాలో అంతర్యుద్ధానికి “కాల్పుల విరమణ ఒప్పందాన్ని” ప్రతిపాదిస్తూ వచ్చిన “ఆఫ్రికన్ యూనియన్” ప్రతినిధులతో చర్చించడానికి వినియోగించిన భవనం సోమవారం నాటి బాంబుదాడుల్లో బాగా ధ్వంసం ఐనట్లు వార్తా సంస్ధలు తెలిపాయి. రీగన్ అమెరికా అధ్యక్షుడుగా ఉన్న…

పశ్చిమ దేశాల దాడుల్లో వందకు పైగా లిబియన్ల మరణం, కొనసాగుతున్న దురాక్రమణ దాడులు

లిబియాపై నో-ఫ్లై జోన్ అమలు చేసే పేరుతో పశ్చిమ దేశాల యుద్ద విమానాలు విచక్షణా రహితంగా చేస్తున్న దాడుల్లొ ఇప్పటికి వందకు పైగా లిబియా పౌరులు మరణించినట్లు లిబియా ప్రభుత్వం ప్రకటించింది. ఐక్యరాజ్య సమితి తీర్మానం గడ్డాఫీకి చెందిన భూతల సైనిక దళాలపై దాడులకు అనుమతి ఇవ్వలేదనీ, అయినా పశ్చిమ దేశాలు గడ్డాఫీ సైనికులపై వైమానిక దాడులు చేస్తుండడం ఆమోదనీయం కాదనీ రష్యా విదేశాంగ మంత్రి “సెర్గీ లావరోవ్” రాయిటర్స్ వార్తా సంస్ధతో మట్లాడుతూ అన్నాడు. గడ్డాఫీ…

తొత్తు అరబ్ ప్రభుత్వాల మద్దతుతో లిబియాపై దాడికి ‘నాటో’ నాయకత్వం

తమ మాట వినే అరబ్ దేశాల మద్దతుతొ లిబియాపై జరుపుతున్న దాడులకు ఆమోద యోగ్యత సాధించడానికి పశ్చిమ దేశాలు ప్రయత్నిస్తున్నాయి. మొదట లిబియాపై సైనిక చర్యను తీవ్రంగా వ్యతిరేకించిన కతార్ ఇప్పటికే దాడుల్లో పాల్గొంటున్నది. తాజాగా టర్కీ కూడా కతార్ తో జత కలిసింది. “అరబ్ దేశాల్లో ప్రజాస్వామిక ఉచ్యమాలు తలెత్తడానికి పశ్చిమ దేశాలు అరబ్ దేశాల పట్ల అనుసరిస్తూ వచ్చిన విధానాలే కారణమ”ని హెచ్చరించిన టర్కీ ఇప్పుడు నో-ఫ్లై అమలుకు నాటొ నాయకత్వానికి అంగీకరించింది. గురువారం…

లిబియాలో దాడులు ప్రతిదాడులు, కొనసాగుతున్న ప్రతిష్టంభన

బుధవారం ఆయిల్ పట్టణమయిన బ్రెగాపై విమాన దాడులు నిర్వహించి గడ్డాఫీ బలగాలు కొన్ని గంటల పాటు స్వాధీన పరచుకున్నప్పటికీ తిరుగుబాటుదారులు ప్రతిదాడితో మళ్ళీ పట్టణాన్ని వశపరచుకున్న సంగతి విదితమే. బ్రెగా పట్టణాన్ని తిరిగి కైవశం చేసుకున్నామన్న ఆనందంలో తిరుగుబాటుదారులు ఉండగానే గడ్డాఫీ బలగాలు గురువారం మరొకసారి బ్రెగా పట్టణంపై విమానాలనుండి బాంబులు జారవిడిచారు. ఆయిల్ కంపినీకి పౌరుల ఆవాసాలకు మధ్య బాంబులు పడినట్లుగా తిరుగుబాటుదారులు తెలిపారు. బ్రెగాపై బాంబు దాడిలో ఎవరూ గాయపడలేదని తెలిసింది. అయితే అజ్దాబియా…

లిబియాపై ఆంక్షలను ఆమోదించిన భద్రతా సమితి

ఐక్యరాజ్య సమితిలో శక్తివంతమైన సంస్ధ ఐన భద్రతా సమితి లిబియా పై ఆంక్షలు విధిస్తూ తీర్మానాన్ని ఏకగ్రీవంగా అమోదించింది. దానితో పాటు లిబియా పౌరులపై సైనికులు పోలీసులచేత విమాన దాడులు చేసినందుకు గడ్డాఫీపై “మానవతపై నేరపూరిత దాడులు” (క్రైమ్స్ ఎగైనెస్ట్ హ్యూమానిటీ) చట్టం కింద విచారణ జరపాలని అంతర్జాతీయ క్రిమినల్ కోర్టుకు సిఫారసు చేస్తూ ఆమోదించింది. అటువంటి సిఫారసు తర్వాత తమను కూడా ఇబ్బందుల్లోకి నెడుతుందని కొంతమంది సంశయించినప్పటికీ చివరికి ఆమోదముద్ర వేశారు.  చైనా అభిప్రాయంపై అనుమానాలు…

గరిష్ట స్ధాయికి ఆయిల్ ధరలు, షేర్ మార్కెట్ కు భారీ నష్టాలు

  ఇండియా షేర్ మార్కెట్లు గురువారం భారీ స్ధాయిలో నష్ట పోయాయి. అసలే అధిక ద్రవ్యోల్బణం, వరుసగా చుట్టుముడుతున్న అవినీతి ఆరోపణల కారణంగా కొత్త సంవత్సరం ప్రారంభం నుండీ ఒడిదుడుకులకు లోనవుతున్న భారత షేర్లు లిబియా ఆందోళనలు ఆశనిపాతంగా పరిణమించాయి. పదహారు నెలల గరిష్ట స్ధాయిలో నష్టాలను నమోదు చేశాయి. బోంబే స్టాక్ ఎక్ఛేంజ్ 546 పాయింట్లు (3 శాతం) నష్టపోయి 17,632 పాయింట్ల వద్ద క్లోజ్ కాగా నేషనల్ స్టాక్ ఎక్ఛేంజ్ 175 పాయింట్లు (3.2…

సిగ్గూ, లజ్జా వదిలేసిన అమెరికా, ఐక్యరాజ్యసమితిలో మరో సారి నవ్వుల పాలు

  పాపాల పుట్ట అమెరికా తాను సిగ్గూ, లజ్జా ఎప్పుడో వదిలేశానని మరోసారి ఋజువు చేసుకుంది. తాను నిత్యం వల్లించే విలువలూ, సూత్రాలూ తనకు ఏ మాత్రం వర్తించవని ప్రపంచ వేదిక ఐక్యరాజ్యసమితి లోనే విలువల వలువలు ఊడదీసుకుని మరీ చాటి చెప్పుకుంది. తనకు నీతీ, నియమాలు ఒక లెక్క కాదనీ, తనకు ఉపయోగం అనుకుంటే ఎన్నిసార్లు మొఖం మీద ఉమ్మేసినా తుడుచుకు పోగలననీ నిస్సిగ్గుగా ప్రకటించుకుంది. తన హీనపు బతుక్కి వేరే ఎవరూ అద్దం పట్టనవసరం…

లిబియాలో “ఆగ్రహ దినం”, పోలీసు కాల్ఫుల్లో 24 మంది మరణం

లిబియాలో గురువారం, ఫిబ్రవరి 17 న ప్రజలు “ఆగ్రహ దినం” (డే ఆఫ్ రేజ్) పాటించినట్లుగా వార్తా సంస్ధలు తెలిపాయి. అయితే ఆ వార్తలను అవి ధృవీకరించలేక పోతున్నాయి. పత్రికా విలేఖరులకు ఎటువంటి సమాచారం ప్రభుత్వ వర్గాలు అందించక పోవటం వలన పౌరులు చెప్పిన విషయాలను ప్రచురించాయి. రాజధాని ట్రిపోలి తప్ప ఇతర పట్టణాల్లోని కనీసం ఐదింటిలో ప్రజలు వీధుల్లోకి వచ్చినట్ల గా బిబిసి, రాయటర్స్, ఎ.ఎఫ్.పి వార్తా సంస్ధలు పౌరులను ఉటంకిస్తూ తెలిపాయి. అమెరికా సంస్ధకు…

ముగ్గురు ‘గాజా’ పౌరులను కాల్చి చంపిన ఇజ్రాయెల్ సైనికులు

కొత్త సంవత్సరంలో ఇజ్రాయెల్ సైనికులు తమ హంతక చర్యలను ప్రారంభించారు. గాజాతో ఉన్న సరిహద్దు వద్ద సముద్రపు గవ్వలను ఏరుకొంటున్న ముగ్గురు పాలస్తీనా యువకులను ఇజ్రాయిల్ సైనికులు అమానుషంగా కాల్చి చంపారు. సరిహద్దు వద్ద మానవ నిషిద్ద ప్రాంతంలో పాలస్తీనీయులు పేలుడు పదార్ధాలు ఉంచుతున్నందున ఇజ్రాయిల్ సైనికులు వారిపైన కాల్పులు జరిపారని ఇజ్రాయిల్ సైన్యం ప్రకటించింది. గాజాలో అధికారంలో ఉన్న ‘హమాస్’ పోరాట సంస్ధ మరణించిన వారు తమ కార్యకర్తలని ప్రకటించ లేదు. వారి కార్యకర్తలు ఏదైనా…

బహ్రెయిన్ ఆందోళనకారులపై ఉక్కుపాదం

  మరిన్ని ప్రజాస్వామిక హక్కుల కోసం డిమాండ్  చేస్తున్న ఆందోళనకారులపై బహ్రెయిన్ ప్రభుత్వం కఠినంగా అణచివేస్తున్నది. టియర్ గ్యాస్ ప్రయోగించి లాఠీ ఛార్జి చేయటమే కాకుండా కాల్పులు కూడా జరపడంతో ముగ్గురు ఆందోళనకారులు చనిపోయారు. మరొకరి పరిస్ధితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వంద మందికి పైగా గాయపడ్డారు. హెచ్చరికలేమీ లేకుండా లాఠీ చార్జీ చేసి కాల్పులు జరిపినట్లు ఆందోళనకారులు ఆరోపించారు. శాంతి బధ్రతల కోసం చర్యలు అనివార్యమయ్యాయనీ, చర్చల ద్వారా నచ్చ జెప్పటానికి అన్ని ద్వారాలు మూసుకు…

ఇరాన్ లో ఈజిప్టు సంఘీభావ ప్రదర్శనలు

ఈజిప్టు ప్రజాందోళనకు ఇరాన్ లోని పాలక, ప్రతిపక్షాలు రెండూ మద్దతు పలికాయి, కానీ వేర్వేరు కారణాలతో. పాలక పక్షం పశ్చిమ దేశాలు పెంచి పోషించిన నియంతకు వ్యతిరేకంగా తలెత్తిన “ఇస్లామిక్ మేలుకొలుపు” గా అబివర్ణించి మద్దతు తెలపగా, ప్రతిపక్ష పార్టీలు మాత్రం “రాజకీయ స్వేఛ్చా వాయువుల కోసం ఎగసిపడిన ప్రజా ఉద్యమం”గా అభివర్ణించి ఈజిప్టు ప్రజల ఉద్యమానికి సంఘీభావంగా ఇరాన్ లో ప్రదర్శనలు పిలుపునిచ్చాయి. సోమవారం ఇరాన్ రాజధాని టెహ్రాన్ లో జరిగిన ప్రదర్శన సందర్భంగా చెలరేగిన…

సమ్మెలకు ఉద్యుక్తులవుతున్న ఈజిప్టు కార్మికులు, ఉద్యోగులు

ముబారక్ నియంతృత్వ పాలనకు పద్దెనిమిది రోజుల ఆందోళనతో తెర దించిన స్ఫూర్తితో ఈజిప్టులోని వివిధ రంగాలకు చెందిన కార్మికులు, ఉద్యోగులు తమ తమ సమస్యలను పరిష్కరించుకోవటానికి ఆందోళనలకు సిద్ధమవుతున్నారు. కొన్ని విభాగాల్లో ఇప్పటికే ఆందోళనలు ప్రారంభమయ్యాయి కూడా. సోమవారం సెంట్రల్ కైరోలో ఉన్న ‘బ్యాంక్ ఆఫ్ అలెగ్జాండ్రియా’ బ్రాంచి కార్యాలయంలో పని చేస్తున్న ఉద్యోగులు వందల మంది కార్యాలయం బయట చేరుకుని తమ అధికారులను పదవి నుండి తప్పుకోవాల్సిందిగా డిమాండ్ చేశారు. ముబారక్ ను వెళ్ళిపొమ్మన్నట్లే వారిని…

నిష్క్రమించిన ఆందోళనకారులు, కొన్ని డిమాండ్లు నెరవేర్చిన మిలట్రీ పాలకులు

  ఆందోళనకారుల డిమాండ్లలో కొన్నంటిని మిలట్రీ పాలకులు నెరవేర్చడంతో వారు విమోచనా కూడలిని వదిలి వెళ్ళిపోవడం ప్రారంభించారు. వెళ్ళడానికి నిరాకరించిన కొద్దిమందిని అరెస్టు చేసినట్టు సమాచారం. పార్లమెంటును రద్దు చేస్తున్నట్లుగా మిలిట్రీ కౌన్సిల్ ప్రకటించింది. సంవత్సరం క్రితం జరిగిన ఎన్నికలలో పార్లమెంటు సభ్యులను ఎన్నుకున్నారు. ఎన్నికలలో పోటీ చేయకుండా అనేక పార్టీలను ముబారక్ ఎప్పటిలాగే నిషేధించడంతో పార్లమెంటులో అత్యధికులు ముబారక్ పార్టీవారే మిగిలారు. ముబారక్ పార్టీ యధేఛ్చగా రిగ్గింగ్ చేసే అచారం ఈజిప్టులో ఉంది. అందువలన పార్లమెంటును…

విమోచనా కూడలిని వదలని ఈజిప్టు ఆందోళనకారులు, పెదవి విప్పని సైన్యం

  ముబారక్ గద్దె దిగిపోయాక ఇళ్ళకు వెళ్ళిపోతారనుకున్న ఈజిప్టు ఆందోళనకారులు తాహ్రిరి స్క్వేర్ (విమోచనా కూడలి) ను ఇంకా వదిలి వెళ్ళలేదు. ప్రజాస్వామ్య పరిపాలన స్ధాపించబడే వరకు తాము వెళ్ళేది లేదని వారు పంతం పట్టారు. శనివారం సాయంత్రం సైన్యం ప్రదర్శకులను పంపించివేయటానికి ప్రయత్నించి విఫలమయ్యారు. కాగా ఆందోళన ప్రారంభ దినాల్లో ప్రదర్శకులపై హింసాత్మక దాడులు జరిపి వందల మంది మరణించడానికి కారకులై ప్రజల్లో అపఖ్యాతి పాలైన మిలట్రీ పోలీసులు తిరిగి “విమోచనా కూడలి” వద్ద మొహరించడం…

ప్రతిఘటిస్తున్న ముబారక్, విస్తరణ వ్యూహంలో ఆందోళనకారులు

అన్నివైపుల నుండి వస్తున్న ఒత్తిడులను ముబారక్ ఇంకా ప్రతిఘటిస్తూనే ఉన్నాడు. “ఈజిప్టు ఇంకా ప్రజాస్వామ్యానికి సిద్ధంగా లేదంటూ” ముబారక్ ప్రభుత్వం తరఫున చర్చల్లో పాల్గొంటున్న ఉపాధ్యక్షుడు ఒమర్ సులేమాన్ ప్రకటించండం పట్ల అమెరికా ఒకింత అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రతిపక్షాలనూ, నిరసనలనూ ముప్ఫై సంవత్సరాలనుండీ అణచివేయటానికి ఉప్పయోగిస్తూ వస్తున్న ఎమెర్జెన్సీ చట్టాన్ని ఎత్తివేయాలన్న అమెరికా డిమాండ్ పట్ల విదేశాంగ మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశాడు. అమెరికా నమ్మకమైన మిత్రుడిగా ఉంటూ ప్రతికూల పరిస్ధితుల్లో ఎమర్జెన్సీ చట్టాన్ని ఎత్తివేయమనటం…