తిరుగుబాటుదారులనుండి ఆయిల్ పట్టణాన్ని స్వాధీనం చేసుకున్న గడ్డాఫీ బలగాలు

లిబియా రాజధానికి పశ్చిమంగా 48 కి.మీ దూరంలో ఉన్న జావియా పట్టణాన్ని ఈ వారం మొదట్లో తిరుగుబాటుదారుల నుండి స్వాధీనం చేసుకున్న గడ్డాఫీ బలగాలు, శనివారం నాటికి ట్రిపోలీకి తూర్పు దిశలో 600 కి.మీ దూరంలో ఉన్న ఆయిల్ పట్టణం ‘రాస్ లానుఫ్’ ను స్వాధీనం చేసుకున్నారు. రాస్ లానుఫ్ లో ఉన్న తిరుగుబాటు బలగాలను రాసులానుఫ్ పట్టణ శివార్లనుండి 20 కి.మీ తూర్పుకు నెట్టివేసినట్లుగా తిరుగుబాటుదారుల నాయకులు విలేఖరులకు తెలిపారు. గడ్డాఫీ మంత్రివర్గంలో హోం మంత్రిగా…

గడ్డాఫీ బలగాల పురోగమనం, విదేశీసాయం కోసం తిరుగుబాటుదారుల ఎదురుచూపు

గడ్డాఫీ బలగాలు ప్రతిదాడులను తీవ్రం చేస్తూ మెల్లగా పురోగమిస్తున్నాయి. రాస్ లానుఫ్ ఆయిల్ పట్టణాని స్వాధీనం చేసుకునే వైపుగా కదులుతున్నాయి. మరో ఆయిల్ పట్టణం బ్రెగా సరిహద్దుల్లో బాంబుదాడులు చేశాయి. రాస్ లానుఫ్ లో పోరు తీవ్రంగా జరుగుతోంది. వాయు, సముద్ర మార్గాల్లొ గడ్డాఫీ బలగాలు రాస్ లానుఫ్ లోని తిరుగుబాటుదారులపై దాదులు చేస్తున్నారు. గడ్డాఫీ బలగాల యుద్ధవిమానాల దాడులను తిరుగుబాటు బలగాలు ఎదుర్కొనలేక పోతున్నాయి. పశ్చిమ దేశాలు లిబియా భూభాగంపై “నిషిద్ధ గగనతలం” ప్రకటించి అమలు…

విమోచనా కూడలిలో ఆందోళనకారులను బలవంతంగా తొలంగించిన సైన్యం

ముబారక్ దేశం విడిచి పారిపోయినప్పటికీ కైరో నగరం లోని విమోచనా కూడలిలో కొన్ని వందలమంది ఆందోళనకారులు తమ బైఠాయింపును కొనసాగించారు. ముబారక్ నుండి అధికారం చేపట్టిన సైన్యం ప్రజలు డిమాండ్ చేసినట్లుగా ప్రజాస్వామిక సంస్కరణలు చేపట్టే వరకూ తాము ఆందోళన విరమించేది లేదని వీరు ప్రతిన బూనారు. వీరిని తొలగించడానికి సైన్యం ప్రారంభంలో ప్రయత్నించినప్పటికీ వారు వెళ్ళలేదు. అయితే మార్చి 9 తేదీన కొన్ని డజన్ల మంది గుర్తు తెలియని వ్యక్తులు విమోచనా కూడలిలో మిగిలి ఉన్న…

గడ్డాఫీ రాజీ ప్రతిపాదన తిరస్కరణ, పోరాటం తీవ్రం

లిబియాలో అంతర్యుద్ధం తీవ్రమవుతున్నది. గడ్డాఫీ సేనలు తిరుగుబాటుదారులను వెనక్కి నెట్టడానికి ప్రయత్నిస్తుండడంతో ఇరుపక్షాల మధ్య పోరు తీవ్రత పెరిగింది. బిన్ జావాద్ పట్టణాన్ని సోమవారం గడ్డాఫీ బలగాలు వైరి పక్షం నుండి స్వాధీనం చేసుకున్నాయి. అక్కడి నుండి ఆయిల్ పట్టణం రాస్ లానుఫ్ ను వశం చేసుకోవాలని చూస్తున్నాయి. మార్గ మధ్యంలో తిరుగుబాటు బలగాలు ప్రతిఘటిస్తున్నాయి. అడపా దడపా గడ్డాఫీ బలగాలు రాస్ లానుఫ్ పై విమాన దాడులు చేస్తున్నాయి. ఇదిలా ఉండగా గడ్డాఫీనుండి తిరుగుబాటుదారులకు రాజీ…

లిబియాలో కొనసా…గుతున్న అంతర్యుద్ధం

  లిబియాలో తిరుగుబాటుదారులకు గడ్డాఫీ బలగాలకు మధ్య యుద్ధం నిర్ణయాత్మక దశకు చేరే స్ధితి కనిపించడం లేదు. ఇరుపక్షాల మధ్య పట్టణాలు చిక్కుతూ, జారుతూ ఉన్నాయి. మూడు లక్షల జనాభా గల మిస్రాటా పట్టణం దగ్గర భీకర పోరు నడుస్తోంది. “బిన్ జావాద్” పట్టణం ఆదివారం తిరుగుబాటుదారుల ఆధీనంలో ఉండగా సోమవారం అది గడ్డాఫీ బలగాల ఆధీనంలోకి వచ్చింది. తిరుగుబాటుదారులు చేతిలో ఉన్న మరో పట్టణం స్వాధీనం చేసుకోవడానికి గడ్డాఫీ బలగాలు ప్రయత్నిస్తున్నాయి. గడ్డాఫీ బలగాలకు యుద్ధ…

లిబియా అంతర్యుద్ధం – లిబియా ఆయిల్ కోసం అమెరికా, ఐరోపా కుతంత్రాలు

ట్యునీషియా, ఈజిప్టు దేశాల్లో ప్రజాస్వామిక సంస్కరణల కోసం జరిగిన ప్రజా ఉద్యమాలు విజయవంతం కావడంతో అదే స్ఫూర్తితో  లిబియా ప్రజలు 41 సంవత్సరాల నుండి ఏలుతున్న గడ్డాఫీని వదిలించుకోవడానికి నడుం బిగించారు. ఫిబ్రవరి 16 న లిబియాలోని రెండో పెద్ద పట్టణం బెంఘాజీ నుండి తిరుగుబాటు ప్రారంభమైంది. బెంఘాజీని తమ ఆధీనంలోకి తెచ్చుకున్న తిరుగుబాటుదారులు కొద్దిరోజుల్లోనే లిబియా తూర్పుప్రాంతాన్నంతటినీ స్వాధీనం చేసుకున్నారు. పశ్చిమ ప్రాంతంలో కొన్ని ముఖ్యమైన పట్టణాలను కూడా తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. రాజధాని ట్రిపోలిలో…

ఈజిప్టు పోలీసులపై ఆందోళనకారుల దాడి

  ఈజిప్టులోని అలెగ్జాండ్రియా పట్టణంలో ఈజిప్టు పోలీసుల ప్రధాన కార్యాలయంపై ప్రజలు దాడి చేశారు. పోలీసులు ముబారక్ కాలం నాటి డాక్యుమెంట్లను నాశనం చేస్తున్నారని తెలియడంతో ఆందోళనకారులు వారిని అడ్డుకోవడానికి కార్యాలయం పైకి వెళ్ళారు. పోలీసులు ఆందోళనకారులపై కాల్పులు జరపడంతో పలువురు గాయపడ్డారు. ఆందోళనకారులు కార్యాలయం కింది అంతస్ధులోకి జొరబడి పోలీసులతో ఘర్షణకు దిగారు. సైన్యం వచ్చి పోలీసు కార్యాలయాన్ని స్వాధీనం చేసేవరకూ ఘర్షణ కొనసాగింది. ఈజిప్టు పోలీసులు ముబారక్ పాలననాతి తమ చర్యల ద్వారా ప్రజల్లో…

లిబియా తిరుగుబాటుదారుల పురోగమనం, చర్చలకు ససేమిరా

  లిబియా తిరుగుబాటుదారులు పురోగమిస్తున్నారు. గడ్డాఫీ బలగాలకూ, తిరుగుబాటుదారులకూ మధ్య యుద్దం మెల్లగా ఊపందుకుంటోంది. రాజధాని ట్రిపోలిలో శుక్రవారం నాదు మధ్యాహ్న ప్రార్ధనల అనంతరం ప్రదర్శనకు తిరుగుబాటుదారులు పధక రచన చేశారు. ప్రదర్శన జరగకుండా అడ్డుకోవడానికి గడ్డాఫీ బలగాలు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. రాజధానీ ట్రిపోలీకి తూర్పున గల శివారు ప్రాంతం “టజౌరా” లో ఇరుపక్షాల మధ్య ఉద్రిక్తత పరిస్ధితులు నెలకొని ఉన్నాయి. విదేశీ విలేఖరులను వారున్న హోటల్ నుండి బైటికి రాకుండా గడ్డాఫీ బలగాలు అడ్దుకున్నాయి.…

లిబియాలో దాడులు ప్రతిదాడులు, కొనసాగుతున్న ప్రతిష్టంభన

బుధవారం ఆయిల్ పట్టణమయిన బ్రెగాపై విమాన దాడులు నిర్వహించి గడ్డాఫీ బలగాలు కొన్ని గంటల పాటు స్వాధీన పరచుకున్నప్పటికీ తిరుగుబాటుదారులు ప్రతిదాడితో మళ్ళీ పట్టణాన్ని వశపరచుకున్న సంగతి విదితమే. బ్రెగా పట్టణాన్ని తిరిగి కైవశం చేసుకున్నామన్న ఆనందంలో తిరుగుబాటుదారులు ఉండగానే గడ్డాఫీ బలగాలు గురువారం మరొకసారి బ్రెగా పట్టణంపై విమానాలనుండి బాంబులు జారవిడిచారు. ఆయిల్ కంపినీకి పౌరుల ఆవాసాలకు మధ్య బాంబులు పడినట్లుగా తిరుగుబాటుదారులు తెలిపారు. బ్రెగాపై బాంబు దాడిలో ఎవరూ గాయపడలేదని తెలిసింది. అయితే అజ్దాబియా…

తిరుగుబాటు ప్రాంతాలపై గడ్డాఫీ సైనికుల దాడి, తిప్పికొట్టామంటున్న తిరుగుబాటుదారులు

  తిరుగుబాటు మొదలయ్యాక మొట్టమొదటిసారి గడ్డాఫీ తిరుగుబాటు ప్రాంతాలపై తన సైన్యంపై దాడి చేశాడు. ఈ దాడిని తిప్పికొట్టామని తిరుగుబాటుదారులు చెబుతున్నారు. కానీ తిరుగుబాటుకు కేంద్రంగా ఉన్న బెంఘానీ పట్టణం సమీపంలోని ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నట్లు గడ్డాఫీ వర్గాలు చెబుతున్నాయి. తిరుగుబాటు వర్గాలు కూడా మొదట గడ్డాఫీ పక్షం దాడి విజయవంతం అయిందని చెప్పినప్పటికీ ఆ తర్వాత వారిని మళ్ళీ వెనక్కి తరిమినట్లు ప్రకటించారు. ఆయిల్ ఉత్పత్తిని బైటికి సరఫరా చేయటానికి ప్రధాన టెర్మినల్ గా ఉన్న…

పతనం బాటలో గడ్డాఫీ ప్రభుత్వం, ప్రపంచ దేశాల మధ్య విభేదాలు?

  కల్నల్ మౌమ్మర్ గడ్డాఫీ రోజు రోజుకీ ఒంటరి అవుతున్నాడు. విదేశీ రాయబారుల్లో చాలామంది గడ్డాఫీకి ‘బై’ చెప్పేశారు. ప్రజలపై హింస ఆపమని డిమాండ్ చేస్తున్నారు. ఆందోళనకారులవి న్యాయమైన్ డిమాండ్లు, వాటిని ఒప్పుకొని దిగిపో అని సలహా ఇస్తున్నారు. గడ్డాఫీ అనుకూల సైనికులు వీధుల్లో జరిపిన కాల్పుల్లో ఇప్పటివరకూ 1,000 మంది పౌరులను చనిపోయారని ఇటలీ విదేశాంగ మంత్రి ఫ్రాట్టిని ప్రకటించాడు. వ్యాపార సంబంధాల వలన లిబియాలో ఉన్న తమ పౌరులను అక్కడినుండి ఖాళీ చేయించడానికి త్వరపడుతున్నారు.…

గడ్డాఫీ చేజారుతున్న లిబియా, లిబియానుండి వెళ్ళిపోతున్న విదేశీయులు

  65 లక్షల జనాభా గల ఎడారి దేశం లిబియా క్రమంగా గడ్డాఫీ చేజారుతోంది. విదేశాల్లో లిబియా తరపున నియమించబడిన రాయబారులు ఒక్కొక్కరు గడ్డాఫీకి ఎదురు తిరుగుతున్నారు. సైనికులు గడ్డాఫీకి వ్యతిరేకంగా ఆందోళనకారుల్లో చేరిపోతున్నారు. వ్యతిరేకులుగా మారిన సైనిక బ్యారక్ లపై ప్రభుత్వ దళాలు విమానాలనుండి బాంబు దాడులు చేస్తున్నారు. హింసాత్మకంగా మారుతున్న లిబియానుండి విదేశీయులు తమ తమ స్వస్ధలాలకు వెళ్ళిపోతున్నారు. వివిధ దేశాల ప్రభుత్వాలు విమానాల ద్వారా, ఓడల ద్వారా తమ దేశీయులను వెనక్కి రప్పించుకుంటున్నాయి.…

బహ్రెయిన్ హింస పై ఇంగ్లండ్ ఆందోళన

  బహ్రెయిన్ లో ప్రజల నిరసనల సందర్భంగా హింసాత్మక సంఘటనలు చెలరేగటంపై ఇంగ్లండ్ ఆందోళన వ్యక్తం చేసింది. ప్రజాందోళనలతో వ్యవహరించేటప్పుడు శాంతియుత చర్యలకు పరిమితం కావలసిన అవసరాన్ని బహ్రెయిన్ ప్రభుత్వానికి నొక్కి చెప్పినట్లు ఇంగ్లండ్ ఫారెన్ సెక్రటరీ విలియం హేగ్ బ్రిటిష్ కామన్స్ సభలో సభ్యులకు తెలియ జేశాడు. అవసరమయితే తప్ప బహ్రెయిన్ ద్వీపానికి ప్రయాణం పెట్టుకోవద్దని హేగ్ బ్రిటన్ పౌరులకు సలహా ఇచ్చాడు. బహ్రెయిన్ రాజధాని మనామాలోని “పెరల్ స్క్వేర్” లో గుడారాలు వేసుకొని ఉన్న…

ముగ్గురు ‘గాజా’ పౌరులను కాల్చి చంపిన ఇజ్రాయెల్ సైనికులు

కొత్త సంవత్సరంలో ఇజ్రాయెల్ సైనికులు తమ హంతక చర్యలను ప్రారంభించారు. గాజాతో ఉన్న సరిహద్దు వద్ద సముద్రపు గవ్వలను ఏరుకొంటున్న ముగ్గురు పాలస్తీనా యువకులను ఇజ్రాయిల్ సైనికులు అమానుషంగా కాల్చి చంపారు. సరిహద్దు వద్ద మానవ నిషిద్ద ప్రాంతంలో పాలస్తీనీయులు పేలుడు పదార్ధాలు ఉంచుతున్నందున ఇజ్రాయిల్ సైనికులు వారిపైన కాల్పులు జరిపారని ఇజ్రాయిల్ సైన్యం ప్రకటించింది. గాజాలో అధికారంలో ఉన్న ‘హమాస్’ పోరాట సంస్ధ మరణించిన వారు తమ కార్యకర్తలని ప్రకటించ లేదు. వారి కార్యకర్తలు ఏదైనా…

బహ్రెయిన్ ఆందోళనకారులపై ఉక్కుపాదం

  మరిన్ని ప్రజాస్వామిక హక్కుల కోసం డిమాండ్  చేస్తున్న ఆందోళనకారులపై బహ్రెయిన్ ప్రభుత్వం కఠినంగా అణచివేస్తున్నది. టియర్ గ్యాస్ ప్రయోగించి లాఠీ ఛార్జి చేయటమే కాకుండా కాల్పులు కూడా జరపడంతో ముగ్గురు ఆందోళనకారులు చనిపోయారు. మరొకరి పరిస్ధితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వంద మందికి పైగా గాయపడ్డారు. హెచ్చరికలేమీ లేకుండా లాఠీ చార్జీ చేసి కాల్పులు జరిపినట్లు ఆందోళనకారులు ఆరోపించారు. శాంతి బధ్రతల కోసం చర్యలు అనివార్యమయ్యాయనీ, చర్చల ద్వారా నచ్చ జెప్పటానికి అన్ని ద్వారాలు మూసుకు…