సైన్యం చేతిలో ఈజిప్టు భవితవ్యం, ప్రజల ఆకాంక్షలు నెరవేరేనా?

“ఈ నియంత మాకొద్దం”టూ పద్దెనిమిది రోజుల పాటు ఎండా, వాన తెలియకుండా, రాత్రీ పగలూ తేడా చూడకుండా వీధుల్లోనే భార్యా బిడ్డలతో సహా గడిపి ఈజిప్టు పౌరుడు ఆందోళనలో పాల్గొని నియంత ముబారక్ ను దేశం నుండి సాగనంపాడు. వారి ప్రధాన కోరిక అయిన ప్రజాస్వామ్య పాలన ఇంకా దేశంలో ఏర్పడలేదు. ముబారక్ ముప్ఫై సంవత్సరాల పాటు ఎమర్జెన్సీ చట్టంతో తమని పాలించటానికి ఏ శక్తి సాయం చేసింది? దేశంలో సైన్యమే ముబారక్ కు అండదండలిచ్చి కాపాడితే,…

ప్రతిఘటిస్తున్న ముబారక్, విస్తరణ వ్యూహంలో ఆందోళనకారులు

అన్నివైపుల నుండి వస్తున్న ఒత్తిడులను ముబారక్ ఇంకా ప్రతిఘటిస్తూనే ఉన్నాడు. “ఈజిప్టు ఇంకా ప్రజాస్వామ్యానికి సిద్ధంగా లేదంటూ” ముబారక్ ప్రభుత్వం తరఫున చర్చల్లో పాల్గొంటున్న ఉపాధ్యక్షుడు ఒమర్ సులేమాన్ ప్రకటించండం పట్ల అమెరికా ఒకింత అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రతిపక్షాలనూ, నిరసనలనూ ముప్ఫై సంవత్సరాలనుండీ అణచివేయటానికి ఉప్పయోగిస్తూ వస్తున్న ఎమెర్జెన్సీ చట్టాన్ని ఎత్తివేయాలన్న అమెరికా డిమాండ్ పట్ల విదేశాంగ మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశాడు. అమెరికా నమ్మకమైన మిత్రుడిగా ఉంటూ ప్రతికూల పరిస్ధితుల్లో ఎమర్జెన్సీ చట్టాన్ని ఎత్తివేయమనటం…

ముబారక్ దిగిపోవాలన్న అమెరికాపై ఈజిప్టు మంత్రి ఆగ్రహం

అధికారాన్ని అప్పగించేందుకు వెంటనే ప్రక్రియ ప్రారంభించాలని ముబారక్ ప్రభుత్వాన్ని కోరుతూ వచ్చిన అమెరికా గత రెండు మూడు రోజులుగా స్వరం మార్చి ముబారక్ దిగి పోవాలని డిమాండ్ చేస్తుండడంతో ఈజిప్టు విదేశాంగ మంత్రి అబౌల్ ఘీత్, అమెరికాపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఎమర్జెన్సీ పరిస్ధుల చట్టాన్ని ఎత్తివేయలన్న డిమాండ్ ను ప్రస్తావిస్తూ అమెరికా తన కోరికలను ఈజిప్టుపై రుద్దకూడదన్నాడు. జనవరి 25 నుండి ముబారక్ రాజీనామా చేయాలన్న డిమాండ్ తో రాజధాని కైరోతో పాటు వివిధ పట్టణాలలో…

భారత ద్రవ్యవిధానం పై ఈజిప్టు పరిణామాల ప్రభావం -ఆర్.బి.ఐ

ఈజిప్టులో హఠాత్తుగా తలెత్తిన పరిణామాలు భారత దేశ ద్రవ్యవిధానం పైన ప్రభావం చూపుతాయని ఆర్.బి.ఐ గవర్నర్ దువ్వూరి సుబ్బారెడ్డి ఆదివారం విలేఖరులతో మాట్లాడుతూ అన్నారు. ఈజిప్టు పరిణామాలు బొత్తిగా ఊహించని విధంగా వచ్చి పడ్డాయని, జనవరి ద్రవ్య విధాన సమీక్ష తర్వాత జరిగిన ఈ పరిణామాలు సమీక్షను పూర్వ పక్షం చేశాయనీ ఆయన అన్నారు. RBI Governer Duvvuri Subba Rao గత జనవరి 25 న రిజర్వు బ్యాంకు భారత పరపతి విధానాన్ని సమీక్షించి వడ్డీ…

ఈజిప్టులో అమెరికా దాగుడు మూతలు

ముప్ఫై ఏళ్ళనుండి పాలిస్తూ తమకు కనీస హక్కులు కల్పించని ముబారక్ దిగిపోవాలని ఈజిప్టు ప్రజలు గత పన్నెండు రోజిలుగా ఆందోళన చేస్తుండగా అమెరికా కల్లోలంలో తమకు ఏ విధంగా లాభం చేకూరుతుందా అని అమెరికా, యూరోపియన్ యూనియన్ గోతికాడ గుంటనక్కల్లా చూస్తున్నాయి. Muslim Brotherhood Leader Mohammed Badie అధికారారం అప్పగించడానికి శాంతియుత ప్రక్రియను ప్రారంభించాలని ప్రకటనలిస్తూ వస్తున్న అమెరికా తన మరో ముఖాన్ని చూపించింది. అమెరికా తరఫున ప్రత్యేక దూతగా వచ్చిన ఫ్రాంక్ విజ్నర్ అధికారం…