ఢిల్లీ, జార్జియా, ధాయిలాండ్ పేలుళ్ల వెనక ఇరానియన్లు

సోమవారం ఢిల్లీలో ప్రధాని నివాసానికి సమీపంలో ఇజ్రాయెలీ దౌత్య సిబ్బందిని లక్ష్యం చేసుకుంటూ జరిగిన బాంబు పేలుడుకూ, దాదాపు అదే సమయంలో జార్జియా లోనూ మంగళవారం ధాయిలాండ్ లోనూ జరిగిన బాంబు పేలుళ్లకూ దగ్గరి సంభంధం ఉందని ఇజ్రాయెల్ ఆరోపించింది. మరోవైపు ఇజ్రాయెల్ ఆరోపణలను ఆమోదించడం గానీ, నిరాకరించడం గానీ చేయబోవడం లేదని ఇరాన్ ప్రభుత్వం ప్రకటించింది. ఇరాన్ కు చెందిన అణు శాస్త్రవేత్తలను అనేక మందిని ఇజ్రాయెల్ ప్రభుత్వం పొట్టన బెట్టుకున్నట్లుగా ఇరాన్ గతంలో ఆరోపించింది.…

ఢిల్లీ బాంబు పేలుడు – అనుమానితుల ఊహా చిత్రాలు

ఢిల్లీ బాంబు పేలుడు దుర్ఘటనలొ ఢిల్లీ పోలీసులు అనుమానితుల ఊహా చిత్రాలను విడుదల చేశారు. వీటిని ఫస్ట్ పోస్ట్ మ్యాగజైన్ ప్రచురించింది. ప్రత్యక్ష సాక్షుల వర్ణనల ఆధారంగా గీసిన చిత్రాలివి. —

ఢిల్లీ బాంబు పేలుడు -ఫోటోలు

బుధవారం ఉదయం ఢిల్లీ హైకోర్టు గేటు వద్ద జరిగిన బాంబు పేలుడు ఘటనలో 11 మంది చనిపోగా 65 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో 15 మంది పరిస్ధితి విషమంగా ఉందని కేంద్ర హోం శాఖ వర్గాలు తెలిపాయి. గత మే 25 తేదీన ఇదే కోర్టు ప్రాంగణంలో తక్కువ శక్తితో బాంబు పేలింది. ఆ ఘటనలో ఎవరికీ హాని జరగలేదు. ఈ రోజు జరిగిన బాంబు పేలుడుకి మే నెలలో జరిగిన పేలుడు ట్రయల్ గా…

ఢిల్లీ హైకోర్టులో బాంబు పేలుడు, అఫ్జల్ గురు విడుదల కోసం? (అప్‌డేట్స్)

ఢిల్లీ హైకోర్టు వద్ద నాలుగు, ఐదవ గేట్ల మధ్య శక్తివంతమైన బాంబు పేలిన దుర్ఘటనలో మరణించినవారి సంఖ్య 11 కి పెరిగిందని హోంశాఖ వర్గాలు తెలిపాయి. ఉదయం గం.10:14ని.లకు పేలిన ఈ బాంబు పేలుడు ఘటన ఢిల్లీలో నాలుగు నెలల్లో రెండవది. మే25 తేదీన, ఇదే హైకోర్టు ప్రాంగణంలో పాలిధీన్ కవర్ లో పెట్టిన తక్కువ తీవ్రతతో కూడిన బాంబు పేలింది. ఆ పేలుడులో ఆస్తి, ప్రాణ నష్టాలు జరగలేదు. ఓ కారు స్వల్పంగా దెబ్బతినడం తప్ప…