అవినీతి ‘రాజా’ కొంప ముంచిన పర్సనల్ సెక్రటరీ ‘ఆచారి’

మాజీ టెలికం మంత్రి ఎ.రాజా కు పర్సనల్ సెక్రటరీ గా పని చేసిన ‘ఆచారి’, తన మాజీ బాస్ కి వ్యతిరేకంగా కీలకమైన సాక్ష్యం చెప్పినట్లుగా ఎన్.డి.టి.వి వార్తా సంస్ధ తెలిపింది. ఎ.ఆచారి గతంలొ ఎ. రాజాకు అసిస్టెంట్ పర్సనల్ సెక్రటరీగా పనిచేశాడు. ఆయన కోర్టులో సోమవారం మాజీ మంత్రికి వ్యతిరేకంగా సాక్ష్యం ఇస్తూ ఎ.రాజాకు, ఆయన కుట్ర పన్నాడని ఆరొపిస్తున్న కంపెనీల అధిపతులతో అనేక సంవత్సరాలుగా దగ్గరి సంబంధాలు ఉన్నాయని తెలిపాడు. తద్వారా ఎ.రాజా టెలికం…

కొత్త సంవత్సరంలో యూరప్ సంక్షోభం ప్రపంచం అంతా వ్యాపిస్తుంది -యూరప్ సెంట్రల్ బ్యాంక్

యూరప్ రుణ సంక్షోభం కొత్త సంవత్సరంలో తన విశ్వరూప చూపిస్తుందనీ, అది ప్రపంచం అంతా వ్యాపించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయనీ యూరోపియన్ సెంట్రల్ బ్యాంకు (ఇ.సి.బి) సీనియర్ అధికారులు పేర్కొన్నారు. ప్రపంచం అంతటికీ వ్యాపించడమే కాక సంక్షోభం మరింత తీవ్రం కానున్నదని వారు తెలిపారు. యూరప్ లో సంక్షోభంలో ఉన్న దేశాలకు సహాయ పడే నిమిత్తం ఐ.ఎం.ఎఫ్ కు నిధులు ఇవ్వడానికి బ్రిటన్ నిరాకరించడంతో ఈ పరిస్ధితి తలెత్తుతుందని అధికారులు తెలిపారు. ఐ.ఎం.ఎఫ్ కు బ్రిటన్ ఇరవై…

‘యూరో’ ను నిలబెట్టడానికి జర్మనీ, ఫ్రాన్సుల విఫల యత్నం -కార్టూన్

యూరప్ రుణ సంక్షోభం పుణ్యమాని యూరప్ ఐక్యత కు ప్రమాదం ముంచుకొచ్చింది. గత రెండేళ్ళనుండీ యూరో జోన్ దేశాలు అనేక చర్యలు తీసుకున్నప్పటికీ ‘యూరప్ రుణ సంక్షోభం’ నిత్య యవ్వనంతో శోభిల్లుతోంది. యూరోపియన్ యూనియన్ ఏర్పాటుకి బాటలు వేసిన లిస్బన్ ఒప్పందం లో మార్పులు చేయడానికి గత శుక్రవారం జరిగిన ఇ.యు శిఖరాగ్ర సమావేశం నిర్ణయించగా బ్రిటన్ ఆ తీర్మానాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. ఇరవే ఏడు దేశాల్లో బ్రిటన్ ప్రస్తుతం ఏకాకిగా ఉన్నా భవిష్యత్తులో దానికి మద్దతు…

రెండేళ్ళ కనిష్ట స్ధాయికి సెన్సెక్స్ పతనం

బోంబే స్టాక్ ఎక్చేంజి సెన్సెక్స్ సూచి శుక్రవారం రెండున్నర శాతం పతనం అయింది. మొత్తంగా రెండేళ్లలోనే అత్యంత కనిష్ట స్ధాయికి చేరుకుంది. బ్యాంకింగ్, మెటల్స్, సాఫ్ట్ వేర్ కంపెనీల షేర్లు భారీగా అమ్మకాల ఒత్తిడికి గురి కావడంతో సెన్సెక్స్ భారీ నష్టాలను చవి చూసిందని విశ్లేషకులు, ట్రేడర్లు విశ్లేషించారని రాయిటర్స్ తెలిపింది. బ్యాంకుల షేర్లు, ఫ్యూచర్లు బాగా పతనం అయ్యాయనీ, ఆర్.బి.ఐ పరపతి విధానం సమీక్షతో నిరుత్సాహపడిన మదుపుదారులు అమ్మకాలకు పాల్పడ్డారని వారు చెబుతున్నారు. శుక్రవారం రిజర్వ్…

2012 లో కుదేలు కానున్న బ్రిటన్ ఆర్ధిక వ్యవస్ధ

వచ్చే సంవత్సరం బ్రిటన్ ఆర్ధిక వ్యవస్ధ తీవ్ర స్ధాయిలో కుచించుకుపోతుందని స్టాండర్డ్ ఛార్టర్డ్ బ్యాంకు అంచనా వేస్తోంది. బ్రిటన్ ఆర్ధిక వ్యవస్ధ వృద్ధి చాలా తక్కువగా ఉంటుందని ఈ బ్యాంకు గతంలోనే జోస్యం చెప్పింది. గతంలో అంచనా వేసినట్లుగా వృద్ధి చెందడానికి బదులు బ్రిటన్ ఎకానమీ కుచించుకుపోతుందని బ్యాంకు ఇప్పుడు అంచనా వేస్తోంది. బ్రిటన్ ఎకానమీ 0.6 శాతం వృద్ధి చెందుతుందని స్టాండర్డ్ ఛార్టర్డ్ అంచనా వేసింది. దానికి బదులు 1.3 శాతం మేరకు కుచించుకుపోతుందని (లేదా…

కొత్త స్ధాయికి పతనమైన రూపాయి విలువ

భారత దేశ కరెన్సీ పతనం చెందడంలో కొంత పుంతలు తొక్కుతోంది. రోజుకొక రికార్డు  నమోదు చేస్తూ పాతాళానికి దూసుకు పోతోంది. సోమవారం అది సరికొత్త రికార్డును నమోదు చేసింది. అంతర్జాతీయ కరెన్సీ మార్కెట్ లో డాలరు కు ఇప్పుడు రు. 52.77 పై చొప్పున రూపాయి విలువ పలుకుతోంది. అంటే రూపాయికి 1/52.77 డాలర్ల చొప్పున రూపాయి విలువ పలుకుతోంది. సోమవారం వెలువడిన అక్టోబరు నెల పారిశ్రామిక ఉత్పత్తి గణాంకాలు భారత ఆర్ధిక వ్యవస్ధ నెమ్మదించిన విషయాన్ని…

పడిపోయిన భారత పారిశ్రామిక ఉత్పత్తి

దాదాపు రెండు సంవత్సరాల తర్వాత భారత పారిశ్రామిక ఉత్పత్తి తగ్గిపోయింది. సాధారణంగా ఎంతో కొంత (ఎంత తక్కువైనా) పెరుగుదలను నమోదు చేయవలసి ఉండగా, పారిశ్రామిక ఉత్పత్తి తగ్గుదలను నమోదు చేయడం పరిశీలకులను నిశ్చేష్టుల్ని చేసింది. ఈ సంవత్సరం అక్టోబరు నెలలో గత సంవత్సరం ఇదే నెలతో పోల్చితే పారిశ్రామిక ఉత్పత్తి  5.1 శాతం తగ్గిపోయిందని ప్రభుత్వ గణాంకాల ద్వారా తెలుస్తోంది. ఫ్యాక్టరీలు, ఖనిజ తవ్వకాలు, వివిధ యుటిలిటీ కంపెనీలు మొ.న రంగాల ఉత్పత్తి పారిశ్రామిక ఉత్పత్తిగా పరిగణిస్తారు.…

యూరోప్ సంక్షోభ పరిష్కారం, ది మిషన్ ఇంపాజిబుల్ -కార్టూన్

– ఎలక్ట్రానిక్ గాడ్గెట్: యూరప్ నాయకులారా! ఎలక్ట్రానిక్ గాడ్గెట్: మరో 11 గంటల 10 సెకన్లలో…..                        మీ యూరప్ ఖండం అంతర్గతంగా బద్దలు కానుంది.   ఎలక్ట్రానిక్ గాడ్గెట్: ఇక మీ కర్తవ్యం: ఐక్యంగా ప్రయత్నించి వినాశనాన్ని అడ్డుకోవడం                          కాని మీరు ఇప్పుడే కదలాలి! గుడ్ లక్!! ఎలక్ట్రానిక్ గాడ్గెట్: వెల్! ఇంకా దేనికోసం ఎదురు చూస్తున్నారు? కదలండి!? యూరప్ నాయకులు: మేము ఎప్పుడూ లెవెన్త్ అవర్ వరకూ ఎదురు చూస్తాం!!! —                          —                             …

ఆర్ధిక వృద్ధి అంచనా తగ్గించుకున్న భారత ప్రభుత్వం

ప్రస్తుత ఆర్ధిక సంవత్సరానికి గాను భారత ప్రభుత్వం గతంలో వేసిన ఆర్ధిక వృద్ధి (జిడిపి వృద్ధి రేటు) అంచనాను తగ్గించుకుంది. పనిలో పనిగా ఈ సంవత్సరం కోశాగార లోటు (ఫిస్కల్ డెఫిసిట్ లేదా బడ్జెట్ డెఫిసిట్) లక్ష్యాన్ని చేరుకోవడం కష్టమని కూడా ఒక హెచ్చరిక జారీ చేసింది. “చెల్లింపుల సమతూకం” (బ్యాలన్స్ ఆఫ్ పేమెంట్స్) విషయంలో తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటున్నామని తెలిపింది. ‘చెల్లింపుల సమతూకం సంక్షోభం’ ఎన్నడో ఇరవై సంవత్సరాల క్రితం 1992 లో ఇండియా ఎదుర్కొంది.…

అమెరికా కోలుకోవడానికి సంవత్సరాలు పడుతుంది -ఒబామా

అమెరికా ఆర్ధిక వ్యవస్ధ కోలుకోవడానికి ఇంకా కొన్ని సంవత్సరాలు పడుతుందని అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామా శుక్రవారం ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. ఇటీవలి కాలంలో కొద్దిగా మెరుగుపడుతున్న సూచనలు కనిపిస్తున్నప్పటికీ అది శాశ్వతం కాదని ఆర్ధిక విశ్లెషకులు భావిస్తున్నారు. బారక్ ఒబామా అంచనా సైతం దాని ధృవీకరిస్తోంది. సిబి.ఎస్ టెలివిజన్ కి చెందిన “60 మినిట్స్” కార్యక్రమానికి ఒబామా ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆదివారం ఇచి ప్రసారం కానున్నది. అమెరికా ఆర్ధిక వ్యవస్ధలో సమస్యల పరిష్కారాన్ని తక్కువ…

యూరోపియన్ యూనియన్ క్రెడిట్ రేటింగ్ తగ్గిస్తాం -ఎస్ & పి హెచ్చరిక

యూరో జోన్ లోని మొత్తం పదిహేడు దేశాల క్రెడిట్ రేటింగ్ తగ్గినట్లయితే యూరోపియన్ యూనియన్ క్రెడిట్ రేటింగ్ కూడా తగ్గించాల్సి ఉంటుందని స్టాండర్డ్ అండ్ పూర్ క్రెడిట్ రేటింగ్ సంస్ధ హెచ్చరించింది. ఇ.యు రేటింగ్ తో పాటు ఇ.యు లో ఉన్న అతి పెద్ద బ్యాంకుల రేటింగ్ కూడా తగ్గించాల్సి ఉంటుందని ఆ సంస్ధ హెచ్చరించింది. శుక్రవారం జరగనున్న యూరోపియన్ యూనియన్ సమావేశంలో సంక్షోభ పరిష్కారానికి నిర్ణయం తీసుకోవాల్సిందేనని ఎస్ & పి పరోక్ష హెచ్చరిక చేసినట్లయ్యింది.…

5 లేదా 6 శాతం కంటె ఎక్కువ ద్రవ్యోల్బణం ఇండియా భరించలేదు -ప్రణబ్

భారత దేశం ఐదు లేదా ఆరు శాతం కంటె ఎక్కువ ద్రవ్యోల్బణాన్ని భరించలేదని భారత ఆర్ధిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ బుధవారం పార్లమెంటులో అన్నాడు. అక్టోబరు నెలలో భారత ఆర్ధిక వ్యవస్ధలో ద్రవ్యోల్బణం 9.73 శాతం గా ఉంది. కనీసం సంవత్సరం నుండి భారత ద్రవ్యోల్బణం తొమ్మిది శాతం కంటే కిందికి దిగి రాలేదు. మరి ద్రవ్యోల్బణం తగ్గించకుండా ప్రణబ్ ముఖర్జీని ఎవరు ఆపారో తెలియడం లేదు. భారత దేశ ఆర్ధిక వ్యవస్ధను నడిపిస్తున్న ఆర్ధిక పండితులలో…

ద్రవ్య సంక్షోభానికి చేరువలో ఇండియా

భారత దేశం ద్రవ్య సంక్షోభానికి చేరువలో ఉన్న విషయాన్ని ఆర్ధిక పరిశీలకులు పెద్దగా గమనిస్తున్నట్లు లేదు. రూపాయి విలువ పతనం రూపంలో భారత దేశం ద్రవ్య సంక్షోభం వ్యక్తమవుతున్నది. పైకి రూపాయి విలువ పతనమే ద్రవ్య సంక్షోభానికి కారణంగా కనిపిస్తున్నప్పటికీ భారత దేశ ప్రభుత్వాలు అనుసరిస్తున్న నూతన ఆర్ధిక విధానాలే ఇండియాను ద్రవ్య సంక్షోభం వైపుకి నెడుతున్న విషయాన్ని గుర్తించవలసి ఉంది. 1991 లో రూపాయి విలువను రెండు రోజుల వ్యవధిలో రెండు సార్లు తగ్గించిన తర్వాత…

రూపాయి పతనం కాకుండా ఆర్.బి.ఐ చర్యలు తీసుకుంటుంది -ఆర్.బి.ఐ

ప్రభుత్వం, ఆర్.బి.ఐ లు రూపాయి పతనం పట్ల తమ నిర్ణయాన్ని మార్చుకున్నట్లు కనిపిస్తోంది. రూపాయి మరింత పతనం కాకుండా అడ్డుకోవడానికి ఆర్.బి.ఐ చేయవలసిందేదీ లేదనీ, ఆ అవసరం లేదని ఆర్.బి.ఐ ఇన్నాళ్లూ చెబుతో వచ్చింది. ఆర్ధిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ కూడా ఆర్.బి.ఐ జోక్యం వల్ల రూపాయి పతనం ఆగిపోయే అవకాశాలు లేవని చెబుతూ వచ్చాడు. శనివారం ఆర్.బి.ఐ స్వరం మారింది. రూపాయి విలువ ను స్ధిరంగా ఉంచడానికి అందుబాటులో ఉన్న అన్ని చర్యలు తీసుకుంటుందని డిప్యుటీ…

విదేశీ సూపర్ మార్కెట్లపై ప్రభుత్వం దేశాన్ని ఫూల్ చేస్తోంది. -అద్వాని

విదేశీ సూపర్ మార్కెట్ల వల్ల కలగనున్న లాభాలపై ప్రభుత్వం దేశాన్ని ఫూల్ చేస్తోందని ప్రతిపక్ష బి.జె.పి అగ్ర నాయకుదు ఎల్.కె.అద్వానీ శనివారం ఆరోపించాడు. “వాల్-మార్ట్ పశ్చిమ దేశాలకు మంచిది కావచ్చు. కాని వాల్-మార్ట్ మనకు సేవ చేసే సంస్ధ కాదు” అని అద్వాని పేర్కొన్నాడు. “మనం వాల్-మార్ట్ పట్ల అసూయ చెందకూడదు” అని న్యూఢిల్లీలో జరిగిన ఓ సభలో ప్రసంగిస్తూ అద్వానీ చెప్పాడు. తద్వారా పశ్చిమ దేశాల ఆర్ధిక వ్యవస్ధలను అతిగా అనుకరించడంపైన హెచ్చరించాడు. నిజానికి బి.జె.పి…