జపాన్ అణువిద్యుత్ కేంద్రంలో పేలుడు, అణు ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం

అప్ డేట్: ఫుకుషిమా అణువిద్యుత్ ప్లాంటు చుట్టూ 10 కి.మీ లోపు ఖాళీ చేయించిన జపాన్ ప్రభుత్వం ఇప్పుడు ఆ పరిధిని 20 కి.మీ కు పెంచినట్లుగా ప్రభుత్వ ఛీఫ్ కేబినెట్ సెక్రటరీ చెప్పాడు. 6:24  pm ఇండియా టైమ్. మానవ చరిత్రలో మొదటి సారి, ఇప్పటి వరకు చివరిసారి కూడా అణు  బాంబు ఫలితాన్ని చవిచూసిన జపాన్, శుక్రవారం సంభవించిన అతిపెద్ద భూకంపం ధాటికి మరో అణు ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నది. జపాన్ రాజధాని టోక్యో నగరానికి…

జపాన్ ను వణికించిన భారీ భూకంపం, ముంచెత్తిన సునామీ

[అప్ డేట్: జపాన్ సునామీలో మరణించిన వారి సంఖ్య: 300 దాటింది] జపాన్ దేశంలోని ఈశాన్య ప్రాంతానికి సమీపంలో సమద్ర గర్బాన భారీ భూకంపం సంభవించింది. సముద్ర గర్బాన భూకంపం సంభవించడం వలన అది భారీ సునామీగా పరిణమించి జపాన్ తీరప్రాంతాన్ని ముంచెత్తింది. రిక్టర్ స్కేల్ పై 8.9 గా నమోదైన ఈ భూకంపం, జపాన్ లో 140 సంవత్సరాల క్రితం భూకంపం రికార్డులు నమోదు చేయడం ప్రారంభించినప్పటి నుండి అత్యంత భారీ భూకంపంగా జపాన్ తెలిపింది.…

గ్రీసు రేటింగ్ ను తగ్గించిన మూడీస్, కొనసాగుతున్న యూరప్ అప్పు సంక్షోభం

మూడీస్ రేటింగ్ సంస్ధ గ్రీకు సావరిన్ అప్పు రేటింగ్ ను మరోసారి తగ్గించింది. ఇప్పటివరకూ Ba1 రేటింగ్ ఉండగా దానిని B1కు తగ్గించింది. ట్రెజరీ బాండ్లు జారీ చేయడం ద్వారా దేశాల ప్రభుత్వాలు చేసే అప్పును సావరిన్ అప్పు అంటారు. సావరిన్ బాండ్లను ప్రభుత్వాలు వేలం వేస్తాయి. బాండ్లు జారీచేసే దేశాల ఆర్ధిక వ్యవస్ధలపై బాండ్ల కొనుగోలుదారులకు (మదుపుదారులు) ఉన్న నమ్మకాన్ని బట్టి బాండ్లపై ప్రభుత్వాలు చెల్లించే వడ్డీ రేటు నిర్ణయమవుతుంది. ప్రభుత్వాలు బాండ్ల విలువ మొత్తాన్ని…

ఇండియా ప్రధానికి బ్రిటన్ ప్రధాని వాణిజ్య పాఠాలు

  బ్రిటన్ ప్రధాన మంత్రి డేవిడ్ కామెరూన్ భారత దేశ ప్రధాన మంత్రికి విదేశీ వాణిజ్యం, దానికి సంబంధించిన విధాన నిర్ణయాలపై పాఠాలు నేర్పటానికి పూనుకున్నాడు. ఇద్దరి మధ్య వేలకొద్దీ కిలోమీటర్ల దూరం ఉండడంతో కరెస్పాండెన్స్ కోర్సును కామెరూన్ పాఠాలు చెప్పడానికి ఎన్నుకున్నాడు. బ్రిటన్, ఇండియా లకు చెందిన కంపెనీల మధ్య ఇండియాలో ఉన్న “కైర్న్ ఇండియా” కంపెనీ అమ్మటానికి ఒప్పందం కుదిరింది. ఈ కంపెనీలో భారత ప్రభుత్వ రంగ సంస్ధకు వాటాలుండడంతో ఇక్కడి ప్రభుత్వ అనుమతి…

బడ్జెట్ 2011-12 -సామాన్యుడికి మొండిచేయి, మార్కెట్ కి అభయ హస్తం

  భారత ప్రభుత్వ ఆర్ధిక నడక, మార్కెట్ ఎకానమీ వైపుకు వడివడిగా సాగిపోతోంది. బహుళజాతి సంస్ధల నుండి మధ్య తరగతి ఉద్యోగి వరకు ఎదురు చూసిన “బడ్జెట్ 2011-12” ఆర్ధిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ ఫిబ్రవరి 28, 2011 తేదీన పార్లమెంటులో ఆవిష్కరించారు. ఎప్పటిలానే యూనియన్ బడ్జెట్ సామాన్యుడిని పట్టించుకుంటున్నట్లు నటిస్తూ, మార్కెట్ లో ప్రధాన పాత్రధారులైన స్వదేశీ ప్రైవేటు పెట్టుబడిదారుల నుండి విదేశీ బహుళజాతి సంస్ధల వరకు భారత దేశ కార్మికులూ, రైతులూ, ఉద్యోగుల రెక్కల…

రైల్వేల ప్రైవేటీకరణకు పచ్చ జెండా ఊపిన మమత రైల్వే బడ్జెట్

పాపులిస్ట్ నినాదాల మాటున మమత రైల్వే బడ్జెట్, రైల్వేల రంగంలో ప్రైవేటీకరణకు పచ్చ జెండా ఊపింది. ప్రైవేటీకరణ గాయత్రీ మంత్రంగా మారిన ఈ రోజుల్లో పాపులర్ బడ్జెట్లు విమర్శలు ఎదుర్కొంటున్నట్లే మమత గారి కొత్త రైల్వే బడ్జెట్ కూడా జాతీయ, అంతర్జాతీయ మార్కెట్ పండితులనుండి విమర్శలను ఎదుర్కొంటోంది. మమత మాత్రం “మానవీయ ముఖం (తొడుగు లేదా మాస్క్ అంటే సరిగ్గా సరిపోతుంది) తో ఆర్ధిక వ్యవస్ధ మెరుగుదలకు దోహదం చేసే బడ్జెట్ నాది,” అని అభివర్ణించింది. వచ్చే…

తగ్గిపోతున్న విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు – ప్రజల్ని పట్టించుకోని ప్రభుత్వ ఆర్ధిక సర్వే

  2011-12 ఆర్ధిక సంవత్సరానికి నూతన బడ్జెట్ రూపొందించడంలో భాగంగా భారత ప్రభుత్వం శుక్ర వారం ఆర్ధిక సర్వే వివరాలను వెల్లడించింది. కొత్త బడ్జెట్ ప్రకటించటానికి రెండు మూడు రోజుల ముందు ఆర్ధిక సర్వే ఫలితాలను ప్రకటిస్తారు. ఈ సర్వేలు సాధారణంగా పారిశ్రామిక ఉత్పత్తి, విదేశీ పెట్టుబడుల ప్రవాహం, జి.డి.పి పెరుగుదల, కరెంట్ ఎకౌంట్, ఎగుమతులు దిగుమతులు, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ (చెల్లింపుల సమతూకం) మొదలైన వాటి ప్రస్తుత పరిస్ధితి వాటి మెరుగుదలకు తీసుకోవలసిన చర్యల పట్ల…

రానున్నది జన రంజక బడ్జెట్టేనట!

  మరో నాలుగు రోజుల్లో ఫిబ్రవరి 28 తేదీన 2011-12 ఆర్ధిక సంవత్సరం నిమిత్తం ఆర్ధిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ ప్రవేశ పెట్టనున్న బడ్జెట్ జన రంజకంగా ఉండనున్నదని విశ్లేషకులు, వార్తా సంస్ధలు, ఉత్సాహ పరులు అంచనా వేస్తున్నారు. ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ కూడా ఆ మేరకు సూచనలు ఇస్తున్నాడని గురువారం నాటి ఆయన ప్రకటన ద్వారా అంచనా వేస్తున్నారు. జన రంజక బడ్జెట్ వలన కొత్త ఆర్ధిక సంవత్సరాంతానికి కోశాగార లోటు ప్రకటిత లక్ష్యం…

గరిష్ట స్ధాయికి ఆయిల్ ధరలు, షేర్ మార్కెట్ కు భారీ నష్టాలు

  ఇండియా షేర్ మార్కెట్లు గురువారం భారీ స్ధాయిలో నష్ట పోయాయి. అసలే అధిక ద్రవ్యోల్బణం, వరుసగా చుట్టుముడుతున్న అవినీతి ఆరోపణల కారణంగా కొత్త సంవత్సరం ప్రారంభం నుండీ ఒడిదుడుకులకు లోనవుతున్న భారత షేర్లు లిబియా ఆందోళనలు ఆశనిపాతంగా పరిణమించాయి. పదహారు నెలల గరిష్ట స్ధాయిలో నష్టాలను నమోదు చేశాయి. బోంబే స్టాక్ ఎక్ఛేంజ్ 546 పాయింట్లు (3 శాతం) నష్టపోయి 17,632 పాయింట్ల వద్ద క్లోజ్ కాగా నేషనల్ స్టాక్ ఎక్ఛేంజ్ 175 పాయింట్లు (3.2…

ధాన్యం ఎగుమతికి వ్యవస్యాయ మంత్రి శరద్ పవార్ అత్యుత్సాహం

  రెండున్నర సంవత్సరాల నుండి ధాన్యం ధరలు చుక్కల్లో కొనసాగుతుండటం వలన ఆహార ద్వవ్యోల్బణం, దానివల్ల ప్రదాన ద్రవ్యోల్బణం అధికంగా ఉన్నప్పటికీ, దాన్ని తగ్గించే విషయం ఏ మాత్రం పట్టించుకోని కేంద్ర వ్యవసాయ శాఖా మంత్రి శరద్ పవార్, ఇప్పుడు దేశంలోని ధాన్యాన్ని ఎగుమతి చేయటానికి మాత్రం తెగ ఉత్సాహపడి పోతున్నాడు. అంతర్జాతీయంగా బియ్యం, గోధుమల ధరలు పెరగడంతో, పెరిగిన ధరల్ని సొమ్ము చేసుకోవటానికి ఇదే మంచి సమయమని ఆయన బుధవారం ప్రకటించాడు. ఇప్పుడు ఎగుమతి చేస్తే…

రెండో రోజూ కొనసాగిన ఇండియా షేర్ల పతనం, ఆశలన్నీ బడ్జెట్ పైనే

సోమవారం లాభాల్లో ముగిసిన ఇండియా షేర్ మార్కెట్లు మంగళ, బుధ వారాల్లో మళ్ళీ నష్టాల బాట పట్టాయి. ఇటీవలి వరకూ ఈజిప్టు ఆందోళనలు ప్రపంచ షేర్ మార్కెట్లపై ప్రభావం చూపగా ప్రస్తుతం లిబియా పరిణామాలు ప్రభావం చూపుతున్నాయి. ప్రజాందోళనలు ఆయిల్ ఉత్పత్తి చేసే ఇతర దేశాలకు సైతం విస్తరించవచ్చనే భయం నెలకొనడంతో ఆయిల్ ధరలు చుక్కల్ని తాకుతున్నాయి. దానితో ద్రవ్యోల్బణం మరింత పెరిగే అవకాశాలు ఉండడంతో బ్యాంకుల షేర్లు మార్కెట్ పతనానికి దోహదం చేశాయి. 30 షేర్ల…

కొత్త ఆర్ధిక సంవత్సరంలో ఇండియా అప్పు రూ. 4.5 ట్రిలియన్లు -రాయిటర్స్ సర్వే

రానున్న ఆర్ధిక సంవత్సరంలో (2011-12) 4.5 ట్రిలియన్ల రూపాయల (4.5 లక్షల కోట్ల రూపాయలు) అప్పును ఇండియా సేకరించే అవకాశం ఉందని రాయిటర్స్ వార్తా సంస్ధ సర్వేలో తేలింది. ఇది 99.3 బిలియన్ల డాలర్లకు (99,300 కోట్ల రూపాయలు) సమానం. ప్రభుత్వాలు “సావరిన్ డెట్ బాండ్లు” జారీ చేయటం ద్వారా అప్పును సేకరిస్తాయి. వివిధ ఫైనాన్షియల్ (ద్రవ్య) కంపెనీలు, ఆర్ధిక రేటింగ్ కంపెనీలు, విశ్లేషణా సంస్ధలు, అర్ధిక మేధావులు మొదలైన వారిని వార్తా సంస్ధలు సర్వే చేసి…

కలైజ్గ్నర్ టీ.వి ఛానల్ కార్యాలయంపై సి.బి.ఐ దాడి, షేర్ మార్కెట్ పతనం

  తమిళనాడులో అధికార పార్టీగా ఉన్న డి.ఎం.కె పార్టీ అధినేత కరుణానిది కుటుంబానికి చెందిన కలైజ్గ్నర్ టీ.వి చానల్ కార్యాలయాలపై శుక్రవారం సి.బి.ఐ దాడులు నిర్వహించింది. 2-జి స్పెక్ట్రం స్కాముకు సంబంధించి లైసెన్సు పొందిన టెలి కంపెనీల్లో ఒకటైన స్వాన్ టెలికం సంస్ధ లైసెన్సు పొందటం కోసం టి.వి ఛానెల్ కు 47 మిలియన్ డాలర్లు (దాదాపు 214 కోట్ల రూపాయలు) ముడుపులుగా చెల్లించినట్లుగా ఆరోపణలు రావడంతో ఈ దాడులు నిర్వహించినట్లు తెలుస్తోంది. సి.బి.ఐ దాడులు జరిగిన…

ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడం కోసం రిజర్వ్ రేట్లను మళ్ళీ పెంచిన చైనా

ప్రపంచంలో రెండో పెద్ద ఆర్ధిక వ్యవస్ధను కలిగి ఉన్న చైనా ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడం కోసం ఆర్.ఆర్.ఆర్ ను మళ్ళీ 50 బేసిస్ పాయింట్ల మేరకు (0.5 శాతం) పెంచింది. బ్యాంకు ఖాతాదారుల సొమ్ము భద్రత కోసం  బ్యాంకులు సేకరించే డిపాజిట్లలో కొంత శాతాన్ని సెంట్రల్  బ్యాంకు వద్ద రిజర్వ్ డబ్బుగా ఉంచాలి. అలా రిజర్వు డబ్బుగా డిపాజిట్లలో ఎంత శాతం ఉంచుతారో దాన్ని చైనాలో ఆర్.ఆర్.ఆర్ (రిజర్వ్ రిక్వైర్మెంట్  రేషియో) అనీ, ఇండియాలో సి.ఆర్.ఆర్ (కేష్ రిజర్వ్…

ఇండియా జపాన్ ల మధ్య కుదిరిన స్వేఛ్చా వాణిజ్య ఒప్పందం

ఇండియా, జపాన్ లు టోక్యోలో స్వేఛ్చా వాణిజ్య ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఇండియా ప్రతినిధిగా వాణిజ్య మంత్రి ఆనంద శర్మ, జపాన్ ప్రతినిధిగా విదేశాంగ మంత్రి సీజీ మాయెహారా ఒప్పందం పై సంతకాలు చేశారు. రానున్న దశాబ్ద కాలంలో రెండు దేశాల మధ్య వాణిజ్యం జరిగే సరుకుల్లో 94 శాతం పైన పన్నులు ఈ ఒప్పందం ప్రకారం రద్దవుతాయి. టెక్స్ టైల్స్, మందులు, ఆటో లాంటి రంగాలతో పాటు సర్వీసు రంగాలు కూడా ఈ ఒప్పందం పరిధి…