ఎ.రాజా 2జి స్పెక్ట్రం కేటాయింపులు చిదంబరం, మన్మోహన్‌లు తెలిసీ అమోదించారు

2జి స్పెక్ట్రం లైసెన్సులను అతి తక్కువ ధరలకు కేటాయించిన విషయం అప్పటి ఆర్ధిక మంత్రి, ప్రధాని మన్మోహన్ లకు తెలిసే జరిగిందని ఫస్ట్ పోస్ట్ వెల్లడించిన డాక్యుమెంట్ల ద్వారా తెలుస్తోంది. ఆర్.టి.ఐ చట్టం ద్వారా ఫస్ట్ పోస్ట్ వెబ్ మ్యాగజైన్ ప్రధాన మంత్రికి 2జి కేటాయింపులపై చిదంబరం రాసిన నోట్‌ను సంపాదించింది. 122 2జి స్పెక్ట్రం లైసెన్సులను వివాదాస్పద రీతిలో అప్పటి టెలికం మంత్రి ఎ.రాజా కేటాయించిన ఐదురోజుల తర్వాత చిదంబరం ఒక నోట్ ను ప్రధానికి…

మా మూడు డిమాండ్లు ఒప్పుకుంటే దీక్ష విరమిస్తా -ప్రధానికి అన్నా లేఖ

శుక్రవారం అన్నా హజారే ప్రధానికి మరొక లేఖ రాశాడు. తమ మూడు కీలక డిమాండ్లను అంగీకరిస్తే దీక్ష విరమిస్తానని ప్రకటించాడు. సివిల్ సర్వెంట్లు అంతా లోక్ పాల్ చట్టం పరిధిలోకి తేవాలి; అన్ని ప్రభుత్వ కార్యాలయాలలోనూ ‘సిటిజన్ చార్టర్’ ను ప్రదర్శించాలి; అన్ని రాష్ట్రాలూ లోకాయుక్త ను నియమించుకోవాలి. ఈ మూడు డిమాండ్ల తీర్మానాన్ని పార్లమెంటు ఆమోదించాలని అన్నా కోరాడు. డిమాండ్లు అంగీకరించడంతో సరిపెట్టకుండా ఆ మేరకు చట్టాన్ని ఆమోదిస్తేనే దీక్ష విరమిస్తానని అన్నా తెలిపాడు. “ఈ…

అన్నా దీక్ష చేసుకోదలిస్తే చేసుకోనివ్వండి, అది మా సమస్య కాదు -ప్రణబ్, ఖుర్షీద్

ఓ వైపు ప్రధాని మన్మోహన్ అన్నా హజారే ఆరోగ్యం పట్ల ప్రభుత్వం తీవ్రంగా కలవరపడుతున్నదని చెబుతుండగా మరో వైపు ప్రధాని సహచరులు అన్నా దీక్ష తమ సమస్య కాదు పొమ్మంటున్నారు. బుధవారం మధ్యాహ్నం వరకూ ఒప్పందం కుదురుతుందన్న వార్తాలు షికార్లు చేయగా సాయంత్రం జరిగిన సమావేశంలో చర్చలు వాడిగా జరిగినట్లుగా పౌరసమాజ కార్యకర్తలు చెబుతున్నదాన్ని బట్టి అర్ధం అవుతోంది. ప్రభుత్వానికీ అన్నా బృందానికి మధ్య జరుగుతున్న చర్చలు మళ్ళీ మొదటికే వచ్చిన పరిస్ధితి కనపడుతోంది. మంత్రులు ప్రణబ్…

జన్ (రాజీవ్) లోక్ పాల్ బిల్లు -కార్టూన్

‘శంఖంలో పోస్తే కాని తీర్ధం కాద’ని సామెత! అది తెలుసుకున్నాడు కనకనే దివంగత వై.ఎస్.రాజశేఖర రెడ్డి ప్రతి పధకానికి ముందు రాజీవ్ అనో, ఇందిరా అనో తగిలించాడు. సోనియా, రాహుల్ లవరకూ అది సాగేదేమో, ఇంతలో ఆయన పరమపదించారు. ఆయన పుత్రుడికి నడమంత్రపు సిరితో కన్నూ మిన్నూ కానక భజన మానుకున్నాడు. ఫలితం చూస్తూనే ఉన్నాం. అవినీతి భరతం పట్టడానికి జన్ లోక్ పాల్ బిల్లుని తయారు చేసి ప్రభుత్వం ముందు పెట్టాడు, అన్నా హజారే. అది…

ప్రజలూ అవినీతిపరులేనట! -కార్టూన్

అవినీతిని రూపుమాపాలని ప్రజలు కోరుతుంటే అతితెలివిపరులు లంచం ఇవ్వడం మానేస్తే అవినీతి అదే తగ్గుతుందని బుద్ధుడి లెవల్లో బోధిస్తారు. తెలుగు ఛానెళ్లలో ఒక ప్రకటన వస్తోంది. “అవినీతి నిర్మూలన మననుండే ప్రారంభిద్దాం” అని. అందులో లంచం ఇస్తుండబట్టే, తీసుకునే వాళ్ళున్నారని చూపిస్తున్నారు. ఆర్.టి.ఒ ఆఫీసుకి గానీ, రిజిస్ట్రార్ ఆఫీసుకి గానీ లేదా ట్రెజరీ ఆఫీసుకి గానీ పనికి వెళ్ళి నేను లంచం ఇవ్వను అంటే పనవుతుందా? నానుండే అవినీతి నిర్మూలన ప్రారంభించాలి అని శపధం చేసి లంచం…

చైనా నెటిజన్లలో ఆసక్తి రేపుతున్న హజారే అవినీతి వ్యతిరేక ఉద్యమం

గత వారం రోజులుగా భారత దేశంలో పతాక శీర్షికలను ఆక్రమించిన అన్నా హజారే నేతృత్వంలోని అవినీతి వ్యతిరేక ఉద్యమం చైనా నెటిజన్లలో ఆసక్తిని రేపుతోంది. ఈ సందర్భంగా చైనా దేశీయులు రెండు దేశాల మధ్య అవినీతిలో పోలికలు తేడాల గురించి చర్చించుకుంటున్నారు. గత సంవత్సరానికి చైనాలో 46 కోట్ల మంది ఇంటర్నెట్ వినియోగదారులు ఉన్న నేపధ్యంలో ఇంటర్నెట్ వినియోగంపై చైనా ప్రభుత్వం సెన్సారింగ్ విధిస్తుంది. చైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎటువంటి వార్తలు చైనా ప్రజలకు అందుబాటులో లేకుండా…

తమ ఆరు షరతులను ఉపసంహరించుకున్న పోలీసులు, రాంలీలా మైదాన్లో దీక్ష

అన్నా హజారే నిరవధిక నిరాహార దీక్షకు ఢిల్లీ పోలీసులు మంగళవారం 22 షరతులు విధించారు. అందులో 16 షరతులను అంగీకరించిన అన్నా హజారే బృందం మిగిలిన 6 షరతులను తిరస్కరించింది. ఆ షరతులను ఇక్కడ చూడవచ్చు. షరతులను ఆమోదించనందున అన్నా బృందాన్ని అరెస్టు చేసిన పోలీసులు వారిని కోర్టుకు హాజరు పరచడంతో తీహారు జైలులో వారం రోజుల రిమాండ్ కు కోర్టు తరలించింది. అక్కడి నుండి ఢిల్లీ పోలీసులకు, కేంద్ర ప్రభుత్వానికి కష్టాలు మొదలయ్యాయి. తీహార్ జైలుకి…

నాయకులు, ఉద్యోగులు, పోలీసులు… వీరే ప్రజల దృష్టిలో అత్యంత అవినీతిపరులు -సర్వే

ప్రజలు రాజకీయ నాయకుల వద్ద డబ్బులు తీసుకునో, మద్యం తాగో వారికి ఓట్లు గెలిపించినా ఎవరు అవినీతిపరులన్న విషయంలో వారు స్పష్టంగానే ఉన్నారని సి.ఎన్.ఎన్-ఐ.బి.ఎన్ సంస్ధ నిర్వహించిన “స్టేట్ ఆఫ్ ది నేషన్” సర్వేలో వెల్లడయ్యింది. భారత దేశ వ్యాపితంగా 1300 లొకాలిటీలలో జరిగిన ఈ సర్వే ప్రకారం ఎన్నికల్లో నెగ్గిన ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులు సమాజంలో అత్యంత అవినీతిపరులుగా ప్రజలు భావిస్తున్నారు. సర్వేలో పాల్గొన్నవారిలో 43 శాతం మంది రాజకీయ నాయకులు అత్యంత అవినీతిపరులుగా…

ముగ్గురు భారతీయుల్లో ఇద్దరు లోక్ పాల్ గురించి అసలు విననే లేదు -సర్వే

అన్నా హజారే, ఆయన నాయకత్వంలోని పౌర సమాజ కార్యకర్తల బృందం సాగించిన ప్రచారం, కార్యకలాపాలు గత మూడున్నర నెలలనుండి లోక్ పాల్ వ్యవస్ధ గురించిన వార్తలను భారతీయ మీడియా తప్పనిసరిగా ప్రచురించేలా చేశాయి. లోక్‌‌పాల్ అనే వ్యవస్ధ భారత ప్రభుత్వంలోని అత్యున్నత స్ధాయిలో సాతుతున్న అవినీతిని అడ్డుకోవడానికి ఉద్దేశించిందని, అవినీతిపై వాళ్ళ ఆందోళన పతాక శీర్షికలకు ఎక్కేవరకూ చాలా మంది అక్షరాస్యులకు కూడా తెలియదంటే అతిశయోక్తి కాదేమో. ఐతే మొత్తం మీద చూస్తే భారతీయుల్లో నూటికి అరవై…

సొంత ‘లోక్‌పాల్ డ్రాఫ్టు’ ను ఆమోదించిన కేంద్ర కేబినెట్, తిరస్కరించిన అన్నా హజారే బృందం

కేంద్ర ప్రభుత్వంలోని మంత్రులు తయారు చేసిన లోక్ పాల్ డ్రాఫ్టును కేంద్ర ప్రభుత్వ కేబినెట్ గురువారం ఆమోదించింది. అన్నా హజారే నేతృత్వంలో పౌర సమాజ నాయకులు ఉద్యమం చేపట్టిన తర్వాత వారి డిమాండ్ మేరకు లోక్ పాల్ చట్టాని తెస్తామని హామీ ఇచ్చి ఆందోళన విరమింపజేసిన కేంద్ర ప్రభుత్వం మూడు నెలల అనంతరం లోక్ పాల్ చట్టం తెచ్చే వైపుగా మొదటి అడుగు వేసింది. అన్నా హజారే బృందం తయారు చేసిన జన్‌లోక్ పాల్ బిల్లులో సూచించిన…

ప్రభుత్వ లోక్‌పాల్ డ్రాఫ్టు దేశ ప్రజల పైకి విసిరిన ఓ పెద్ద జోక్ -ప్రధానికి లేఖలో హజారే

ప్రభుత్వ లోక్ పాల్ డ్రాఫ్టు చాలా బలహీనమైనదనీ, తప్పించుకోవడానికి అవసరమైన అనేక రంధ్రాలు కలిగి ఉన్నదనీ కనుక తాము రూపొందించిన జన్ లోక్‌పాల్ డ్రాఫ్టును పార్లమెంటులో ప్రవేశ పెట్టాలని సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే ప్రధానికి రాసిన లేఖలో పేర్కొన్నాడు. ప్రభుత్వం రూపిందించిన లోక్ పాల్ డ్రాఫ్టు భారత దేశ ప్రజల మీదికి విసిరిన ఒక పెద్ద జోక్ అని ఆయన అభివర్ణించారు. ప్రధానికి రాసిన లేఖలో అన్నా హజారే, ఆమరణ దీక్షకు దిగుతానన్న తన నిర్ణయాన్ని…

ఎం.పిలకు శుభవార్త: ఎం.పి లాడ్స్ నిధుల వినియోగంపై నిబంధనలు సడలించిన ప్రభుత్వం

భారత పార్లమెంటు సభ్యులకు ఓ శుభవార్త. తమ తమ నియోజకవర్గ ప్రాంతంలో అభివృద్ధి పనుల నిమిత్తం ఎం.పిలకు కేటాయించే నిధుల వినియోగంపై ప్రభుత్వం విధించిన నియమ నిబంధనలను సడలిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఎం.పి. లాడ్స్ గా పిలిచే ఈ నిధులను ఖర్చు చేయడంలో ఇప్పటివరకు ఒకింత కఠినమైన నిబంధనలు ఉన్నాయి. దానితో చాలా మంది ఎం.పిలు వారికి కేటాయించిన నిధులను ప్రజలకోసం ఖర్చు చేయడానికి పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఆ నిధులన్ని గణనీయ మొత్తంలొ…

“రాజ్ ఘాట్” వద్ద ఒక రోజు నిరాహార దీక్షలో అన్నా హజారే

చెప్పినట్లుగానే అన్నా హజారే ఒక రోజు నిరాహార దీక్ష ప్రారంభమయ్యింది. వేలమంది అనుచరులు, ఆసక్తిపరులు, స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన మద్దతుదారులతోహజారే తన ఒక రోజు నిరసన దీక్షను ప్రారంభించారు. అవినీతికి వ్యతిరేకంగాశాంతియుత దీక్షకు దిగిన బాబా రాందేవ్ శిబిరంపై అర్ధరాత్రి పోలీసుల చేత దాడిచేయించి, లాఠీ చార్జీ, టియర్ గ్యాస్ ప్రయోగం జరిపించడానికి వ్యతిరేకంగాహజారే బుధవారం దీక్షను తలపెట్టారు. మొదట తన దీక్ష జంతర్ మంతర్ వద్దజరుగుతుందని అన్నా చెప్పినప్పటికీ ప్రభుత్వం అందుకు అనుమతి నిరాకరించడంతోతన శిబిరాన్ని…

పౌరసమాజ నాయకులను ఐక్యం చేసిన రామ్‌దేవ్ అరెస్టు, లాఠీ ఛార్జీ

ఆదివారం వేకువ ఝామున బాబా రాందేవ్ ఆమరణ నిరాహార దీక్షా శిబిరంపై పోలీసులు దాడి చేయడమే కాకుండా, టియర్ గ్యాసు ప్రయోగించి, లాఠీ ఛార్జీ కూడా చేయడంతో అప్పటివరకు వివిధ కారణాలతో ఎడమొగం పెడమొగం గా ఉన్న పౌర సమాజ నాయకులుగా మన్ననలు అందుకుంటున్నవారిని ఏకం చేసింది. రాం దేవ్ దీక్షా శిబిరాన్ని ధ్వంసం చేసి ముప్ఫై మందిక పైగా కార్యకర్తలను గాయపరచడాన్ని అన్నా హజారే, అరుణా రాయ్, కేజ్రివాల్ తదితరులు తీవ్రంగా ఖండించారు. కనీసం నిరసన…

దయానిధి మారన్ హీరోగా మరో కొత్త టెలికమ్ కుంభకోణం

కరుణానిధి బంధువు, కేంద్ర మాజీ టెలికం మంత్రి దయానిధి మారన్ ప్రధాన పాత్రధారుడుగా మరో సరికొత్త టెలికం కుంభకోణం వెల్లడయ్యింది. తెహెల్కా పత్రిక ద్వారా వెల్లడయిన ఈ కుంభకోణం విలువ 700 కోట్ల రూపాయలు. తాను కేంద్రంలో టెలికం శాఖ మంత్రిగా ఉండగా తమిళనాడులోని ఎయిర్ సెల్ అనే కంపెనీకి టెలికం లైసెన్సులు రాకుండా సంవత్సరాల తరబడి దయానిధి మారన్ అడ్డుకున్నాడని తెహెల్కా పత్రిక బైట పెట్టింది. తన మిత్రుడికి చెందిన మలేషియా కంపెనీ మాక్సిస్‌కి ఎయిర్…