లిబియా – ఓవైపు అంతర్యుద్ధం, మరోవైపు పశ్చిమ దేశాల దాడులు

లిబియాపై పశ్చిమ దేశాలు అధునాతన యుద్ధ విమానాలతో క్షిపణి దాడులు జరుపుతుండగా, మరోవైపు గడ్డాఫీ బలగాలు, తిరుగుబాటు బలగాల మధ్య ఘర్షణలు కొనసాగుతూనే ఉన్నాయి. పశ్చిమ దేశాల దాడులపై అంతర్జాతీయంగా వ్యతిరేకత పెరుగుతున్నది. ఆఫ్రికన్ యూనియన్ దేశాలు పశ్చిమ దేశాల దాడులను ఖండించాయి. నో-ఫ్లై జొన్ అమలు చేయడానికి మద్దతిచ్చిన అరబ్ లీగ్ సైతం భారీ దాడులు జరపడం పట్లా, పౌరులు చనిపోవడం పట్లా అసంతృప్తి వ్యక్తం చేసింది. పశ్చిమ దేశాల ఉద్దేశాల పట్ల అనుమానాలు వ్యక్త…

యెమెన్ ఆందోళనకారులతో చేతులు కలుపుతున్న మిలట్రీ అధికారులు

యెమెన్ అధ్యక్షుడు ఆలీ అబ్దుల్లా సలే కి వ్యతిరేకంగా ఆందోళనలు తీవ్రం అయ్యేకొద్దీ మిలట్రీ అధికారులు ఒక్కరొక్కరుగా అధ్యక్షుడిని వదిలి ఆందోళనకారులతో చేరుతున్నారు. మిలట్రీ జనరల్ ఆలీ మొహసేన్ అల్-అమ్హర్ సోమవారం తన పదవికి రాజీనామా చేశాడు. “పోరాటం రాను రానూ క్లిష్ట సమస్యగా మారుతోంది. హింస, అంతర్యుద్ధం వైపుగా వెళ్తోంది. నా ఆలోచనలు, నాటోటి కమాండర్ల, సైనికుల ఆలోచనల ప్రకారం మేము యువకుల విప్లవానికి శాంతియుత మద్దతు తెలుపుతున్నాము. భద్రత, దేశ సుస్ధిరత లను కాపాడటంలో…

పశ్చిమ దేశాల దాడులకు ఊతమిచ్చిన గడ్డాఫీ చర్యలు

ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్ లకు ఇప్పుడు మరో దేశం జత కలిసింది. అమెరికాతో పాటు ఐరోపాలలోని పెత్తందారీ దేశాలు మరో బాధిత దేశాన్ని తమ ఖాతాలో చేర్చుకున్నాయి. శనివారం లిబియాపై ఫ్రాన్సు జరిపిన విమానదాడులతో ప్రారంభమైన పశ్చిమ దేశాల కండకావరం ఆదివారం అమెరికా, బ్రిటన్ ల క్షిపణి దాడులతో మరింత పదునెక్కింది. ప్రత్యక్షంగా ఇరాక్, ఆఫ్ఘనిస్తాల్ దేశాల ప్రజలు కష్టాల సుడిగుండం లోకి నెట్టడంతో పాటు పరోక్షంగా తమ దేశాల ప్రజలను కూడా ఆర్ధిక, సామాజిక సంక్షోభం లోకి…

బహ్రెయిన్ కి తమ సైనికులను పంపిన గల్ఫ్ దేశాలు

బహ్రెయిన్ రాజు హమద్ బిన్ ఇస్సా అల్-ఖలీఫా వినతి మేరకు గల్ఫ్ దేశాలు తమ సైనికులను బహ్రెయిన్ కు పంపాయి. గల్ఫ్ కో-ఆపరేషన్ కౌన్సిల్ (జి.సి.సి) సభ్య దేశాల ఒప్పందం మేరకు ఈ సైనికుల తరలింపు జరిగింది. బహ్రెయిన్ రాజు నేతృత్వంలోని ప్రభుత్వం దిగిపోవాలంటూ నెలన్నర పైగా ప్రజలు ఆందోళనలు చేస్తున్నారు. షియా గ్రూపుకి చెందిన ప్రతిపక్షాలు వారికి నాయకత్వం వహిస్తున్నాయి. రాజు చర్చలకు ఆహ్వానించినప్పటికీ వారు నిరాకరించారు. ఆదివారం, మార్చి 13 తేదీన నిరసనకారులపై పోలీసులు…

తిరుగుబాటుదారులనుండి ఆయిల్ పట్టణాన్ని స్వాధీనం చేసుకున్న గడ్డాఫీ బలగాలు

లిబియా రాజధానికి పశ్చిమంగా 48 కి.మీ దూరంలో ఉన్న జావియా పట్టణాన్ని ఈ వారం మొదట్లో తిరుగుబాటుదారుల నుండి స్వాధీనం చేసుకున్న గడ్డాఫీ బలగాలు, శనివారం నాటికి ట్రిపోలీకి తూర్పు దిశలో 600 కి.మీ దూరంలో ఉన్న ఆయిల్ పట్టణం ‘రాస్ లానుఫ్’ ను స్వాధీనం చేసుకున్నారు. రాస్ లానుఫ్ లో ఉన్న తిరుగుబాటు బలగాలను రాసులానుఫ్ పట్టణ శివార్లనుండి 20 కి.మీ తూర్పుకు నెట్టివేసినట్లుగా తిరుగుబాటుదారుల నాయకులు విలేఖరులకు తెలిపారు. గడ్డాఫీ మంత్రివర్గంలో హోం మంత్రిగా…

గడ్డాఫీ బలగాల పురోగమనం, విదేశీసాయం కోసం తిరుగుబాటుదారుల ఎదురుచూపు

గడ్డాఫీ బలగాలు ప్రతిదాడులను తీవ్రం చేస్తూ మెల్లగా పురోగమిస్తున్నాయి. రాస్ లానుఫ్ ఆయిల్ పట్టణాని స్వాధీనం చేసుకునే వైపుగా కదులుతున్నాయి. మరో ఆయిల్ పట్టణం బ్రెగా సరిహద్దుల్లో బాంబుదాడులు చేశాయి. రాస్ లానుఫ్ లో పోరు తీవ్రంగా జరుగుతోంది. వాయు, సముద్ర మార్గాల్లొ గడ్డాఫీ బలగాలు రాస్ లానుఫ్ లోని తిరుగుబాటుదారులపై దాదులు చేస్తున్నారు. గడ్డాఫీ బలగాల యుద్ధవిమానాల దాడులను తిరుగుబాటు బలగాలు ఎదుర్కొనలేక పోతున్నాయి. పశ్చిమ దేశాలు లిబియా భూభాగంపై “నిషిద్ధ గగనతలం” ప్రకటించి అమలు…

లిబియా తిరుగుబాటు ప్రభుత్వాన్ని గుర్తించిన ఫ్రాన్స్

యూరోపియన్ పార్లమెంటు లిబియాలోని తిరుగుబాటు ప్రభుత్వాన్ని గుర్తించడాన్ని ప్రోత్సహిస్తున్న నేపధ్యంలో ఫ్రాన్సు మొదటిసారిగా అందుకు అనుగుణమైన చర్యను తీసుకొంది. లిబియా తూర్పు ప్రాంతంలోని బెంఘాజీ పట్టణం కేంద్రంగా ఏర్పడిన “లిబియా జాతీయ కౌన్సిల్” ను అధికారిక స్టేట్ బాడీగా ఫ్రాన్సు గుర్తించింది. యూరోపియన్ పార్లమెంటు దేశాల ప్రభుత్వాలను కాకుండా రాజ్యాన్ని గుర్తిస్తాయి. అందువలన అది తన సభ్య దేశాలను తిరుగుబాటు ప్రభుత్వాన్ని గుర్తించాల్సిందిగా కోరింది. తిరుగుబాటుదారులు బెంఘాజీ కేంద్రంగా ఏర్పాటు చేసిన తాత్కాలిక కౌన్సిల్ తో సంబంధాలు…

గడ్డాఫీ రాజీ ప్రతిపాదన తిరస్కరణ, పోరాటం తీవ్రం

లిబియాలో అంతర్యుద్ధం తీవ్రమవుతున్నది. గడ్డాఫీ సేనలు తిరుగుబాటుదారులను వెనక్కి నెట్టడానికి ప్రయత్నిస్తుండడంతో ఇరుపక్షాల మధ్య పోరు తీవ్రత పెరిగింది. బిన్ జావాద్ పట్టణాన్ని సోమవారం గడ్డాఫీ బలగాలు వైరి పక్షం నుండి స్వాధీనం చేసుకున్నాయి. అక్కడి నుండి ఆయిల్ పట్టణం రాస్ లానుఫ్ ను వశం చేసుకోవాలని చూస్తున్నాయి. మార్గ మధ్యంలో తిరుగుబాటు బలగాలు ప్రతిఘటిస్తున్నాయి. అడపా దడపా గడ్డాఫీ బలగాలు రాస్ లానుఫ్ పై విమాన దాడులు చేస్తున్నాయి. ఇదిలా ఉండగా గడ్డాఫీనుండి తిరుగుబాటుదారులకు రాజీ…

లిబియా తిరుగుబాటుదారుల పురోగమనం, చర్చలకు ససేమిరా

  లిబియా తిరుగుబాటుదారులు పురోగమిస్తున్నారు. గడ్డాఫీ బలగాలకూ, తిరుగుబాటుదారులకూ మధ్య యుద్దం మెల్లగా ఊపందుకుంటోంది. రాజధాని ట్రిపోలిలో శుక్రవారం నాదు మధ్యాహ్న ప్రార్ధనల అనంతరం ప్రదర్శనకు తిరుగుబాటుదారులు పధక రచన చేశారు. ప్రదర్శన జరగకుండా అడ్డుకోవడానికి గడ్డాఫీ బలగాలు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. రాజధానీ ట్రిపోలీకి తూర్పున గల శివారు ప్రాంతం “టజౌరా” లో ఇరుపక్షాల మధ్య ఉద్రిక్తత పరిస్ధితులు నెలకొని ఉన్నాయి. విదేశీ విలేఖరులను వారున్న హోటల్ నుండి బైటికి రాకుండా గడ్డాఫీ బలగాలు అడ్దుకున్నాయి.…

లిబియాలో దాడులు ప్రతిదాడులు, కొనసాగుతున్న ప్రతిష్టంభన

బుధవారం ఆయిల్ పట్టణమయిన బ్రెగాపై విమాన దాడులు నిర్వహించి గడ్డాఫీ బలగాలు కొన్ని గంటల పాటు స్వాధీన పరచుకున్నప్పటికీ తిరుగుబాటుదారులు ప్రతిదాడితో మళ్ళీ పట్టణాన్ని వశపరచుకున్న సంగతి విదితమే. బ్రెగా పట్టణాన్ని తిరిగి కైవశం చేసుకున్నామన్న ఆనందంలో తిరుగుబాటుదారులు ఉండగానే గడ్డాఫీ బలగాలు గురువారం మరొకసారి బ్రెగా పట్టణంపై విమానాలనుండి బాంబులు జారవిడిచారు. ఆయిల్ కంపినీకి పౌరుల ఆవాసాలకు మధ్య బాంబులు పడినట్లుగా తిరుగుబాటుదారులు తెలిపారు. బ్రెగాపై బాంబు దాడిలో ఎవరూ గాయపడలేదని తెలిసింది. అయితే అజ్దాబియా…

తిరుగుబాటు ప్రాంతాలపై గడ్డాఫీ సైనికుల దాడి, తిప్పికొట్టామంటున్న తిరుగుబాటుదారులు

  తిరుగుబాటు మొదలయ్యాక మొట్టమొదటిసారి గడ్డాఫీ తిరుగుబాటు ప్రాంతాలపై తన సైన్యంపై దాడి చేశాడు. ఈ దాడిని తిప్పికొట్టామని తిరుగుబాటుదారులు చెబుతున్నారు. కానీ తిరుగుబాటుకు కేంద్రంగా ఉన్న బెంఘానీ పట్టణం సమీపంలోని ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నట్లు గడ్డాఫీ వర్గాలు చెబుతున్నాయి. తిరుగుబాటు వర్గాలు కూడా మొదట గడ్డాఫీ పక్షం దాడి విజయవంతం అయిందని చెప్పినప్పటికీ ఆ తర్వాత వారిని మళ్ళీ వెనక్కి తరిమినట్లు ప్రకటించారు. ఆయిల్ ఉత్పత్తిని బైటికి సరఫరా చేయటానికి ప్రధాన టెర్మినల్ గా ఉన్న…

చైనాలో ప్రదర్శనకు పిలుపు, ఉక్కుపాదం మోపిన చైనా పోలీసులు

  అరబ్ దేశాల్లో ప్రజాస్వామిక హక్కుల కోసం చెలరేగుతున్న ప్రజా ఉద్యమాలు చైనా ప్రభుత్వానికి సమస్యలను తెచ్చి పెడుతున్నాయి. ఆదివారం ట్యునీషియా తరహాలో చైనాలోని బీజింగ్, షాంగై నగరాల్లో జాస్మిన్ గేదరింగ్ జరపాలని అమెరికానుండి నిర్వహించబడుతున్న ఒక వెబ్ సైట్ చేసిన ప్రచారానికి ఎవరూ గుమిగూడకుండా చైనా పోలీసులు కట్టుదిట్టం చేశారు. విదేశీ విలేఖరులను కూడా వదల కుండా కెమెరాలను లాక్కొని ఫోటోలను తొలగించారు. ప్రదర్శన కోసం పిలుపునిచ్చిన ప్రాంతంలో ఎవరూ ఎక్కువ సేపు ఆగకుండా చీపుర్లతో…

దక్షిణ కొరియా మానసిక ప్రచారానికి ప్రతిగా ఉత్తర కొరియా మిలట్రీ చర్య హెచ్చరిక

  అరబ్ దేశాల్లో ప్రజాస్వామిక సంస్కరణల కోసం చెలరేగుతున్న తిరుగుబాట్ల గురించి సమాచారం ఉన్న కర పత్రాలను ఉత్తర కొరియాలో జారవిడవడం ఆపకపోతే దక్షిణ కొరియాపై మిలట్రీ చర్య తీసుకోవలసి ఉంటుందని ఉత్తర కొరియా హెచ్చరించింది. ఉత్తర కొరియా తన పౌరులకు బయటి ప్రపంచం నుండి ఎటువంటి సమాచారం అందకుండా గట్టి చర్యలు తీసుకొంటుంది. బయటి దేశాలకు ఫోన్ సౌకర్యాలను సైతం అనుమతించదు. దానితో ఉత్తర కొరియా ప్రజలకు ప్రపంచంలో ఏం జరుగుతున్నదీ తెలిసే అవకాశం లేదు.…

లిబియాలో కొనసాగుతున్న అంతర్యుద్ధం, ఆంక్షలు విధించిన అమెరికా

  లిబియాలో గడ్డాఫీ మద్దతుదారులకూ వ్యతిరేకులకూ మధ్య అంతర్యుద్ధం కొనసాగుతున్నది. గడ్డాఫీ వ్యతిరేకులు క్రమంగా రాజధాని ట్రిపోలిని సమీపిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ట్రిపోలీ పైనే ఇప్పుడు అటు ఆందోళనకారులూ, ఇటు గడ్డాఫీ ప్రభుత్వ బలగాలూ కేంద్రీకరించాయి. రాజధాని ఆందోళనకారుల వశం కాకూడదని ప్రభుత్వం ప్రయత్నిస్తుండగా ట్రిపోలీని పట్టుకొని గడ్డాఫీనీ అతని అనుకూలురనూ తరిమివేయాలని తిరుగుబాటుదారులు చూస్తున్నారు. గడ్డాఫీ వ్యతిరేక తిరుగుబాటుకు ఒసామా బిన్ లాడెన్ పూర్తి మద్దతు ఉందని గడ్డాఫీ ప్రకటించాడు. ముస్లిం తీవ్రవాదులుగా అమెరికా ముద్ర…

పతనం బాటలో గడ్డాఫీ ప్రభుత్వం, ప్రపంచ దేశాల మధ్య విభేదాలు?

  కల్నల్ మౌమ్మర్ గడ్డాఫీ రోజు రోజుకీ ఒంటరి అవుతున్నాడు. విదేశీ రాయబారుల్లో చాలామంది గడ్డాఫీకి ‘బై’ చెప్పేశారు. ప్రజలపై హింస ఆపమని డిమాండ్ చేస్తున్నారు. ఆందోళనకారులవి న్యాయమైన్ డిమాండ్లు, వాటిని ఒప్పుకొని దిగిపో అని సలహా ఇస్తున్నారు. గడ్డాఫీ అనుకూల సైనికులు వీధుల్లో జరిపిన కాల్పుల్లో ఇప్పటివరకూ 1,000 మంది పౌరులను చనిపోయారని ఇటలీ విదేశాంగ మంత్రి ఫ్రాట్టిని ప్రకటించాడు. వ్యాపార సంబంధాల వలన లిబియాలో ఉన్న తమ పౌరులను అక్కడినుండి ఖాళీ చేయించడానికి త్వరపడుతున్నారు.…