కొత్త ప్రభుత్వానికి పశ్చిమ దేశాల డిమాండ్లివి -2

3. ప్రయివేటీకరణ: నవరత్నాలుగా పేరు గాంచిన వివిధ ప్రభుత్వ రంగ కంపెనీల షేర్లను తెగనమ్మాలని పశ్చిమ కంపెనీలు పోరు పెడుతున్నాయి. అనగా ప్రభుత్వ్బ రంగ కంపెనీల ప్రయివేటీకరణ. ప్రైవేటీకరణకు కావలసిన తాత్విక భూమికను పాలకవర్గాలు ఇప్పటికే ఏర్పరుచుకున్నాయి. లాభాలు వచ్చే పబ్లిక్ కంపెనీలను ఎందుకు అమ్మేస్తున్నారని అడిగేవారు ఇప్పుడు లేరు. ఆ వాటాలు తెగనమ్ముతుంటే ఎగబడి కొనుక్కునే ధనికవర్గాలే ఇప్పుడు ఉన్నారు. ఇలాంటి షేర్ల మెతుకుల కోసం ఎదురు చూసే మధ్యతరగతి, ఉద్యోగ వర్గాలు కూడా ఇప్పుడు…

కొత్త ప్రభుత్వానికి పశ్చిమ దేశాల డిమాండ్లివి -1

భారత దేశంలో ఏర్పడబోయే కొత్త ప్రభుత్వం కోసం ఆత్రం ఎదురు చూస్తున్నది ఎవరు? భారత ప్రజలైతే కాదు. ఎందుకంటే వారిలాంటి ఎన్నికల్ని అనేకం చూశారు. ఎన్నికల వల్ల, ఎన్నికల తర్వాత వచ్చే కొత్త ప్రభుత్వాల వల్లా తమకు కొత్తగా ఒరిగేది ఏమీ లేదని వారికి ఎప్పుడో అర్ధమైపోయింది. కొత్త ప్రభుత్వాల వల్లా, వాటి నిర్ణయాల వల్లా ఎప్పుడూ ఎవరైతే లాభం పొందుతారో వారే ఎన్నికల ఫలితాల కోసం ఇప్పుడూ ఆత్రపడుతున్నారు. పోటీ చేసేదే రాజకీయ పార్టీలు గనక వాటికి…

కెవిపి ని అరెస్ట్ చేయండి -అమెరికా

టైటానియం మైనింగ్ కుంభకోణం విషయంలో నిందితుడుగా అమెరికా కోర్టులు పేర్కొన్న కె.వి.పి రామచంద్ర రావును వెంటనే అరెస్టు చేయాలని అమెరికా కోరింది. రాజ్య సభ సభ్యుడు అయిన కెవిపి ఆంధ్ర ప్రదేశ్ లో టైటానియం గనుల తవ్వకానికి అనుమతులు ఇప్పించినందుకు గాను అమెరికా కంపెనీ నుండి లంచం వసూలు చేశారని అమెరికా ఆరోపించింది. ఆరోపణలను కెవిపి ఖండించినప్పటికీ ఆయన మాటలను ఎవరూ నమ్మే పరిస్ధితి ఆంధ్ర ప్రదేశ్ లో అయితే లేదు. టైటానియం గనుల తవ్వకానికి అనుమతులు…

ప్రొ-రష్యా అలజడులతో అట్టుడుకుతున్న తూర్పు ఉక్రెయిన్ -ఫోటోలు

నిన్నటి వరకు పశ్చిమ దేశాల అనుకూల ఆందోళనలతో ఉక్రెయిన్ రాజధాని కీవ్ కంటికి నిద్ర లేకుండా గడిపింది. రైట్ సెక్టార్, స్వోబోడా లాంటి మితవాద, నయా నాజీ సంస్ధలు హింసాత్మక ఆందోళనలతో యనుకోవిచ్ ప్రభుత్వాన్ని కూల్చివేశాయి. అంతటితో ఉక్రెయిన్ చల్లబడలేదు. ఈసారి ఆందోళనలు తూర్పు, దక్షిణ ఉక్రెయిన్ ప్రాంతాలకు విస్తరించాయి. కానీ ఈ సారి ఆందోళనలు పశ్చిమ దేశాలకు వ్యతిరేకంగానూ, ఇ.యు, అమెరికాల మద్దతు ఉన్న ఉక్రెయిన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగానూ ఎక్కుపెట్టబడ్డాయి. కీవ్ ఆందోళనలకు పశ్చిమ దేశాలు…

మోడి గెలుపు ఆలోచనే భయం గొలుపుతోంది

“మోడి అధికారంలోకి వస్తారన్న ఆలోచనే భయం గొలుపుతోంది” అని విదేశాల్లోని భారతీయ మేధావులు ఒక సంయుక్త ప్రకటనలే పేర్కొన్నారు. బ్రిటన్ లోనే అనేక ప్రసిద్ధి చెందిన యూనివర్సీటీలకు చెందిన బోధకులు ఈ ప్రకటన జారీ చేసినవారిలో ఉన్నారు. మోడి అధికారంలోకి వస్తే ‘మోరల్ పోలీసింగ్’ తీవ్రం అవుతుందని, ముఖ్యంగా మహిళలు అనేక నిర్బంధాలకు గురవుతారని వారు అంచనా వేస్తున్నారు. హిందూత్వ గ్రూపులు రెచ్చిపోతాయని, పొరుగు దేశాలతో సంబంధాలు ఉద్రిక్తంగా మారుతాయని వారు ఊహిస్తున్నారు.  ప్రపంచ ప్రసిద్ధి చెందిన…

ఉక్రెయిన్: అమెరికాకు తా చేసింది ప్రజాస్వామ్యం

‘తా వలచింది రంభ, తా మునిగింది గంగ’ అని మూర్ఖుల ధోరణిని వర్ణిస్తుంది ఒక సామెత. మనం చెప్పుకునేది మూర్ఖుల గురించి కాదు. ‘ఉంటే నాతో ఉండు. లేదంటే శత్రువుతో ఉన్నట్లే’ అని ప్రపంచ దేశాల్ని శాసించే అమెరికా గురించి. తాను చెప్పిందే నీతి. తన మాటే శాసనంగా చెలాయించుకునే అమెరికా ఏక నీతికి తాజా తార్కాణం ఉక్రెయిన్ సంక్షోభం విషయంలో విక్టోరియా నూలంద్ వదరిన వాక్కులు! విక్టోరియా నూలంద్ అమెరికాకు అసిస్టెంట్ సెక్రటరీ ఆఫ్ స్టేట్.…

ఉక్రెయిన్ సంక్షోభం: స్వీడన్ మిలట్రీ వ్యయం పెంపు

ఉక్రెయిన్ సంక్షోభం ప్రపంచంలోని అనేక దేశాలపై ప్రభావం పడవేస్తోంది. ఉక్రెయిన్ విషయంలో రష్యాకు భారత పాలకులు మద్దతు ఇవ్వగా రష్యా అందుకు కృతజ్ఞతలు చెప్పుకుంది. రష్యాతో శక్తి వనరుల వాణిజ్యాన్ని 2018 నాటికి మూడు రెట్లు పెంచే ఒప్పందాన్ని చైనా చేసుకుంది. అమెరికా ఉపాధ్యక్షుడు ఈ రోజు (ఏప్రిల్ 22) ఉక్రెయిన్ సందర్శించి నాజీ పాలకులకు మద్దతు ప్రకటించాడు. సోవియట్ రష్యా పతనం తర్వాత తన మిలట్రీ ఖర్చును బాగా తగ్గించుకున్న స్వీడన్ ఉక్రెయిన్ సంక్షోభం కారణంగా…

ఉక్రెయిన్ సంక్షోభం: మరింత దగ్గరవుతున్న రష్యా, చైనా

ఉక్రెయిన్ సంక్షోభం పలు భౌగోళిక రాజకీయాలకే కాకుండా ఆర్ధిక పరిణామాలకు కూడా బాటలు వేస్తోంది. ఐరోపా, రష్యాల మధ్య కీలక స్ధానంలో ఉన్న ఉక్రెయిన్ ను నిస్పక్ష ప్రాంతంగా నిలిపి ఉంచడం ద్వారా నాటో దూకుడుని రష్యా పాక్షికంగానైనా నిరోధిస్తూ వచ్చింది. ఇప్పుడు ఆ ఉక్రెయిన్ నాటో చేతుల్లోకి వెళ్లిపోవడంతో తన విదేశాంగ విధానాన్ని సవరించుకోవలసిన తక్షణ అవసరం రష్యాకు ఏర్పడింది. రష్యా శక్తి వనరులకు పెద్ద వినియోగదారుగా ఉన్న ఐరోపాకు బదులు ఆ స్ధానాన్ని భర్తీ…

మోడి గాలి ఉన్నట్టా లేనట్టా? -కార్టూన్

“హుర్రే… ‘మోడి గాలి లేదు’ గాలి వీస్తోందోచ్…” – గాలి పలు విధాలు. తూర్పు గాలి, పడమటి గాలి… ఇలా వీచే దిశ, కాలాల్ని బట్టి గాలి కలిగించే ప్రభావం కూడా మారుతూ ఉంటుంది. పడమటి గాలిని మనం భరించలేం. సముద్రం మీది నుండి వచ్చే గాలి చల్లగా ఉంటుందనుకుంటాం. కానీ అది మోసుకొచ్చే ఉప్పు నీటియావిరి జిడ్డుని అంటగడుతుంది.  దానితో చల్లదనం అటుంచి దేహం చిరచిరలాడుతుంది. ఈ గాలి లాగానే ఎన్నికల గాలులు కూడా పలు…

అందాల ఆకాశ రాజ్యం లెసోతో -ఫోటోలు

మనకి అరకు, ఊటీ లాంటి ఎత్తైన ప్రాంతాలు విహార స్ధలాలు. సముద్ర మట్టానికి ఎత్తుకు పోయే కొద్దీ ఉష్ణోగ్రత పడిపోతుంది. కాబట్టి ఇక్కడ సంవత్సరం పొడవునా చల్లటి వాతావరణం జనాన్ని సేదతీరుస్తుంది. కానీ దేశం దేశమే కొండలపైన ఉంటే? ఇక ఆ దేశం అంతా అందమైన ప్రకృతి దృశ్యాలతో అలరారుతుంది. అలాంటి దేశం ఆఫ్రికా లోని లెసోతో. ప్రతి దేశానికి దిక్కులుంటాయి. అనగా ఉత్తరాన ఫలానా, దక్షిణాన ఫలానా… ఇలా. కానీ లెసోతో ఒక విధంగా దిక్కులు…

గృహిణి హత్యకు దారితీసిన ఫేస్ బుక్ స్నేహం

ఎలా అర్ధం చేసుకోవాలో, ఎవరిని తప్పు పట్టాలో తెలియని వికృత పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఫేస్ బుక్ లాంటి సామాజిక వెబ్ సైట్లు సృష్టిస్తున్న సామాజిక సంక్షోభం అంతా ఇంతా కాదు. వయసు లేదు, విలువ లేదు, పద్ధతి లేదు, ఎవల్యూషన్ అసలే లేదు. పరిచయం చూస్తేనేమో ఫేస్ బుక్ లాంటి వర్చువల్ ప్రపంచంలో. దాని వాస్తవ పరిణామాలేమో నిజ ప్రపంచం పైన! 43 సంవత్సరాల ఒక గృహిణి 22 సంవత్సరాల యువకుడితో (సోకాల్డ్) ప్రేమలో పడిపోయింది.…

జాబ్: డైరెక్టర్ ఆఫ్ ఆపరేషన్స్; జీతం: సున్న -వీడియో

ఉద్యోగం పేరు చూస్తేనేమో గొప్ప పేరు: డైరెక్టర్ ఆఫ్ ఆపరేషన్స్. జీతం ఎంత అంటే ఏమీ ఇవ్వం అంటున్నారు. పైగా 24 గంటలు పని చేయాలిట. ఇంటర్-పర్సనల్ కమ్యూనికేషన్స్ స్కిల్స్ కూడా ఉండాలిట. అలా ఎలా చేస్తారంటే అనేకమంది చేస్తున్నారని చెబుతున్నాడీ పెద్ద మనిషి. ఇంతకీ అంత నిస్వార్ధంగా అంత పెద్ద బాధ్యత నిర్వహిస్తున్నది ఎవరు? వీడియో చూసి తెలుసుకోవాల్సిందే.

అద్వానీజీ, హామీలు మరిస్తే నిషేధం వద్దా?

బి.జె.పి అగ్రనేత లాల్ కృష్ణ అద్వానీకి భారత ప్రజాస్వామ్యంపై హఠాత్తుగా బెంగ పట్టుకుంది. జనం ఓట్లు వేయకుండా ఇంట్లో కూర్చుంటున్నందుకు ఆయనకు కోపం వచ్చింది. ఓటు హక్కు ఉండి కూడా ఓటు వేయని జనం ఇక భవిష్యత్తులో ఎప్పటికీ ఓటు వేయకుండా నిషేధం విధించాలని ఆయన ఎలక్షన్ కమిషన్ ను కోరుతున్నారు. జనం కోసం జరిగే ఎన్నికల్లో జనమే ఓటు వేయకపోతే ప్రజాస్వామ్యం ఎలా బతికేను అన్నది అద్వానీ భయం! “ఓటు వేయని ప్రజలపైన అపరాధ రుసుము…

ఎఎపి: నోట్లు ఊడ్చినట్లే ఎన్నికలూ ఊడ్చాల! -కార్టూన్

“ఎన్నికలను కూడా ఇలాగే ఊడ్చేయగలిగితే బాగుడ్ను!” – ఎన్నికలలో ఖర్చు కోసం పరిశుభ్రమైన డబ్బు కావాలని అరవింద్ కేజ్రీవాల్ ఒక ట్వీట్ ద్వారా పిలుపు ఇవ్వడంతోనే రెండు రోజుల్లో 1.15 కోట్ల రూపాయలు వసూలయ్యాయట. అత్యంత పెద్ద మొత్తం తమిళనాడు నుండి అందిన రు. 1 లక్ష కాగా, అత్యంత చిన్న మొత్తం రు. 10 అని ఎఎపి నేతలు చెప్పారు. అరవింద్ ట్విట్టర్ లో చేసిన విన్నపం ఇది: “Reached Varanasi. Will go to…

చలి నీళ్ళకు పిల్లలు తట్టుకోలేరనుకున్నా -ద.కొరియా నౌక కెప్టెన్

నౌక ఖాళీ చేయమని ఆదేశాలిస్తే పిల్లలు అంత చలిలో చల్లటి నీళ్ళకు తట్టుకోలేక చనిపోతారని భావించానని దక్షిణ కొరియాలో ప్రమాదానికి గురయిన ‘సెవొల్’ కెప్టెన్ కోర్టుకు తెలిపాడు. అందుకే వారిని వెంటనే పడవ ఖాళీ చేయాలని ఆదేశాలివ్వడానికి తటపటాయించానని కెప్టెన్ లీ జూన్-సియోక్ చెప్పారు. పడవ ఖాళీ చేయాలని కోరడంలో 40 ని.లు ఆలస్యం కావడంతో ఎక్కువమంది తప్పించుకోలేక నౌకలోనే చిక్కుకుపోయారు. 32 మంది మరణాలను దక్షిణ కొరియా ప్రభుత్వం ధృవీకరించగా ఇంకా 273 మంది జాడ…