బి.జె.పి ఎం.పిల మద్దతు: ఒకరు రేప్ కి, మరొకరు హత్యకి!

భారతీయ జనతా పార్టీ తరపున పార్లమెంటులో ప్రవేశించిన లోక్ సభ సభ్యులు ఒక్కొక్కరు తమ తమ నిజస్వరూపాలను బట్టబయలు చేసుకుంటున్నారు. బి.జె.పిని మితవాద భావాల పార్టీగా విశ్లేషకులు ఎందుకు చెబుతారో వారు తమ వెనుకబాటు భావాలను వెల్లడి చేసుకుంటూ వివరించి చెబుతున్నారు. ఒకరు యు.పిలో అత్యాచారానికి మద్దతుగా వచ్చి ములాయం పట్ల సానుభూతి ప్రకటిస్తే, మరొకరేమో శివాజీ, ధాకరేలను ఫేస్ బుక్ లో అవమానిస్తే తత్పరిణామాలు ‘సహజం’ అంటూ ముస్లిం టెకీ హత్యను సమర్ధించుకొచ్చారు. ఉత్తర ప్రదేశ్…

రాహుల్ యుద్ధం: ఉత్త కుమారుడేనా? -కార్టూన్

కాంగ్రెస్ పార్టీ యువరాజు రాహుల్ గాంధీ కనీసం ఉత్తర కుమారుడు కూడా కాదనీ, ఆయన సోనియా గాంధీకి ‘ఉత్త కుమారుడే’ అనీ ఆయనగారి ధోరణి చెబుతోందని కార్టూన్ సూచిస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయానికి తామిద్దరమే బాధ్యులమని తల్లిగారితో పాటు గంభీరంగా ప్రకటించిన రాహుల్ గాంధీ ప్రతిపక్ష హోదాలో ప్రజల కోసం ప్రభుత్వంతో యుద్ధం చేస్తామని హామీ ఇచ్చారు. కానీ తీరా పార్లమెంటరీ సమావేశాలు మొదలయ్యాక ఆయన పత్తా లేకుండా పోయారు. ఎక్కడో చివరి వరుసలో కూర్చుని…

కె.సి.ఆర్ కారు Vs చంద్రబాబు కారు -కార్టూన్

కె.సి.ఆర్ కారు ఎక్కేశారు. డ్రైవర్ సీటు కూడా చేజిక్కించుకుని ప్రయాణం కూడా మొదలు పెట్టేశారు. అనగా సి.ఎంగా పదవీ స్వీకార ప్రమాణం చేసి, మంత్రివర్గం కూడా నియమించుకుని పాలన మొదలు పెట్టేశారు. కాబట్టి ఆయన వదులుతున్న వాగ్దానాలకు కాస్త అర్ధం వచ్చి చేరింది. అవి నెరవేరుస్తారా లేదా అన్నది తర్వాత సంగతి. రైతుకు 12,000 దాకా రుణం మాఫీ అంటున్నారు. ఉన్న పెట్టుబడులు ఎక్కడికీ వెళ్లొద్దని కోరారు. కొత్తవాళ్లు కూడా రావచ్చన్నారు. ప్రత్యేక హోదా తమకూ ఇవ్వాలని…

యూరప్ స్టిములస్: ఆకాశ వీధుల్లో భారత స్టాక్ మార్కెట్లు!

ప్రతి ద్రవ్యోల్బణం భయంతో వణికిపోతున్న యూరోపియన్ దేశాలను బైటపడేయడానికి యూరోపియన్ సెంట్రల్ బ్యాంకు (ఇ.సి.బి) మరో ఉద్దీపన పధకం ప్రకటిస్తుందన్న ఊహాగానాలు వ్యాపించడంతో భారత స్టాక్ మార్కెట్లు పరవళ్ళు తొక్కాయి. ఆర్ధిక గమనాన్ని వేగవంతం చేయడానికి మరింత లిక్విడిటీని ఇ.సి.బి ప్రవేశపెడుతుందని నమ్మకమైన సంకేతాలు అందాయి. దాని ప్రభుత్వం భారత స్టాక్ మార్కెట్లకూ విస్తరించి సరికొత్త రికార్డులు నమోదు చేశాయి. సెన్సెక్స్ మొట్టమొదటిసారి 25,000 మార్కు దాటగా, నిఫ్టీ సైతం కొత్త రికార్డు నెలకొల్పింది. గురువారం మెటల్,…

సి.ఐ.ఏపై కేసుకు పాక్ కోర్టు ఆదేశం

పాకిస్తాన్ లో ఒక ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది. పాక్ లో పని చేసి వెళ్ళిన సి.ఐ.ఏ మాజీ అధికారులపై హత్య కేసు నమోదు చేయాలని ఇస్లామాబాద్ హై కోర్టు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. డ్రోన్ దాడుల ద్వారా హత్య, కుట్ర, దేశంపై యుద్ధం ప్రకటించడం తదితర నేరాలకు పాల్పడినందుకు గాను వివిధ సెక్షన్ల కింద కేసు పెట్టాలని కోర్టు ఆదేశించింది. అమెరికన్ డ్రోన్ దాడుల్లో తన కొడుకును కోల్పోయిన ఉత్తర వజీరిస్తాన్ పౌరుడొకరు చేసిన…

దొడ్డి దారిన రిటైల్ ఎఫ్.డి.ఐ యోచనలో మోడి ప్రభుత్వం?

బి.జె.పి/నరేంద్ర మోడి ఎన్నికల వాగ్దానాల్లో రిటైల్ ఎఫ్.డి.ఐ ఒకటి. మల్టీ బ్రాండ్ రిటైల్ వ్యాపారంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను యు.పి.ఏ ప్రభుత్వం అనుమతించగా బి.జె.పి ఆ నిర్ణయాన్ని వ్యతిరేకించింది. తాము అధికారంలోకి వస్తే ఈ నిర్ణయాన్ని తిరగదోడతామని బి.జె.పి వాగ్దానం ఇచ్చింది. సదరు వాగ్దానాన్ని నెరవేర్చడం మాట అటుంచి దొడ్డి దారిన యు.పి.ఏ ప్రభుత్వ నిర్ణయాన్ని అమలు చేసే యోచనలో మోడి ప్రభుత్వం ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు ప్రభుత్వ వర్గాల నుండి తమకు గట్టి…

ముస్లిం టెకీ హత్య: హిందూ రాష్ట్ర సేన ఘాతుకం

నరేంద్ర మోడి నేతృత్వం లోని హిందూ జాతీయవాద ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నిన్నటితో సరిగ్గా వారం రోజులు పూర్తయింది. బి.జె.పి గానీ, మోడి గానీ అట్టహాసంగా ఇచ్చిన వాగ్దానాలు ఏ విధంగా అమలులోకి వచ్చేదీ వివరాలేవీ ఇంకా వెల్లడి కానేలేదు. కాంగ్రెస్/యు.పి.ఏ అమలు చేసిన నయా ఉదారవాద ఆర్ధిక విధానాలను మరింత దీక్షతో నిర్నిరోధంగా అమలు చేస్తారని స్వదేశీ, విదేశీ కంపెనీలు పెట్టుకున్న ఆశలను ప్రజలను మెప్పిస్తూ ఎలా నెరవేర్చవచ్చో తగిన ఐడియాలేవీ ఇంకా ప్రకటించబడనే లేదు.…

ఆకాశం దించాలా, భువి తునక తుంచాలా? -ఫోటోలు

అమెరికా, రష్యాలు భౌగోళిక రాజకీయ రంగంలో ఎంతగా తగువులాడుకున్నా ఆ దేశాల అంతరిక్ష సంస్ధలు మాత్రం కలిసి మెలిసి కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నాయి. బహుశా, కనీసం ప్రస్తుత కాలానికి,  అమెరికా-రష్యాల మధ్య గల వైరుధ్యాల పరిమితులను ఇది తెలియజేస్తుందేమో! ఎక్స్ పెడిషన్ 39 పేరుతో జరిగిన అంతరిక్ష ప్రయాణంలో ఇరు దేశాల సిబ్బంది కలిసి ప్రయాణించి శాస్త్ర పరిశోధనలలో పాలు పంచుకోవడమే కాకుండా అద్భుతమైన భూ దృశ్యాలను రికార్డు చేసి మనముందు ఉంచారు. ఇరు దేశాలకు చెందిన ముగ్గురు…

ఎఎపి పరిస్ధితి ఇక ఇదేనా? -కార్టూన్

సామాన్యుడిని నెత్తి మీద పెట్టుకుంటానని ఉనికిలోకి వచ్చిన ఆం ఆద్మీ పార్టీ ఢిల్లీ జనాన్ని బాగానే ఆకట్టుకుంది. కానీ అనతికాలం లోనే జనంలో పలుకుబడి కోల్పోయిందని లోక్ సభ ఎన్నికలు రుజువు చేసినట్లుగా విశ్లేషకులు భావిస్తున్నారు. ఢిల్లీ పీఠాన్ని కట్టబెట్టడం ద్వారా  ప్రజలు పెట్టుకున్న ఆశల్ని తగిన విధంగా ఆచరణలోకి తేవడంలో ఆ పార్టీ విఫలమైందని అందుకే ప్రజల్లో పలచన అయిందని వారి అవగాహన. అధికారంలోకి వచ్చీ రావడంతోనే సంచలన కార్యక్రమాలకు తెరతీసిందని సో కాల్డ్ మర్యాదస్తులు,…

సామాజిక తెలంగాణా? కె.సి.ఆర్ తెలంగాణా? -కార్టూన్

నూతన రాష్ట్రం తెలంగాణ ఆవిర్భావాన్ని ది హిందూ కార్టూనిస్టు కేశవ్ ఇలా వ్యక్తీకరించారు. ఏమిటి దీనర్ధం? సామాజిక తెలంగాణను హామీ ఇచ్చిన కె.సి.ఆర్ తన కుటుంబ తెలంగాణ మాత్రమే ఇచ్చారనా? కె.సి.ఆర్ బలం అంతా తెలంగాణ మాత్రమే అనా? కె.సి.ఆర్ బలం తెలంగాణ వాపులోనే ఉందని, అది త్వరలో తగ్గిపోతుందని (వాపు తగ్గాక నూతన రాష్ట్రం వల్ల ఒరిగిందేమీ లేదని ప్రజలు తెలుసుకుంటారని) అర్ధమా? పాఠకుల్లో ఎవరన్నా చెప్పగలరా?

తెలంగాణ మొదటి అడుగు: కె.సి.ఆర్ వాగ్దాన ఉల్లంఘన

నూతన రాష్ట్రం తెలంగాణ ఆవిష్కృతం అయింది. ఉద్యమ పార్టీ నేతగా కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారు తెలంగాణ మొదటి ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. 11 మంది మంత్రులతో కొలువు తీరిన నూతన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్యమంత్రితో సహా ముగ్గురు ఒకే కుటుంబానికి చెందినవారు. అనగా దాదాపు 25 శాతం ఒకే కుటుంబ మంత్రులతో కూడిన మంత్రివర్గాన్ని కొత్త రాష్ట్రం తలకెత్తుకుంది. తెలంగాణ ఉద్యమాన్ని సైతం కుటుంబ ఉద్యమంగా నడిపిన ఆరోపణలు ఎదుర్కొన్న కె.సి.ఆర్…

షియా ఇరాన్ సందర్శనలో సున్నీ కువైట్ అమీర్

మధ్య ప్రాచ్యంలో మరో పరిగణించదగిన పరిణామం చోటు చేసుకుంది. అమెరికాకు పక్కా మిత్ర దేశం కువైట్ అమీర్ ఒకరు ఆదివారం నుండి తన ఇరాన్ సందర్శన ప్రారంభించాడు. షియా ఇరాన్ ప్రభావం మధ్య ప్రాచ్యంలో పెరిగడానికి దారి తీసే ప్రతి పరిణామాన్ని ఆటంకపరిచే సున్నీ సౌదీ అరేబియా పాత్ర ప్రస్తుత పరిణామంలో ఎంత ఉందన్నది వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. గత సంవత్సరం అధికారం చేపట్టిన రౌహాని ప్రభుత్వం అమెరికా, పశ్చిమ రాజ్యాలతో పాటు ప్రాంతీయ ప్రత్యర్ధి…

షాంగ్రీ-లా డైలాగ్: చైనా, అమెరికా పరస్పర సవాళ్ళు!

సింగపూర్ లో శనివారం జరిగిన ‘షాంగ్రీ-లా డైలాగ్’ చైనా, అమెరికాల మధ్య మాటల తూటాలు పేలడానికి వేదికయింది. ప్రాంతీయంగా అస్ధిరత్వం నెలకొనడానికి చైనా కారణం అవుతోందని అమెరికా చైనాను నిందించగా, అమెరికా ప్రసంగం చైనాను బెదిరిస్తున్నట్లుగా ఉందని చైనా తిప్పి కొట్టింది. అమెరికా తరపున డిఫెన్స్ కార్యదర్శి చక్ హెగెల్ ప్రసంగించగా చైనా తరపున ఆ దేశ ఆర్మీ డెప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ లెఫ్టినెంట్ జనరల్ వాంగ్ గువాంగ్ ఝాంగ్ ప్రసంగించారు. ‘ఆసియన్ సెక్యూరిటీ ఫోరం’…

మబ్బులు తొలగును, అసలు తెలియును -కార్టూన్

“…ప్రారంభోల్లాస భ్రాంతి సర్దుకునే కొలదీ ఆర్ధిక స్ధితిగతులలు తన అసలు రూపాన్ని వ్యక్తం చేసుకుంటుంది..”  (ఆ రూపమే గదిలో ఏనుగు) మోడి: మనం మిత్రులమే కదా? *** స్వతంత్ర  భారత దేశ చరిత్ర లోనే పూర్తి మెజారిటీ సాధించిన మొట్ట మొదటి కాంగ్రెసేతర పార్టీగా బి.జె.పి మన్ననలు అందుకుంటోంది. బి.జె.పికి ఆ ఖ్యాతి దక్కించిన మహోన్నత నేతగా నరేంద్ర మోడి ప్రశంసలు పొందుతున్నారు. నిన్నటిదాకా ‘దూరం, దూరం’ అంటూ అస్పృశ్యత అమలు చేసిన బ్రిటన్, అమెరికాలు ‘రండి,…

మొదటి ప్రపంచ యుద్ధం: యుద్ధ విమానాలు -ఫోటోలు

యుద్ధ విమానాలతో యుద్ధం చేసుకోవడం మొదటి ప్రపంచ యుద్ధంలోనే మొదలయింది. అప్పటికి విమానాల నిర్మాణ రంగంలో సాంకేతిక పరిజ్ఞానం పెద్దగా అభివృద్ధి చెందలేదు. చాలా ప్రాధమిక స్ధాయిలోనే విమానాల నిర్మాణం ఉన్నప్పటికీ శత్రువుపై పై చేయి సాధించడానికి పశ్చిమ దేశాలు వాటినీ వదల్లేదు. ప్రారంభంలో కేవలం గూఢచర్యానికి మాత్రమే విమానాలను, ఇతర ఎగిరే వస్తువులను (బెలూన్లు, గాలిపటాలు మొ.వి) వినియోగించేవారు. యుద్ధం తీవ్రం అయ్యేకొద్దీ అవసరం రీత్యానే బాంబర్లు, ఫైటర్ విమానాలు తయారు చేసుకుని వినియోగించారు. దాడులకు…