‘మేక్’ ఇన్ ఇండియా -కార్టూన్

బులెట్ ప్రూఫ్ అద్దాలు లేకుండా ఎర్రకోటపై నిలబడి మొదటిసారి దేశ ప్రజలకు స్వాంతంత్ర్య సందేశం ఇచ్చిన ప్రధాని నరేంద్ర మోడి విదేశీ కంపెనీలకు ఆహ్వానం పలికారు. ప్రపంచంలో ఉన్న కంపెనీలన్నీ ఇండియా రావాలనీ పిలుపు ఇచ్చారు. ఇక్కడ సరుకులు ఉత్పత్తి చేసి ప్రపంచంలో ఎక్కడైనా అమ్ముకోవచ్చని ఆశ చూపారు. విదేశీ కంపెనీలకు ఎర్ర తివాచీ పరుస్తానని ఎర్రకోట బురుజులపై నిలబడి చాటింపు వేశారు. ఇప్పుడు ఏ సరుకు చూసినా ‘మేడ్ ఇన్ చైనా’ స్టిక్కర్ ను ప్రదర్శించేవే.…

గాజా విధ్వంసం: బిగ్ బెన్ ముందు వినూత్న నిరసన -ఫోటోలు

గాజా విధ్వంసకాండపై బ్రిటన్ స్వచ్ఛంద సంస్ధ ఆక్స్ ఫాం వినూత్న నిరసన చేపట్టింది. గాజా ప్రజల దీన పరిస్ధితిని తెలియజేస్తూ 150 మంది కార్యకర్తలు చేసిన ఈ ప్రదర్శన ప్రపంచాన్ని ఆకర్షించింది. చిన్న చెక్క పెట్టెలను బ్రిటిష్ పార్లమెంటు మైదానం ముందు ఉంచి అందులో ఇరుక్కుని కూర్చోవడం ద్వారా ఆక్స్ ఫామ్ గాజా ప్రజలు అత్యంత చిన్న ప్రదేశంలో ఇరుక్కుని బతుకుతూ కూడా ఇజ్రాయెల్ దురహంకార అణచివేతను ఎదుర్కొంటున్నారని ప్రదర్శన ద్వారా తెలిపారు. బ్రిటన్ పాలనా కేంద్ర…

TAPI గ్యాస్ పైప్ లైన్: ఫ్రెంచి కంపెనీ ఆసక్తి

ఫ్రాన్స్ కు చెందిన బడా బహుళజాతి చమురు & సహజవాయువు కంపెనీ టోటల్ (TOTAL) భారత్ కు గ్యాస్ తెచ్చే పైప్ లైన్ పై ఆసక్తి ప్రదర్శిస్తోంది. తుర్క్ మెనిస్తాన్-ఆఫ్ఘనిస్తాన్-పాకిస్ధాన్-ఇండియా (T-A-P-I) దేశాల మీదుగా సాగే ఈ పైప్ లైన్ నిర్మాణంలో తానూ భాగం పంచుకుంటానని టోటల్ ముందుకు వచ్చింది. ఇరాన్ నుండి గ్యాస్ ను తెచ్చే పీస్ పైప్ లైన్ (ఇరాన్-పాకిస్ధాన్-ఇండియా) నుండి వెనక్కి తగ్గి అమెరికా ఒత్తిడితో TAPI పైప్ లైన్ వైపు మొగ్గు…

ఈ జాత్యహంకార దుర్గంధం ఎచటిదంటే గాజావైపు చూపండి! -ఫోటోలు

ప్రకృతి శక్తులకు మాత్రమే సాధ్యమైన ఉన్మత్త విధ్వంసం ఇది. ఆధునిక సాంకేతికాభివృద్ధి శక్తులను కూరి పసిప్రాణాల్ని పేల్చేస్తున్న చమురు దాహపు వినాశనమిది. నెలరోజుల నిర్విరామ డాలర్ల దాడుల్లో మిగిలిన మానవత్వపు శిధిలాలివి. అత్యంత ప్రాచీన పాలస్తీనా జాతి గుండె కోత ఇది.  చెట్టూ-పుట్టా, గుడిసే-మేడా  తేడా లేకుండా దివిసీమనంతటినీ ముంచేసిన ప్రళయ భీకర పెను తుఫానును చూసి గుండెలు బాదుకున్నాం. ఉప్పు సముద్రాలన్నీ తెచ్చి కుమ్మరించిన హిందూ మహా సముద్రపు సునామీలో వేలమందిని కోల్పోయాం. కట్టుదిట్టమైన ఫుకుషిమా…

భీమా బిల్లు: అక్కరకు రాని మోడి మెజారిటీ -కార్టూన్

స్వదేశీ, విదేశీ ప్రైవేటు కంపెనీలతో, వ్యాపార వర్గాలతో స్నేహపూర్వకంగా వ్యవహరిస్తామని మోడి ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ సదరు హామీని మొదటి అడుగులోనే హుళక్కి చేయడంలో ప్రతిపక్ష కాంగ్రెస్ సఫలం అయింది. పాతికేళ్లలో మొదటిసారిగా పూర్తి మెజారిటీ సంపాదించినా అది ఎన్నికల హామీలకు అక్కరకు రాకుండా పోయింది. పాలక, ప్రతిపక్ష పార్టీలు రెండింటికీ ఉపయోగపడే జ్యుడీషియల్ కమిషన్ బిల్లును రెండు సభల్లో ఆమోదింపజేసుకున్నప్పటికీ భీమా ఎఫ్.డి.ఐ పరిమితి పెంపు బిల్లును మాత్రం గట్టెక్కించలేకపోయింది. నిజానికి భీమా ఎఫ్.డి.ఐ…

పాకిస్తాన్ పై తప్పుడు సలహాలు -ది హిందు సంపాదకీయం

(Ill-advised on Pakistan శీర్షికతో ది హిందూ ఈ రోజు సంపాదకీయం రాసింది. దానికి ఇది యధాతధ అనువాదం. -విశేఖర్) నరేంద్ర మోడి అసలు స్వరూపం ఏమిటి? ఎన్నికల విజయం నాటి ఆరంభ పుష్టితో ఇస్లామాబాద్ కు స్నేహ హస్తం చాచి, తన ప్రమాణ స్వీకార మహోత్సవానికి ప్రధాని నవాజ్ షరీఫ్ ను ఆహ్వానించి, ఆయనతో తమ తమ తల్లుల కోసం దుశ్శాలువలు, చీరలు ఇచ్చిపుచ్చుకున్న వ్యక్తా? లేక “సంప్రదాయ యుద్ధం చేయగల సామర్ధ్యాన్ని పాకిస్ధాన్ కోల్పోయింది.…

మూజువాణి: తెలంగాణ మాదిరిగానే జ్యుడీషియల్ బిల్లు కూడా

సుప్రీం కోర్టు, హై కోర్టులకు జడ్జిల నియామకంలో పార్లమెంటుకు కూడా అధికారాలు కట్టబెట్టడానికి ఉద్దేశించిన బిల్లు లోక్ సభలో ఆమోదం పొందింది. 121వ రాజ్యాంగ సవరణ, నేషనల్ జ్యుడీషియల్ అపాయింట్ మెంట్స్ కమిషన్ ఏర్పాటు లను అమలులోకి తెచ్చే బిల్లు మూజు వాణి ఓటుతో ఆమోదం పొందడం ప్రత్యేకంగా గమనించవలసిన విషయం. తెలంగాణ బిల్లును ఆనాటి లోక్ సభ, రాజ్య సభలు మూజు వాణి ఓటుతో ఆమోదం పొందినపుడు అనేకమంది రాజకీయవేత్తలు, ఎ.పి.ఎన్.జి.ఓ లాంటి ఆందోళన సంస్ధలు,…

ఇరాక్, సిరియాల్లో 900 మంది ఫ్రెంచి జిహాదీలు

మధ్య ప్రాచ్యంను కుదిపేస్తున్న ఇస్లామిక్ ఘర్షణల్లో పశ్చిమ దేశాల పౌరులు పాల్గొనడం నానాటికీ పెరుగుతోంది. సిరియాలో పశ్చిమ దేశాలు ప్రేరేపించిన కిరాయి తిరుగుబాటు మొదలైనప్పటి నుండి అనేక ఇస్లామిక్ దేశాల నుండి ఆకర్షించబడిన అమాయక యువత సిరియాకు ప్రయాణం కట్టారు. సో కాల్డ్ జిహాద్ లో పాల్గొనడానికి పశ్చిమ దేశాల నుండి కూడా ముస్లిం యువత ఇరాక్, సిరియాలకు వెళ్ళడం పెరిగిపోయిందని ఆ దేశాల ప్రభుత్వాలు చెబుతున్నాయి. ‘ఇస్లామిక్ స్టేట్’ (ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్…

‘పవిత్రం’ కనుక గంగా నదిని శుద్ధి చేయాలా?

“పవిత్ర” గంగానది ని శుద్ధి చేసే కార్యక్రమాన్ని బి.జె.పి ప్రభుత్వం ఎందుకు వెనక్కి నెట్టేసిందని సుప్రీం కోర్టు ప్రశ్నించింది. బి.జె.పి నేతృత్వంలోని ఎన్.డి.ఏ ప్రభుత్వంలో గంగా నదిని పరిశుభ్రం చేయాలన్న ఆతృత (urgency) చూపించడం లేదని వ్యాఖ్యానించింది. ‘దేశంలో 2,500 దూరం ప్రవహించే గంగా నదిని శుద్ధి చేసే పధకాల పట్ల ప్రభుత్వం ఆసక్తి కోల్పోయిందా?’ అని ప్రశ్నించింది. 20 యేళ్ళ నాటి ప్రజా ప్రయోజన వ్యాజ్యం పైన విచారణ కొనసాగిస్తూ సుప్రీం కోర్టు బెంచి బుధవారం…

లండన్: ఇజ్రాయెల్ వ్యతిరేక భారీ ప్రదర్శనలు

‘ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా’ అని సామెత. ఈ సామెత తమ విషయంలో నిజం కాదని లండనర్లు నిరూపిస్తున్నారు. బ్రిటన్ ప్రభుత్వం, బ్రిటిష్ పత్రికలు అంతా కట్టగట్టుకుని ఇజ్రాయెల్ స్వయం రక్షణ హక్కు కోసం పాటు పడుతుంటే, ఇజ్రాయెల్ అమానవీయ దాడులు జరిపే హక్కులను నిలదీస్తూ పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. లండనర్ల నిరసనలను లండన్ కేంద్రంగా నడిచే అంతర్జాతీయ కార్పొరేట్ పత్రికలు సైతం పట్టించుకోకపోవడం గమనార్హం. ‘పాలస్తీనియన్ సాలిడారిటీ కాంపెయిన్’, ‘స్టాప్…

కాంగ్రెస్ నాయకత్వ సంక్షోభ పరిష్కర్త ఎవరు? -కార్టూన్

ఇంకెవరు, రాజవంశమే. దృతరాష్ట్రుడు గుడ్డివాడయినందుకు ఆయన్ని సింహాసనానికి దూరం చేశారా? పోనీ జనంలో ఇంకా ఎవరన్నా ఉద్దండుడు ఉన్నారా అని వెతికారా? లేదు కదా! ఆయన తమ్ముడు పాండు రాజుచేత బాధ్యతలు నిర్వర్తింపజేస్తూ ఆ గుడ్డాయన్నే కుర్చీలో కూర్చోబెట్టారు. సో కాల్డ్ ప్రజాస్వామ్యం లోనూ అదే తంతు. ప్రజాస్వామ్య వ్యవస్ధలో రాజకీయ పార్టీలకు నాయకత్వం ఎక్కడి నుండి వస్తుంది? కార్యకర్తల నుండే రావాలి. కింది స్ధాయి నుండి సంస్ధాగత ఎన్నికలు జరిపించాలి. ఆ ఎన్నికల్లో నెగ్గిన వారిలోనుండి…

అమిత్ షా: కమల దళాలే ఆక్టోపస్ చేతులవ్వాలి -కార్టూన్

బి.జె.పి అధ్యక్ష పీఠాన్ని అధిష్టించిన అమిత్ షా భారత దేశం కోసం తాను కంటున్న కలలేమిటో వ్యక్తం చేశారు. అధ్యక్ష పదవి అమిత్ షాకు అప్పగించడానికి బి.జె.పి కార్యర్గం లాంఛన ప్రాయంగా ఆమోద ముద్ర వేసిన అనంతరం ఆయన బి.జె.పి జాతీయ కౌన్సిల్ ను ఉద్దేశించి ప్రసంగించారు. సదరు ప్రసంగంలో తన ఉద్దేశ్యాలేమిటో శాంపిల్ గా వివరించారాయన. ఇన్నాళ్లూ కాంగ్రెస్ ఐడియాలజీ ఒక్కటే దేశాన్ని శాసించిందని ఇక నుండి కాంగ్రెస్ ఐడియాలజీని పక్కకు నెట్టి కేవలం బి.జె.పి…

ప్రపంచ వ్యాపితంగా అరుదైన సూపర్ మూన్ -ఫోటోలు

అరుదుగా కనిపించే సూపర్ మూన్ ఆగస్టు 10, 2014 తేదీ రాత్రి సంభవించింది. చంద్ర కళల ప్రకారం నెలకొకసారి పౌర్ణమి రోజున పూర్తి రూపంలో చంద్రుడు కనిపించే సంగతి తెలిసిందే. భూమి చుట్టూ వర్తులాకారంలో (elliptical shape) తిరిగే చంద్రుడు తన కక్ష్యలో భూమికి అతి సమీపంలో వచ్చే సందర్భం ఒకటి ఉంటుంది. కానీ ఆ సందర్భం ఎప్పుడూ పౌర్ణమి రోజు కానవసరం లేదు. పౌర్ణమి రోజున పూర్తిగా చంద్రుడు కనిపించే రోజునే భూమికి అతి దగ్గరిగా…

స్టేటస్ కో కోసమే జ్యుడీషియల్ కమిషన్ బిల్లు

సుప్రీం కోర్టు, హై కోర్టుల జడ్జిల నియామకాలకు సంబంధించి యు.పి.ఏ చేయలేని పనిని ఎన్.డి.ఏ సాధించేవైపుగా పరిణామాలు జరుగుతున్నాయి. సుప్రీం కోర్టులకు, హై కోర్టులకు జడ్జిలను నియమించే అధికారం ప్రస్తుతం పూర్తిగా సుప్రీం చేతుల్లో లేదా న్యాయ వ్యవస్ధ చేతుల్లో ఉంది. దీనిని మార్చేవైపుగా ఎన్.డి.ఏ ప్రభుత్వం నూతన రాజ్యాంగ సవరణ బిల్లును లోక్ సభలో ఈ రోజు ప్రవేశపెట్టింది. ఫలితంగా యు.పి.ఏ పదేళ్ళలో చేయలేని పనిని ఎన్.డి.ఏ సాధించనుంది. నూతన ఆర్ధిక విధానాలలో భాగంగానూ, ప్రపంచ…

గూఢచారుల పేర్లివ్వండి! -ఎంబసీలకు జర్మనీ ఆదేశం

జర్మనీ ప్రభుత్వం ఓ సంచలన నిర్ణయం ప్రకటించింది. ఎన్.ఎస్.ఎ, సి.ఐ.ఎ లాంటి అమెరికా గూఢచార సంస్ధలతో విసిగిపోయి ఇక ఎంత మాత్రం సహించలేని దశకు చేరుకున్నట్లుగా సంకేతాలిస్తూ దేశంలోని విదేశీ ఎంబసీలన్నీ తమ గూఢచార అధికారుల పేర్లను వెల్లడించాలని ఆదేశించింది. తమ దేశంలో విధులు నిర్వర్తిస్తున్న గూఢచారులందరి పేర్లను తమకు అప్పగించాలని కోరింది. ఈ మేరకు విదేశీ ఎంబసీలన్నింటికీ జర్మనీ ప్రభుత్వం గత వారం లేఖలు రాసిందని పత్రికలు సమాచారం ఇచ్చాయి. జర్మనీ విదేశీ మంత్రిత్వ శాఖ…