ఎపికి ఇచ్చేది గ్రాంటు కాదు, ప్రపంచ బ్యాంకు అప్పు

Amaravati the Ghost Town 2024-25 బడ్జెట్ లో ఆంధ్ర ప్రదేశ్, బీహార్ రాష్ట్రాలకు కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ కేటాయింపులు ప్రకటించారు. టిడిపి, జెడి(యు) పార్టీల మద్దతు పైన బిజెపి నేతృత్వం లోని కేంద్ర ప్రభుత్వం ఆధారపడి ఉన్నందునే ఆర్ధిక మంత్రి ‘కుర్సీ కో బచావో’ పధకం మేరకు ఆ రెండు రాష్ట్రాలకు నిధులు ప్రకటించిందని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించాడు. ఇతర రాష్ట్రాలపై వివక్ష చూపిందని ఆరోపించాడు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి…

రెండిందాల నష్టపోతున్న మిడిల్ క్లాస్!

పన్ను చెల్లింపుదారుల్లో కార్పొరేట్ కంపెనీల కంటే మిడిల్ క్లాస్ ఆదాయంతో రోజులు కనాకష్టంగా వెళ్లదీసే వర్గమే అధిక మొత్తంలో పన్నులు చెల్లిస్తున్నారని గత ఆర్టికల్ లో, ప్రభుత్వం విడుదల చేసిన ఆర్ధిక సర్వే సాక్షిగా, చూశాం. అత్యధిక పన్ను చెల్లింపుదారులు ఎదుర్కొంటున్న ‘అడకత్తెరలో పోకచెక్క’ పరిస్ధితిని కాస్త చూద్దాం. కేంద్ర ప్రభుత్వానికి ప్రధానంగా రెండు రకాల పన్నుల ద్వారా ప్రజల నుండి ఆదాయం సమకూరుతుంది. ఒకటి ప్రత్యక్ష పన్నులు: ఆదాయ పన్ను, కార్పొరేట్ల లాభాలపై పన్నులు. రెండవది,…

మోడీ పుణ్యం: కార్పొరేట్ల కంటే మిడిల్ క్లాస్ చెల్లించే పన్నులే ఎక్కువ!

ఇండియాలో చాలా మందికి తెలియని సంగతి ఏమిటంటే ఇక్కడి కార్పొరేట్ కంపెనీల కంటే మధ్య తరగతి జీవులు చెల్లిస్తున్న పన్నుల మొత్తమే ఎక్కువ అని. బిజెపి ప్రభుత్వం అనుసరించిన ఆర్ధిక విధానాలు ఈ పరిస్ధితికి దారితీశాయి. యుపిఏ హయాంలో కార్పొరేట్లు తెగ పన్నులు కట్టేశాయని కాదు గానీ, కొద్దో గొప్పో మిడిల్ క్లాస్ కంటే కాసింత ఎక్కువ పన్నుల ఆదాయం కార్పొరేట్ కంపెనీల నుండి వచ్చేది. మోడీ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత కూడా 2021-22 ఆర్ధిక సం.…

బడ్జెట్ 24-25: ఆదాయ పన్నులో నలుసంత ఉపశమనం!

కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు అనగా జులై 23 తేదీన 2024-25 ఆర్ధిక సంవత్సరానికి గాను వార్షిక బడ్జెట్ ప్రవేశ పెట్టారు. ఎప్పటి లాగానే కార్పోరేట్ సూపర్ ధనిక వర్గాలకు రాయితీలు ప్రకటించిన ఆర్ధిక మంత్రి మధ్య తరగతి ఉద్యోగులకు మాత్రం నాలుగు మెతుకులు విధించారు. ప్రస్తుతం రెండు రకాల ఆదాయ పన్ను విధింపును ఉద్యోగులు కలిగి ఉన్నారు. ఒకటి ఓల్డ్ రెజిం, రెండు కొత్త రెజిం. రెండేళ్ళ క్రితం కొత్త రెజిం…

కన్వర్ యాత్రలో మత ఘర్షణలకు ఏర్పాట్లు?

బి‌జే‌పి ప్రభుత్వాల మతతత్వ పూరిత ఆదేశాలు నానాటికి శృతి మించుతున్నాయి. ఏదో విధంగా ముస్లింలపై వ్యతిరేకతను సృష్టించి తగవులు పెట్టేందుకు అనేక రకాల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. గత లోక్ సభ ఎన్నికల ప్రచార సందర్భంగా సాక్షాత్తు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారే ముస్లింలకు వ్యతిరేకంగా ప్రసంగాలు గుప్పించినప్పటికీ లోక్ సభలో సీట్ల సంఖ్యను పెంచుకోవడంలో సఫలం కాలేక పోయాడు. ఐనప్పటికీ బి‌జే‌పి నేతృత్వం లోని ఉత్తరాది రాష్ట్రాల రాష్ట్ర ప్రభుత్వాలు ఈ దిశలో తమ…

పోటీ నుండి బైడెన్ ఉపసంహరణ, ట్రంప్ కు తలనొప్పి!

అమెరికా అద్యక్ష పదవి రేసు నుండి తప్పుకుంటున్నట్లు జోసెఫ్ బైడెన్ ప్రకటించాడు. ఎక్స్ (ట్విట్టర్) ఈ మేరకు బైడేన్ ఒక లేఖను పోస్ట్ చేశాడు. అదే లేఖలో ఆయన తన ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ అధ్యక్ష పదవి అభ్యర్ధిత్వానికి మద్దతు (ఎండార్స్ మెంట్) ప్రకటించాడు. అధ్యక్షుడుగా ఉండగా బైడెన్ డిమెన్షియాతో బాధపడుతున్నట్లు ఆయన బహిరంగ ప్రవర్తన ద్వారా ప్రజలకు స్పష్టంగా తెలుస్తూ వచ్చింది. అనేకసార్లు తన సొంత సిబ్బంది పేర్లు మర్చిపోవటం, విలేఖరుల సమావేశంలో ప్రసంగిస్తూ అకస్మాత్తుగా…

గవర్నర్ అత్యాచారం: పోలీసు విచారణ నుండి ఎస్కేప్!

పశ్చిమ బెంగాల్ గవర్నర్ పైన ఆయన సిబ్బంది లోని మహిళ ఒకరు ఆయన తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపించారు. పోలీసుల విచారణ నుండి తప్పించుకునేందుకు ఘనత వహించిన ఆ గవర్నర్ సిగ్గు లేకుండా తన గవర్నర్ గిరీని అడ్డం తెచ్చుకుంటున్నాడు. గవర్నర్ కార్యాలయంలో పని చేసే సిబ్బందిలోని మహిళ తనపై లైంగిక అత్యాచార ఆరోపణ చేసిన తర్వాత, ఏ మాత్రం ఆత్మ గౌరవం ఉన్నా, తాను నిర్వహిస్తున్న పదవి పట్ల ఇసుమంతైనా బాధ్యత ఉన్నా వెంటనే…

ఉక్రెయిన్: ఆయుధ రహస్యాలు చైనాకు చేరుతున్నాయన్న బెంగలో అమెరికా!

ఇప్పుడు అమెరికాకి కొత్త భయం పట్టుకుంది. ఉక్రెయిన్ సైన్యానికి సరఫరా చేస్తున్న అమెరికా ఆయుధాలన్నీ రష్యా యుద్ధ ఎత్తుగడల ముందు ఎందుకూ పనికి రాకుండా విఫలం అవుతుండడంతో తమ ఆయుధాల రహస్యాలు రష్యాకు తెలిసిపోతున్నాయని ఆందోళన చెందుతోంది. అంతకంటే ముఖ్యంగా తమ ఆయుధాల రహస్యాలను రష్యా, చైనాకు కూడా సరఫరా చేస్తున్నదని అనుమానిస్తోంది. అమెరికా, ఐరోపా దేశాల ఆయుధాల సమాచారం చైనాకు సరఫరా అవుతోందన్న అనుమానం అధ్యక్షుడు జో బైడెన్ ప్రభుత్వాన్ని పట్టి పీడిస్తున్నది. అమెరికా మరియు…

జ్ఞాన యోధుడు: సన్నాఫ్ జోగిని చిన్నూబాయి

—–రచన: డాక్టర్ కోయి కోటేశ్వరరావు జోగినికి పుట్టిన బిడ్డ అంటూ లోకం అతనిని అవమానించింది. తండ్రి ఎవరో తెలియని అనామకుడని సభ్య సమాజం తిరస్కరించింది. అంటరాని అభాగ్యుడని ఊరు ‘బాకున కుమ్మినట్లు’ బాధించింది. కుల భూతం విషం చిమ్మింది. పేదరికం వెక్కిరించింది. చుట్టుముట్టిన లెక్కలేని అవమానాలను ధిక్కరించి, కఠోర శ్రమతో అచంచల కార్యదీక్షతో ధీరోచితంగా అతను ముందడుగు వేశాడు. దారి కడ్డంగా పరుచుకున్న రాళ్ల గుట్టలను దాటుకుంటూ, ముళ్ళ తుప్పలను తొక్కుకుంటూ నెత్తుటి పాదాలతోనే నడక సాగించి…

రష్యాతో యుద్ధానికి 8 లక్షల సైన్యం, ప్లాన్ సిద్ధం చేస్తున్న జర్మనీ

German Superior Tank -Leapord 2A7A1 కొన్ని వందల వేల సైన్యాన్ని రష్యాతో యుద్ధానికి జర్మనీ సిద్ధం చేస్తున్నట్లు న్యూస్ వీక్ పత్రిక వెల్లడి చేసింది. జర్మనీ పత్రిక డెష్పీగెల్ (Der Spiegel) ప్రభుత్వం తయారు చేసిన ఒక రహస్య పత్రాన్ని సంపాదించి దాని వివరాలు వెల్లడి చేయగా ఆ వివరాలని న్యూస్ వీక్ ఆన్ లైన్ అమెరికన్ పత్రిక న్యూస్ వీక్ ప్రచురించింది. త్వరలోనే రష్యాతో యుద్ధం తలెత్తవచ్చని పశ్చిమ పత్రికలన్నీ అడపా దడపా విశ్లేషణలు…

ప్రశ్న: రియల్ జిడిపి, నామినల్ జిడిపిల మధ్య తేడా ఏమిటి?

అంకమ్మ ‘ ‘: సర్, రియల్ జిడిపి, నామినల్ జిడిపిల మధ్య తేడా ఏమిటో చెప్పండి. జవాబు: మీ పేరు చివర తోకను రాయనందుకు అన్యధా భావించ వద్దు. నిన్న రష్యా ఆర్ధిక వ్యవస్థ గురించి రాసిన టపాలో రియల్, నామినల్ జిడిపి ల గురించి ప్రస్తావించాను. బహుశా అది చదివాక మీకు ఈ ప్రశ్న ఉదయించి ఉంటుంది. ఈ జవాబు పాఠకులకు ఉపయుక్తంగా ఉంటుందని భావిస్తున్నాను. రియల్ జిడిపి: పేరులోనే ఉన్నట్లు రియల్ జిడిపి ఒక…

పశ్చిమ ఆంక్షల నడుమ high-income దేశంగా రష్యా!

ఉక్రెయిన్ పై దాడిని సాకుగా చూపిస్తూ రష్యా పైన అమెరికా, ఐరోపా దేశాలు విస్తృతమైన ఆంక్షలు అమలు చేసినప్పటికీ రష్యా ఉన్నత ఆదాయ దేశంగా అవతరించింది. ఈ మేరకు ప్రపంచ బ్యాంకు విడుదల చేసిన జాబితా ద్వారా ఈ సంగతి వెలుగు లోకి వచ్చింది. నిజానికి రష్యా 2014 వరకు ఉన్నత ఆదాయ దేశమే. మార్చి 2014 లో ఉక్రెయిన్ లో ‘యూరో మైదాన్’ పేరుతో జరిగిన ఆందోళనల నేపధ్యంలో, అప్పటి వరకు జి8 గ్రూపు దేశాల…

విద్యుత్ రంగాన్ని జగన్ నాశనం చేశాడు -చంద్రబాబు

ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ రంగాన్ని గత ప్రభుత్వ ముఖ్య మంత్రి జగన్మోహన్ రెడ్డి సర్వ నాశనం చేశాడని ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించాడు. రాష్ట్ర సచివాలయంలో విద్యుత్ రంగం పైన శ్వేత పత్రం విడుదల చేస్తూ ముఖ్య మంత్రి గత ముఖ్య మంత్రి జగన్ పై తీవ్ర ఆరోపణలు చేశాడు. జగన్ ప్రభుత్వం అనుసరించిన విధానాల వలన రాష్ట్ర విద్యుత్ రంగం అనేక నష్టాలు ఎదుర్కొన్నదని, ఇప్పుడు అది అనేక సవాళ్లు ఎదుర్కొంటున్నదని వివరించాడు.…

గాజా యుద్ధం: పాలస్తీనియన్లు వెళ్లేందుకు ఇక చోటు లేదు -ఐరాస

గాజాలో ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ (ఐడిఎఫ్) సైన్యం పాలస్తీనా పౌరుల మారణ హోమం కొనసాగిస్తోంది. అక్టోబర్ 7 తేదీన హమాస్ తమ పైన దాడి చేసి 2 వందల మందికి పైగా ఇజ్రాయెల్ పౌరులను, సైనికులను కిడ్నాప్ చేసిన తర్వాత ఆ సాకుతో ఇజ్రాయెల్ సాగిస్తున్న మారణ హోమంలో ఇప్పటి వరకు 38,000 మందికి పైగా పాలస్తీనియన్లు చనిపోయారు. కాగా వారిలో 75 శాతం మంది స్త్రీలు, పిల్లలే కావటం గమనార్హం. కాగా గాజాలో పరిస్ధితిని తాజాగా…

ఉక్రెయిన్ లో నాటో సైన్యం, సమీపంలో WW-3?

రష్యా, ఉక్రెయిన్ యుద్ధంలో ఉక్రెయిన్ సైన్యం వరుస ఓటములు ఎదుర్కొంటోంది. రష్యా సైన్యం రోజు రోజుకీ ముందడుగు వేస్తున్నది. దీనితో అమెరికా గంగవెర్రులు ఎత్తుతోంది. ఉక్రెయిన్ కి ఓటమి తప్పదన్న భయం అమెరికాకి పట్టుకుంది. ఈ పరిస్ధితుల్లో నాటో కూటమి సైనికులు వివిధ రూపాల్లో ఉక్రెయిన్ యుద్ధంలో పాల్గొనడం ఎక్కువ అవుతున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. నిజానికి నాటో మిలటరీ కాంట్రాక్టర్లు మొదటి నుండి ఉక్రెయిన్ లో ఉంటూ ఉక్రెయిన్ సైన్యానికి సలహా, సూచనలు ఇస్తున్నారన్నది బహిరంగ రహస్యమే.…