కాదేదీ రాజకీయాల కనర్హం! టీచర్స్ డే కూడా -కార్టూన్

A for Achche din… గతంలో ఎన్నడూ ఎవరూ పెద్దగా పట్టించుకోని ‘ఉపాధ్యాయ దినోత్సవం’ (సెప్టెంబర్ 5) ఈ సంవత్సరం ప్రధాని నరేంద్ర మోడి పుణ్యమాని ఓ పెద్ద చర్చాంశం అయింది. రాజకీయాలకు అతీతంగా నిస్పాక్షిక సంబరంగా ఇన్నాళ్లూ ఉంటూ వచ్చిన ఉపాధ్యాయ దినం ఇప్పుడు రాజకీయ ప్రకటనలకు వేదిక కావడమూ ప్రధాని మోడి పుణ్యమే. ‘చాయ్ పే చర్చా’ తరహాలో ప్రధాన మంత్రి స్వయంగా పిల్లలతో మాట్లాడుతారంటూ మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ…

యూరో జోన్ వడ్డీ రేటు ఇప్పుడు 0.05 శాతం

ఐరోపా సంక్షోభ తీవ్రతను తెలియజేస్తూ 17 దేశాల యూరోజోన్ కూటమి వడ్డీ రేటును మళ్ళీ తగ్గించారు. ఆగస్టు ప్రారంభంలో 0.25 శాతం ఉన్న వడ్డీ రేటును 0.15 శాతానికి తగ్గించిన యూరోపియన్ సెంట్రల్ బ్యాంకు ఇప్పుడు దానిని కూడా తగ్గించి 0.05 శాతానికి చేర్చింది. ఇంత తక్కువ వడ్డీ రేటు బహుశా ప్రపంచం ఎరిగి ఉండదు. సెంట్రల్ బ్యాంకు/రిజర్వ్ బ్యాంకు వడ్డీ రేటు తగ్గిస్తే ఆ మేరకు బ్యాంకులకు, తద్వారా కంపెనీలకు మరిన్ని నిధులు అందుబాటులోకి వస్తాయి.…

ఉపఖండంలో ఆల్-ఖైదా, పశ్చిమ జోక్యానికి సూచిక

భారత ఉపఖండంలో ఆల్-ఖైదా విభాగాన్ని స్ధాపించినట్లు ఆల్-ఖైదా నేతగా చెప్పుకునే అయిమన్ ఆల్-జవహరి ప్రకటించాడు. ఈ విభాగం ద్వారా భారత ఉపఖండం అంతటా జీహాద్ విస్తరణకు పాటుపడనున్నట్లు తెలిపాడు. ఆన్-లైన్ లో పోస్ట్ చేసిన ఒక వీడియో ద్వారా ఆల్-జవహరి ‘ఖైదత్ ఆల్-జిహాద్ ఇన్ ద ఇండియన్ సబ్ కాంటినెంట్’ ఏర్పాటు చేసినట్లు తెలిపాడు. ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్, సిరియా, సోమాలియా, యెమెన్, మాలి, లిబియా తదితర దేశాల్లో మొదట ఆల్-ఖైదా లేదా మరో పేరుతో టెర్రరిస్టులను ప్రవేశపెట్టడం,…

అమెరికా కరువుకు దృష్టాంతం ఒరోవిల్లే, షాస్టా సరస్సులు -ఫోటోలు

అమెరికాలో పలు చోట్ల ఇప్పుడు కరువు నెలకొని ఉంది. కాలిఫోర్నియా రాష్ట్రంలో అతి తీవ్ర కరువు నెలకొని ఉండగా ఇంకా ఇతర చోట్ల ఒక మాదిరి నుండి తీవ్ర స్ధాయి వరకు కరువు పరిస్ధితులు నెలకొని ఉన్నాయి. కరువు క్రమంగా పుంజుకుంటున్న చోట్లు విస్తరిస్తున్నాయి. కరువు కారణాలను ప్రకృతి పైకి నెట్టేసి తప్పించుకోవడం ప్రభుత్వాలకు అనాదిగా ఉన్న అలవాటు. వర్షాభావం వల్ల పంటలు పండకపోతే ఆహార గింజల ఉత్పత్తి తగ్గేమాట నిజమే కావచ్చు. కానీ భారీ ఉత్పత్తులు…

అంధులకు చెవులతో లోకాన్ని చూపుతున్న వి.టి.ఇ

‘సిరి వెన్నెల’ సినిమా చూసారా? అందులో పుట్టుకతో కళ్లులేని ఒక పాపకు కళ్ళులేని మరో యువకుడు (హీరో) తన పిల్లన గ్రోవి ద్వారా ‘బృందావనం’ ను దర్శింపజేస్తాడు. అనగా శబ్ద జ్ఞానం ద్వారా ఒక సుందర దృశ్య రూపాన్ని పాప మనసు చూసేలా చేస్తాడు. ఇటీవల, బహుశా ఓ పదేళ్ళ క్రితం ‘పెళ్లి పందిరి’ పేరుతో మరో సినిమా వచ్చింది. అందులో హీరో గారు కళ్ళు లేని హీరోయిన్ తో తన కళ్ళతోనే లోకాన్ని చూడమని చెబుతూ…

ఉక్రెయిన్ కాల్పుల విరమణ, రష్యాకు మరో వ్యూహాత్మక విజయం!

తూర్పు ఉక్రెయిన్ లోని దోనెట్స్క్, లుగాన్స్క్ రాష్ట్రాలకు చెందిన స్వయం రక్షక బలగాలపై నాలుగు నెలలుగా దాడులు చేస్తున్న ఉక్రెయిన్ ప్రభుత్వం కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందని ప్రకటించింది. రష్యా అధ్యక్షుడు పుతిన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు పెట్రో పోరోషెంకోలు ఇరువురూ టెలీఫోన్ లో మాట్లాడుకున్నారని, దరిమిలా శాశ్వత కాల్పుల విరమణ ఒప్పందం సాధ్యపడిందని ఉక్రెయిన్ ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి. అయితే ఇంతలోనే తమ ప్రకటనను ఉక్రెయిన్ మార్చుకుంది. ‘శాశ్వత’ కాల్పుల విరమణ ఒప్పందం కాదని ఉద్రిక్తతలు తగ్గించి,…

మోడి: జపాన్ షరతులతో అణు ఒప్పందం వాయిదా

భారత ప్రధాని నరేంద్ర మోడి జపాన్ పర్యటనలో ఇండియా-జపాన్ ల మధ్య చరిత్రాత్మక అణు ఒప్పందం ఆమోదం పొందుతుందని పలువురు భావించారు. అందుకే ప్రపంచ అణు పరిశ్రమతో వివిధ రకాలుగా సంబంధం ఉన్నవారందరూ మోడి పర్యటనను ఆసక్తిగా, ఆశగా, భయంగా, ఆందోళనగా తిలకించారు. చివరికి ఒప్పందం కుదరకపోవడంతో పరిశ్రమ వర్గాలు తమ తమ స్ధానాలను బట్టి అనుకూలంగానూ, వ్యతిరేకంగానూ నిట్టూర్చగా ప్రజల తరపున ఆలోచించేవారు ‘పోనీలెమ్మ’ని ఊపిరి పీల్చుకున్నారు. ఒప్పందం కుదరకపోవడానికి కారణం జపాన్ విధించిన విషమ…

ఎఫ్.డి.ఐల కోసం మోడీ అన్నీ తానే అయి…

జపాన్ పర్యటనను భారత ప్రధాని మోడి ముగించుకున్నారు. పర్యటనలో ఉండగా ఆయన జపాన్ పెట్టుబడుల కోసం ఎన్ని విన్యాసాలు ప్రదర్శించిందీ ఈ కార్టూన్ తెలియజేస్తోంది. భారత దేశంలో రెడ్ టేపిజం తొలగించి దానికి బదులు విదేశీ కంపెనీలకోసం రెడ్ కార్పెట్ పరుస్తామని మోడి ప్రకటించారు. దేశంలో విదేశీ కంపెనీలు పెట్టుబడులు పెట్టదలిస్తే ఏ దేశమైనా కొన్ని జాగ్రత్తలు పాటిస్తుంది. స్వేచ్చా మార్కెట్ సూత్రాలను పాటిస్తామని చెప్పుకునే అమెరికా, ఐరోపాలు కూడా వివిధ సుంకాలు, పన్నులు, అనుమతులను ఎఫ్.డి.ఐ…

స్కాట్లండ్ రిఫరెండం: ‘యెస్’ కు పెరుగుతున్న ఆదరణ

స్కాట్లండ్ రిఫరెండం దగ్గర పడేకొద్దీ బ్రిటన్ పాలకుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. స్కాట్లండ్ స్వతంత్రాన్ని కోరేవారు రోజు రోజుకీ పెరుగుతుండమే దానికి కారణం. ఆర్ధిక కారణాలు, చారిత్రక కారణాలు, బెదిరింపులు, బుజ్జగింపులు… ఇలా ఎన్ని ఆశలు పెడుతున్నా యెస్ వోటు పెరుగుతుండగా నో వోటు తగ్గిపోతున్నట్లుగా సర్వేలు చెబుతున్నాయి. ఫలితంగా ఇంగ్లండ్ పాలకుల్లో గుబులు బయలుదేరింది. స్కాట్లండ్ స్వతంత్రాన్ని వ్యతిరేకిస్తున్న కార్పొరేట్ పత్రికలు సైతం ఆందోళన ప్రకటిస్తూ హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. ఇంగ్లండ్ నేతృత్వంలోని యునైటెడ్ కింగ్…

తెలుగు వార్తలు బ్లాగ్ 1 మిలియన్ హిట్స్ దాటింది…

జాతీయ అంతర్జాతీయ వార్తలు, విశ్లేషణ బ్లాగ్ ఈ రోజుతో 1 మిలియన్ హిట్స్ దాటింది. ఫిబ్రవరి 4, 2011 తేదీన ప్రారంభం అయిన ఈ బ్లాగ్ ప్రారంభంలో ‘తెలుగులో జాతీయ, అంతర్జాతీయ వార్తలు’ శీర్షికతో ఉండేది. ప్రారంభం అయిన 43 నెలలకు 1 మిలియన్ హిట్స్ కు చేరుకోగలిగింది. అప్పటికి ‘అరబ్ వసంతం’ పేరుతో ఈజిప్టులో జనం పెద్ద ఎత్తున వీధుల్లోకి వచ్చి మిలట్రీ పాలకులకు వ్యతిరేకంగా ఉద్యమం సాగిస్తున్నారు. ఉద్యమం ఉవ్వెత్తున సాగుతున్న నేపధ్యంలో ఈజిప్టు…

రైతులు ఓ.కె అంటే మంగళగిరి, లేదంటే నూజివీడు

రాష్ట్ర ప్రభుత్వం రైతులతో మైండ్ గేమ్ ఆడబోతున్నట్లు కనిపిస్తోంది. రైతులకు, ఇతర వర్గాలకు మధ్య అనవసర విభేదాలు రేపే నిర్ణయం రాష్ట్ర మంత్రివర్గం తీసుకుందని ఛానెళ్ల వార్తలను బట్టి తెలుస్తోంది. మంత్రివర్గ నిర్ణయాలను ఎవరికీ చెప్పొద్దని ముఖ్యమంత్రి ఖచ్చితమైన ఆదేశాలు ఇచ్చారని చెబుతూనే రాజధానిపై వారేమి చర్చించారో వెల్లడి చేశాయి. రైతులు అంగీకరిస్తే మంగళగిరి కేంద్రంగా రాజధాని ఏర్పాటు చేయాలని మంత్రివర్గం నిర్ణయించిందట. ఒకవేళ మంగళగిరి రైతులు మొరాయిస్తే గనుక నూజివీడు కేంద్రంగా రాజధాని ఏర్పాటు చేయాలని…

వినూత్న కళా ప్రదర్శన ‘బర్నింగ్ మేన్’ -ఫోటోలు

అమెరికా ఎడారి రాష్ట్రం నెవాడాలో ప్రతి సంవత్సరం ఓ వినూత్న కళా ప్రదర్శన జరుగుతుంది. దీనికి ‘బర్నింగ్ మేన్ ఫెస్టివల్ అని పేరు. అమెరికా పశ్చిమ తీరానికి ఒక రాష్ట్ర వరుస దూరంలో ఉండే నెవాడా ఎడారి వాతావరణం నెలకొని ఉంటుంది. ఎల్-నినో వల్ల ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లో వేడి గాలులు, తక్కువ వర్షపాతంతో కూడిన వాతావరణం ఉంటే నెవాడాలో మాత్రం వర్షాలు కురుస్తాయి. నెవాడాలోని బ్లాక్ రాక్ ఎడారిలో బర్నింగ్ మేన్ వెస్టివల్ ప్రతి యేడూ…

జి.డి.పి వృద్ధి: కాదు కాదు, మా వల్లే -వెంకయ్య

10 త్రైమాసికాల తర్వాత మొట్ట మొదటిసారిగా 2014-15 మొదటి త్రైమాసికంలో భారత ఆర్ధిక వృద్ధి రేటు 5.7 శాతం నమోదు చేసింది. ఇది తమ విధానాల వల్లనే అని మాజీ ఆర్ధిక మంత్రి పి.చిదంబరం మొన్న జబ్బ చరుచుకున్న సంగతి విదితమే. చిదంబరం సంతోషానికి బి.జె.పి కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు అడ్డుకట్ట వేశారు. కాంగ్రెస్ నేత అంతగా సంతోషపడడానికి ఏమీ లేదని జి.డి.పి తమ బి.జె.పి ప్రభుత్వం వల్లనే పెరిగిందని పోటీకి వచ్చారు. తాము అధికారంలోకి…

సబ్సిడీలు ప్రజాస్వామ్య సాధనకు మార్గం -ఈనాడు

‘అధ్యయనం’ సిరీస్ లో 9వ భాగం ఈ రోజు ఈనాడు పత్రిక చదువు పేజీలో ప్రచురించబడింది. పత్రిక చదివిన కొందరు మిత్రులు ‘అలా అర్ధం కాకుండా రాస్తే ఎలా?’ అని నిలదీశారు.  స్ధలాభావం వల్ల కత్తిరింపులకు గురి కావడంతో కొన్ని చోట్ల వివిధ అంశాలకు మధ్య లంకెలు మిస్ అయ్యాయి. దానితో అర్ధం కానట్లుగా ఉండడానికి ఆస్కారం ఏర్పడింది. బ్లాగ్ పాఠకుల కోసం ఈనాడు ప్రచురణను కింద ఇస్తున్నాను. బొమ్మపై క్లిక్ చేస్తే పెద్ద సైజులో చూడవచ్చు.…

గదిలో ఏనుగు, పాక్ మిలట్రీ -కార్టూన్

పాకిస్ధాన్ లో పార్లమెంటరీ ప్రజాస్వామ్యం (ప్రజల ప్రజాస్వామ్యం కాదు) కూడా ఓ ఎండమావిగా మారిపోయింది. ఎన్నికలు జరిగి పౌర ప్రభుత్వం ఏర్పడి అది కుదురుకునే లోపుగా అక్కడి మిలట్రీ జోక్యం చేసుకోవడం, ఎన్నికయిన ప్రభుత్వాల్ని కూల్చివేయడం ఒక పరిపాటి అయింది. పాలక వర్గాల మధ్య కుమ్ములాటలే ఈ ప్రహసనానికి మూల కారణం అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నవాజ్ షరీఫ్ ప్రభుత్వం ఎన్నికల్లో మెజారిటీ సాధించి అధికారంలోకి వచ్చింది. కానీ నవాజ్ షరీఫ్ కీ, అక్కడి మిలట్రీకి…