జిన్ పింగ్: మోడి దౌత్యం నేర్పుగా…. -కార్టూన్

“… అనంతరం దారం తెగిపోకుండా ఇలా నేర్పుగా లాగి పట్టి…” ********* చైనా అధ్యక్షుడు గ్జి జిన్ పింగ్ భారత్ పర్యటనలో ఉండగానే చైనా-ఇండియా సరిహద్దులో లడఖ్ లో చైనా సైన్యం రెండు చోట్ల చొరబడిందని, కనీసం 500 మీటర్ల మేర చొచ్చుకు వచ్చి వెనక్కి వెళ్లబోమని భీష్మించ్చిందని వార్తలు వెలువడ్డాయి. భారత దేశంలో పత్రికలు, ఛానెళ్లలో పతాక శీర్షికలకు ఎక్కిన ఈ వార్తలు సహజంగానే ప్రధాని మోడీకి అగ్ని పరీక్షగా మారాయి. కాదా మరి! ప్రతిపక్షంలో…

ఎగుడుదిగుడు స్వస్ధత -ది హిందు ఎడిటోరియల్

(ఈ రోజు ది హిందు పత్రికలో ‘Uneven recovery‘ శీర్షికన ప్రచురితం అయిన సంపాదకీయానికి ఇది యధాతధ అనువాదం. -విశేఖర్) ద్రవ్యోల్బణం, పారిశ్రామిక వృద్ధి, వాణిజ్యం… ఈ అంశాలపై విడుదలయిన తాజా ఆర్ధిక గణాంకాల వివరాల నుండి స్పష్టంగా తెలుస్తున్న సంకేతం ఏదన్నా ఉంటే, అది: స్వస్ధత (రికవరీ) ప్రక్రియ ప్రారంభం అయింది కానీ అది ఎగుడు దిగుడుగా, ఇంకా మొదటి గేరులోనే ఉంది. ఆగస్టు నెలలో టోకు ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం గత 5…

వాళ్ళు ఇండియా కోసం ఏమైనా చేస్తారు -మోడి

భారత ప్రధాని నరేంద్ర మోడి నుండి ఇంతవరకు వినని మాటలు వినబడుతున్నాయి. దాదాపు ప్రతి (భారతీయ) మతానికి చెందిన సాంప్రదాయ దుస్తులు ధరించినప్పటికీ ముస్లింల టోపీ (skull cap) ధరించడానికి మాత్రం నిర్ద్వంద్వంగా నిరాకరించిన నరేంద్ర మోడి ఈ రోజు ముస్లింల దేశభక్తిపై పొగడ్తల వర్షం కురిపించారు. “నా అవగాహన ఏమిటంటే, వాళ్ళు మన దేశ ముస్లింలకు అన్యాయం చేస్తున్నారు. భారతీయ ముస్లింలు వారి ట్యూన్ లకు నాట్యం చేస్తారని ఎవరైనా భావించినట్లయితే వారు భ్రమల్లో ఉన్నట్లే”…

అమిత్ షా: అచ్చిరాని యు.పి పరీక్ష -కార్టూన్

బి.జె.పి భారీ మెజారిటీతో కేంద్రంలో అధికారంలోకి రావడానికి కారకులుగా భావిస్తున్నవారిలో అమిత్ షా అగ్రగణ్యులు. బీహార్, ఉత్తర ప్రదేశ్ లలో భారీ సంఖ్యలో సీట్లు రావడానికి కారణం ఆయనే అని ఇప్పుడు దాదాపు అందరూ చెప్పే మాట. అందుకే ఆయనను బి.జె.పి అధ్యక్ష పదవి వరించింది కూడా. అధ్యక్ష పదవి చేపట్టిన అనంతరం తన హవా ఏ పాటిదో పరీక్షించుకునే అవకాశం ఉత్తర ప్రదేశ్ ఉప ఎన్నికల రూపంలో అమిత్ షాకు వచ్చిందని కార్టూన్ సూచిస్తోంది. అమిత్…

(బి.జె.పికి) సంకేతాత్మక హెచ్చరిక -ది హిందు ఎడిటోరియల్

(A Note of Caution శీర్షికన ఈ రోజు (సెప్టెంబర్ 17) ది హిందూ ప్రచురించిన సంపాదకీయానికి ఇది యధా తధ అనువాదం -విశేఖర్) ఉల్లాసం వెనువెంటే నిరాశ రావడం చాలా అరుదుగా జరుగుతుంది: భారత దేశంలో అత్యధిక జనాభా కలిగిన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో తన చరిత్రలోనే అత్యంత మెరుగైన ఎన్నికల ఫలితాలను రికార్డు చేసిన భారతీయ జనతా పార్టీ నాలుగు నెలల్లోనే ఆ రాష్ట్రంలో తన సాంప్రదాయక పునాది కలిగిన చోట కూడా పెనుగులాడుతున్నట్లు…

పేద గొప్ప తేడాలెరగని నిద్ర -ఫోటోలు

ఆకలి రుచి ఎరగదు నిద్ర సుఖమెరగదు అంటారు. సుఖం మాట ఎలా ఉన్నా నిద్రాదేవికి పేద గొప్ప తేడాలతో పని లేని మాట నిజం. ఎటువంటి వివక్ష లేకుండా ప్రతి వ్యక్తిని ఆదరించి జోకొట్టే సుగుణవతి నిద్రాదేవి. ఆ మాటకొస్తే సృష్టిలో నిద్రపోని జీవి అంటూ లేదు. అలసి సొలసిన శరీరాలను తన ఒడిలో చేర్చుకుని, సేదదీర్చి, తిరిగి నూతన జవసత్వాలను నింపే నిద్రమాత ప్రసన్నం కోసం మనిషి ‘నిద్ర మాత్ర’ ను కూడా కనిపెట్టాడు. నిద్ర…

శారదా చిట్ ఫండ్ ఊబిలో మమతా బెనర్జీ! -కార్టూన్

శారదా చిట్ ఫండ్ కుంభకోణం క్రమంగా మమతా బెనర్జీని కూడా చుట్టు ముడుతోంది. సి.బి.ఐ విచారణ ఫలితంగా పలువురు త్రిణమూల్ కాంగ్రెస్ నేతలు, మంత్రులు కుంభకోణంలో పాత్రధారులుగా, లబ్దిదారులుగా తేలుతున్నారు. చివరికి మమతా బెనర్జీ ఎన్నికల ప్రచార ఖర్చులను కూడా శారద చిట్ ఫండ్ భరించిందని అరెస్టయిన నేత ఒకరు ఆరోపించడంతో మమతా బెనర్జీని ఊబిలోకి లాగేందుకు ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయని స్పష్టం అవుతోంది. త్రిణమూల్ నేత, మాజీ ఐ.పి.ఎస్ అధికారి రజత్ మజుందార్, ఆ పార్టీ…

మహా రాష్ట్ర: బి.జె.పి, శివసేనల పీతల తట్ట

పీతల్ని ఒక పాత్రలో వేసి పెడితే అవి తప్పించుకోకుండా ఉండడానికి ప్రత్యేకంగా మూత పెట్టనవసరం లేదట. ఒకటి ఎలాగో సందు చూసుకుని అంచు దాటి పోయేలోపు మరో పీత ఆ పైకి వెళ్ళిన పీత ఆధారంగా తానూ పైకి వెళ్ళే ప్రయత్నంలో మొదటి పీతను కిందకు లాగేస్తుంది. మొత్తం మీద ఏ పీతా తప్పించుకోకుండా తమకు తామే కిందకు లాగేస్తూ యజమానికి సహాయం చేస్తాయి. మహారాష్ట్రలో బి.జె.పి, శివ సేన పార్టీల తగవులాట కూడా పీతలాటను తలపిస్తోంది.…

ఉప ఎన్నికలు: సడలుతున్న బి.జె.పి కుదుళ్లు

పార్లమెంటు, అసెంబ్లీ స్ధానాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. లోక్ సభ ఎన్నికల్లో బి.జె.పి ప్రదర్శనకు ఉప ఎన్నికల ఫలితాలు దాదాపు విరుద్ధంగా వెలువడ్డాయి. అసెంబ్లీ ఎన్నికలకు, పార్లమెంటు ఎన్నికలకు మధ్య ప్రజలు తేడా చూడడం ప్రారంభించారా అన్న అనుమానం కూడా ఉప ఎన్నికల ఫలితాలు కలిగిస్తున్నాయి. ఒకవేళ అదే నిజమైతే భారత ప్రజలు సాపేక్షికంగా రాజకీయ చైతన్యాన్ని ప్రదర్శిస్తున్నట్లే లెక్క. ఎలా చెప్పుకున్నా బి.జె.పి, అధికారంలోకి వచ్చిన కొద్ది నెలలకే లోక్ సభ ఎన్నికల్లో…

విజయ్ మాల్యా ఎగవేసింది నీటి బొట్టంత! -మాజీ కాగ్

కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్, యునైటెడ్ బ్రూవరీస్… తదితర కంపెనీల అధినేత విజయ్ మాల్యా ఇప్పుడు భారత దేశంలోని అప్పు ఎగవేతదారులకు సింబల్! యునైటేడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యు.బి.ఐ), ఆయనను ఉద్దేశ్యపూర్వక పన్ను ఎగవేతదారు (Wilful defaulter) గా ప్రకటించినప్పటి నుండి ఆయనకు ఆ కీర్తి దక్కింది. బహుశా స్వతంత్ర భారత చరిత్రలో ఈ బిరుదు దక్కించుకున్న ఏకైక/మొట్టమొదటి పారిశ్రామికవేత్త విజయ్ మాల్యాయే కావచ్చు. అయితే ఇంతటి కీర్తి ప్రతిష్టలను సొంతం చేసుకున్న విజయ్ మాల్యా,…

ఉత్పాదక, అనుత్పాదక వ్యయాలు -ఈనాడు

అధ్యయనం శీర్షికన వెలువడిన వ్యాస పరంపర పోయిన వారం కాక అంతకు ముందు వారంతో ముగిసింది. ఓ వారం విరామం తర్వాత స్ధూల ఆర్ధిక శాస్త్ర పదజాలాన్ని వివరించే ప్రయత్నం మొదలు పెట్టాను. డ్రై సబ్జెక్ట్ గా పేరుంది కనుక వీలనయింత తడిని అద్ది పాఠకులకు ఇవ్వాలనేది నా ప్రయత్నం. అందుకోసం సంభాషణల ద్వారా ఆర్ధిక పదజాలాన్ని వివరించగలిగితే పాఠకులకు మరింత తేలికగా ఉంటుందని ఒక ఐడియా వచ్చింది. ఆ ఐడియాను ఈ వారం అమలు చేశాను.…

కులాలవారి శ్మశానవాటికలు కోర్టుకు కొత్తేనట!

“ఇటా…, అస్పృశ్యత సంచరించుటకు తావే లేదు…” అని ‘శ్మశాన వాటి’ కావ్యంలో గుర్రం జాషువా గారు ప్రస్తావిస్తారు. జాషువా జీవించినప్పటి పరిస్ధితి ఏమిటో గానీ ఇప్పుడైతే ఈ పరిశీలనలో వాస్తవం లేదు. దాదాపు ప్రతి ఊరిలోనూ కులాల వారీగా (బ్రాడ్ గా) శ్మశాన వాటికలు ఇప్పటికీ ఉన్నాయి. అగ్ర కులాలకు ఉమ్మడి ఒక శ్మశాన వాటిక ఉండవచ్చునేమో గానీ నిమ్న కులాలకు మాత్రం అందులో ప్రవేశం ఉండదు. రాజస్ధాన్ లో ఇలాంటి విషయం ఒకటి కోర్టు దృష్టికి…

కాశ్మీర్ వరదలు: పట్టించుకునేవారు లేరు

“ఒక్క రాయి విసిరినా, ఆ ఒక్క వ్యక్తిని కొట్టడానికి వందల మంది పోలీసులు పరుగెట్టుకుని వస్తారు. వాళ్ళంతా ఇప్పుడేరి? మంత్రులు ఎక్కడ?” కాశ్మీర్ వరదల నుండి బైటపడిన ఒక కాశ్మీరీ టీచర్ వేసిన ప్రశ్నలివి. “హెలికాప్టర్లు వచ్చాయి, వెళ్ళాయి. మా సహాయం కోసం ఎవ్వరూ రాలేదు. మా ఏరియాలో ఎవ్వరినీ హెలికాప్టర్ల ద్వారా రక్షించలేదు” తాత్కాలిక శిబిరంలో తలదాచుకుంటున్న ఒక కాశ్మీరీ పౌరుడు వెల్లడించిన సత్యం. “ఈ ప్రభుత్వం ఇచ్చే ఆహారం మాకు అక్కర్లేదనీ జనం నిరాకరిస్తున్నారు.…

ఒడిషా: డెంగ్యూను పోషిస్తున్న టాటా స్టీల్

ఒడిషా రాష్ట్రంలో టాటా స్టీల్ నిర్మిస్తున్న భారీ ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణ కార్మికులను అవస్ధలకు గురి చేస్తోంది. ఫ్యాక్టరీ పరిసరాల్లో శుభ్రత పాటించకపోవడంతో కార్మికులు ప్రతి సంవత్సరం డెంగ్యూ జ్వరానికి గురై అవస్ధలు పడుతున్నారు. ఒడిషా ప్రభుత్వ శాఖలు టాటా యాజమాన్యం వైఖరిని తీవ్రంగా తప్పు పడుతున్నాయి. టాటా కంపెనీ ప్రతినిధులు మాత్రం ఇది ప్రతేడూ ఉండేదే అని చేతులు దులిపేసుకుంటున్నారు. టాటా గ్రూపు కంపెనీల్లో ఒకటయిన ‘టాటా స్టీల్’ కంపెనీ ఒకప్పుడు భారత దేశానికి ఒకే…

(మత) ఆకర్షక రాజకీయాలు -ది హిందు ఎడిటోరియల్

ముంచుకొచ్చే ఎన్నికలు, ప్రభుత్వాల చర్యలకు అనివార్యంగా రంగు పులుముతాయి. ఉత్తర ప్రదేశ్ లో 11 అసెంబ్లీ స్ధానాలకు, ఒక పార్లమెంటరీ స్ధానానికి ఉప ఎన్నికలు జరగడానికి సరిగ్గా రెండు రోజుల ముందు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా పై విద్వేష ప్రసంగం చేసినందుకు అభియోగ పత్రం నమోదు చేయడానికి తీసుకున్న నిర్ణయం రాజకీయ లక్ష్యంతోనే జరిగిందా అన్నది చర్చనీయమైన ప్రశ్న. అమిత్ షా పై దాఖలు చేసిన ఛార్జీ షీటును కోర్టు పోలీసులకు వెనక్కి…