ఇంకా తేరుకోని బంగ్లాదేశ్

బంగ్లాదేశ్ లో రాజకీయ మరియు శాంతి భద్రతల పరిస్ధితులు ఇప్పటికీ మెరుగుపడ లేదని అక్కడి పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. మధ్యంతర ప్రభుత్వానికి చీఫ్ అడ్వైజర్ గా విధులు నిర్వహిస్తూ ప్రధాన పాలనా బాధ్యతలు చూస్తున్న మహమ్మద్ యూనస్ నేతృత్వంలో పరిస్ధితిని చక్కదిద్దేందుకు జరుగుతున్న ప్రయత్నాలు పూర్తిగా సత్ఫలితాలను ఇవ్వటం లేదు. 15 యేళ్ళ పాటు సాగిన షేక్ హసీనా పాలన మిగిల్చిన వైరాలు, వైరుధ్యాలు, పగలు-ప్రతీకారాలు నివురు గప్పిన నిప్పులా తమ ఉనికిని కొనసాగిస్తూనే ఉన్నాయి. బహుశా…

గాజా హత్యాకాండకు బాధ్యులెవరు?

గాజాలో మానవ హననం కొనసాగుతూనే ఉంది. ఇజ్రాయెల్ సైన్యం – ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ (IDF) హమాస్ ని సాకుగా చూపిస్తూ విచక్షణా రహితంగా పాలస్తీనీయుల జనావాసాలపైనా, శరణార్ధి శిబిరాల పైనా, శరణార్ధులకు ఐరాస ఆహార సరఫరాలు తెస్తున్న ట్రక్కుల పైనా, ఐడిఎఫ్ బాంబింగ్ లో గాయపడ్డ పాలస్తీనీయులను ఆసుపత్రులకు తరలిస్తున్న అంబులెన్స్ ల పైనా… ఇదీ అదీ అని లేకుండా పాలస్తీనీయులకు సంబంధించిన సమస్త నిర్మాణాల పైనా మిసైళ్లు, బాంబులు, లాయిటర్ బాంబులు, డ్రోన్ బాంబులు,…

ఈ వరుస హత్యా ప్రయత్నాల వెనుక ఉన్నది ఎవరు?

గత కొద్ది నెలల కాలంలో వివిధ దేశాల పాలకులను హత్య చేసేందుకు వరుసగా ప్రయత్నాలు జరిగాయి. అమెరికాలో త్వరలో జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో సునాయాసంగా గెలుస్తాడు అనుకుంటున్న డొనాల్డ్ ట్రంప్ తో సహా, రష్యా అధ్యక్షుడు పుటిన్, స్లొవేకియా ప్రధాన మంత్రి రాబర్ట్ ఫికో, వెనిజులా అధ్యక్షుడు రాబర్ట్ మదురో, హమాస్ పోలిటికల్ లీడర్ ఇస్మాయిల్ హానియే, హిజ్బొల్లా కమాండర్ ఖలీల్ ఆల్-మగ్దా… ఇలా వరస బెట్టి హత్యా ప్రయత్నాలు జరిగాయి. వీళ్ళలో ట్రంప్ కొద్ది పాటి…

రు. 76 వేల కోట్ల వసూలు ఇక కష్టమే -సెబి

కంపెనీలు పాల్పడిన వివిధ అవినీతి వ్యవహారాల వలనా, చిన్నా పెద్దా మదుపుదారుల నుండి పెట్టుబడులను మోసపూరితంగా వసూలు చేయడం వలనా, సెబి విధించిన అపరాధ రుసుముల వలనా, ఇంకా అనేక ఇతర కారణాల వలనా, వసూలు కావలసిన మొత్తంలో రు 76,293 కోట్లు వసూలు కావటం ఇక కష్టమే అని సెక్యూరిటీ ఎక్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబి) ప్రకటించింది. సెబి, ఇలాంటి వసూలు కావటం కష్టంగా మారే వాళ్ళ జాబితాను క్రమం తప్పకుండా యేటా తయారు…

అమెరికా కాంగ్రెస్ లో నెతన్యాహు చెప్పిన కొన్ని అబద్ధాలు!

Netanyahu addressing U.S. Congress on July 24, 2024 అమెరికా తోక ఇజ్రాయెల్ అన్న సంగతి ఈ బ్లాగ్ లో చాలా సార్లు చెప్పుకున్నాం. అమెరికా తోకకి ఒక ప్రత్యేకత ఉంది. అమెరికాకి ఎంతయితే దుష్టబుద్ధితో కూడిన మెదడు ఉన్నదో దాని తోక ఇజ్రాయెల్ కి కూడా అంతే స్థాయి దుష్ట బుద్ధితో కూడిన మెదడు ఉండడం ఆ ప్రత్యేకత. ఒక్కోసారి అమెరికా తలలో ఉన్న మెదడు కంటే దాని తోకలో ఉన్న మెదడుకే ఎక్కువ…

ఇరాన్ కి యుద్ధం కావాలి, అందుకే…

ఇరాన్ కి యుద్ధం కావాలి. ఇరాన్ కి యుద్ధమే ఆహారం. కానీ అమెరికాకి శాంతి కావాలి. శాంతి లేనిదే అమెరికా బ్రతకలేదు. ప్రపంచ శాంతి అమెరికాకి చాలా చాలా ముఖ్యం. కానీ ఇరాన్ తన యుద్ధ కాంక్షతో అమెరికాకి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నది. కావాలంటే కింద సాక్ష్యం చూడండి! అమెరికా ప్రపంచ శాంతి కోసం తపన పడుతూ, ప్రపంచం నిండా సైనిక స్థావరాలను నిర్మించుకుంది. ఇరాన్ దేశం ప్రపంచ శాంతి కోసం అమెరికాతో సహకరించకుండా…

హసీనాపై ఒత్తిడి వద్దు- అమెరికాకు ఇండియా విజ్ఞప్తి!

బంగ్లాదేశ్ ప్రధాన మంత్రి షేక్ హసీనా పట్ల చూసీ చూడనట్లు వ్యవహరించాలని భారత అధికారులు అమెరికన్ విదేశీ వ్యవహారాల శాఖ అధికారులకు విజ్ఞప్తి చేశారని ‘బిజినెస్ టుడే’ పత్రిక వెల్లడి చేసింది. షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి ఇండియాకు పారిపోవటానికి సంవత్సరం ముందు నుండే ఇండియా, హసీనా పట్ల తేలికగా వ్యవహరించాలని, అమెరికాను కోరిందని ది వాషింగ్టన్ పోస్ట్ పత్రికను ఉటంకిస్తూ బిజినెస్ టుడే పత్రిక వెల్లడి చేసింది. బంగ్లాదేశ్ లోని హసీనా ప్రభుత్వం…

సెబి రెగ్యులేటర్ రూల్స్ ఉల్లంఘించింది -రాయిటర్స్

అమెరికాకు చెందిన పరిశోధన సంస్థ మరియు షార్ట్ సెల్లర్ అయిన హిండెన్ బర్గ్ రీసర్చ్, సెబి రెగ్యులేటర్ (సెబి ఛైర్మన్) మాధాబి పూరి బక్ పై చేసిన ఆరోపణలలో వాస్తవం ఉన్నట్లు తమ పరిశోధనలో తేలినట్లు రాయిటర్స్ వార్తా సంస్థ ప్రకటించింది. హిండెన్ బర్గ్ రీసర్చ్ గతంలో ఆదాని కంపెనీపై తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి విదితమే. అదాని గ్రూప్ కంపెనీ భారీ అప్పుల్లో కూరుకుపోయి ఉన్నదనీ, టాక్స్ హేవెన్ (పన్నులు అతి తక్కువగా ఉండే) దేశాలను…

బంగ్లాదేశ్ ఉద్యోగాల రిజర్వేషన్ గురించి…

జనవరి 2024 లో జరిగిన ఎన్నికల్లో ఆవామీ లీగ్ పార్టీ విజయం సాధించడంతో బంగ్లాదేశ్ ప్రధాన మంత్రిగా నాలుగవ సారి పదవి చేపట్టిన షేక్ హసీనా మరో 6 నెలల్లోనే పదవికి రాజీనామా చేసి ఇండియాలో శరణు కోరవలసి వచ్చింది. 15 యేళ్ళ పాటు అవిచ్ఛిన్నంగా ప్రజాస్వామ్య వాసనలు లేకుండా దాదాపు డిక్టేటర్ తరహాలో బంగ్లాదేశ్ ను పాలించిన షేక్ హసీనా ప్రస్తుత పరిస్ధితి స్వయంకృతాపరాధమే అని ది హిందూ లాంటి పత్రికలు వ్యాఖ్యానించాయి. ఈ పరిశీలనలో…

అమెరికా ప్రతీకారమే నా పదవీచ్యుతి -హసీనా

St. Martin Island in North-Eastern Bay of Bengal విద్యార్ధులు, ప్రతిపక్ష పార్టీలు, ఇస్లామిక్ ఫండమెంటలిస్ట్ సంస్థల హింసాత్మక ఆందోళనల ఫలితంగా బంగ్లాదేశ్ ప్రధాన మంత్రి పదవికి రాజీనామా చేసి ఇండియాలో శరణు వేడిన మాజీ ప్రధాని షేక్ హసీనా, అసలు గుట్టును బట్టబయలు చేసిందని రష్యా టుడే పత్రిక తెలియజేసింది. బంగ్లాదేశ్ ద్వీపాన్ని సైనిక స్థావరం నిర్మించేందుకు లీజుకు ఇచ్చేందుకు నిరాకరించినందు వల్లనే అమెరికా ఇప్పుడు తనపై ప్రతీకారం తీర్చుకుందని షేక్ హసీనా కుండ…

మా శత్రువుకు సాయం చేస్తే సహకారం ఉండదు, ఇండియాకు బి.ఎన్.పి హెచ్చరిక!

బంగ్లాదేశ్ ప్రతిపక్ష పార్టీ అయిన ‘బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ’ ఇండియాకు హెచ్చరిక జారీ చేసింది. “మా శత్రువు (షేక్ హసీనా) కు సహాయం చేస్తే మీతో సహకారం కొనసాగించడం కష్టం అవుతుంది” అని బి.ఎన్.పి పార్టీ ఇండియాను గట్టిగా హెచ్చరించింది. ఈ మేరకు బి.ఎన్.పి పార్టీ ప్రతినిధి మరియు బంగ్లాదేశ్ మాజీ మంత్రి గయేశ్వర్ రాయ్, హెచ్చరించాడు. బంగ్లాదేశ్ మాజీ ప్రధాన మంత్రి షేక్ హసీనాకు ఇండియాలో రక్షణ కల్పించడం ఆ దేశ ప్రతిపక్ష పార్టీ బి.ఎన్.పి…

బిజెపి కేసుల బండారం బైట పెట్టిన సిసోడియా బెయిల్!

ఢిల్లీ లిఫ్టినెంట్ గవర్నర్, బిజెపి/మోడి ప్రభుత్వం (ఇడి, సిబిఐ) కనిపెట్టిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో సుప్రీం కోర్టు ఢిల్లీ ప్రభుత్వ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా కు బెయిల్ మంజూరు చేసింది. ‘బెయిల్, నాట్ జెయిల్, ఈజ్ ద రూల్’ అని జస్టిస్ బి. ఆర్. గవాయ్, కెవి విశ్వనాధన్ లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. బెయిల్ పై విడుదలయిన మనీష్ సిసోడియా అంబేద్కర్ రాసిన రాజ్యాంగం తనపై సుదీర్ఘ కాలంగా సాగుతున్న…

బంగ్లా నుండి కోటిమంది హిందువులు ఇండియా వస్తారట!

ఎద్దు ఈనింది అంటే దూడని దొడ్లో కట్టేయమన్నాడట వెనకటికొకరు! పశ్చిమ బెంగాల్ ప్రతిపక్ష నాయకుడు, తృణమూల్ కాంగ్రెస్ నుండి బిజెపిలోకి దూకిన టర్న్ కోట్ సువేందు అధికారి చేసిన ప్రకటన ఇలాగే ఏడ్చింది! పత్రికల వార్తల ప్రకారం సువేందు అధికారి “సిద్ధంగా ఉండండి. బంగ్లాదేశ్ నుండి కోటి మంది హిందువులు (పశ్చిమ) బెంగాల్ కు వలస రాబోతున్నారు” అని ప్రకటించాడు. సువేందు అధికారి అంతటితో ఆగలేదు. ప్రత్యేకంగా ఢిల్లీ వెళ్ళి బంగ్లాదేశ్ లో మైనారిటీ హిందువులపై జరుగుతున్న…

బంగ్లా సంక్షోభం, అమెరికా పుణ్యం!

Awami League Leader and Ousted PM Shaik Hasina జనవరి 2024 ఎన్నికల్లో 4వ సారి బంగ్లాదేశ్ ప్రధాన మంత్రిగా ఎన్నికయిన అవామీ లీగ్ నాయకురాలు షేక్ హసీనా సోమవారం ఆగస్టు 5 తేదీన అక్కడి మిలటరీ సమకూర్చిన హెలికాప్టర్ లో ఇండియాకు పారిపోయి రావడంతో భారత ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. జులై 1 తేదీ నుండి బంగ్లా దేశ్ లో పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు జరుగుతున్నప్పటికీ పరిస్ధితి ఇంతటి తీవ్ర పరిణామాలకు…

క్రీమీ లేయర్: కొండ నాలుకకు మందేస్తే…

సుప్రీం కోర్టు నియమించిన 7గురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనంలో 4గురు సభ్యులు తమకు అప్పగించని పనిని నిర్వర్తించారు. ఒకరైతే ఏకంగా ఏ భగవద్గీత అయితే భారత ప్రజలను నాలుగు వర్ణాలుగా విభజించి పంచముల గురించి అసలు మాట్లాడలేదో అదే భగవద్గీతను తన తీర్పు సందర్భంగా ఉటంకించటానికి వెనకాడ లేదు. అసలు భగవద్గీత శ్లోకాలను తమ తీర్పులలో ఈ మధ్య తరచుగా తెస్తున్న న్యాయమూర్తులకు మన దేశానికి ఒక రాజ్యాంగం, శిక్షా స్మృతి ఉన్నాయనీ, కోర్టులు వాటిని మాత్రమే…