2015లో తెలుగు వార్తలు బ్లాగ్ -సమీక్ష

ఈ సమీక్ష నేను చేసింది కాదు. ఎప్పటిలాగే వర్డ్ ప్రెస్ వాళ్ళు ఈ సమీక్షను ప్రకటిస్తూ దానిని బ్లాగ్ లో ప్రచురించే అవకాశం ఇచ్చారు. సమీక్షలోని ముఖ్య అంశాలు: 2015లో మొత్తం వీక్షణలు 250,000 చిల్లర ఎక్కువ వీక్షణలు పొందిన టపా – చెన్నై జల విలయం -ఫోటోలు ఎక్కువ టపాలు పోస్ట్ చేసిన వారం – గురువారం ఎక్కువ మంది సందర్శకులు కూడలి నుండి రాగా ఆ తర్వాత గూగ్ల్ సర్చ్ ఇంజన్ నుండీ, ఫేస్ బుక్…

అధికారుల సస్పెన్షన్: ఢిల్లీ ఐ‌ఏ‌ఎస్ ల సామూహిక సెలవు

ఢిల్లీ ఐ‌ఏ‌ఎస్ అధికారులు ఏ‌ఏ‌పి ప్రభుత్వంపై సమ్మె ప్రకటించారు. వందల మంది అధికారులు మూకుమ్మడిగా సెలవుపై వెళ్లారు. కొందరు రోజంతా సెలవు తీసుకోగా మరికొందరు ఒక పూట సెలవులో వెళ్లారు. ఇదంతా తమలో ఇద్దరు అధికారులను ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసినందుకు! అధికారుల సెలవు వల్ల ఢిల్లీ ప్రభుత్వం ప్రయోగాత్మకంగా తలపెట్టిన బేసి-సరి సంఖ్యల (నంబర్ ప్లేట్లు) వాహన పధకం అమలుకు ఇబ్బందులు ఏర్పడే ప్రమాదం తలెత్తింది. ఢిల్లీ ప్రభుత్వం తరపున వాదించే కౌన్సెళ్ళకూ పబ్లిక్…

అమెరికా వీసా ఫీజు పెంపులో హ్రస్వదృష్టి -ది హిందు

[Short-sighted hike in U.S. visa fee శీర్షికన ఈ రోజు ది హిందులో వెలువడిన సంపాదకీయానికి యధాతధ అనువాదం] ********** అమెరికాలో తాత్కాలిక పని కోసం వచ్చే వృత్తిగత నిపుణులకు వీసా ఫీజు పెంచుతూ బారాక్ ఒబామా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఐ.టి రంగంలోని భారతీయ కంపెనీలను ప్రభావితం చేస్తుంది. ఈ చర్య వల్ల సంవత్సరానికి 400 మిలియన్ డాలర్ల (రమారమి రు. 2640 కోట్లు) నష్టం వస్తుందని (భారత సాఫ్ట్ వేర్) వాణిజ్య సంఘం…

కొత్త పార్లమెంటు… స్వేచ్ఛగా కొట్లాడ్డానికి! -కార్టూన్

“నిజమే సుమా. ఇప్పుడు మరీ ఇరుకై పోయింది -ముఖ్యంగా వెల్ ఆఫ్ ద హౌస్ లో…” ____________________________ పార్లమెంటు కోసం కొత్త భవనం కావాలని స్పీకర్ కోరారు. ************ పార్లమెంటు కార్యకలాపాల కోసం కొత్త భవనం కావాలని లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ గట్టిగా కోరుతున్నారు. ఈ మేరకు ఆమె రెండు ఆప్షన్ లను ప్రభుత్వం ముందు పెడుతూ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు గారికి లేఖ కూడా రాశారు. ఇపుడున్న పార్లమెంటు కాంప్లెక్స్…

చైనా అభివృద్ధి శిధిలాలు ప్రాణాలు మింగేస్తున్న వేళ… -ఫోటోలు

దేశంలోని సకల సంపదలు కొద్ది మంది వద్దనే కుప్పబడినప్పుడు ఆ సంపదలని వెలికి తీసే బీద ప్రాణాలు కుప్పలుగా సమాధి కావలసిందే. ఆర్ధిక అభివృద్ధిలో అమెరికాను అధిగమించడానికి శరవేగంగా దూసుకుపోతున్న చైనాలో అభివృద్ధి పక్కనే అభివృద్ధి శిధిలాలు కుప్పలై పోగుబడి కొండలై పెరిగిపోయి చివరికి అమాంతం కూలిపోయి శ్రామికుల ప్రాణాల్ని నిలువునా కప్పేస్తున్నాయి. డిసెంబర్ 20 తేదీన అత్యంత అభివృద్ధి చెందిన నగరాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందిన షెన్ జెన్ నగరంలో ఓ కొండ ఉన్నట్టుండి కూలిపోయింది.…

కీర్తి ఆజాద్ కు బిజెపి పెద్దల మద్దతు

కొందరు రాజకీయ విశ్లేషకులు అంచనా వేసినట్లుగా కీర్తి ఆజాద్ కు బిజెపి పెద్దల నుండి మద్దతు వస్తోంది. బి.జె.పి సైద్ధాంతిక మార్గదర్శక సంస్ధ ఆర్‌ఎస్‌ఎస్ సైతం కీర్తి ఆజాద్ విషయంలో పార్టీ వ్యవహరించిన తీరుపై అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీ ఎం.పిని మొదట వివరణ కోరుతూ షో-కాజ్ నోటీసు ఇవ్వకుండా ఎకాఎకిన సస్పెండ్ చెయ్యడం పట్ల ఆర్‌ఎస్‌ఎస్ కూడా అసంతృప్తిగా ఉన్నట్లు వార్తలు చెబుతున్నాయి. చూడబోతే ఏ‌ఏ‌పి ఒత్తిడికి తలొగ్గి ఆదరాబాదరాగా కీర్తి ఆజాద్ ను సస్పెండ్…

డి‌డి‌సి‌ఏ స్కాం: అబ్బే పిచ్ లో స్వల్ప మార్పులు!

Keshav strikes again! డి‌డి‌సి‌ఏ స్కాంలో తన అవినీతిని అరుణ్ జైట్లీ ఎలా సమర్ధించుకుంటున్నారో ఈ కార్టూన్ విశ్లేషిస్తున్నది. ఫిరోజ్ షా కోట్ల స్టేడియంలో కొన్ని భాగాల్ని ఆధునికరించడానికి 24 కోట్ల అంచనాతో కాంట్రాక్టు అప్పగించగా పనులు ముగిసే నాటికి 114 కోట్లు చెల్లించడం ప్రధాన కుంభకోణం. ఆధునీకరణ పనుల్లో భాగంగా ఢిల్లీ మునిసిపాలిటీ అనుమతి లేకుండానే కొన్ని బాక్స్ లను నిర్మించారు. స్టేడియం స్ధలంలో అక్రమ నిర్మాణాలు చేసి వాటిని అక్రమంగా లీజులకి ఇచ్చేశారు. అదనంగా…

జైట్లీ విచారణకు హాకీ ఫెడ్ మాజీ అధికారి డిమాండ్

అరుణ్ జైట్లీ బీరువాలో దాచిపెట్టిన అవినీతి కంకాళాలు ఒక్కొక్కటిగా బైటికి వస్తున్నాయి. ఢిల్లీ & డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడుగా జైట్లీ సాగించిన అవినీతిపై విచారణ చేయాలని డిమాండ్లు ఓ పక్క మిన్నంటుతుండగా మరో పక్క హాకీ ఇండియా ఫెడరేషన్ బోర్డు సభ్యుడుగా ఆయన పాల్పడిన అవినీతిaపై కూడా విచారణ చేయాలంటూ డిమాండ్లు చేసే గొంతులు పెరుగుతున్నాయి. ఈసారి ఏకంగా హాకీ ఫెడరేషన్ మాజీ అధికారి స్వయంగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు లేఖ రాస్తూ…

జైట్లీకి కీర్తి ఆజాద్ 52 ప్రశ్నలు

ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు జైట్లీ అవినీతిపై 5 ప్రశ్నలతో సరిపెడితే బి.జె.పి ఎం.పి కీర్తి ఆజాద్ ఏకంగా 52 ప్రశ్నలను సంధించారు. సోమవారం మాజీ టెస్ట్ క్రికెటర్ బిషన్ సింగ్ బేడి తో కలిసి విలేఖరుల సమావేశంలో మాట్లాడిన కీర్తి ఆజాద్, ఒక వ్యక్తిపై ఎక్కుపెట్టిన దాడి కాదని చెబుతూనే జైట్లీకి 52 ప్రశ్నాస్త్రాలను సంధించాడు. ప్రశ్నలను సంధించడంతోనే కీర్తి ఆజాద్ సరిపెట్టుకోలేదు. Wikileaks4India అనే వెబ్ సైట్, సన్ స్టార్ అనే పత్రికా విడుదల…

రాజీనామా చేయమని జైట్లీకి మోడి సంకేతం?!

ఢిల్లీ & డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ -డి‌డి‌సి‌ఏ- అధ్యక్షులుగా 13 సంవత్సరాలు, ప్యాట్రన్-ఇన్-చీఫ్ గా ఒక సంవత్సరం పదవులు నిర్వహించిన ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ, అవినీతి ఆరోపణల నేపధ్యంలో, రాజీనామా చేయవలసి ఉంటుందని ప్రధాని నరేంద్ర మోడి సంకేతం ఇచ్చారా? బి.జె.పి పార్లమెంటరీ పార్టీ బోర్డు సమావేశంలో నరేంద్ర మోడి చేశారంటూ కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు పత్రికలకు చెప్పిన వ్యాఖ్యలు ఈ అనుమానాన్ని కలిగిస్తున్నాయి. “ప్రధాన మంత్రి ఎల్.కె.అద్వానీ ఉదాహరణను ప్రస్తావించారు. అప్పటి ప్రభుత్వం…

పునరావాసం కల్పించగల న్యాయం (తీర్పు)! -ది హిందు

[డిసెంబర్ 21, 2015 తేదీన ది హిందు “Justice that is rehabilitative” శీర్షికన ప్రచురించిన సంపాదకీయానికి యధాతధ అనువాదం.] ******* పరిపక్వ సమాజం జనం పెడబొబ్బలకు లొంగి తన న్యాయ వ్యవస్ధకు ఆధారభూతమైన పటుతర న్యాయ సూత్రాలను, సామాజిక నియమాలను తలకిందులు చేయదు. ప్రత్యేక శిక్షణా గృహంలో 3 సంవత్సరాల పాటు గడపాలని విధించిన శిక్ష ముగిశాక డిసెంబర్ 2012 నాటి ఢిల్లీ సామూహిక అత్యాచారం కేసులోని బాల నేరస్ధుడిని విడుదల చేసిన విషయంలో పెల్లుబుకిన…

దేశం దృష్టికి రాని ఆరేళ్ళ నిర్భయ

నిర్భయపై అత్యాచారం చేసిన ఆరుగురిలో ఒకరైన బాల నేరస్ధుడిని విడుదల చేసినందుకు ప్రస్తుతం దేశ్యవ్యాపితంగా అనేకమంది ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. ఆరుగురిలో నిర్భయ పట్ల అత్యంత క్రూరంగా వ్యవహరించింది బాల నేరస్ధుడే అన్న అభిప్రాయం మొదటి నుండీ వ్యాపించి ఉండడంతో అతన్ని వదిలిపెట్టడం పట్ల ఆగ్రహం తీవ్రంగా వ్యక్తం అవుతోంది. ముఖ్యంగా నిర్భయ తల్లిదండ్రులు బాల నేరస్ధుడు విడుదల కానున్నాడన్న నిజాన్ని తట్టుకోలేక నిద్ర లేని రాత్రులు గడుపుతూ తీవ్ర ఆగ్రహం ప్రకటిస్తున్నారు. తమకు అన్యాయం జరిగిందని…

మెనూ స్మృతి -కత్తిరింపు

అక్టోబర్ 29 తేదీన ఆంధ్ర జ్యోతి దినపత్రికలో ప్రచురించబడిన వ్యాసం ఇది. భారత దేశ పేద ప్రజల ఆహారపు అలవాట్లపై హిందూత్వ ప్రారంభించి సాగిస్తున్న సాంస్కృతిక దాడిని సమర్ధవంతంగా ససాక్షారంగా తిప్పి కొట్టిన ఈ వ్యాసం మల్లంపల్లి సాంబశివరావుగారి విరచితం. ఇలాంటి ప్రజాస్వామిక భావజాలంతో కూడిన వ్యాసాలను ప్రచురించడం ఆంధ్ర జ్యోతి పత్రికకు మాత్రమే సాధ్యం అనుకుంటాను. ఇటీవల ఉస్మానియా యూనివర్సిటీలో జరప తలపెట్టిన బీఫ్ ఫెస్టివల్ ను కోర్టులే నిషేధించడం అప్రజాస్వామిక పరిణామం. బీఫ్ మాంసాన్ని…

అనిశ్చితిని ముగించిన ఫెడ్ రేటు పెంపు -ది హిందు

[మొన్న అనగా డిసెంబర్ 16, 2015 తేదీన అమెరికా సెంట్రల్ బ్యాంకు -ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్- వడ్డీ రేటు 0.25 శాతం పెంచింది. ఇప్పుడు అమెరికా రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేటు 0.5 శాతం. డిసెంబర్ 2008లో ద్రవ్య సంక్షోభం చుట్టుముట్టడంతో కంపెనీలు తమ డబ్బు సంపదను ఎక్కడికక్కడ బిగదీసుకున్న నేపధ్యంలో ఆర్ధిక కార్యకలాపాలు స్తంభించిపోయిన దరిమిలా కదలిక తేవడానికి ప్రభుత్వమే మార్కెట్ లో డబ్బు కుమ్మరించడం మొదలు పెట్టింది. అలా కుమ్మరించడానికి వీలుగా వడ్డీ రేటును…

చూడు చూడు నీడలు.. మూసాహార్ వాడలు -ఫోటోలు

వీళ్ళు మూసాహార్ అనబడే ఎలుకాహారులు. భోజ్ పురిలో ముసాహార్ అంటే ఎలుకల్ని తినేవారు అని. అదే వారి సమూహానికి పెట్టిన కులం పేరు. బీహార్ రాష్ట్రంలో నాగరికత నుండి దూరంగా వెలివేయబడ్డ ఈ కులం ప్రజలను భారత దేశ హిందూ సమాజం పంచములుగా గుర్తించి శతాబ్దాలు దాటిపోయింది. ఆధునిక భారతావని, సర్వ స్వతంత్ర గణతంత్ర సామ్యవాద లౌకికవాద రాజ్యంగా అవతరించాక  వారు షెడ్యూల్డ్ కులంగా గుర్తించ బడ్డారు. కానీ ఎన్ని పేర్లు పెట్టినా, ఓటు చట్టాలు చేసి…