డొనాల్డ్ ట్రంప్: ప్రపంచీకరణని తిరగదోడతాడా?

నవంబరు నెలలో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఒక వింత పరిస్థితిని ప్రపంచ ప్రజల ముందు ఉంచుతున్నాయి. రెండు ప్రధాన పార్టీలైన రిపబ్లికన్, డెమోక్రటిక్ పార్టీలు తమ సాంప్రదాయ రాజకీయార్ధిక, సామాజికార్ధిక ప్రాధామ్యాలను పక్కనబెట్టి ప్రత్యర్ధి ప్రాధామ్యాలను సొంతం చేసుకోవడమే ఆ వింత పరిస్ధితి! సాధారణంగా అమెరికాలో రిపబ్లికన్ పార్టీ రాజకీయంగా, సామాజికంగా కన్సర్వేటివ్ భావజాలానికి ప్రాతినిధ్యం వహిస్తుంది. ఆర్థికంగా ధనిక వర్గాలకు, కంపెనీలకు, ముఖ్యంగా వాల్ స్ట్రీట్ వర్గాల ప్రయోజనాలకు కట్టుబడి పని చేస్తుంది. డెమొక్రటిక్…

ఇరోం షర్మిల తదుపరి నిశ్చయం -ద హిందూ ఎడిట్.. 

(True translation to today’s The Hindu editorial “Irom Sharmila’s next stand”) ********** ఇరోం చాను షర్మిల, తన నిరాహార దీక్షను ఆగస్టు 9 తేదీన విరమిస్తానని చేసిన ప్రకటన దాదాపు ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరిచింది. ప్రభుత్వాలు చట్టబద్ధమైన, గందరగోళపరిచే AFSPA మాటున ఆత్మరక్షణ పొందగా, ఆమె చేపట్టిన శక్తివంతమైన శాంతియుత ప్రతిఘటనా చర్య ఆ రక్షణను బలహీనం కావించింది. తద్వారా ప్రజాస్వామ్యం పైనా మానవత్వం పైనా అది కలుగజేస్తున్న క్షయీకరణ ప్రభావాన్ని బట్టబయలు…

హిల్లరీ: ఆమె గాజు పైకప్పు బద్దలు కొట్టారట!

అమెరికా డెమోక్రటిక్ పార్టీ జరిపిన సదస్సులో హిల్లరీ రోధమ్ క్లింటన్ అధ్యక్ష పదవి అభ్యర్థిగా అధికారికంగా నామినేషన్ పొందారు. ఆమె నామినేషన్ ను అమెరికా పత్రికలు, ముఖ్యంగా డెమోక్రటిక్ పార్టీకి మద్దతుగా వచ్చే మీడియా “చరిత్ర సృష్టి” గా ఆకాశానికి ఎత్తేస్తున్నాయి. రెండవ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా తరచుగా కీర్తించుకునే అమెరికాలో అభ్యర్థి పదవికి అభ్యర్థిగా నామినేషన్ పొందిన మొట్టమొదటి మహిళ హిల్లరీ క్లింటన్ కావడమే వారి ఉబ్బితబ్బిబ్బులకు కారణం. అమెరికాకు స్వతంత్రం వచ్చి 240 యేళ్ళు…

ఎవరు రెచ్చగొడితే… -తెలంగాణ బిడ్డ ఆవేదన!

[ఎర్రవెల్లి మండలం కొండపాక (మల్లన్న సాగర్ ప్రాజెక్టు) లో పోలీసుల లాఠీచార్జినీ, తెలంగాణ ప్రజలపై కే‌సి‌ఆర్ కుటుంబం చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ మిత్రుడు ఫేస్ బుక్ లో చేసిన వ్యాఖ్య ఇది. తెలంగాణ ప్రజలకు కావలసింది దొరల తెలంగాణ కాదని, జన తెలంగాణ అని ఆనాడే ప్రజా సంఘాలు చేసిన డిమాండు ఎంత సంబద్ధమో ఈ వ్యాఖ్య, ఫోటోలు చెబుతున్నాయి.] ********* –గంగాధర్ మాకం ఎవరు రెచ్చగొడితే తెలంగాణ‌ కోసం ప్రాణాలకు తెగించి కొట్లాడినమో… ఎవరు రెచ్చగొడితే…

పెల్లెట్ గన్ మన వాళ్ళకే తగిలితే?! -ఫోటోలు

కాశ్మీర్ లో సి‌ఆర్‌పి‌ఎఫ్ పోలీసులు స్ధానిక ప్రజలపై విచ్చలవిడిగా వినియోగిస్తున్న సో-కాల్డ్ ప్రమాద రహిత (నాన్-లెధల్) పెల్లెట్ తుపాకులు మనకు బాగా తెలిసిన వాళ్ళకు తగిలితే, ఆ దెబ్బల్ని మన టి.వి చానెళ్లు పచ్చిగా చూపిస్తే మనం ఎలా స్పందిస్తాము? చాలా మంది భారతీయులకి కాశ్మీర్ ప్రజలు అంటే ముస్లింలు మాత్రమే. వారు మనుషులనీ, వారికీ భారత దేశ ప్రజలకు మల్లేనే ఆశలు, ఆకాంక్షలు, ముఖ్యంగా ప్రాణాలు, జీవితాలు ఉంటాయని భావించేవారు చాలా అరుదుగా కనిపిస్తారు. కాశ్మీర్…

యాహూ అస్తమయం ఇక గోడ మీది రాత!

గూగుల్ కంటే ముందు స్ధాపించబడి ఇంటర్నెట్ సర్చ్ ప్రపంచాన్ని రారాజుగా ఏలిన యాహూ త్వరలో ఒక స్వతంత్ర కంపెనీగా ఉనికి చాలించనున్నది. యాహూ కేంద్ర (కోర్) బిజినెస్ కార్యకలాపాలను అమెరికా టెలీ కమ్యూనికేషన్ దిగ్గజం వెరిజాన్ కంపెనీ కొనుగోలు చేయడానికి ఒప్పందం కుదిరిన దృష్ట్యా ఈ పరిణామం పూర్తి కావడమే ఇక మిగిలింది. ఆపరేటింగ్ బిజినెస్ గా పేర్కొనబడుతున్న యాహూ ఇంక్ కార్యకలాపాలను 4.4 బిలియన్ డాలర్లకు (వోక్స్ పత్రిక 4.8 బిలియన్ డాలర్లుగా పేర్కొంది) కొనుగోలు…

దళిత ఓటు: మోడి ‘అఖిల్లెస్ హీల్’ -కార్టూన్

మోడి రాజకీయాలు, దళిత ఓట్లు మధ్య నెలకొన్న సంబంధాన్ని వివరించడానికి, బహుశా, ఇదే గొప్ప పోలిక! ముందు అఖిల్లెస్ హీల్ అంటే ఏమిటో చూద్దాం. ఇది చాలా మందికి తెలిసి ఉండవచ్చు, ఐనా రికార్డు కోసం, తెలియని వాళ్ళ కోసం, వివరిస్తాను. గ్రీకు పురాణాల్లో అఖిల్లెస్ ఒక పాత్ర. మహాభారతంలో దుర్యోధనుడి తొడలతో అఖిల్లెస్ పాదాన్ని పోల్చవచ్చు. అఖిల్లెస్ పుట్టుక నాడు అతను యవ్వనంలోనే చనిపోతాడని జ్యోతిష్కులు చెబుతారు. ఆమె తల్లి ధేటీస్ అతన్ని శక్తివంతుడ్ని చేయాలని…

ఎర్డోగన్ కుట్ర -ద హిందూ ఎడిట్.. 

[Erdogan’s coup శీర్షికన జులై 25 -ఈ రోజు- తేదీన ద హిందు ప్రచురించిన సంపాదకీయానికి యధాతధ అనువాదం. -విశేఖర్] ********* జులై 15 నాటి విఫల కుట్రకు టర్కీ అధ్యక్షుడు రెసిప్ తయ్యిప్ ఎర్డోగన్ ప్రతీకారంతో చూపుతున్న అసమతూక ప్రతిస్పందన పెద్దగా ఆశ్చర్యం కలిగించేది కాదు. ఆయన ప్రభుత్వంలో పెచ్చరిల్లిన నియంతృత్వ ధోరణుల దృష్ట్యా తన శత్రువులను, విమర్శకులను నిర్మూలించటానికి, అంది వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటారని అనేక మంది హెచ్చరించారు. దురదృష్టవశాత్తు ఇప్పుడు జరుగుతున్నది సరిగ్గా…

మాయావతిపై ఎఫ్‌ఐ‌ఆర్: గాయాన్ని శిక్షించాలని కత్తి డిమాండ్!

అనుకున్నంతా అయింది! అఖ్లక్ ని చంపారు. అఖ్లక్ కొడుకుని మృత్యు ముఖం వరకూ తీసుకెళ్లారు. మళ్ళీ అఖ్లక్ నీ, ఆయన కుటుంబాన్నే దొషులుగా నిలబెట్టారు, హిందూత్వ కుట్రదారులు. మాయావతిని తిట్టారు. వేశ్య కంటే నీచంగా టికెట్లు అమ్ముకుంటుంది అన్నారు. ఇప్పుడు ఆమె పైన కూడా ఫిర్యాదు చేసి, ఎఫ్‌ఐ‌ఆర్ నమోదు చేసి, ఆమెనీ దోషిని చేసేశారు. బాధితులే నేరస్ధులన్న మాట! కత్తిది కాదు, గాయానిదే తప్పన్నమాట! కత్తి దిగబడేంత మెత్తగా ఎవరుండమన్నారు, గాయాన్ని? కత్తి దూసుకొస్తుంటే పక్కకు…

క్రికెట్ దసరా, ముసలోళ్ళకి లేదిక! -కార్టూన్ 

ఎట్టకేలకు క్రికెట్-రాజకీయ మరియు రాజకీయ-క్రికెట్ పెద్దల నిరసనల మధ్య సుప్రీం కోర్టు, జస్టిస్ లోధా కమిటీ నివేదికను ఆమోదించింది. కమిటీ ప్రతిపాదించిన, తాము ఆమోదించిన సిఫారసులను ఆరు నెలల లోపు బిసిసిఐ అమలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. కమిటీ సిఫసిఫారసుల మేరకు రాజకీయ పదవులు అనుభవిస్తున్న వారు క్రికెట్ పాలనా పదవులలో ఉండటానికి వీలు లేదు. ఆ లెక్కన ఢిల్లీ క్రికెట్ సంఘం నేతగా కొనసాగుతున్న ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఆ బాధ్యత నుంచి తప్పుకోవాలి.…

ప్రమాదకర పహరా -ద హిందు ఎడిట్…

[Dangerous vigilantism శీర్షికన ఈ రోజు -జులై 21- ద హిందు ప్రచురించిన ఎడిటోరియల్ కు యధాతధ అనువాదం.] ********* గుజరాత్ లోని చిన్న పట్టణం ఉనా వద్ద “గో రక్షణ” కావలిదారుల చేతుల్లో కొందరు దళితులు హింసకు గురయిన సంఘటన, పార్లమెంటులో ప్రతిధ్వనిస్తుండగానే దానిపై నిరసనలు రాష్ట్ర వ్యాపితంగా విస్తరించడం కొనసాగుతూనే ఉన్నాయి. దళితుల నాయకత్వంలోని ఆందోళనలతో అట్టుడుకుతున్న సౌరాష్ట్రలో మెజారిటీ ప్రాంతాలు బుధవారం బంద్ పిలుపును అనుసరించి మూసివేతకు గురయ్యాయి. అక్కడ ఆందోళనకారులు వివిధ…

చైనా సరిహద్దుకు 100 ట్యాంకులు తరలింపు! 

దారిన పోయే దరిద్రాన్ని పిలిచి తలకెత్తుకోవటం అంటే ఇదే కావచ్చు. NSG (న్యూక్లియర్ సప్లయర్ గ్రూప్) సభ్యత్వం కోసం ఎన్నడూ లేని విధంగా బీజింగ్ చుట్టూ చక్కర్లు కొట్టిన ప్రధాన మంత్రి ఇప్పుడు సరిహద్దు వద్ద ఉద్రిక్తత పెరిగేందుకు దోహదం చేస్తూ చైనాతో ఘర్షణ వాతావరణం పెంచే విధంగా గిల్లి కజ్జాలు పెట్టుకుంటున్నారు. వివాదాస్పద సరిహద్దు కలిగిన లడఖ్ ఏరియా లోకి భారీ ఎత్తున యుద్ధ ట్యాంకులను  భారత ప్రభుత్వం తరలించింది. జమ్మూ & కాశ్మీర్, టిబెట్ ప్రాంతాల…

జి‌ఎస్‌టి బిల్లు: జైట్లీ అబద్ధం ఆడారు!

జి‌ఎస్‌టి వల్ల రాష్ట్ర ప్రభుత్వాలకు గతంలో లేని మేలు జరుగుతుందని ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ ఈ రోజు సభలో మాట్లాడుతూ చెప్పారు. అమ్మకపు పన్నులో గతంలో రాష్ట్రాలకు వాటా ఉండేది కాదనీ, జి‌ఎస్‌టి (గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్) బిల్లు ఆమోదం పొందితే సేల్స్ టాక్స్ లో కూడా రాష్ట్రాలకు వాటా వస్తుందని అరుణ్ జైట్లీ ఊరించారు. కానీ ఇది అబద్ధం అని మాజీ ఆర్ధిక మంత్రి పి చిదంబరం వెల్లడి చేశారు. కేంద్రానికి సమకూరే…

నగదు బదిలీ: మోడి చెప్పింది అబద్ధం! -కాగ్

అబద్ధం! అబద్ధం!! అబద్ధం!!! తమ ప్రభుత్వం గొప్పతనాల గురించి, సాధించిన బృహత్కార్యాల గురించి బి‌జే‌పి నేతలు చెప్పేవి అన్నీ అబద్ధాలే. జి‌ఎస్‌టి బిల్లు ఆమోదింపజేసుకోవడానికి ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ రాజ్యసభలోనే అబద్ధం ఆడేస్తారు. నగదు బదిలీ పధకం దేశానికి భలే ఒరగబెట్టిందని చెప్పడానికి ప్రధాన మంత్రి చాలా తేలికగా వేల కోట్ల అబద్ధాన్ని ఆడేస్తారు. బి‌జే‌పి ప్రభుత్వ నేత, ప్రధాన మంత్రి నరేంద్ర మోడి ఈ అబద్ధాల కార్యక్రమానికి నాయకత్వం వహించడం ఒక విడ్డూరం. అత్యున్నత…

వివరణ: టర్కీ సైనిక కుట్ర -అంకెల్లో..

కొన్ని గంటలలోనే, నిమిషాలు కాకుంటే, ఓటమితో ముగిసిపోయిన టర్కీ సైనిక కుట్ర పైన ప్రస్తుతం అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు కుట్ర జరగడం వాస్తవమేనా అన్నది ప్రధాన అనుమానం. తామే “కుట్రతో” కుట్ర చేయించుకుని ఆ సాకుతో మరిన్ని నియంతృత్వ అధికారాలు తనకు తానే కట్టబెట్టుకునేందుకు టర్కీ అధ్యక్షుడు రెసిప్ తయ్యిప్ ఎర్డోగన్ ప్రయత్నిస్తున్నాడని అనుమాన ప్రియుల అనుమానం. అమెరికా ప్రభుత్వ అధికారులు, వివిధ ఇంటలిజెన్స్ సంస్థల అధికారులు ఈ అనుమానాలను వ్యక్తం చేస్తున్న వారిలో ఉన్నారు.…