చైనా సరిహద్దుకు 100 ట్యాంకులు తరలింపు! 

దారిన పోయే దరిద్రాన్ని పిలిచి తలకెత్తుకోవటం అంటే ఇదే కావచ్చు. NSG (న్యూక్లియర్ సప్లయర్ గ్రూప్) సభ్యత్వం కోసం ఎన్నడూ లేని విధంగా బీజింగ్ చుట్టూ చక్కర్లు కొట్టిన ప్రధాన మంత్రి ఇప్పుడు సరిహద్దు వద్ద ఉద్రిక్తత పెరిగేందుకు దోహదం చేస్తూ చైనాతో ఘర్షణ వాతావరణం పెంచే విధంగా గిల్లి కజ్జాలు పెట్టుకుంటున్నారు. వివాదాస్పద సరిహద్దు కలిగిన లడఖ్ ఏరియా లోకి భారీ ఎత్తున యుద్ధ ట్యాంకులను  భారత ప్రభుత్వం తరలించింది. జమ్మూ & కాశ్మీర్, టిబెట్ ప్రాంతాల…

జి‌ఎస్‌టి బిల్లు: జైట్లీ అబద్ధం ఆడారు!

జి‌ఎస్‌టి వల్ల రాష్ట్ర ప్రభుత్వాలకు గతంలో లేని మేలు జరుగుతుందని ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ ఈ రోజు సభలో మాట్లాడుతూ చెప్పారు. అమ్మకపు పన్నులో గతంలో రాష్ట్రాలకు వాటా ఉండేది కాదనీ, జి‌ఎస్‌టి (గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్) బిల్లు ఆమోదం పొందితే సేల్స్ టాక్స్ లో కూడా రాష్ట్రాలకు వాటా వస్తుందని అరుణ్ జైట్లీ ఊరించారు. కానీ ఇది అబద్ధం అని మాజీ ఆర్ధిక మంత్రి పి చిదంబరం వెల్లడి చేశారు. కేంద్రానికి సమకూరే…

నగదు బదిలీ: మోడి చెప్పింది అబద్ధం! -కాగ్

అబద్ధం! అబద్ధం!! అబద్ధం!!! తమ ప్రభుత్వం గొప్పతనాల గురించి, సాధించిన బృహత్కార్యాల గురించి బి‌జే‌పి నేతలు చెప్పేవి అన్నీ అబద్ధాలే. జి‌ఎస్‌టి బిల్లు ఆమోదింపజేసుకోవడానికి ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ రాజ్యసభలోనే అబద్ధం ఆడేస్తారు. నగదు బదిలీ పధకం దేశానికి భలే ఒరగబెట్టిందని చెప్పడానికి ప్రధాన మంత్రి చాలా తేలికగా వేల కోట్ల అబద్ధాన్ని ఆడేస్తారు. బి‌జే‌పి ప్రభుత్వ నేత, ప్రధాన మంత్రి నరేంద్ర మోడి ఈ అబద్ధాల కార్యక్రమానికి నాయకత్వం వహించడం ఒక విడ్డూరం. అత్యున్నత…

వివరణ: టర్కీ సైనిక కుట్ర -అంకెల్లో..

కొన్ని గంటలలోనే, నిమిషాలు కాకుంటే, ఓటమితో ముగిసిపోయిన టర్కీ సైనిక కుట్ర పైన ప్రస్తుతం అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు కుట్ర జరగడం వాస్తవమేనా అన్నది ప్రధాన అనుమానం. తామే “కుట్రతో” కుట్ర చేయించుకుని ఆ సాకుతో మరిన్ని నియంతృత్వ అధికారాలు తనకు తానే కట్టబెట్టుకునేందుకు టర్కీ అధ్యక్షుడు రెసిప్ తయ్యిప్ ఎర్డోగన్ ప్రయత్నిస్తున్నాడని అనుమాన ప్రియుల అనుమానం. అమెరికా ప్రభుత్వ అధికారులు, వివిధ ఇంటలిజెన్స్ సంస్థల అధికారులు ఈ అనుమానాలను వ్యక్తం చేస్తున్న వారిలో ఉన్నారు.…

టర్కీలో అలజడి -ది హిందు ఎడిట్…

[True translation for today’s editorial: Turmoil in Turkey] *** కుట్రలతో కూడిన రాజకీయ వ్యవస్ధకు టర్కీ ఒక ఉత్తమ తార్కాణం. అక్కడి మిలటరీ సాపేక్షికంగా స్వతంత్రమైనది, ప్రజలలో పలుకుబడి కలిగినట్టిది. గతంలో అది నాలుగు సార్లు పౌర ప్రభుత్వాలను కూల్చివేసింది. ఉన్నత పాలక వర్గానికి, మిలటరీ వ్యవస్ధకు మధ్య అక్కడ ఉద్రిక్తతలు ఎప్పుడూ ఉంటుంటాయి. అయితే 2002 నుండి జస్టిస్ అండ్ డవలప్ మెంట్ పార్టీ నేతృత్వంలో సాపేక్షికంగా సాగుతున్న సుస్ధిర పాలన, దాని…

అరుణాచల్: కాంగ్రెస్ మాస్టర్ స్ట్రోక్! 

అరుణాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ అధికారం పోగొట్టుకోవటం ఇక లాంఛనప్రాయమే అనుకున్నారు అందరూ. చీలిక వల్ల ఆ పార్టీకి మెజారిటీ లేదు. కాస్త సమయం తీసుకుని చీలిన ఎమ్మెల్యేలను సొంత గూటికి రప్పిద్దాం అన్న లక్ష్యంతో బల నిరూపణకు సమయం కోరితేనేమో గవర్నర్ లేదు పొమ్మన్నారు. ఇంకా ఒక రోజు మాత్రమే మిగిలి ఉంది. ఈ పరిస్థితుల్లో బలం నిరూపించుకోలేక ముఖ్యమంత్రి నబామ్ టుకి రాజీనామా సమర్పించటమే తరువాయి, అని అంతా భావించారు. “ఆపరేషన్ సక్సెస్,…

బి‌జే‌పి రోడ్ రోలర్ కింద డెమోక్రసీ -కార్టూన్

భారత ప్రజాస్వామ్యాన్ని రోడ్ రోలర్ తో తొక్కిపారేసినా చివరి క్షణంలో నైనా లేచి నిలబడుతుందని, తొక్కుడుదారులను ఎత్తి కుదేస్తుందని చెప్పటం బాగానే ఉంది గానీ, జరిగింది అదేనా అన్నదే అనుమానం! రోడ్డు రోలర్ బి‌జే‌పి చిహ్నం కమలాలను శ్వాసించటం సరైన పోలిక! రోడ్ రోలర్ లో ప్రధాన తొక్కుడు గాను/చక్రం ప్రధాన మంత్రి గానూ, డ్రైవర్ ను అమిత్ షా గానూ చెప్పటం ఇంకా సరైన పోలిక! రోడ్డు రోలర్ కలర్ విషయం వేరే చెప్పాలా?!  

గడియారం వెనక్కి -ద హిందూ ఎడిట్…

[Turning back the clock శీర్షికన ప్రచురించిన ఎడిటోరియల్ కు యధాతధ అనువాదం] మరోసారి, కేంద్రం లోని స్నేహ పూర్వక ప్రభుత్వం మద్దతు కలిగిన కాంగ్రెస్ అంఅంతర్గత తిరుగుబాటు గ్రూపు వలన అధికారం కోల్పోయిన కాంగ్రెస్ ముఖ్యమంత్రి తిరిగి అధికారం చేచేపట్టనున్నారు. అరుణాచల్ ప్రదేశ్ లో డిసెంబర్ 15,2015 నాటి యధాతధ పరిపరిస్థితిని పునరుద్ధరించాలని సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పు చెప్పింది. దీని అర్థం నబామ్ టుకి ముఖ్యమంత్రిగా తిరిగి బాధ్యతలు చేపడతారు; కొద్ది కాలం…

కేంద్రం రెండో చెంపా వాయించిన సుప్రీం కోర్టు

ఇప్పటికే ఉత్తరాఖండ్ ప్రభుత్వం రద్దు విషయంలో బి‌జే‌పి నేతృత్వం లోని కేంద్ర ప్రభుత్వాన్ని ఒక చెంప వాయించిన సుప్రీం కోర్టు, అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వం మంత్రాంగం విషయంపై తీర్పు ద్వారా రెండో చెంప కూడా వాయించింది. అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్ అమలు చేసిన విచక్షణాధికారాలను రద్దు చేసింది. జనవరి 14, 2016 తేదీన ప్రారంభం కావలసిన రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలను “తన విచక్షణాధికారాలను వినియోగించి” డిసెంబర్ 16, 2015 తేదీకి మార్చుతూ గవర్నర్ తీసుకున్న నిర్ణయం చెల్లదని…

బ్రెగ్జిట్ వ్యతిరేకి చేతుల్లో బ్రెగ్జిట్!

యూకె లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఈయూ నుంచి విడాకులు తీసుకునే కార్యక్రమం బ్రెగ్జిట్ అనుకూల రాజకీయ నాయకుల చేతుల మీదుగా జరగవలసి ఉండగా అది కాస్తా ఇప్పుడు బ్రెగ్జిట్ వ్యతిరేకుల చేతుల మీదుగా జరిగిపోయే పరిస్థితి ఏర్పడింది. నిజానికి పరిస్ధితి ఏర్పడటం కాదు, అదే జరగబోతోంది కూడా. బ్రెగ్జిట్ కు వ్యతిరేకంగా ప్రచారం చేసిన బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరాన్ తన ప్రచారానికి వ్యతిరేకంగా ప్రజలు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో నైతిక బాధ్యత వహిస్తూ…

ఏ‌ఎఫ్‌ఎస్‌పి‌ఏ కింద శిక్షలేమికి ముగింపు -ద హిందూ ఎడిట్..

[Ending impunity under AFSPA శీర్షికన ఈ రోజు -11/07/2016- ద హిందు ప్రచురించిన సంపాదకీయానికి యధాతధ అనువాదం. -విశేఖర్] “జవాబుదారితనం, చట్టబద్ధ సూత్రాలకు ఒక పార్శ్వం.” విధి నిర్వహణ పేరుతో  “కల్లోలిత ప్రాంతాలలో” కూడా, భద్రతా బలగాలు పాల్పడే అతి చర్యలపై జరగవలసిన దర్యాప్తు నుండి తప్పించుకోజాలరని సుప్రీంకోర్టు ఇచ్చిన రూలింగు దరిమిలా ఈ స్థాపిత సూత్రం తాజాగా ప్రాధాన్యత సంతరించుకుంది. అటువంటి నోటిఫైడ్ ప్రాంతాల్లో భద్రతా బలగాలు తమ “ప్రత్యేక అధికారాలు” ఉపయోగించినప్పుడు చట్టబద్ధ…

ఇరాక్ యుద్ధం చట్ట విరుద్ధం -యూ‌కే మాజీ ఉప ప్రధాని

ఇరాక్ యుద్ధానికి దారి తీసిన పరిస్ధితులను విచారించటానికి గత బ్రిటిష్ ప్రభుత్వం నియమించిన ఎంక్వైరీ కమిషన్, తన నివేదికను వెలువరించిన దరిమిలా బ్రిటన్ మాజీ నేతల ఒప్పుకోళ్ళు వరదలా ప్రవహిస్తున్నాయి. 2009లో అప్పటి ప్రధాని గార్డన్ బ్రౌన్, లార్డ్ జాన్ చిల్కాట్ నేతృత్వంలో నియమించిన విచారణ కమిషన్ కొద్ది రోజుల క్రితం విచారణ నివేదికను విడుదల చేసింది. ఆనాటి ప్రధాని టోని బ్లెయిర్ సరైన కారణాలు లేకుండా బ్రిటిష్ యువ సైనికుల ప్రాణాలను బలి పెడుతూ దేశాన్ని…

పౌల్ట్రీ తగాదా: ఇండియాపై ఆంక్షలు కోరుతున్న అమెరికా

‘తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే’ అంటుంటారు పెద్దలు. ఈ సిద్ధాంతాన్ని అమలు చేయటంలో అమెరికాని మించిన వారు ఉండబోరు. “ఇండియా అంతకంతకూ అమెరికాకు నమ్మకమైన భాగస్వామిగా మారుతోంది” అని వివిధ వేదికల పైన చెబుతున్న అమెరికా కోడిగుడ్ల వాణిజ్యం విషయంలో ఇండియాపై పగబట్టి వ్యవహరిస్తోంది. అమెరికా నుండి వచ్చే కోడి గుడ్లు, కోడి మాంసం, పందుల దిగుమతులపై ఇండియా ఎప్పటి నుండో పలు ఆంక్షలు విధించింది. పౌల్ట్రీ దిగుమతుల ద్వారా అమెరికా నుండి బర్డ్ ఫ్లూ ప్రమాదం…

మోడి కేబినెట్ విస్తరణకు అర్ధమేమి? -కార్టూన్

ప్రధాన మంత్రి నరేంద్ర మోడి ఎన్నాళ్లుగానో ఊరిస్తూ వచ్చిన కేబినెట్ విస్తరణ ఎట్టకేలకు పూర్తయింది. ఇది యధావిధిగా మోడి మార్కు విస్తరణగానే ఉన్నదని పత్రికలు, ఛానెళ్లు వ్యాఖ్యానించగా, ఇందులో ప్రత్యేకత ఏమీ లేదని అభివృద్ధి లక్ష్యంగా కొన్ని సర్దుబాట్లు జరిగాయని బి‌జే‌పి ప్రభుత్వ నేతలు వ్యాఖ్యానించారు. బి‌జే‌పి నేతలు ఏమి చెప్పినా, ఏ కారణము లేకుండా, ఏ ఫలితమూ ఆశించకుండా ప్రధాన మంత్రి తన కేబినెట్ లో మార్పులు, చేర్పులు చేస్తారంటే నమ్మటానికి వీలు లేదు. “కేబినెట్…

గిరిజన విద్యకు గుజరాత్ వరస్ట్ రాష్ట్రం -బి‌జే‌పి నేత

కేంద్ర మంత్రివర్గంలో మార్పులు, చేర్పులు, తొలగింపులు జరిగాక అసమ్మతి స్వరాలు మెల్లగా బయలు దేరుతున్నా యి. అయితే ఆ అసమ్మతి పదవి పేరుతో కాకుండా పార్టీ పనితనం పేరుతో వ్యక్తం కావటం విశేషం. ‘కాంగ్రెస్ కంటే మాది భిన్నమైన పార్టీ’ అని బి‌జే‌పి నేతలు చెబుతుంటారు. అసమ్మతిలో కూడా భిన్నం అన్నమాట! కేంద్ర మంత్రివర్గంలో మన్సుఖ్ వాసవ నిన్నటి వరకు గిరిజన శాఖ మంత్రిగా పని చేశారు. బి‌జే‌పి/మోడి ప్రభుత్వం అధికారం చేపట్టిన మే 2014 నుండి…