కొనసాగుతున్న షేర్ల పతనం

భారత షేర్ మార్కెట్ల పతనం కొనసాగుతోంది. అమెరికా రుణ పరిమితి పెంపుపై సోమవారం ఒప్పందం కుదరడంతో లాభాలు పొందిన షేర్ మార్కెట్లు, మంగళవారం పాత భయాలు తిరిగి తలెత్తడంతో నష్టాలకు గురయ్యాయి. అమెరికా ఆర్ధిక వ్యవస్ధ వృద్ధి నెమ్మదించడం, యూరప్ లోని బలహీన ఆర్ధిక వ్యవస్ధలున్న దేశాల్లో అప్పు సంక్షోభంపై తిరిగి ఆందోళనలు తలెత్తడం, భారత ఆర్ధిక వృద్ధికి అధిక ద్రవ్యోల్బణం ప్రతిబంధకంగా మారడం… ఇవన్నీ రంగం మీదికి రావడంతో షేర్ మార్కెట్లు నష్టాల బాట పట్టాయి.…

అబ్బే, నేనసలు ల్యాప్ టాపే మొయ్యను, పగిలిందెప్పుడు? -వెంకయ్య నాయుడు

ఆగ్రహంతో ఉన్న యెడ్యూరప్ప తన ల్యాప్ టాప్ ను లాక్కొని విసిరేసి పగలకొట్టాడని మీడియాలో వచ్చిన వార్తను వెంకయ్య నాయుడు ఖండించాడు. తానసలు లాప్ ట్యాప్ ని మోసే పనిని పెట్టుకోననీ ఇక మరొకరు లాక్కొని పగలగొట్టే పరిస్ధితే తలెత్తదనీ వెంకయ్య నాయుడు అన్నాడు. తనకు మద్దతు ఇస్తూ రాసిన లేఖలో సంతకం పెట్టడానికి నిరాకరించడంతో అగ్రహంతో వెంకయ్య నాయుడు చేతిలోని ల్యాప్ టాప్ లాక్కొని నేలకేసి విసిరి కొట్టినట్లుగా టైమ్స్ ఆఫ్ ఇండియా, ఇండియా టు…

ల్యాప్ టాప్‌ విసిరేస్తూ, చెంప ఛెళ్ళుమనిపిస్తూ, పదవీవియోగ నైరాశ్యంలో యెడ్యూరప్ప

కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి, ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న బి.ఎస్.యెడ్యూరప్ప పదవీ వియోగంతోనో మరి దేనివల్లనో అదుపు తప్పినట్లు కనిపిస్తోంది. బి.జె.పి మాజీ అధ్యక్షుడూ వెంకయ్య నాయుడు ల్యాప్ టాప్‌ లాక్కొని మరీ నేలకు విసిరికొట్టి ఆయనపై యెడ్యూరప్ప ఆగ్రహం ప్రకటించినట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా తెలిపింది. ఇంటివద్ద తనను కలవడానికి వచ్చిన పార్టీ నాయకుడొకరిని చెంప ఛెళ్ళుమనిపించిన సంగతి కూడా ఆ పత్రిక వెల్లడించింది. ఇండియా టుడే కధనం ప్రకారం, యెడ్యూరప్ప తనకు మద్దతు…

అమెరికా రుణ పరిమితి పెంపుకు ఒప్పందం, ప్రతినిధుల సభ ఆమోదం

ఆగస్టు 2 లోగా అమెరికా రుణ పరిమితిని పెంచుతూ చట్టాన్ని ఆమోదించాల్సి ఉన్న నేపధ్యంలో అనేక వారాల పాటు చర్చలు, తర్జన భర్జనలు జరిగాక ఎట్టకేలకు, అమెరికా ప్రతినిధుల సభ లోని డెమొక్రటిక్, రిపబ్లికన్ సభ్యులు, వైట్ హౌస్ మధ్య ఆగస్టు 1 న ఒప్పందం కుదిరింది. ఒప్పందం మేరకు ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టిన “ది బడ్జెట్ కంట్రోల్ యాక్ట్ 2011” ను  సభ్యులు 269-161 ఓట్ల తేడాతో ఆమోదం తెలిపారు. ప్రతినిధుల సభలో ఆమోదం పొందిన…

ముదిరిన సి.ఐ.ఎ, ఐ.ఎస్.ఐ ల విభేధాలు, ఐ.ఎస్.ఐ ఛీఫ్ రహస్య చైనా పర్యటన

అమెరికా, పాకిస్ధాన్ ల సంబంధాలు రోజు రోజుకీ జఠిలంగా మారుతున్నాయి. ప్రచ్ఛన్న యుద్ధం సాగిన యాభై సంవత్సరాల పాటు అమెరికాకి దక్షిణాసియాలో నమ్మకమైన బంటుగా ఉంటూ వచ్చిన పాకిస్ధాన్‌తో, అమెరికా సంబంధాలు గతంలో ఎన్నడూ లేనంతగా దిగజారాయి. ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో ఒకవైపు ఇండియా, రష్యాల మధ్య స్నేహ సంబంధాలు అభివృద్ధి చెందగా, మరొక వైపు పాకిస్ధాన్, అమెరికాల మధ్య సత్సంబంధాలు అభివృద్ధి చెందాయి. స్నేహ సంబంధాలు అనడం కంటే, భారత్, పాకిస్ధాన్‌ల పాలక వర్గాలు తమ…

‘పులి పాప’ను పాల డబ్బాతో సాకుతున్న ‘పిల్ల చింపాంజీ’ -ఫొటోలు

మనిషికి, ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే హోమో సెపియన్ కి అత్యంత దగ్గరి పోలికలు ఉన్నది చింపాంజీకే నని జీవ శాస్త్రవేత్తలు చెబుతారు. చింపాంజీల చేష్టలు, అలవాట్లు, వివిధ అవసరాల కోసం అవి చూపించే కదలికలు, కొద్ది ముఖంలో కూడా ప్రతిఫలించే హావ భావాలు… ఇవన్నీ ఆ విషయం నిజమేనని స్పష్టం చేస్తాయి కూడా. పేదల ఇళ్ళల్లో తల్లి దండ్రులు పని చేయగల వారినందర్నీ కూలి పనులకు పట్టుకుపోతే, ఇంట్లోనే ఉండక తప్పని చంటి పాపను, పాపకంటే నాలుగో,…

మరింత క్షీణిస్తున్న భారత ఆర్ధిక వృద్ధి, లక్ష్య సిద్ధి అనుమానమే

భారత దేశ ఆర్ధిక వృద్ధి మరింత క్షీణిస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. వివిధ రంగాల్లో ఉత్పత్తి పెరుగుదల రేటు తగ్గిపోతుండడంతో జి.డి.పి వృద్ధి రేటు అంచనా వేసిన దానికంటే తక్కువే నమోదు కావచ్చని ప్రభుత్వంలోని ఆర్ధిక సంస్ధలు, పరిశీలకులు భావిస్తున్నారు. దానితో గతంలో విధించుకున్న జిడిపి వృద్ధి రేటు లక్ష్యాన్ని ప్రభుత్వం తగ్గించుకుంటోంది. జి.డి.పి వృద్ధితో పాటు మార్చి 2011 నాటికి చేరాలని భావిస్తున్న బడ్జెట్ లోటు (ఫిస్కల్ డెఫిసిట్), ద్రవ్యోల్బణం తదితర లక్ష్యాలను కూడా ప్రభుత్వం తగ్గించుకుంటోంది.…

ఫుకుషిమా శుభ్రతకు దశాబ్దాలు, అణు పరిశ్రమకు అంతం పలకాలని కోరుతున్న జపాన్

“జపాన్ కాంగ్రెస్ ఎగైనెస్ట్ అటామిక్ అండ్ హైడ్రోజన్ బాంబ్స్” మొదటి సమావేశం, భూకంపం, సునామీల వలన అణు ప్రమాదం సంభవించిన ఫుకుషిమాలో సోమవారం ప్రారంభమయ్యింది. అణు విద్యుత్ పరిశ్రమకు ఇక అంతం పలకాలని ఆ సదస్సు కోరింది. అణు విద్యుత్ కానీ, అణు బాంబులు కానీ ఏవీ వాంఛనీయం కాదనీ రెండూ మానవాళికి ప్రమాదకారులేననీ సమావేశం తెలిపింది. రిక్టర్ స్కేల్ పై 9 పరిమాణంతో మార్చి 11 న ఫుకుషిమా దైచి అణు ప్లాంటు వద్ద సంభవించిన…

ప్రతిపక్షాల కుంభకోణాలకేమీ తక్కువలేదు, మాకేం భయం? -ప్రధాని

అటు పాలక పక్షాలు, ఇటు ప్రతిపక్షాలూ… ఎవర్ని కదిలించినా తాము “సాధు పుంగవులమ”నే అంటారు. “కోరికలసలే లేక ప్రజాసేవలో తరించవచ్చిన సన్యాసులమే” అంటారు. మరే! రాజకీయ నాయకులు వారు చెప్పుకున్నట్లు కోరికలు లేని సన్యాసులే. అపుడు ‘సన్యాసీ సన్యాసీ రాసుకుంటే రాలేది బూడిదే’ అన్నది పాతకాలపు సామెత గా రద్దవుతుంది. ‘సన్యాసీ సన్యాసీ రాసుకుంటే రాలతాయి బోలెడు కుంభకోణాలు’ అన్నది ఆధునిక నియమంగా స్ధిరపడుతుంది. ప్రధాని మన్మోహన్ వెల్లడించిన ధైర్యంలో ఆ సంకేతాలే కనపడుతున్నాయి. సోమవారం వర్షాకాల…

బీహార్ పాఠశాల గ్రంధాలయాల్లొ అర్.ఎస్.ఎస్ పుస్తకాలు -జె.డి(యు) రెబెల్స్

తనను తాను అసలైన సెక్యులరిస్టుగా చెప్పుకునే నితీష్ కుమార్ బీహార్ పాఠశాలల కోసం ఆర్.ఎస్.ఎస్ సిద్ధాంతాలను బోధించే పుస్తకాలను కొనడానికి అనుమతించాడని జనతా దళ్ (యునైటెడ్) పార్టీ తిరుగుబాటు నాయకుడు ఒకరు ఆదివారం వెల్లడించాడు. మతన్మోదాన్ని, విద్వేషాలనూ రెచ్చగొట్టే ఈ పుస్తకాలను వెంటనే పాఠశాలల గ్రంధాలయాలనుండి తొలగించాలని ఆయన డిమాండ్ చేశాడు. ప్రభుత్వ నిధులను ఖర్చు చేసి ఆర్.ఎస్.ఎస్ భావాల వ్యాప్తికి దోహదం చేసే పుస్తకాలను కొనుగోలు చేసి పాఠశాల పిల్లలకు అందుబాటులో ఉంచడం తగదని ఉపేంద్ర…

2జి కుంభకోణానికి ‘తెలంగాణ డిమాండ్’ అడ్డు చక్రం, కాంగ్రెస్ వ్యూహం

పాలక కాంగ్రెస్ పార్టీకి ఉన్న అనుభవం అపారం. ఏ బిల్లుని ఎలా ఆమోదింపజేసుకోవాలో, ఏ ఆందోళననను ఎలా తప్పించుకోవాలో, ఏ సంకటం నుండి ఎలా బైటపడాలో కాంగ్రెస్ పాలకులకు తెలిసినంతగా మరెవరికీ తెలియదనడంలో అతిశయోక్తి లేదు. సోమవారం నుండి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలు కాంగ్రెస్ నేతృత్వంలోని యు.పి.ఎ ప్రభుత్వానికి పెద్ద గండంగా మారాయి. ఓవైపు తాము నిండా మునిగి ఉన్న కుంభకోణాలకు సమాధానం చెప్పుకోవలసి ఉండగా, మరొక వైపు అంతర్జాతీయ పెట్టుబడుదారులనుండీ,…

పోస్టాఫీసులు రద్దు చేసి బ్యాంకులు నెలకొల్పుతాం -కపిల్ సిబాల్

దేశ వ్యాపితంగా ఉన్న 1.5 లక్షల పోస్టాఫిసులపై ప్రవేటీకరణ మంత్రుల కన్నుపడింది. ప్రభుత్వంలో ప్రవేటీకరణ కోసం, నూతన ఆర్ధిక విధానాలను వేగంగా అమలు చేయడం కోసం ప్రత్యేకంగా కొంతమంది మంత్రులను ప్రధాని మన్మోహన్ నియమించుకున్నాడు. వారిలో కపిల్ సిబాల్ ఒకరు. ఈయన పూర్వాశ్రమంలో సుప్రీం కోర్టులో పేరు మోసిన న్యాయవాది. అమెరికా పాలకులకు ఇష్టుడు. 2జి కుంభకోణం వలన ప్రభుత్వానికి రు.176,000 కోట్ల నష్టం వాటిల్లి ఉండొచ్చని భారత అత్యున్నత ఆడిటింగ్ సంస్ధ చెప్పగా, కపిల్ సిబాల్…

సుప్రీం కోర్టు తీర్పును పట్టించుకోని బళ్ళారి మైనింగ్ మాఫియా, ఖనిజం సీజ్

మాఫియాకి తీర్పులు, ఆదేశాలు ఒక అడ్డా? కోర్టుల తీర్పులు, ప్రభుత్వాల ఆదేశాలే దానికి అడ్డయితే అది మాఫియా కాదేమో! గత గురువారం బళ్ళారిలో ఇనుప ఖనిజం తవ్వకాలను, రవాణాను సస్పెండ్ చేస్తూ సుప్రీం కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను బేఖాతరు చేస్తూ బళ్ళారి నుండి 49 ట్రక్కులతో ఇనుప ఖనిజం రావాణా చేస్తూ బళ్ళారి వద్ద దొరికిపోయారు. బళ్ళారి శివార్లలో ఉన్న ఆలిఘర్ వద్ద ఇనుప ఖనిజాన్ని చట్ట విరుద్ధంగా రవాణా చేస్తుండగా జిల్లా…

అమెరికా కంటే యాపిల్ కంపెనీ వద్దే డబ్బు ఎక్కువగా ఉంది!

ప్రస్తుతం అమెరికా కోశాగార విభాగం కంటే యాపిల్ కంపెనీ వద్దే డబ్బు ఎక్కువగా ఉన్న సంగతి వెల్లడయ్యింది. తాజా గణాంకాల ప్రకారం, అమెరికా ట్రెజరీ డిపార్ట్‌మెంట్ వద్ద ఆపరేటింగ్ ఖర్చుల కోసం 73.7 బిలియన్ డాలర్ల సొమ్ము ఉంది. ఐఫోన్, ఐప్యాడ్ ల సృష్టికర్త యాపిల్ కంపెనీ అత్యంత తాజాగా వెల్లడించిన ఫైనాన్షియల్ ఫలితాల ప్రకారం కంపెనీ వద్ద 76.4 బిలియన్ డాలర్లు ఉంది. అంటే అమెరికా కోశాగారం కంటే 2.7 బిలియన్ డాలర్లు యాపిల్ కంపెనీ…

‘ఫ్యాషన్ ఐకాన్‌’ గా చిత్రించడంపై ఆగ్రహించిన పాక్ విదేశీ మంత్రి హైనా రబ్బాని

భారత పత్రికలు పాకిస్ధాన్ విదేశాంగ మంత్రి హైనా రబ్బానీ ఖర్, తనను భారత పత్రికలు ‘ఫ్యాషన్ ఐకాన్’ గా అభివర్ణించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రతి చోటా పేపరాజ్జీ ఎదురవుతూనే ఉంటుందనీ పత్రికలు అలా వ్యవహరించడం సరికాదని పాకిస్ధాన్ మీడియా వేసిన ఒక ప్రశ్నకు సమాధానంగా తెలిపింది. ఆ ప్రశ్న అనంతరం మరో ప్రశ్న వేయడానికి మీడియాకి అనుమతి ఇవ్వకుండా వెళ్ళిపోయేంతగా హైనా రబ్బానీ తనపై వచ్చిన ముద్ర పట్ల ఆగ్రహం చెందింది. ఇటీవల భారత…