ఇప్పుడు నాకొక పాట కావాలి –గేయమైన గాయం
బాధితులనే దొషులుగా నిలబెడుతున్న హిందూత్వ కుటిల పాలనలో నరకబడ్డ అఖ్లక్ లపైనే చార్జి షీట్లు నమోదవుతున్నాయి. హైదారాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో దళిత ప్రజ్వలనంలో తనను తాను ఆహుతి చేసుకున్న రోహిత్ వేముల ఈ దేశ దళితోద్ధారక చట్టాల సాక్షిగా దళితుడు కాడని రుజువు చేయబడ్డాడు. ఎన్నికల కోసం చేసే దళిత వివక్ష నిర్మూలనా శపధాలను హైందవ కపట నీతి దళితతనం నిర్మూలనతో నెరవేర్చుతున్నది. దళిత పుట్టుకనే నిరాకరించడం ద్వారా దళిత అణచివేత సమస్యను కృత్రిమంగా మాయం చేసేస్తున్న…














