గాలి కోసం జగన్ బూతులు బెదిరింపులు

అనంతపురం జిల్లాలో మైనింగ్ లీజుల్ని గాలి కంపెనీకి అప్పజెప్పడంలో వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి పాత్ర స్పష్టంగా తెలుస్తున్నప్పటికీ సి.బి.ఐ జగన్ అరెస్టుకి ఎందుకు వెనకాడుతోంది? గాలి జనార్ధన రెడ్డి కంటే ముందే ఇనుప గనుల లీజుకి దరఖాస్తు చేసుకున్నప్పటికీ తన కంపెనీని కాదని గాలి కంపెనీకి గనులు లీజు ఇచ్చారనీ, ఈ విషయంపై కోర్టుకి వెళ్లడంతో జగన్ తనను బెంగుళూరుకి మూడుసార్లు పిలిపించి ఇష్టం వచ్చిన రీతిలో బూతులు తిట్టి బెదిరించాడనీ, అందువల్లనే తాను కేసుతో పాటు లీజు…

ఇన్‌స్క్రిప్ట్+ తెలుగు కీబోర్డ్ లేఔట్

Originally posted on వీవెనుడి టెక్కునిక్కులు:
ప్రపంచవ్యాప్తంగా ఉన్న లిపులన్నింటినీ కంప్యూటర్లలో ఉపయోగించుకునేందుకు వీలుగా యూనికోడ్ కన్సార్టియమ్ అన్ని అక్షరాలకూ స్థిరమైన సంకేతబిందువులను కేటాయిస్తుంది. వీటిల్లో ప్రస్తుతం వాడుకలో ఉన్న అక్షరాలే కాకుండా, కాలగతిలో కలిసిపోయిన అక్షరాలు కూడా ఉంటాయి. పురాతన గ్రంథాలను సాంఖ్యీకరించడానికి ప్రాచీన అక్షరాల/గుర్తుల అవసరం ఉంటుంది కదా. ఇవన్నీ యూనికోడ్ ప్రమాణంలో ఉన్నంత మాత్రన అంతిమ వాడుకరులకు అందుబాటులో ఉండకపోవచ్చు. ఎందుకంటే, వాటిని టైపు చెయ్యడానికి ఒక పద్ధతో పరికరమో కావాలి కదా! భారతీయ భాషలకు…

ఆ డాక్టరే లాడెన్‌ని పట్టిచ్చాడు -అమెరికా

బిన్ లాడెన్ ఆచూకి తెలుసుకోవడంలో తమకు సహాయపడింది పాకిస్ధాన్ ప్రభుత్వం అరెస్టు చేసిన డాక్టరేనని అమెరికా మొదటిసారి ధృవీకరించింది. డిఫెన్స్ సెక్రటరీ లియోన్ పెనెట్టా ఓ టెలివిజన్ ఛానెల్ కి ఇంటర్వూ ఇస్తూ ఈ నిజాన్ని కక్కాడు. అబ్బోత్తాబాద్ లో లాడెన్ నివసించాడని చెబుతున్న ఇంటికి సమీపంలోనే పెనెట్టా చెబుతున్న డాక్టర్ నివాసం ఉంటున్నాడు. అమెరికాకి చెందిన నావీ సీల్ విభాగ కమాండర్లు రెండు హెలికాప్టర్లలో బయలుదేరి, పాకిస్ధాన్ ప్రభుత్వానికి చెప్పకుండా, పాకిస్ధాన్ గగనతలంలోకి జొరబడి, ఒసామా…

రెండేళ్ళ పాపని కొట్టి, గోడకి బాది…

ఎ.ఐ.ఐ.ఎం.ఎస్ ట్రౌమా సెంటర్ లో రెండేళ్ళ పాప ‘ఫాలక్’ కధ విన్న ఎవరికైనా హృదయం చలించక మానదు. రెండు చేతుల్లోనూ ఎముకలు చిట్లి, నేరుగా మెదడుకే గాయాలై, కపాలం ఫ్రాక్చరై, వొంటినిండా కొరికిన గాట్లతో ఉన్న ‘ఫాలక్’ని పది రోజుల క్రితం మరో పదిహేనేళ్ల పాప ‘మహి గుప్త’, జనవరి 18న ‘తానే తల్లి’ నంటూ ఎ.ఐ.ఐ.ఎం.ఎస్ లో చేర్చింది. మంచం పైనుండి కింద పడిందనీ, ఆ తర్వాత బాత్రూమ్ లో జారి పడిందనీ విభిన్న కధనాలు…

‘పెట్టుబడి’ క్రౌర్యానికి ఇద్దరు బలి

‘అనంత’ లాభాలను గుంజుకోవడానికి వెంపర్లాడే పెట్టుబడి క్రౌర్యానికి ఇద్దరు బలయ్యారు. మరణించినవారిలో ఒకరు కార్మిక యూనియన్ నాయకుడు కాగా మరొకరు కంపెనీ వైస్ ప్రెసిడెంట్. యాజమాన్యానికి కొమ్ము కాస్తూ పోలీసులు అమానుషంగా జరిపిన లాఠీ ఛార్జిలో కార్మికుల నాయకుడు చనిపోగా, తమ నాయకుడి మరణానికి ఆగ్రహంగా తిరగబడ్డ కార్మికుల చేతిలో కంపెనీ వైస్ ప్రెసిడెంట్ చనిపోయాడు. కార్మికులకు స్ధానిక ప్రజానీకం సంఘీభావంగా ఉద్యమిస్తుండడంతో యానాంలో ఉద్రిక్తతలు ఇంకా చల్లబడలేదని తెలుస్తోంది. కాకినాడకి ముప్ఫై కి.మీ దూరంలో ఉన్న…

ఈ స్పామ్ కామెంట్స్ లక్ష్యం ఏంటి?

ఇక్కడ మూడు స్క్రీన్ షాట్స్ ఇవ్వబడ్డాయి. ఇవి వ్యాఖ్యలుగా ఈ బ్లాగ్ లో పోస్ట్ అయ్యాయి. ఈ స్పాం కామెంట్లకు లక్ష్యం పట్ల నాకు కొన్ని అనుమానాలు తలెత్తడం వల్ల బహిరంగం చేయడం జరుగుతోంది. మొదటి రెండు స్క్రీన్ షాట్లలో చూస్తే ఆ వ్యాఖ్యలకు అర్ధం లేనట్లు తెలుస్తూనే ఉంది. మూడో స్క్రీన్ షాట్ లో చివరి వ్యాఖ్య మిగత వ్యాఖ్యలకు భిన్నంగా ఉంది. ఈ వ్యాఖ్య, గురు గోల్వాల్కర్ బోధనలను ఉటంకిస్తూ రాసిన పోస్టు కింద…

గడ్డాఫీ లాబీయిస్టుల చేతిలో లిబియా పట్టణం

గడ్డాఫీ అనుకూలురు పశ్చిమ లిబియాలోని ముఖ్య పట్టణం ‘బాని వాలిద్’ ను సోమవారం సాయంత్రం తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. గడ్డాఫీని హత్య చేసిన తిరుగుబాటు ప్రభుత్వం ఎన్.టి.సి కి చెందిన స్ధానిక కమాండర్ ఒకరు ఈ విషయం తెలిపినట్లుగా వార్తా పత్రికలు తెలిపాయి. మూడు నెలల క్రితం లిబియా మాజీ అధ్యక్షుడు గడ్డాఫీ, ఆయన ప్రభుత్వంలోని అనేకమందిని చంపిన అమెరికా, ఫ్రాన్సు, బ్రిటన్ బలగాలు లిబియాని తమకు అనుకూలురైన ఎన్.టి.సి (నేషనల్ ట్రాన్సిషనల్ కౌన్సిల్) ని అధికారంలో…

మొదటి భారత మహిళా ప్రెస్ ఫొటోగ్రాఫర్ ‘హోమై’ ఫొటోలు

భారత దేశంలో మొట్టమొదటి మహిళా ఫొటోగ్రాఫర్ గా ప్రసిద్ధికెక్కిన ‘హోమై వ్యారవల్లా’ జనవరి 15 తేదీన మరణించింది. మరణించేనాటికి ఆమెకు తొంభై ఎనిమిదేళ్ళు. స్వతంత్ర భారత దేశం జన్మించినప్పటినుండీ పత్రికా ఫొటోగ్రాఫర్ గా ముప్ఫై మూడేళ్ల పాటు ఈమె తన వృత్తిని కొనసాగించారు. బ్రిటిష్ ఇండియా అంతం, స్వతంత్ర ఇండియా ప్రారంభానికి సంబంధించి ఈమె తీసిన ఫొటోలు ఇప్పటికీ చారిత్రాత్మకంగా మన్ననలు అందుకుంటున్నాయి.  1913 లో గుజరాత్ లోని నవసారి లో ఓ మధ్య తరగతి పార్శీ…

నూతన ఆర్ధిక విధానాలపై పోరాడని అవినీతి వ్యతిరేక పోరాటాలు వృధా

(గతంలో రెండు భాగాలుగా ఈ వ్యాసం రాయబడింది. ఆ వ్యాసంలో అనవసరమైన భాగాలు తొలగించి, మరిన్ని వివరాలు జోడించి, మరింత పరిపూర్ణత కావించి తిరిగి ప్రచురించడం జరుగుతోంది) అన్నా హజారే భారత దేశంలో రాజకీయ నాయకులు, బ్యూరోక్రసీ అధికారులఅవినీతికి వ్యతిరేకంగా గత సంవత్సర కాలంగా పోరాడుతున్నాడని పత్రికలు కోడై కూస్తునాయి. ఈ మధ్య కాలంలో ఈ కూతల సంఖ్య తగ్గినా అన్నా హజారే కి అవినీతి వ్యతిరేక పోరాట యోధుడు బిరుదు ఇవ్వడం మానలేదు. పఠిష్టమైన లోక్…

2డి తో 3డి ఎఫెక్ట్ -వీధి చిత్రం

ఇక్కడ ఉన్న ఫొటోల్లో మొదటిది పూర్తి చేసిన వీధి చిత్రం. ఆ తర్వాత ఉన్నవి ఆ చిత్రం గీస్తున్న క్రమంలో వివిధ దశలు. చివరి బొమ్మను చూస్తే గానీ ఇందులో మర్మం అర్ధం కాదు. మీరూ ఓ సారి పరిశీలించండి. – – – Ninja1 మరియు Mach505 లు ఈ చిత్ర గీశారట. –

అమెరికా రాయబారి రాకను వద్దన్న పాక్

అమెరికా ప్రత్యేక రాయబారి మార్క్ గ్రాస్‌మన్, తాను పాకిస్ధాన్ సందర్శిస్తానని కోరగా, ‘ఇప్పుడు వద్దు’ అని నిరాకరించి, పాకిస్ధాన్ సంచలనం సృష్టించింది. పాకిస్ధాన్ కి చెందిన సీనియర్ అధికారి ఒకరి ఈ సంగతి వెల్లడించినట్లుగా రాయిటర్స్ వార్తా సంస్ధ తెలిపింది. అమెరికా, పాకిస్ధాన్ ల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలను ఇది సూచిస్తోంది. రాయబారిని రావొద్దని కోరడానికి గల కారణాలను పాక్ అధికారి వివరించలేదు. “రాయబారి గ్రాస్‌మన్ పాకిస్ధాన్ సందర్శిస్తానని విజ్ఞప్తి చేశాడు. కాని ఈ సమయంలో ఆయన…

ప్రాణాంతక మధురై జల్లికట్టు -ఫొటోలు

తమిళనాడులొ మధురై సమీపాన ఉన్న అనంగనల్లూరు గ్రామంలో జరిగిన జల్లికట్టు దృశ్యాలివి. ‘జల్లి కట్టు’ పేరుతో ఆంబోతులతో తలపడే ఆచారం ఒక్క ఆంధ్ర ప్రదేశ్ కే పరిమితం కాదన్నమాట! ‘ఈ ఎద్దులు మాకు దైవంతో సమానం’ అని జల్లికట్టు జరిగిన ప్రాంగణంలో ప్రదర్శించబడిన ఒక బ్యానర్ చెబుతోంది. దైవం అంటూనె వాటిపై హింసకు పాల్పడడం కేవలం ‘జీవన వైవిధ్యం’ గానో, ‘సంస్కృతి’ గానో చెప్పుకుని సరిపెట్టుకోగలమా? జల్లికట్టు సందర్భంగా క్రీడలో పాల్గొన్న వారు యూనిఫారం ధరించారు. యూనిఫారం…

‘లోకాయుక్త’పై సుప్రీంకి మోడి ప్రభుత్వం

గుజరాత్ రాష్ట్ర లోకాయుక్త నియామకం విషయంలో గుజరాత్ హై కోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీం కోర్టులో అప్పీలు చేయడానికి గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. న్యాయ నిపుణుల సలహాలు తీసుకుని త్వరలో సుప్రీం కోర్టు తలుపు తడతామని గుజరాత్ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. గుజరాత్ హై కోర్టు తన మెజారిటీ తీర్పు ద్వారా లోకా యుక్త నియామకంపై రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ ని కొట్టివేసింది. గుజరాత్ గవర్నర్ కమ్లా బేనివాల్ గత సంవత్సరం ఆగష్టులో…

గుజరాత్ కోర్టులో ‘మోడి’కి మొట్టికాయ

గుజరాత్ లోకాయుక్త నియామకం విషయంలో గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడి మరొక ఎదురు దెబ్బ తగిలింది. గవర్నర్ పూనుకుని, స్వతంత్రంగా చేసిన లోకాయిక్త నియామకం చెల్లదనీ, అది రాజ్యంగ వ్యతిరేకం  అని వాదిస్తూ గజరాత్ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ ను గుజరాత్ హై కోర్టు, మెజారిటీ తీర్పు ద్వారా కొట్టి వేసింది. గుజరాత్ గవర్నర్ ‘కమ్లా బెనీవాల్’ ఆగష్టు 25, 2011 తేదీన రిటైర్డ్ జస్టిస్ ఆర్.ఎ.మెహతా ను గుజరాత్ ‘లోకాయుక్త’ గా నియమించింది.…