Myanmar elections

మియాన్మార్ ఎన్నికల్లో ‘ఆంగ్ సాన్ సూక్యీ’ గెలుపు -కార్టూన్

మియాన్మార్ ఉప ఎన్నికల్లో ‘ఆంగ్ సాన్ సూక్యీ’ పార్టీ ఎన్.ఎల్.డి (నేషనల్ లీగ్ ఫర్ డెమొక్రసి) విజయ దుందుభి మోగించిందని పత్రికలు రాస్తున్నాయి. ఇంకా ఫలితాలు వెల్లడికాకపోయినా, కౌంటింగ్ కేంద్ర్రాల నుండి వస్తున్న సమాచారం ద్వారా, ఎన్నికలు జరిగిన నలభై ఐదు స్ధానాల్నీ ఆ పార్టీ గెలుచుకోబోతున్నట్లు తెలిసిందని అవి రాస్తున్నాయి. మియాన్మార్ మిలట్రీ పాలకులపైన ఉన్న వ్యతిరేకతా, సూక్యీ కి ఉన్న పరపతిని దృష్టిలొ పెట్టుకున్నపుడు ఆ వార్తలు పెద్దగా ఆశ్చర్యం కలిగించేవి కావు. ఇన్నాళ్ళూ…

అమెరికా, ఇ.యు వాణిజ్య బెదిరింపులను సాహసోపేతంగా తిప్పికొడుతున్న అర్జెంటీనా

అమెరికా, యూరోపియన్ యూనియన్ ల ఆధిపత్య వాణిజ్య విధానాలను తిప్పికొట్టడంలో అర్జెంటీనా సాహసోపేతంగా వ్యవహరిస్తోంది. తమ దేశ ప్రయోజనాలను బలి పెట్టే విధంగా విదేశీ ఒత్తిడులకు తల వంచేది లేదని అమెరికా, ఇ.యు లకు చేతల ద్వారా స్పష్టం చేస్తోంది. డబ్ల్యూ.టి.ఓ వద్ద అమెరికా, ఇ.యు లు చేస్తున్న తప్పుడు ఫిర్యాదులకు బెదిరేది లేదని తెగేసి చెబుతోంది. అర్జెంటీనా వాణిజ్య విధానాల పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ అమెరికా, ఇ.యు లు డబ్ల్యూ.టి.ఓ లో ఆదివారం ఫిర్యాదు…

సిరియా తరలి వెళ్ళిన రష్యా యుద్ధ నౌక ‘డిస్ట్రాయర్’

రష్యన్ నేవీ కి చెందిన యుద్ధ నౌక సిరియా ఓడ రేవు కి బయలుదేరినట్లు రష్యా మిలట్రీ అధికారులు తెలిపారు. గత వారాంతంలో నల్ల సముద్రంలోని సేవాస్టోపోల్  స్ధావరాన్ని డిస్ట్రాయర్ వదిలి వెళ్లిందని వారు తెలిపారు. మధ్యధరా సముద్రంలోని సిరియా ఓడరేవు ‘టార్టస్’ కు అది మరి కొద్ది రోజుల్లో చేరుకుంటుందని తెలుస్తోంది. ముందుగా అనుకున్న ‘మిలట్రీ డ్రిల్లు’ లో ‘డిస్ట్రాయర్’ పాల్గొంటుందని రష్యా మిలట్రీ ని ఉటంకిస్తూ ‘డి డెయిలీ స్టార్’ పత్రిక తెలిపింది. సిరియాలో…

ఆఫ్ఘన్ లో మరో హెలికాప్టర్ కూల్చివేత, 14 మంది అమెరికా సైనికుల మరణం

ఆఫ్ఘన్ మిలిటెంట్లు మరొక అమెరికా హెలికాప్టర్ ని కూల్చివేసినట్లు ప్రెస్ టి.వి తెలిపింది. తూర్పు ఆఫ్ఘన్ రాష్ట్రం ఘజని లోని అందర్ జిల్లాలో అమెరికా హెలికాప్టర్ ని కూల్చి వేసినట్లు తాలిబాన్ మిలిటెంట్లను ఉటంకిస్తూ ప్రెస్ టి.వి తెలిపింది. హెలికాప్టర్ లో ఉన్న 14 మంది అమెరికా సైనికులు చనిపోయారని తాలిబాన్ ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ చెప్పాడు. హెలికాప్టర్ కూల్చివేతపై నాటో దళాల నుండి ఇంకా సమాచారం ఏదీ అందలేదని ప్రెస్ టి.వి తెలిపింది. 82 ఎం.ఎం…

రికార్డు స్ధాయికి యూరో జోన్ నిరుద్యోగం, డబుల్ డిప్ నిర్ధారణ?

ఫిబ్రవరి నెలలో 17 దేశాల యూరో జోన్ నిరుద్యోగం అత్యధికంగా 10.8 శాతానికి చేరుకుంది. 1999 లో ‘యూరో’ ఉమ్మడి కరెన్సీగా యూరో జోన్ ఏర్పాడ్డాక ఇదే అత్యధిక స్ధాయి నిరుద్యోగం. జనవరి నెలలో యూరో జోన్ 10.6 శాతం నిరుద్యోగం నమోదు చేసింది. యూరో జోన్ దేశాల్లోలో స్పెయిన్ అత్యధికంగా 23.6 శాతం నిరుద్యోగంతో అగ్రస్ధానంలో ఉంది. మూడేళ్ళ క్రితం సంభవించిన ‘ది గ్రేట్ రిసెషన్’ నుండి పూర్తిగా కోలుకోక ముందే యూరప్, మరోసారి మాంద్యంలోకి…

Teen killed

రు. 50 వేల కోసం క్లాస్ మేట్ ని హత్య చేసిన టెన్త్ విద్యార్ధులు

విలాసాల ఖర్చుల కోసం పదో తరగతి విద్యార్ధులు తమ క్లాస్ మేట్ ని కిడ్నాప్ చేసి హత్య చేసిన దారుణం పూణె లో చోటు చేసుకుంది. క్లాస్ మేట్ తల్లిదండ్రులకు గర్భ శోకం మిగల్చడమే కాక తమ తల్లిదండ్రులను సైతం సమాజంలో తలెత్తుకోనీకుండా చేసిన విద్యార్ధులు తమకు టి.వి సీరియళ్ళు స్ఫూర్తినిచ్చాయని పోలీసులకి చెప్పారు. టి.వి సీరియళ్ళే తమకు దారి చూపాయని విద్యార్ధులు తమ విచారణలో చెప్పినట్లుగా పోలీసు అధికారులు చెప్పారు. శుభం షిర్కే పూనె లో…

Tatra trucks deal - General's attack

టాట్రా అవినీతి, ఆర్మీ చీఫ్ అటాక్ -కార్టూన్

టాట్రా ట్రక్కుల కొనుగోలుకోసం రు.14 కోట్లు లంచం ఇవ్వజూపారని ఆరోపించిన ఆర్మీ ఛీఫ్ వి.కె.సింగ్ ఆరోపణ చేసినపుడు పేరు చెప్పలేదు. ఇప్పుడు సి.బి.ఐ కి ఫిర్యాదు చేస్తూ తనకు లంచం ఇవ్వబోయిన వ్యక్తి ‘లెఫ్టినెంట్ జనరల్ తేజీందర్ సింగ్’ అని స్పష్టం చేసాడు. (తేజీందర్ సింగ్ ఇప్పటికే వి.కె.సింగ్ పై పరువు నష్టం దావా వేశాడు) తన తదనంతరం ఆర్మీ ఛీఫ్ కానున్నవారిలో రెండవ స్ధానంలో ఉన్న బల్వీందర్ సింగ్ పైన సి.బి.ఐ విచారణకు ఆదేశించిన సంగతి…

అజర్ బైజాన్ ఎయిర్ బేస్ నుండి ఇరాన్ పై దాడి చేయనున్న ఇజ్రాయెల్?

వైమానిక బాంబుదాడులతో ఇరాన్ అణు కర్మాగారాలను నాశనం చేయడానికి ఉవ్విళ్లూరుతున్న ఇజ్రాయెల్ కు తమ ఎయిర్ బేస్ లు వినియోగించుకోవడానికి అజర్ బైజాన్ అంగీకరించినట్లు అమెరికాకి చెందిన ‘ఫారెన్ పాలసీ’ పత్రిక వెల్లడించింది. ఈ వార్తలను అజర్ బైజాన్ ప్రబుత్వం ఆగ్రహంగా తిరస్కరించింది. “ఇజ్రాయెల్ ఒక ఎయిర్ ఫీల్డ్ కొనుక్కుంది. ఆ ఎయిర్ ఫీల్డ్ పేరు అజర్ బైజాన్” అని ఒక అమెరికా అధికారి చెప్పినట్లుగా ఫారెన్ పాలసీ పత్రిక చెబుతోంది. అజ్ఞాత సీనియర్ రాయబారులనూ, ఆర్మీ…

ఆఫ్రికా ఆదిమ జాతుల క్రికెట్ సొగసు చూడవలసిందే -ఫొటోలు

కొత్త రాతి యుగం నుండి ఉనికిలో ఉన్న ‘మాసాయ్’ ఆదిమ జాతి కీన్యా, టాంజానియాలలో నివసిస్తోంది. వీరి జనాభా కేవలం నాలుగు లక్షలే. సంచార జాతి అయిన మాసాయ్ అనేక ప్రాచీన ఆచారాలకు నెలవు. వీరిని సంచార జీవనం నుండి బైటికి రప్పించడానికి ప్రయత్నాలు చేసినా అవేవీ సఫలం కాలేదని చెబుతున్నారు. అయితే పర్యావరణ మార్పుల రీత్యా సంచార జీవనమే వీరికి శ్రీరామ రక్ష అని ప్రముఖ లండన్ వ్యవసాయ సంస్ధ ‘ఆక్స్ ఫాం’ నిర్ధారించింది. అటు…

చెక్క చెక్కిన చిత్రాలు -ఫొటోలు

ప్రముఖ పోర్చుగీసు కళాకారుడు ‘అలెగ్జాండ్రె ఫార్టో’ అలియాస్ ‘విల్స్’ చెక్కిన బొమ్మలివి. తీసి పారేసిన చెక్కల ఉపరితలాలను క్రమ పద్ధతిలో చెక్కడం ద్వారా పోర్ట్రయిట్ లను సృజించడాన్ని ఈ ఫొటోల్లో చూడవచ్చు. కొంచెం పరిశీలిస్తే ఇళ్లు లేదా ఆఫీసుల గోడలకి ఉపయోగించిన చెక్కలపైన ఈ చిత్రాలు చెక్కినట్లు కనిపిస్తొంది. పశ్చిమ దేశాల్లో  చెక్క ఇళ్లు ఎక్కువ గనక ఇలా భావించవలసి వస్తోంది. అలెగ్జాండ్రె వయసు 24 సం. మాత్రమే. 2008లో లండన్ లో జరిగిన కేన్స్ ఫెస్టివల్…

పాడుబడిన ఇల్లు, కాదు కాదు… స్ట్రీట్ అక్వేరియం -వీధి (వి)చిత్రం

స్పెయిన్ కళాకారుడు డిమిట్రిస్ టాక్సిస్ సృష్టి ఇది. ‘కార్నెల్లా డి లాబ్రెగాట్’ అనే పేరుగల పట్నంలో రోడ్డు పక్కన ఉన్న పాడు బడిన ఇంటిని ‘స్ట్రీట్ అక్వేరియం’ గా మార్చేశాడు. బైటి గోడలకు కూడా రంగులు వేసినట్లయితే అక్వేరియం లుక్ ఇంకా బాగా వచ్చి ఉండేది. కాని, అలా చేస్తే పాడు బడిన ఇల్లు అని తెలిసేది కాదు. ‘ఒరిజినల్ లుక్’ కీ ‘కళాత్మక దృష్టికీ’ మధ్య సమతూకం పాటించడానికి కళాకారుడు ప్రయత్నించినట్లు కనిపిస్తోంది.   –…

Ban on citizenship education

స్పెయిన్ లో ‘చదువు’ కి సంకెళ్ళు -వీధి చిత్రం

స్పెయిన్ లో కొత్తగా ఎన్నికయిన కన్జర్వేటివ్ పార్టీల ప్రభుత్వం విద్యార్ధుల ‘చదువు’ కి సంకెళ్లు వేయడం ద్వారా చైతన్యాన్ని అరికట్టాలని చూస్తోంది. అప్పులు చేసి కంపెనీలకి ఇచ్చిన బెయిలౌట్లను ప్రజలనుండి వసూలు చేయడానికి దుర్మార్గమైన పొదుపు ఆర్ధిక విధానాలు అమలు చేస్తుండడంతో స్పెయిన్ ఆందోళనలతో అట్టుడుకుతోంది. కార్మికులు, ఉద్యోగుల వేతనాల రూపంలో ప్రజలపై పెడుతున్న ఖర్చులో అక్కడి ప్రభుత్వం ఏకంగా 27 బిలియన్ యూరోలు (36 బిలియన్ డాలర్లు) కోతపెడుతూ రెండు రోజుల క్రితమే బడ్జెట్ ఆమోదించింది.…

ఒబామా అభిమానులా? నిరుద్యోగులా? -కార్టూన్

ఎన్నికల సంవత్సరంలో బారక్ ఒబామాకి నిరుద్యోగులకీ, అభిమానులకీ తేడా తెలియడం లేదు. భారత దేశంలో లాగానే పశ్చిమ దేశాల్లో కూడా ఎన్నికలు దగ్గర్లో ఉన్నపుడు కంపెనీలకు అనుకూలమైన విధానాలు మానేసినట్లూ, ప్రజల ప్రయోజనాల కోసమే కట్టుబడి ఉన్నట్లూ పాలకులు నాటకాలాడతారు. నిన్నటిదాకా సిరియాలో జోక్యం కోసం ఉవ్విళ్లూరిన ఒబామా అర్జెంటుగా కోఫీ అన్నన్ ని పంపి సిరియా అధ్యక్షుడు అస్సాద్ తో శాంతి ఒప్పందం కుదుర్చుకుంది అందుకే. ఇరాన్ విషయంలో ‘ఆల్ ఆప్షన్స్ ఆర్ ఆన్ ది…

‘పోస్కో’ పర్యావరణ అనుమతిని సస్పెండ్ చేసిన గ్రీన్ ట్రిబ్యునల్

ఒరిస్సా గిరిజన గ్రామాలు, అడవులకు తీవ్ర నష్టాన్ని కలిగించే పోస్కో ఉక్కు ఫ్యాక్టరీ కి కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ మంజూరు చేసిన అనుమతిని గ్రీన్ ట్రిబ్యూనల్ సస్పెండ్ చేసింది. పర్యావరణ మంత్రిత్వ శాఖ ఫ్యాక్టరీ పూర్తి సామర్ధ్యాన్ని దృష్టిలో పెట్టుకోకుండా అనుమతి ఇచ్చిందనీ, ఫ్యాక్టరీ పూర్తి సామర్ధ్యం మేరకు పని చేసినపుడు కలిగే నష్టాలను అది సమీక్షించలేదనీ చెబుతూ, మళ్ళీ తాజాగా సమీక్ష జరిగేవరకూ అనుమతిని సస్పెన్షన్ లో ఉంచుతున్నట్లు ప్రకటించింది. జస్టిస్ సి.వి.రాములు, జస్టిస్…

ఆంధ్ర ప్రదేశ్ లో రు. 50 వేల కోట్ల భూకుంభకోణం -కాగ్ నివేదిక

2006-2011 మధ్య ఐదు సంవత్సరాల కాలంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం జరిపిన భూముల కేటాయింపులలో రు.50,285.90 కోట్ల విలువ గల భూమి అక్రమ పద్ధతుల్లో అన్యాక్రాంతం జరిగిందని ‘కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్’ (సి.ఏ.జి – కాగ్) జరిపిన ఆడిట్ లో తేలింది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల చివరి రోజుల రాష్ట్ర ప్రభుత్వం కాగ్ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ప్రతిపక్షాల దాడి నుండి తప్పించుకోవడానికి, పార్లమెంటరీ ప్రజా స్వామ్య వ్యవస్ధలో ప్రజా వ్యతిరేక అవినీతి చర్యలను స్క్రూటినీ…