బుద్ధిలేనితనం, అత్యాశ, నిర్లక్ష్యం… ఇవే ఆర్ధిక సంక్షోభాలకు కారణం -గీధనర్

బుద్ధిలేనితనం (stupidity), అత్యాశ (greed), నిర్లక్ష్యం (recklesness) వల్లనే ఆర్ధిక సంక్షోభాలు సంభవిస్తున్నాయని అమెరికా ట్రెజరీ సెక్రటరీ తిమోతి గీధనర్ స్పష్టం చేశాడు. ఆర్ధిక ప్రమాదాలను అవలీలగా తీసుకోవడం తగదని హెచ్చరించాడు. మోసాలనూ, చట్టాల దుర్వినియోగాన్నీ అడ్డుకోవడానికి కఠినమైన చట్టాలు తప్పనిసరని గీధనర్ నొక్కి చెప్పాడు. పోర్ట్ లాండ్ సిటీ క్లబ్ లో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ గీధనర్ బుధవారం ఈ మాటలన్నాడు. వాల్ స్ట్రీట్ లోని బడా బడా ద్రవ్య కంపెనీలు లాభాల పేరాశతో ప్రమాదకరమైన…

క్లుప్తంగా… 26.04.2012

అంతర్జాతీయం హెచ్.ఎస్.బి.సి బ్యాంకు యు.కె శాఖల్లో 2,200 ఉద్యోగాలు రద్దు ఇంగ్లాండులో హెచ్.ఎస్.బి.సి బ్యాంకు మరో 2,200 ఉద్యోగాలు రద్దు చేసింది. వాస్తవంగా రద్దు చేసినవి 3,100 ఉద్యోగాలు కాగా, కొత్తగా ఇచ్చిన ఉద్యోగాలు పోను నికరంగా 2,217 ఉద్యోగాలు రద్దు చేసినట్లయింది. ఖర్చు తగ్గించుకునే చర్యల్లో భాగంగా ఉద్యోగాలు రద్దు చేస్తున్నట్లు బ్యాంకు ప్రకటించింది. హెచ్.ఎస్.బి.సి గత సంవత్సరం 7,000 ఉద్యోగాలు రద్దు చేసింది. 2013 లోపు ప్రపంచ వ్యాపితంగా 30,000 ఉద్యోగాలు రద్దు చేస్తానని…

‘కోర్టు ధిక్కారం’ కేసులో పాక్ ప్రధాని దోషి, 30 సెకన్లు జైలు

పాక్ ప్రధాని యూసఫ్ రజా గిలానీ పై ‘కోర్టు ధిక్కారం’ నేరం రుజువయిందని పాకిస్ధాన్ సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. నేరం రుజువయినప్పటికీ ‘సంకేతాత్మక’ శిక్షతో ప్రధానిని కోర్టు వదిలిపెట్టింది. ఆయనపై జైలు శిక్ష గానీ, మరొక శిక్షగానీ విధిస్తున్నట్లు కోర్టు ప్రకటించలేదు. గిలానీ ప్రధాని పదవికి వచ్చిన ముప్పేమీ లేదని కూడా తెలుస్తోంది. మాజీ మిలట్రీ పాలకుడు ముషార్రఫ్ పాలనలో అధ్యక్షుడు జర్దారీతో పాటు అనేకమంది రాజకీయ నాయకులపై ఉన్న అవినీతి కేసుల్లో ముషార్రఫ్ క్షమా…

రాజ్య సభకు ‘సచిన్ టెండూల్కర్’?

కేంద్ర ప్రభుత్వంలో అధికారం నెరుపుతున్న కాంగ్రెస్ పార్టీ ‘సచిన్ టెండూల్కర్’ ను రాజ్య సభ సభ్యత్వానికి ప్రతిపాదించిందని ‘ఐ.బి.ఎన్ లైవ్’ పత్రిక తెలిపింది. సచిన్ ఇంకా ఏ సంగతీ చెప్పలేదని తెలుస్తోంది. సచిన్ నుండి స్పందన కోసం కాంగ్రెస్ పార్టీ ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది. అయితే రాజ్య సభ సభ్యత్వం స్వీకరించడానికి సచిన్ అంగీకరించకపోవచ్చని కూడా పత్రికలు రాస్తున్నాయి. సంచిన్ వైపు నుండి అధికారికంగా ఏ సమాచారమూ లేదు. సచిన్ టెండూల్కర్ ని రాష్ట్ర ప్రతి కోటాలో…

ఫెయిలయినందుకు టీచర్లందరినీ నిర్భంధించిన XI క్లాస్ విద్యార్ధులు

పశ్చిమ బెంగాల్ లోని పశ్చిమ మిడ్నపూర్ జిల్లాలో క్లాస్ XI సంవత్సరాంత పరీక్షల్లో ఫెయిలయిన విద్యార్ధులు టీచర్లందరినీ స్కూల్ లోపల పెట్టి తాళాలు వేశారు. తమని క్లాస్ XII కు ప్రమోట్ చేశామని చెబితే తప్ప విడుదల చేయబోమని పట్టుపట్టారు. దాదాపు తొంభై మంది విద్యార్ధులు ఈ కార్యక్రమంలో ఉండడంతో జోక్యం చేసుకోవడానికి పోలీసులు వెనకాడుతున్నారు. స్కూల్ సెక్రటరీ కూడా నిర్బంధించబడివనారిలో ఉండడం విశేషం. గోపీబల్లభ్ పూర్ లోని ‘నయబాసన్ జనకళ్యాణ్ విద్యాపీఠ్’ అనే పాఠశాలలో గురువారం…

News in brief

కొత్త కేటగిరీ – ‘క్లుప్తంగా’

ఏప్రిల్ 24 తేదీ నుండి ‘క్లుప్తంగా’ పేరుతో కొత్త కేటగిరీ ప్రారంభించాను. ప్రతిరోజూ “క్లుప్తంగా… ‘తేదీ’” హెడ్డింగ్ తో ఒక పోస్టు రాయడం జరుగుతుంది. ఈ పోస్టులో ఆ తేదీన వెలువడ్డ వార్తలలో కొన్ని ముఖ్యమైనవి ఎంచుకుని క్లుప్తంగా వివరించడం జరుగుతుంది. ఇలాంటి పోస్టు ఒకటి ప్రతి రోజూ రాయాలని ఎప్పటి నుండో అనుకుంటున్నప్పటికీ ఎలా రాయాలో తెలియక మొదలు పెట్టలేదు. ఆ విధంగా ప్రతిరోజూ రాసిన క్లుప్త వార్తల పోస్టులకు హోం పేజీ నుండి లింక్…

క్లుప్తంగా… 25.04.2012

జాతీయం   మరోసారి రంగం మీదికి బోఫోర్స్ బోఫోర్స్ మరోసారి పతాక శీర్షికలకు ఎక్కింది. బోఫోర్స్ కుంభ కోణం బయటపడ్డ రోజుల్లో స్వీడన్ లో విచారణ నిర్వచించిన పోలీసు అధికారి తాజాగా సరికొత్త ఆరోపణలతో నోరు విప్పడంతో మంత్రులు, ప్రతిపక్షాలు వాదోపవాదాలు ప్రారంభించారు. బోఫోర్స్ కుంభకోణంపై జరిగిన విచారణను అడ్డుకోవడంలో అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ సఫలమైనాడని స్వీడన్ పోలీసు అధికారి స్టెన్ లిండ్ స్ట్రామ్ ప్రకటించి సంచలనం సృష్టించాడు. గాంధీల పాత్ర గురించి సాక్ష్యాలు లేవుగానీ…

ఇరాన్ అణుబాంబు నిర్మిస్తుందంటే నేన్నమ్మను -ఇజ్రాయెల్ కమాండర్

ఇరాన్ అణు బాంబు నిర్మిస్తుందని తాను భావించడం లేదని ఇజ్రాయెల్ ‘చీఫ్ ఆఫ్ స్టాఫ్’ లెఫ్టినెంట్ జనరల్ బెన్నీ గాంట్జ్ కుండ బద్దలు కొట్టాడు. ఇరాన్ రహస్యంగా అణు బాంబులు నిర్మిస్తోందనీ, ఇరాన్ అణు బాంబులు ప్రపంచ శాంతికి ప్రమాదకరమనీ అమెరికా, యూరప్, ఇజ్రాయెల్ లు ఓ పక్కన చెవి కోసిన మేకల్లా అరుస్తూ, ఇరాన్ పై అక్రమ యుద్ధానికి సైతం తెగబడుతున్న నేపధ్యంలో ఇజ్రాయెల్ సైన్యాధిపతి వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. మధ్య ప్రాచ్యం (Middle East)…

‘డబుల్ డిప్ రిసెషన్’ లో ఇంగ్లండ్

ఇంగ్లండ్ ‘డబుల్ డీప్ రిసెషన్’ లోకి జారుకుంది. 2012 లో మొదటి క్వార్టర్ (జనవరి, ఫిబ్రవరి, మార్చి) లో బ్రిటన్ జి.డి.పి (గ్రాస్ డోమెస్టిక్ ప్రోడక్ట్) 0.2 శాతం మేరకు కుదించుకుపోయింది. అంటే జి.డి.పి వృద్ధి చెందడానికి బదులు తగ్గిపోయింది. 2011 చివరి క్వార్టర్ లో (అక్టోబరు, నవంబరు, డిసెంబరు) ఇంగ్లండ్ జి.డి.పి 0.3 శాతం క్షీణించింది. వరుసగా రెండు క్వార్టర్ల పాటు నెగిటివ్ జి.డి.పి వృద్ధి నమోదయితే ఆ దేశం మాంద్యం (రిసెషన్) లో ఉన్నట్లు…

ఇండియా రేటింగ్ తగ్గించిన ఎస్&పి

స్టాండర్డ్ & పూర్ రేటింగ్ సంస్ధ ఇండియా రేటింగ్ ‘ఔట్ లుక్’ ని తగ్గించింది. ఇండియా అప్పు రేటింగ్ ఇప్పటివరకూ BBB+ గా ఉండగా ఇప్పుడు దానిని BBB- కి తగ్గించింది. BBB+ ‘స్ధిర’ (stable) రేటింగ్ ని సూచిస్తుంది. BBB- రేటింగు సమీప భవిష్యత్తులో రేటింగ్ మరింత తగ్గించే అవకాశం ఉందన్న హెచ్చరికను సూచిస్తుంది. ఎస్&పి కేటాయించే ఇన్వెస్ట్ మెంట్ గ్రేడ్లలో BBB- అత్యంత తక్కువ రేటింగ్. AAA, AA, A, BBB తర్వాత BBB-…

క్లుప్తంగా… 24.04.2012

జాతీయం జగన్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు జగన్ అవినీతి ఆస్తుల కేసులో సి.బి.ఐ ఉచ్చు బిగిస్తున్నదని ఫస్ట్ పోస్ట్ తెలిపింది. సెక్షన్ 164 కింద సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేయడం ద్వారా పకడ్బందీగా కేసు విచారణ సాగిస్తునట్లు వెల్లడించింది. మేజిస్ట్రేట్ సమక్షంలో నమోదు చేసిన సాక్షుల వాంగ్మూలాలను సాక్ష్యాలుగా కోర్టు పరిగణిస్తుందనీ, వాటిని ఆ తర్వాత సాక్షులు వెనక్కి తీసుకోవడానికి లేదనీ ఆ పత్రిక తెలిపింది. అలాంటి సాక్ష్యాలను రహస్యంగా ఉంచుతూ కింది కోర్టులో అప్పుడే వాటిని…

మధ్య ప్రాచ్యం లో కీలక పరిణామం, ఇజ్రాయెల్ కి ఈజిప్టు గ్యాస్ సరఫరా రద్దు

మధ్య ప్రాచ్యం లో కొద్ది రోజుల క్రితం కీలక పరిణామం సంభవించింది. ఇజ్రాయెల్ కి గ్యాస్ సరఫరాను ఈజిప్టు సైనిక ప్రభుత్వం రద్దు చేసింది. ఇది ప్రభుత్వాల మధ్య వ్యవహారం కాదు, కేవలం కంపెనీల మధ్య వ్యాపార లావాదేవీల వ్యవహారమేనని ఇరు ప్రహుత్వాలలోని కొన్ని వర్గాలు అంటున్నప్పటికీ, విశ్లేషకుల అభిప్రాయం భిన్నంగా ఉంది. ఈజిప్టు నియంత హోస్నీ ముబారక్ కి వ్యతిరేకంగా ‘ప్రజాస్వామిక సంస్కరణల’ కోసం జరిగిన తిరుగుబాటులో ఇజ్రాయెల్ కి సంవత్సరాల తరబడి అత్యంత చౌకగా…

పై చదువులకోసం అమెరికా వెళ్ళే డాక్టర్లు ఇక ‘రిటర్న్ బాండ్’ ఇవ్వాలి

పై చదువుల కోసం అమెరికా వెళ్ళే డాక్టర్లు ఇక నుండి దేశానికి తిరిగొస్తామని బాండ్ పేపర్ పైన సంతకం చేయాల్సి ఉంటుంది. అమెరికాలో చదువులు పూర్తయ్యాక అక్కడే స్ధిరపడడానికి భారతీయ డాక్టర్లు మొగ్గు చూపుతున్నారనీ, ఉన్నత చదువుల పేరుతో వెళ్ళి అక్కడే ఉండిపోతున్నారనీ ప్రభుత్వం భావిస్తోంది. అలాంటి వారిని అడ్డుకోవడానికి కొత్త నిబంధన విధిస్తున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి గులాం నబీ ఆజాద్ తెలిపాడు. “ఏ విధ్యార్ధి అయినా వైద్య చదువుల కోసం అమెరికా వెళ్తే…

విదేశీ గూఢచర్యానికి ‘వాణిజ్య ముసుగు’ కోసం అనుమతి కోరిన అమెరికా మిలట్రీ

విదేశాల్లో తాము సాగించే గూఢచార కార్యకలాపాలకు ‘వాణిజ్య ముసుగు’ కావాలంటూ అమెరికా రక్షణ విభాగం కాంగ్రెస్ అనుమతి కోరింది. విదేశాలలో వాణిజ్యవేత్తల ముసుగులో మిలట్రీ గూఢచర్యానికి పాల్పడడానికి అమెరికాకి చెందిన ‘డిపార్ట్ మెంట్ ఆఫ్ డిఫెన్స్’ (డి.ఒ.డి) అమెరికా కాంగ్రెస్ ముందు ప్రతిపాదనలు ఉంచిందని ‘ఇన్ సైడ్ డిఫెన్స్’ వెబ్ సైట్ తెలిపింది. అమెరికా సైనికులను నేరుగా రంగంలోకి దించడం వల్ల వారి ప్రాణాలకు ముప్పు ఏర్పడుతోందనీ, వాణిజ్య ముసుగులో రహస్య మిలట్రీ కార్యకలాపాల కోసం అనుమతి…

‘స్పామ్ ఈ మెయిల్స్’ లో ఇండియాదే అగ్ర స్ధానం

పనికిరాని ‘స్పామ్ ఈ మెయిల్స్’ పంపడంలో భారత దేశం అగ్ర స్ధానం ఆక్రమించిందని కంప్యూటర్ సెక్యూరిటీ సంస్ధ ‘సోఫోస్’ తెలిపింది. అమెరికాని రెండో స్ధానంలోకి నెట్టి భారత దేశం అగ్ర స్ధానానికి చేరిందని ఆ సంస్ధ తెలిపింది. అయితే ఇందులో భారతీయుల తప్పేమీ లేదు. మొదటిసారి ఇంటర్నెట్ వినియోగిస్తున్న భారతీయులకు ఈ మెయిల్ వినియోగంలో అనుభవం లేకపోవడమే దీనికి కారణమని ‘సోఫోస్’ తెలిపింది. సోఫోస్ సంస్ధ స్పామ్ మెయిళ్ళు అధికంగా వచ్చే కంప్యూటర్ల సంఖ్య ఆధారంగా వివిధ…