స్విస్ ఖాతాల సమాచారం పొందడానికి నిబంధనలు సరళతరం

స్విస్ బ్యాంకుల్లో దొంగ సొమ్ము దాచిన భారతీయుల సమాచారం పొందడానికి ఇప్పటివరకూ ఉన్న నిబంధనలు మరింత సరళతరం అయ్యాయని భారత ప్రభుత్వం తెలియజేసింది. ‘బ్లాక్ మనీ’ పై భారత ప్రభుత్వం తలపెట్టిన పోరాటం తాజా పరిణామంతో ఊపందుకుంటుందని భావిస్తున్నట్లు ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది. రహస్య ఖాతాలున్న వ్యక్తుల సమాచారం స్విస్ ప్రభుత్వం మనకు ఇవ్వడానికి ఇకనుండి పేరు, చిరునామా పూర్తిగా ఇవ్వకపోయినా ఫర్వాలేదనీ, సమీప సమాచారం ఇస్తే సరిపోయే విధంగా నిబంధనలు సడలించారనీ ప్రభుత్వం తెలిపింది.…

ఎన్రికా లెక్సీ: కేరళను నిలదీసిన సుప్రీం కోర్టు

ఇద్దరు భారతీయ జాలర్లను సముద్ర దొంగలుగా భావిస్తూ ఇటాలియన్ నౌక రక్షణ బలగాలు కాల్చి చంపిన కేసులో కేరళ ప్రభుత్వ అవగాహనను సుప్రీం కోర్టు నిలదీసింది. నౌక యజమానులు, జాలర్ల కుటుంబాలు కుదుర్చుకున్న ‘రాజీ’ని రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు వ్యతిరేకించలేదని సుప్రీం కోర్టు బెంచి నిలదీసింది. “భారత న్యాయ వ్యవస్ధకే ఇది సవాలు లాంటిది. ఇది అనుమతించరానిది. అత్యంత దురదృష్టకరం” అని ఆర్.ఎం.లోధా, హెచ్.ఎల్.గోఖలే లతో కూడిన బెంచి వ్యాఖ్యానించింది. ఒక్క కోటుంబానికి నౌక యజమానులు కోటి…

కొత్త వీసా రూల్స్ తో మోడిని రాకుండా చెయ్యండి -బ్రిటన్ మానవ హక్కుల సంస్ధలు

యూరోపియన్ యూనియన్ ప్రతిపాదిస్తున్న కొత్త వీసా నిబంధనలను నరేంద్ర మోడి కి వర్తింపజేసి బ్రిటన్ కి రాకుండా అడ్డుకోవాలని అక్కడి మానవ హక్కుల సంస్ధలు డిమాండ్ చేశాయి. ఇ.యు దేశాలకు చెందని వారు తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడితే వారిని బ్రిటన్ రాకుండా నిషేధించాలని కొత్త నిబంధనను బ్రిటన్ ప్రతిపాదిస్తున్నది. ఈ నిబంధనను మోడీకి వర్తింపజేసి భవిష్యత్తులో ఆయన బ్రిటన్ లో అడుగుపెట్టనివ్వకుండా చేయాలని మానవ హక్కుల గ్రూపులు ఆదివారం డిమాండ్ చేశాయి. నరేంద్ర మోడి…

యాపిల్ బిలియన్ల కొద్దీ పన్నులు ఎగ్గొట్టింది -న్యూయార్క్స్ టైమ్స్

ఎలక్ట్రానిక్ గాడ్గెట్ల దిగ్గజం ‘యాపిల్’ ప్రపంచ వ్యాపితంగా చిన్న చిన్న ఆఫీసులు నెలకొల్పి బిలియన్ల కొద్దీ డాలర్ల పన్నులను ఎగవేసిందని ది న్యూయార్క్స్ టైమ్స్ శనివారం వెల్లడించింది. కాలిఫోర్నియా కంపెనీ అయిన ‘యాపిల్’ నెవాడా రాష్ట్రంలోని రెనో నగరంలో ఆఫీసు పెట్టడం పన్ను ఎగవేతకు వేసిన ఎత్తుగడల్లో ఒకటని ఆ పత్రిక తెలిపింది. నెవాడాలో కార్పొరేట్ పన్ను సున్నా శాతం కాగా కాలిఫోర్నియాలో 8.84 శాతం కార్పొరేట్ పన్ను వసూలు చేస్తారని తెలిపింది. రెనో ఆఫీసు లాంటివి…

అమెరికా డ్రోన్ దాడుల్లో 2,800 పాక్ పౌరుల మరణం

గత యేడేళ్ళలో అమెరికా మానవ రహిత విమానాలు మూడువేల మంది అమాయక పాకిస్ధాన్ పౌరులను చంపేశాయని మానవ హక్కుల కార్యకర్త ఒకరు తెలిపాడు. మొత్తం దాదాపు మూడువేల మంది అమెరికా డ్రోన్ దాడుల్లో చనిపోగా వారిలో 2,800 మంది అమాయక పౌరులేనని పాకిస్ధాన్ మానవ హక్కుల కార్యకర్త షాజాద్ అక్బర్ ని ఉటంకిస్తూ ప్రెస్ టి.వి తెలిపింది. 170 మంది మాత్రమే అమెరికా దురాక్రమణపై పోరాడుతున్న “మిలిటెంట్లు” అని ఆయన తెలిపాడు. “ఫౌండేషన్ ఫర్ ఫండమెంటల్ రైట్స్”…

హైద్రాబాద్ మత కల్లోలానికి హిందువులే కారణం

మూడువారాల క్రితం హైద్రాబాద్ లో చెలరేగిన మత ఘర్షణలకు హిందువులే కారణమని పోలీసుల పరిశోధనలో తేలింది. ఇద్దరు స్ధానిక నాయకుల ప్రోత్సాహంతో హిందూ యువకులు మత కల్లోలం రెచ్చగొట్టడానికి పూనుకున్నారని పోలీసులు శనివారం తెలిపారు. మాదన్నపేట దేవాలయంలో ఆవు కాళ్ళు పడేసి, పచ్చ రంగు జల్లితే అది ముస్లింలు చేసిన పనేనని హిందువులు భావించి ముస్లింలపై దాడులకు పూనుకుంటారని పధకం వేశారని పోలీసులు తెలిపారు. ఆవు కాళ్ళను గుడిలో ఉంచి పచ్చరంగు జల్లిన హిందూ యువకులను పోలీసులు…

క్లుప్తంగా… 28.04.2012

జాతీయం సోనియా సభలో నల్లజెండా కర్ణాటక పర్యటిస్తున్న సోనియా గాంధీకి ఒక మహిళ నల్ల జెండా చూపి కలకలం రేపింది. పోలీసులు ఆమె పైకి లంఘించి నోరు నొక్కి బైటికి వెళ్లగొట్టారు. తమ కమ్యూనిటీకి ఎస్.సి రిజర్వేషన్లు కల్పించాలని మహిళ డిమాండ్ చేసినట్లు ‘ది హిందూ’ తెలిపింది. కేవలం నల్ల జెండా చూపిస్తేనే మహిళ నోరు నోక్కే పోలీసు చట్టాలు ఏ ప్రజాస్వామ్యానికి ప్రతీకలో సోనియా గాంధీ చెప్పవలసి ఉంది. సిద్దగంగ మఠం వ్యవస్ధాపకుడి 105 వ…

టెర్రరిస్టులకు ఐక్యరాజ్యసమితి మద్దతు? -సిరియా ప్రభుత్వం

ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ‘బాన్-కి-మూన్’ సిరియాలో విధ్వంసం సృష్టిస్తున్న టెర్రరిస్టులకు మద్దతు ఇచ్చేలా ప్రకటనలు జారీ చేయడం పట్ల సిరియా పత్రికలు ఆయనపై దుమ్మెత్తి పోస్తున్నాయని ‘అసోసియేటెడ్ ప్రెస్’ ని ఉటంకిస్తూ ‘ది హిందూ’ తెలిపింది. సమితి అధిపతి తన విమర్శలను పూర్తిగా సిరియా ప్రభుత్వంపైనే కేంద్రీకరించడం ద్వారా టెరరిస్టుల హింసను ప్రోత్సహిస్తున్నాడని సిరియా పత్రికలు విమర్శలు ఎక్కుపెట్టాయి. మానవ బాంబులను ప్రయోగిస్తూ వేలమంది ప్రజలను బలి గొంటున్న టెర్రరిస్టు చర్యలను ఖండిస్తూ అంతర్జాతీయ సంస్ధలు…

బంగారు లక్ష్మణ్ కి నాలుగేళ్ళు జైలు, జడ్జి సంచలన వ్యాఖ్యలు

ఢిల్లీ కోర్టు బి.జె.పి మాజీ అధ్యక్షుడు, మాజీ కేంద్ర మంత్రి బంగారు లక్ష్మణ్ కి నాలుగేళ్ళు జైలు శిక్ష విధించింది. జరిమానాగా లక్ష రూపాయలు చెల్లించాలని జడ్జి తీర్పు నిచ్చాడు. శిక్ష విధిస్తూ అడిషనల్ సెషన్స్ జడ్జి కన్వల్ జీత్ అరోరా సంచలన వ్యాఖ్యలు చేశాడు. జడ్జి విధించిన శిక్ష, తదనంతరం ఆయన చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాపితంగా ఉన్న కోర్టులు పాటించినట్లయితే దాదాపు భారత దేశ నాయకులు, బ్యూరోక్రాట్ అధికారులు అందరూ జైలు ఊచలు లెక్కపెట్టాల్సిందే.…

రాజకీయ సంస్కరణల కోసం లక్ష మంది మలేసియన్ల ప్రదర్శన

మలేసియా రాజధాని కౌలాలంపూర్ లో రాజకీయ సంస్కరణలను డిమాండ్ చేస్తూ ప్రదర్శన నిర్వహించినవారిపై పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. రసాయనాలు కలిపిన నీళ్ళు ప్రదర్శకులను చెదర గొట్టారు. ఎన్నికల విధానాన్ని పూర్తిగా సంస్కరించాలనీ, పాలక పక్షం పట్ల పక్షపాతం వహిస్తున్న ఎన్నికల కమిషన్ ను సంస్కరించాలనీ, విదేశాల్లో ఉన్న మలేసియన్లకు కూడా ఓటు హక్కు కల్పించాలనీ ప్రదర్శకులు డిమాండ్ చేశారు. ప్రదర్శనలో లక్ష మంది పాల్గొన్నారని మలేసియా పత్రిక ‘ది సన్’ తెలుపగా 80,000 పైగా పాల్గొన్నారని…

Sachin, MP

పార్లమెంటుతో సచిన్ సరికొత్త ఇన్నింగ్స్ -కార్టూన్

రాష్ట్ర పతి కోటాలో సచిన్ టెండూల్కర్ రాజ్య సభ సభ్యుడయ్యాడు. సెంచరీల శతకం సాధించినందుకు అభినందనలు అందుకోమని పిలిచి కాంగ్రెస్ సుప్రీం సోనియా ఆయనకి రాజ్య సభ్య సభ్యత్వం కట్టబెట్టింది. సచిన్ కి ‘భారత రత్న’ ఇవ్వాలని ఓ పక్క చర్చలు సాగుతుండగా రాజ్య సభ సభ్యత్వం కట్టబెట్టడం అనుమానాలు రేకెత్తించింది. భారత రత్న ఇవ్వలేక రాజ్య సభ్య సభ్యత్వం ఇచ్చినట్టా లేక భారత రత్న కు రాజ్య సభ సభ్యత్వం బోనస్సా అన్నది ముందు ముందు…

ఛత్తీస్ ఘడ్ కలెక్టర్ విడుదలకు ప్రభుత్వము, మావోయిస్టుల ఒప్పందం

మావోయిస్టు గెరిల్లాల చేత కిడ్నాప్ కి గురయిన ఛత్తీస్ ఘడ్ రాష్ట్ర జిల్లా కలెక్టర్ అలెక్స్ మీనన్ విడుదలకోసం మావోయిస్టు ప్రతినిధులకూ, ప్రభుత్వ ప్రతినిధులకు ఒప్పందం కుదిరినట్లు ‘ది హిందూ’ తెలిపింది. అయితే ఒప్పందానికి మావోయిస్టు పార్టీ ఆమోద ముద్ర వేయాల్సి ఉండని తెలుస్తోంది. శనివారం ఒప్పందాన్ని మావోయిస్టులకు సమర్పించనున్నారు. “ఇప్పటికీ చర్చలు పూర్తయ్యాయి. కానీ అంతిమ ఒప్పందాన్ని మావోయిస్టులు ఆమోదించాల్సి ఉంది” అని మావోయిస్టుల తరపున చర్చల్లో పాల్గొంటున్న బి.డి.శర్మ తెలిపాడు. ఒప్పందం వివరాలు తెలపడానికి…

క్లుప్తంగా… 27.04.2012

ఇరాన్ అణు బాంబు కి సాక్ష్యం లేదు –పెనెట్టా ఇరాన్ ‘అణు బాంబు’ నిర్మిస్తోందని ఖచ్చితమైన సాక్ష్యం ఏదీ దొరకలేదని అమెరికా రక్షణ కార్యదర్శి లియోన్ పెనెట్టా అన్నాడని ఎ.ఎఫ్.పి వార్తా సంస్ధ తెలిపింది. “ఇరానియన్లు అణుబాంబు తయారీకి నిర్ణయించినట్లు నిర్ధిష్ట సమాచారం ఏదీ నా వద్ద లేదు” అని పెనెట్టా అన్నాడు. చిలీ రక్షణ మంత్రితో సమావేశం అయిన అనంతరం విలేఖరులతో పెనెట్టా మాట్లాడాడు. ఇరాన్ అణు బాంబుకి ప్రయత్నిస్తున్నదంటూ అమెరికా, యూరప్ లు ఒత్తిడి…

అవినీతి కేసులో బి.జె.పి మాజీ అధ్యక్షుడు బంగారు లక్ష్మణ్ దోషి -సి.బి.ఐ కోర్టు

బి.జె.పి మాజీ అధ్యక్షుడు బంగారు లక్ష్మణ్ ను అవినీతి కేసులో దోషిగా సి.బి.ఐ కోర్టు నిర్ధారించింది. తెహెల్కా పత్రిక నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్ లో కంపెనీ ప్రతినిధులుగా నాటకమాడిన తెహెల్కా విలేఖరుల వద్ద నుండి లక్ష రూపాయల నోట్ల కట్లను తీసుకుంటూ బంగారు లక్ష్మణ్ వీడియో కెమెరాకు అడ్డంగా దొరికిపోయాడు. 2001 లో జరిగిన ఈ సంఘటనలోని వీడియో దేశ వ్యాపితంగా అన్నీ చానెళ్లలోనూ ప్రసారం అయింది. పార్టీ కోసం చందా తీసుకున్నానని లక్ష్మణ్ అప్పట్లో వివరణ…

మాంద్యం (recession) లో స్పెయిన్

డబుల్ డీప్ రిసెషన్ జాబితాలో స్పెయిన్ కూడా చేరింది. 2012 మొదటి క్వార్టర్ లో స్పెయిన్ జి.డి.పి క్షీణించింది. 2011 చివరి క్వార్టర్ లో కూడా స్పెయిన్ జి.డి.పి తగ్గుదల నమోదు చేయడంతో స్పెయిన్ కూడా మాంద్యం లో ఉన్నట్లయింది. రెండు క్వార్టర్లు వరుసగా ప్రతికూల వృద్ధి నమోదు చేసినట్లయితే అలాంటి ఆర్ధిక వ్యవస్ధ గల దేశం మాంద్యం ఎదుర్కొంటున్నట్లుగా పరిగణిస్తారు. 2008 నాటి సుదీర్ఘ మాంద్యం నుండి కోలుకోక మునుపే రెండవ సారి రిసెషన్ లోకి…