మూడు రోజుల్లో 24 మంది ఆఫ్ఘన్ పౌరుల్ని చంపేసిన నాటో బలగాలు

గత మూడు రోజుల్లోనే దేశవ్యాపితంగా జరిపిన దాడుల్లో 24 మంది అమాయక ఆఫ్ఘన్ పౌరులను నాటో దురాక్రమణ బలగాలు చంపేశాయి. మరింతమందిని గాయపరిచాయి. పాతిక మందిని చంపినందుకు రెండు రోజుల్లో సారీ చెబుతామని నాటో అధికారి చెప్పాడు. చనిపోయినవారిలో మహిళలు పిల్లలు ఉన్నారు. వాయవ్య ఆఫ్ఘనిస్ధాన్ లో ఉన్న బాద్ఘిస్ రాష్ట్రంలో సోమవారం నాటో విమానాలు జరిపిన బాంబు దాడుల్లో ఐదుగురు మరణించారనీ, మరో 15 మంది గాయపడ్డారనీ ప్రెస్ టి.వి తెలిపింది. అయితే వాషింగ్టన్ పోస్ట్…

ఫ్రాన్సు ఎన్నికల్లో సర్కోజీ ఓటమి, స్వల్ప మెజారిటీతో హాలండే గెలుపు

ఫ్రాన్సు అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. మితవాద పార్టీ ‘యు.ఎం.పి’ అభ్యర్ధి, అధ్యక్షుడు అయిన నికోలస్ సర్కోజీ ఓటమి చెందాడు. ఆయనపై ‘సోషలిస్టు’ పార్టీ అభ్యర్ధి ఫ్రాంకోయిస్ హాలండే స్వల్ప మెజారిటీతో గెలుపొందాడు. 95 శాతం ఓట్ల లెక్కింపు పూర్తికాగా వాటిలో హాలండేకి 51.6 శాతం ఓట్లు, సర్కోజీ కి 48.4 శాతం ఓట్లూ పోలయ్యాయి. కేవలం 3.2 శాతం ఓట్ల తేడాతో హాలండే గెలుపొందాడు. నికోలస్ సర్కోజీ విచక్షణా రహితంగా అమలు చేసిన ‘పొదుపు ఆర్ధిక…

ఇరాన్ ఆయిల్ దిగుమతులు ఇండియా తగ్గించాల్సిందే -హిల్లరీ హుకుం

ఇండియా, ఇరాన్ నుండి చేసుకుంటున్న ఆయిల్, గ్యాస్ దిగుమతులను తగ్గించుకోవాల్సిందేనని అమెరికా విదేశీ మంత్రి హిల్లరీ క్లింటన్ హుకుం జారీ చేసింది. ఇరాన్ దిగుమతులను ఇప్పటికే గణనీయంగా తగ్గించుకున్నందుకు హర్షం వ్యక్తం చేసిన హిల్లరీ, అది చాలదనీ, ఇంకా తగ్గించుకోవాలని కోరింది. ‘ఇరాన్ ఆయిల్, గ్యాస్ దిగుమతులను తగ్గించుకునేది లేదని’ జనవరిలో పెట్రోలియం మంత్రి జైపాల్ రెడ్డి చేసిన ప్రకటన ఒట్టిదేనని హిల్లరీ హర్షం స్పష్టం చేసింది. ఆ రకంగా బహిరంగంగానే ఇండియాకి ఆదేశాలిస్తున్న హిల్లరీని ‘అదేమని’…

ఆఫ్-పాక్ యుద్ధ కల్లోలం -ఫొటోలు

యుద్ధాలు జన జీవనంలో మిగిల్చే భీభత్సం అంతా ఇంతా కాదు. లక్షల మందిని విగత జీవుల్ని చేసే యుద్ధాలు మరిన్ని లక్షల మందిని అవయవాలు లేని జీవచ్చవాలుగా మారుస్తాయి. ఇంకా అనేక రెట్ల మంది జీవితాల్లో తీరని విషాధాలు మిగిల్చి తరాల తరబడి ప్రభావాన్ని కలుగు జేస్తాయి. యుద్ధాల వల్ల బాగు పడేది పెట్టుబడిదారీ కంపెనీలు, ఆ కంపెనీల దగ్గర కమీషన్లు మెక్కే రాజకీయ నాయకులు, అధికారులే. ప్రజలు మాత్రం ధన, మాన, ప్రాణాలను కోల్పోయి చెట్టుకొకరు,…

క్లుప్తంగా… 05.05.2012

జాతీయం వేచి చూస్తాం -రాష్ట్రపతి ఎన్నికపై లెఫ్ట్ పార్టీలు రాష్ట్ర పతి ఎన్నికకు సంబంధించి వేచి చూడడానికి నిర్ణయించుకున్నామని లెఫ్ట్ పార్టీలు తెలిపాయి. సి.పి.ఐ, సి.పి.ఎం, ఆర్.ఎస్.పి ఫార్వర్డ్ బ్లాక్ న్యూఢిల్లీలో సమావేశమై మాట్లాడుకున్న అనంతరం తమ నిర్ణయం ప్రకటించాయి. శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్.సి.పి పార్టీ మాత్రం ఉప రాష్ట్రపతి ‘హమీద్ అన్సారీ’ కంటే ఆర్ధిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ యే తమకు ఆమోదయోగ్యమని ప్రకటించింది. అంతిమ నిర్ణయం తీసుకునే ముందు ‘సెక్యులర్’ పార్టీల అభిప్రాయం…

క్లుప్తంగా… 04.05.2012

జాతీయం మణిపూర్ విద్యార్ధి డ్రగ్స్ వల్ల చనిపోలేదు –ఫోరెన్సిక్ నివేదిక బెంగుళూరు లో చదువుతున్న మణిపూర్ విద్యార్ధి రిచర్డ్ లోయితం డ్రగ్స్ వల్ల చనిపోలేదని ఫోరెన్సిక్ ఫలితాలు నిర్ధారించినట్లు ‘ది హిందూ’ తెలిపింది. ఆర్కిటెక్చర్ విద్యార్ధి అతని సీనియర్ విద్యార్ధులు కొట్టడం వల్ల చనిపోయాడని అతని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. సీనియర్ విద్యార్ధుల దాడిలో చనిపోయినప్పటికీ బెంగుళూరు పోలీసులు కేసు నమోదు చేయలేదని మణిపూర్ విద్యార్ధులపైన వివక్ష పాటిస్తున్నారని ఆరోపిస్తూ దేశ వ్యాపితంగా మణిపూర్ విద్యార్ధులు నిరసన ప్రదర్శనలు…

భారత ప్రజల ఆయిల్ ప్రయోజనాలు దెబ్బ తీయనున్న క్లింటన్ పర్యటన

ఆది, సోమ వారాల్లో ఇండియా పర్యటించనున్న అమెరికా విదేశీ మంత్రి హిల్లరీ క్లింటన్ భారత ప్రజల ఇంధన ప్రయోజనాలను గట్టి దెబ్బ తీయనుంది. తన పర్యటన సందర్భంగా ఇరాన్ నుండి ఆయిల్ దిగుమతులు మరింత తగ్గించుకోవాలని హిల్లరీ భారత ప్రభుత్వంపై ఒత్తిడి చేయనుందని క్లింటన్ సహాయకులు చెప్పారు. అమెరికా ఒత్తిడితో ఇరాన్ గ్యాస్ పైప్ లైన్ ఒప్పందాన్ని రద్దు చేస్తుకున్న భారత ప్రభుత్వం అమెరికా మంత్రి ఒత్తిడికి లోగిపోదన్న గ్యారంటీ లేదు. ప్రపంచ ఆయిల్ ధరలతో పోలిస్తే…

‘నీరు, అడవి, భూమి’ ల యజమానులు ఎవరన్నదే మావోయిస్టు సమస్య -బి.డి.శర్మ

గిరిజన ప్రాంతాల్లో “జల్, జంగిల్, జమీన్” యజమానులు ఎవరన్నదే మావోయిస్టులు, ప్రభుత్వం మధ్య ఉన్న ప్రధాన సమస్య అని మాజీ జిల్లా మేజిస్ట్రేట్ బి.డి.శర్మ అన్నారు. ఛత్తీస్ ఘర్ లో కిడ్నాపయిన కలెక్టర్ అలెక్స్ పాల్ మీనన్ విడుదల కోసం మధ్యవర్తిత్వం వహించి బి.డి.శర్మ సఫలం అయ్యారు. న్యూఢిల్లీలో విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ బి.డి.శర్మ ఖనిజ సంపదలున్న భూములకు యజమానులైన గిరిజనులపైన రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు వారి ప్రయోజనాలకు వ్యతిరేకమైన అభివృద్ధి నమూనాను బలవంతంగా రుద్దుతున్నాయని, సమస్యకు…

‘ఒలింపిక్స్’ ని రాజకీయం చేయడానికి అడ్డదారిలో బ్రిటన్ ప్రయత్నం?

‘లండన్ ఒలింపిక్స్’ ని రాజకీయం చేయడానికి అర్జెంటీనా ప్రయత్నిస్తోందని బ్రిటన్ కొన్ని రోజులుగా ఆరోపిస్తోంది. ఒలింపిక్ క్రీడల ప్రచారం కోసం తన భూభాగాన్ని వినియోగించడం ద్వారా ఒలింఫిక్స్ లో రాజకీయాలు చొప్పించడానికి అర్జెంటీనా ప్రయత్నిస్తోందని బ్రిటన్ అంటోంది. వివాదానికి కారణమైన ప్రచార ప్రకటనను రూపొందించింది బ్రిటన్ కంపెనీయేనని తెలియడంతో అసలు ఒలింపిక్స్ ని రాజకీయం చేస్తున్నది అర్జెంటీనా దేశమా లేక బ్రిటన్ దేశమా అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. బ్రిటన్ కి వేల మైళ్ళ దూరంలో దూరంలోనూ,…

క్లుప్తంగా… 03.05.2012

జాతీయం బెంగాల్ ప్రజలు అడుక్కునేవాళ్ళు కాదు –మమత లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వం తీసుకున్న అప్పులపై మూడేళ్లు వడ్డీ చెల్లింపులు నిషేధించాలని తాను చేసిన డిమాండ్ ని కేంద్రం పట్టించుకోకపోవడం పై మమత ఆగ్రహం వ్యక్తం చేసీంది. ఈ విషయంలో తన బాధ్యతను కేంద్రం విస్మరించడానికి వీల్లేదని, బెంగాల్ ప్రజలేమీ అడుక్కోవడం లేదనీ మమత బెనర్జీ వ్యాఖ్యానించింది. తాము ప్రత్యేక ప్యాకేజీ అడగడం లేదనీ అది వారు ఇచ్చిన హామీయే కనుక దాన్ని నెరవేర్చాలనీ కోరింది. “2000 నుండి…

అనగనగా దుబాయ్ లో… ఫొటోలు

దుబాయ్ ఇప్పుడొక కాస్మోపాలిటన్ ఒయాసిస్సు. ప్రపంచంలో అత్యంత ఎత్తైన భవంతి ‘బర్జ్ ఖలీఫా’ దుబాయ్ లోనే ఉంది. అత్యంత విలాసవంతమయిన టూరిస్టు కేంద్రంగా దుబాయ్ భాసిల్లుతోంది. సొమ్ములు అనంతంగా పోగుపడిన వారు వాటిని త్వర త్వరగా ఖర్చు చేసుకోవడానికి దుబాయ్ సందర్శిస్తే సరిపోతుంది. అక్రమ సంపాదనను పెట్టుబడులు పెట్టుడానికీ, అక్రమ డబ్బుని దాచుకోవడానికి దుబాయ్ వీలు కల్పిస్తుంది. ఇది ఇప్పటి సంగతి. ఇరవై, ముప్ఫై యేళ్ల క్రితం దుబాయ్ పరిస్ధితి ఇది కాదు. పెట్రో డాలర్లు ముంచెత్తి…

రూపాయి విలువ పడిపోవడానికి యూరోపే కారణం -ఆర్ధిక మంత్రి

గత కొద్ది నెలలుగా రూపాయి విలువ 15 శాతం పైగా పడిపోవడానికి కారణం యూరో జోన్ లోని వ్యవస్ధాగత సమస్యలేనని ఆర్ధిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ తేల్చేశాడు. రూపాయి విలువ ఎన్నడూ లేనంతగా పతనం అవుతుండడంతో దేశ దిగుమతుల బిల్లు తడిసి మోపెడయింది. యూరోజోన్ ఋణ సంక్షోభంతో పాటు కమోడీటీల ధరలు, ముఖ్యంగా ఆయిల్ ధరలు అస్ధిరంగా మారడంతో ఇండియాతో పాటు ఇతర ఆసియా దేశాల్లో ‘చెల్లింపుల సమతూకం’ (Balance of Payment) ఒత్తిడికి గురవుతోందని ప్రణబ్…

IPL score

ఇండియన్ ప్రెసిడెన్షియల్ లీగ్ -కార్టూన్

ఓ వైపు ఇండియన్ ప్రీమియర్ లీగ్ పోటీలు జరుగుతుండగానే భారత దేశ రాష్ట్ర పతికి ఎవరు సరైన అభ్యర్ధులో తేల్చుకోవడానికి రాజకీయ పార్టీలు మల్ల గుల్లాలు పడుతున్నాయి. రెండు చోట్ల, రెండు రంగాల్లో చోటు చేసుకున్న ద్వైదీ భావ ‘టు బి ఆర్ నాట్ టు బి’ పరిస్ధితి ‘ది హిందూ’ పత్రిక కార్టూనిస్టు సురేంద్రను ఈ కార్టూన్ గీయడానికి పురి గొల్పింది. రాష్ట్రపతి పదవికి ఇద్దరు అభ్యర్ధులను కాంగ్రెస్ ప్రతిపాదించింది. వారు ఉప రాష్ట్రపతి హమీద్…

స్పెయిన్ ఆయిల్ కంపెనీని జాతీయ చేసిన అర్జెంటీనా

– “ఇప్పటి నుండి మన ఆయిల్ రెస్పోల్ కంపెనీ అమ్ముకునే కమోడిటీ గా ఉనికిని ముగించుకుని దేశ అభివృద్ధి కోసం మౌలిక సరుకుగా ఉపయోగపడుతుంది”      -అర్జెంటీనా పాలక పార్టీ పార్లమెంటు సభ్యుడు ఆగస్టిన్ రొస్సీ అర్జెంటీనాలో అతి పెద్ద ఆయిల్ కంపెనీ వై.పి.ఎఫ్ ను ప్రభుత్వం జాతీయ చేసింది. వాణిజ్య ఆంక్షలు విధిస్తామన్న యూరోపియన్ యూనియన్ హెచ్చరికలను పెడచెవిన పెడుతూ, అర్జెంటీనా పార్లమెంటు అత్యధిక మెజారిటీతో వై.పి.ఎఫ్ జాతీయ కరణను ఆమోదించింది. వై.పి.ఎఫ్ లో స్పెయిన్ బహుళజాతి…

అవును, నేను వేశ్య కూతుర్నే -నసీమా (వీడియో)

తల్లిదండ్రుల నిరాదరణకి గురై ఓ వేశ్య చేతికి చిక్కిన నసీమా కధ ఇది. వేశ్యా జీవితం బారిన పడకుండా తనను కాపాడిన అమ్మమ్మ కాని అమ్మమ్మ లాంటి వారి జీవితాలలో కొత్త మార్పు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్న నసీమా అద్భుత మహిళ అనడంలో సందేహం లేదు. విదేశీ నిధుల కోసం ‘ప్రగతి శీల ఫోజులు’ కొట్టే ఎన్.జి.ఒ సంస్ధలపై నమ్మకం లేక తానే ‘పార్స్చం’ అనే సంస్ధను స్ధాపించి ఆశావహ దృక్పధంతో ముందుకు సాగుతోంది నసీమా. తల్లిదండ్రులు విడాకులు…