గొడవకి కారణమైన ‘అంబేద్కర్ కార్టూన్’ ఇదే -కార్టూన్

శుక్రవారం లోక్ సభలో జరిగిన గొడవతో ఎన్.సి.ఇ.ఆర్.టి సెలక్షన్ కౌన్సిల్ సభ్యులూ, ఛీఫ్ సలదారులూ అయిన ఇద్దరు రాజీనామా చేయవలసి వచ్చింది. దళిత ఎం.పిలు గొడవ చేయడంతో ప్రముఖ కార్టూనిస్టు శంకర్ కార్టూన్ ఉన్న పదకొండవ తరగతి రాజకీయ శాస్త్రం లో ఒక పాఠ్యాంశంగా ఉన్న పుస్తకాన్ని తొలగిస్తున్నట్లు మానవ వనరుల శాఖ మంత్రి ‘కపిల్ సీబాల్’ ప్రకటించాడు. ఆయనతో పాటు ఆర్ధిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ కూడా కార్టూన్ అలా గీయవలసింది కాదని వ్యాఖ్యానించారు. కార్టూన్…

అంబేడ్కర్ కార్టూన్ పై ఇంత రగడ అవసరమా? -కార్టూన్

శుక్రవారం పార్లమెంటులో అంబేడ్కర్ కార్టూన్ విషయంలో జరిగిన రగడ కు స్పందనగా ‘ది హిందూ’ పత్రిక కార్టూనిస్టు ‘సురేంద్ర’ గీసిన కార్టూన్ ఇది. మమత బెనర్జీ పై గీసిన కార్టూన్ ని ఈమెయిల్ ద్వారా ఇతరులకు పంపాడన్న కారణంతో ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్ పైన కేసులు పెట్టి వేధించడాన్ని దేశం మొత్తం ఖండించింది. దేశ రాజకీయ నాయకులతో పాటు, అనేక మంది స్కాలర్లు, విద్యావేత్తలు, రాజకీయ వేత్తలు మెచ్చిన కార్టూనిస్టు ‘శంకర్’ గీసిన కార్టూన్ అరవై అయిదేళ్ల…

అంబేడ్కర్ కార్టూన్ పై సిబాల్ ‘సారీ’, ఇద్దరు ప్రొఫెసర్లు రాజీనామా

ఎన్.సి.ఇ.ఆర్.టి టెక్స్ట్ బుక్ లో అంబేడ్కర్, నెహ్రూ లపై ముద్రించబడిన కార్టూన్ పై పార్లమెంటులో గొడవ జరగడంతో ఇద్దరు ప్రొఫెసర్లు తమ సలహాదారు పదవులకు రాజీనామా చేశారు. యోగేంద్ర యాదవ్, సుహాస్ పాల్శికర్ లు సలహా దారుల కౌన్సిల్ నుండి తప్పుకున్నారని మానవ వనరుల శాఖ మంత్రిత్వ శాఖ తెలిపింది. అంబేడ్కర్ కార్టూన్ పై లోక్ సభలో దళిత ఎం.పిలతో పాటు పలువురు ఎం.పి లు ఆందోళన చేయడంతో మానవ వనరుల మంత్రి కపిల్ సిబాల్ క్షమాపణ…

క్లుప్తంగా… 09.05.2012

జాతీయం పరువు హత్యలకు యు.పి డి.ఐ.జి మద్దతు తన కూతురు ఇంటి నుండి పారిపోయి వేరే అబ్బాయిని పెళ్లి చేసుకుందనీ, అబ్బాయిపై చర్య తీసుకోవాలనీ ఫిర్యాదు చేసిన వ్యక్తికి కూతురిని చంపెయ్యమని అత్యున్నత పోలీసు అధికారి సలహా ఇవ్వడం సంచలనం రేపింది. తండ్రి స్ధానంలో తానున్నట్లయితే కూతురిని చంపేయ్యడమో లేదా తానే ఆత్మహత్య చేసుకోవడమో చేసేవాడినని సలహా ఇస్తుండగా సంభాషణను కేమెరాలు బంధించడంతో డి.ఐ.జి ఎస్.కె.మాధుర్ వ్యవహారం లోకానికి వెల్లడయింది. రెగ్యులర్ చెకింగ్ కోసం ఓ పోలీసు…

క్లుప్తంగా… 08.05.202

జాతీయం జ్యువెలర్స్ పన్ను ఉపసంహరించిన ప్రణబ్ నగల వ్యాపారుల ఒత్తిడికి ఆర్ధిక మంత్రి తలొగ్గాడు. జ్యువెలర్స్ వ్యాపారుల తరపున తీవ్ర స్ధాయిలో జరిగిన లాబీయింగ్ ముందు చేతులెత్తేశాడు. బ్రాండెడ్ మరియు అన్ బ్రాండెడ్ నగల దిగుమతులపై పెంచిన 1 శాతం పన్ను ఉపసంహరించుకున్నాడు. పన్ను ఉపసంహరణతో పాటు పన్ను పెంపు ప్రతిపాదిస్తూ చేసిన అనేక చర్యలను సరళీకరించాడని పత్రికలు తెలిపాయి. జ్యూవెలరీ రంగంలో విదేశీ పెట్టుబడుల ఆహ్వానాన్ని మరో సంవత్సరం పాటు వాయిదా వేసుకున్నట్లు కూడా తెలుస్తోంది.…

‘సాక్షి’ కి ప్రకటనలు ఇవ్వొద్దు -ఎ.పి ప్రభుత్వం ఆదేశాలు

మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర రెడ్డి స్ధాపించిన దిన పత్రిక ‘సాక్షి’ కి ప్రభుత్వ ప్రకటనలు ఇవ్వరాదని ప్రభుత్వం సంబంధిత విభాగాలకు ఆదేశాలు జారీ చేసింది. వై.ఎస్.ఆర్ స్ధాపించిన ‘ఇందిర’ టి.వి కి కూడా ప్రకటనలు ఇవ్వడం ఆపాలని ప్రభుత్వం నిర్ణయించింది. కడప ఎం.పి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి పై ‘అక్రమ ఆస్తుల’ కేసు విచారణకు సంబంధించి ఈ ఆదేశాలు జారీ చేశామని ప్రభుత్వం తెలిపింది. ఇరు సంస్ధలకు చెందిన బ్యాంకు ఖాతాలను సి.బి.ఐ స్తంభింపజేసిన ఒక రోజు తర్వాత…

ఇరాన్ ఆయిల్ కొనుగోలు పెంచిన టర్కీ

ఇరాన్ నుండి కొనుగోలు చేస్తున్న క్రూడాయిల్ మొత్తాన్ని టర్కీ అధికం చేసింది. ఇరాన్ తయారు చేయని అణు బాంబు ప్రపంచ శాంతికి ప్రమాదం అని చెబుతూ ఆదేశానికి వ్యతిరేకంగా వాణిజ్య ఆంక్షలు విధిస్తూ చట్టం చేసి తమ చట్టాన్ని అమలు చేయాలని ప్రపంచ దేశాలపై ఒత్తిడి చేస్తున్న అమెరికాకి టర్కీ ఈ విధంగా సమాధానం చెప్పింది. ఫిబ్రవరి తో పోలిస్తే మార్చి నెలలో ఇరాన్ నుండి టర్కీ దిగుమతి చేసుకున్న క్రూడాయిల్ దాదాపు మూడు రెట్లు పెరిగిందని…

అమెరికా నిరుద్యోగం -కార్టూన్లు

పశ్చిమ దేశాల ఆర్ధిక వ్యవస్ధలకు ‘నిరుద్యోగం’ కొత్త సాధారణ లక్షణం (new normal) గా మారిపోయింది. ఆర్ధిక సంక్షోభం అనంతరం ‘రికవరీ’ సాధించినట్లయితే అందులో ‘జాబ్ గ్రోత్’ కూడా కలిసి ఉండడం నియమం. కాని 2008 ఆర్ధిక సంక్షోభం అనంతరం ‘రికవరీ’ సాధించామని చెబుతున్నప్పటికీ అందులో ‘జాబ్ గ్రోత్’ లేదు. దానితో ఆర్ధిక వేత్తలు ఇప్పటి రికవరీని ‘జాబ్ లెస్ రికవరీ’ గా పేర్కొంటున్నారు. ‘జాబ్ గ్రోత్’ లేని రికవరీ, అసలు రికవరీ కానే కాదు. అందుకే…

జాతీయ స్ధాయి విలుకత్తెకి కానిస్టేబుల్ కొలువు కూడా ఇవ్వలేరా?

ఈ ఫోటోలో అమ్మాయి పేరు నిషా రాణి దత్తా. విలువిద్యలో జాతీయ స్ధాయి ప్రతిభ కనబరిచిన 21 యేళ్ళ యువతి. కటిక పేదరికంలో పుట్టినా స్వయం కృషితో విలువిద్య క్రీడలో జాతీయ స్ధాయికి చేరింది. అయినప్పటికీ ఈ జార్ఘండ్ ఆడకూతురికి కనీసం కానిస్టేబుల్ ఉద్యోగం కూడా ఇవ్వలేకపోయాయి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు. ఈ దేశ మూలవాసులయిన గిరిజన తెగల్లో పుట్టిన పాపానికి వృద్ధ తల్లిదండ్రులని, ఇద్దరు చెల్లెళ్లను పోషించుకోవడానికి తాను భద్రంగా కాపాడుకుంటూ వస్తున్న వెండి విల్లుని…

2జి: కేంద్రం U-టర్న్ (గ్రాఫిక్)

2జి స్పెక్ట్రం కేసు విషయంలో కేంద్ర ప్రభుత్వం యు-టర్న్ తీసుకుంది. ప్రవేటు టెలికం కంపెనీలు అక్రమంగా పొందిన లైసెన్సులను రద్దు చేసిన సుప్రీం కోర్టు తీర్పు పై దాఖలు చేసిన రివ్యూ పిటిషన్ ను ఉపసంహరించు కోవాలని నిర్ణయించింది. ప్రవేటు కంపెనీలు పొందిన 122 అక్రమ లైసెన్సులను సుప్రీం కోర్టు ఫిబ్రవరి 2, 2012 తేదీన ఇచ్చిన తీర్పులో రద్దు చేసింది. దేశ సహజ వనరుల విషయంలో మొదట వచ్చినవారికి మొదట లైసెన్సు లు కేటాయించే పద్ధతి…

ఫ్రాన్సు ఎన్నికల్లో సర్కోజి ఓటమి -యూరోప్ కార్టూన్లు

ఫ్రాన్సు అధ్యక్షుడు నికొలస్ సర్కోజి ఓటమి పై యూరోపియన్ కార్టూనిస్టులు ఇలా స్పందించారు. యూరోపియన్ బహుళజాతి కంపెనీలతో పాటు అమెరికా బహుళజాతి కంపెనీలకు లబ్ది చేకూరుస్తూ జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్, ఫ్రాన్సు అధ్యక్షుడు నికొలస్ సర్కోజీల నేతృత్వంలో యూరోపియన్ ప్రభుత్వాలు అమలు చేసిన పొదుపు ఆర్ధిక విధానాలతో యూరోపియన్ ప్రజలు తీవ్రంగా విసిగిపోయారు. కంపెనీలకు బెయిలౌట్లు పంచిపెట్టడం వల్ల పేరుకున్న అప్పులను కోతలు, రద్దులతో ఇ.యు ప్రభుత్వాలు వసూలు చేస్తున్నాయి. కార్మికులు, ఉద్యోగుల వేతనాలలో గణనీయ…

క్లుప్తంగా… 07.05.2012

జాతీయం మోడిని ప్రాసిక్యూట్ చెయ్యొచ్చు -అమికస్ క్యూరీ 2002 గుజరాత్ మారణకాండ కేసులో ముఖ్యమంత్రి నరేంద్ర మోడి ని ప్రాసిక్యూట్ చేయదగ్గ సాక్ష్యాలున్నాయని సుప్రీం కోర్టు నియమించిన ‘అమికస్ క్యూరీ’ (కోర్టు సహాయకుడు) రాజు రామచంద్రన్ కోర్టుకి తెలియజేశాడు. ఇరు మతాల ప్రజల మధ్య ‘శతృత్వాన్ని ప్రోత్సహించినందుకు’ గాను మోడిని ప్రాసిక్యూట్ చేయవచ్చని ఆయన తన నివేదికలో పేర్కొన్నాడు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు గుజరాత్ అల్లర్లపై విచారణ చేయడానికి ‘స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం’ ఏర్పాటయింది. దశాబ్దం…

ఇరాన్ ఆయిల్: అమెరికా ఒత్తిడికి ఇండియా ప్రతిఘటన

ఇరాన్ నుండి ఆయిల్, గ్యాస్ దిగుమతులను మరింతగా తగ్గించాలని అమెరికా తెస్తున్న ఒత్తిడిని భారత ప్రభుత్వం ప్రతిఘటిస్తున్నట్లుగా విదేశాంగ మంత్రి ప్రకటన సూచిస్తోంది. ఇరాన్ పై అమెరికా విధించిన ఆంక్షలను భారత దేశం అమలు చేయాలంటే గల్ఫ్ ప్రాంతంలో నివశిస్తున్న భారతీయుల భద్రత కూడా పరిగణించాలని హిల్లరీ క్లింటన్ కి చెప్పినట్లు విదేశాంగ మంత్రి ఎస్.ఎం.కృష్ణ పత్రికలకు తెలిపాడు. గల్ఫ్ ప్రాంతంలో భారత దేశానికి కీలకమైన భద్రతా ప్రయోజనలు ఉన్నాయని ఆయన అమెరికా అతిధికి గుర్తు చేశాడు.…

‘హజ్’ సబ్సిడీ రద్దు చేసిన సుప్రీం కోర్టు

‘హజ్’ యాత్రకు వెళ్ళే ముస్లిం ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ చెల్లించడాన్ని మంగళవారం సుప్రీం కోర్టు తప్పు పట్టింది. మరో పదేళ్ళలో ‘హజ్’ సబ్సిడీలను క్రమంగా రద్దు చేయాలని తీర్పు నిచ్చింది. మతపరమైన యాత్రలకు సబ్సిడీలు ఇవ్వడం ‘చెడ్డ మతాచారం’ గా అభివర్ణించింది. యాత్రీకులకు తోడు వెళ్లడానికి కేంద్ర ప్రభుత్వం స్వయంగా అధికారిక డెలిగేషన్స్ పంపిస్తూ పెద్ద ఎత్తున ఖర్చు పెట్టడం ద్వారా ‘హజ్’ యాత్ర ను రాజకీయం చేస్తున్నారని అభిప్రాయపడింది. “ఈ విధానాన్ని అంతం చేయాలని…

క్లుప్తంగా… 06.05.2012

జాతీయం భోపాల్ బాధితులకు మూడు నెలల్లో శుభ్రమైన నీళ్లివ్వండి -సుప్రీం కోర్టు భోపాల్ దుర్ఘటన జరిగి దాదాపు ముప్ఫై యేళ్ళు అవుతున్నా బాధితులు ఇప్పటికీ కాలుష్య పూరితమైన, క్యాన్సర్ కారక నీటినే తాగవలసి రావడం పట్ల సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మూడు నెలల్లో వారికి పరిశుభ్రమైన నీరు తాగే సౌకర్యం కల్పించాలని ఆదేశాలు జారీ చేసింది. నిధులు లేకపోవడం కారణాలుగా చెప్పడానికి వీల్లేదనీ, ఆగస్టు 13 కల్లా నీటి సౌకర్యం కల్పించిన నివేదిక తనకి…