అమెరికా వేడి గాలులకి 42 మంది దుర్మరణం

అమెరికాలో వేడి గాలుల తీవ్రత కొనసాగుతోంది. పర్యావరణంలో మార్పుల ప్రభావంగా నిపుణులు చెబుతున్న ఈ వేడి గాలులు గత కొద్ది రోజులుగా అమెరికా లోని కనీసం డజను రాష్ట్రాలను చుట్టుముట్టాయి. ముఖ్యంగా మిడ్ వెస్ట్ నుండి తూర్పు తీరం వరకూ ఈ వేడి గాలులు వ్యాపించి ఉన్నాయని బి.బి.సి వార్తా సంస్ధ తెలిపింది. పంటలు శుష్కించుకుపోగా, రోడ్లు, రైల్వే లైన్ల రూపు రేఖలు మారిపోయాయని ఆ సంస్ధ తెలిపింది. వందల కొద్దీ ఉష్ణోగ్రతా రికార్డులు బద్దలయ్యాయని తెలిపింది.…

మోడి పచ్చి అబద్ధాల కోరు -గుజరాత్ బి.జె.పి నాయకుడు కేశూభాయ్

గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడి నిజ స్వరూపాన్ని ఆయన పార్టీ నాయకులే విప్పి చూపుతున్నారు. మోడి చెబుతున్న అభివృద్ధి పారిశ్రామికవేత్తలదే తప్ప ప్రజలది కాదన్న వాస్తవాన్ని వెల్లడిస్తున్నారు. అబద్ధాలు చెప్పడాన్ని మోడీ గుత్తకు తీసుకున్నాడని, ఆయన సద్భావన మిషన్ పెద్ద మోసమనీ గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి, బి.జె.పి నాయకుడు కేశూభాయ్ పటేల్ అసలు వాస్తవాన్ని వెల్లడించాడు. తద్వారా మోడీ కేంద్రంగా ఉబ్బిపోతున్న గాలి బుడగను ‘టప్పున’ బద్దలు కొట్టాడు.  “ప్రజలకు అబద్ధాలు చెప్పి తప్పుదారి పట్టించడాన్ని ఒక…

సిరియా విషయంలో అమెరికా హెచ్చరికను తిరస్కరించిన చైనా

సిరియా విషయంలో రష్యా, చైనా లు తగిన మూల్యం చెల్లించక తప్పదన్న అమెరికా హెచ్చరికను చైనా తిరస్కరించింది. అమెరికా విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్ విమర్శ తమకు ఆమోదయోగ్యం కాదని చైనా విదేశీ మంత్రిత్వ శాఖ ప్రతినిధి లియు వీమిన్ శనివారం ప్రకటించాడు. “సిరియా సమస్యల పరిష్కారాన్ని తాము అడ్డుకోవడం లేదని” లియు విలేఖరుల సమావేశంలో అన్నాడని ప్రెస్ టి.వి తెలిపింది. జులై 6 తేదీన పారిస్ లో జరిగిన ‘ఫ్రెండ్స్ ఆఫ్ రష్యా’ దేశాల సమావేశాల…

ఇంటర్నెట్ రేట్లు: కంపెనీలను వదిలి వినియోగదారులపై బాదుడు -కార్టూన్

కంపెనీలను ఏమీ చేయలేక సాధారణ వినియోగదారులకు ఇంటర్నెట్ ఛార్జీలు పెంచిన వైనం ఇది. బడా ఐ.ఎస్.పి (ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్) కంపెనీలకు అనేక లైసెన్సులు ఉంటాయి. ప్రభుత్వం, ఐ.ఎస్.పి ల ఒప్పందం ప్రకారం రెవిన్యూను పరస్పరం పంచుకోవాలి. డిఫరెన్షియల్ రెవిన్యూ షేరింగ్ గా పిలిచే ఈ పద్ధతి ప్రకారం పిండి కొద్దీ రొట్టె ముక్కను ప్రభుత్వానికి కంపెనీలు ఇవ్వాలి. ప్రభుత్వ వాటా వివిధ స్ధాయిల లైసెన్సులను బట్టి ఉంటుంది. కొన్ని లైసెన్సుల కింద వచ్చే ఆదాయంలో 6…

మాయావతి అవినీతి కేసు కొట్టివేత, సి.బి.ఐ అతి చేసిందని సుప్రీం వ్యాఖ్య

ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతి పై సి.బి.ఐ దాఖలు చేసిన అవినీతి కేసును సుప్రీం కోర్టు కొట్టివేసింది. కోర్టు నుండి నిర్దిష్ట ఆదేశాలు లేకుండానే సి.బి.ఐ తనంతట తాను మాయావతి కోసమే ప్రత్యేకంగా ఎఫ్.ఐ.ఆర్ రిజిస్టర్ చేయడాన్ని తప్పు పట్టింది. తాజ్ కారిడార్ అవినీతి కేసులో అధికారుల అవినీతిని విచారించాలని కోర్టు చెపితే దాన్ని వదిలి మాయావతి పై ప్రత్యేకంగా కేసు పెట్టడం ఏమిటని ప్రశ్నించింది. సి.బి.ఐ తన అధికార పరిధిని అతిక్రమించి మాయావతి పై…

అణు కర్మాగారం తెరవడాన్ని వ్యతిరేకిస్తూ జపనీయుల ప్రదర్శనలు -ఫొటోలు

జపాన్ ప్రభుత్వం అణు కంపెనీల లాబీ తెచ్చిన తీవ్ర ఒత్తిడికి లొంగిపోయింది. రెండు నెలల పాటు అణు విద్యుత్ అనేదే లేకుండా గడిపగలిగినప్పటికీ ప్రజల ప్రయోజనాల కంటె అణు కంపెనీల ప్రయోజనానే ముఖ్యమని భావించింది. ఫుకుయి లో ‘కాన్సాయ్ ఎలక్ట్రిక్ పవర్ కంపెనీ’ కి చెందిన ‘ఒయి న్యూక్లియర్ పవర్ ప్లాంటు’ ను ఆదివారం తిరిగి తెరిచింది. తద్వారా ఫుకుషిమా ప్రమాదం తర్వాత కూడా పాఠాలు నేర్చుకోవడానికి తిరస్కరించింది. సంవత్సర కాలంగా జపాన్ ప్రజల నిరసనలను బేఖాతరు…

బ్యాంకులు కంపెనీల కోసం ఇ.సి.బి ఉదారం, వడ్డీ రేటు 0.75% కి తగ్గింపు

ప్రపంచ ఆర్ధిక సంక్షోభానికి కారకులయిన బహుళ జాతి వాల్ స్ట్రీట్ బ్యాంకులు, కంపెనీల కోసం యూరోపియన్ సెంట్రల్ బ్యాంకు (ఇ.సి.బి) మరోసారి యధా శక్తి ఉదారతను ప్రదర్శించింది. ఇప్పటికే హీన స్ధాయిలో 1 శాతం వడ్డీ రేటును 0.25 శాతం తగ్గించి 0.75 శాతానికి చేర్చింది. 2007 ఆర్ధిక సంక్షోభం నుండి అత్యంత తక్కువ స్ధాయి 0.25 శాతం వద్ద వడ్డీ రేటు కొనసాగిస్తున్న అమెరికన్ సెంట్రల్ బ్యాంకు ‘ఫెడరల్ రిజర్వ్’ కంటే ఇది కేవలం అర…

ఫుకుషిమా విపత్తు మానవ తప్పిదమే -జపాన్ పార్లమెంటరీ కమిటీ

జపాన్ ప్రభుత్వం, న్యూక్లియర్ కంపెనీ ‘టెప్కో’ లే ఫుకుషిమా అణు ప్రమాదానికి కారకులని జపాన్ పార్లమెంటరీ కమిటీ తేల్చి చెప్పింది. ఫుకుషిమా అణు కర్మాగారం ప్రమాదానికి గురికావదానికి సునామీ ఒక్కటే కారణం కాదనీ అది వాస్తవానికి మానవ నిర్మిత వినాశనమని కమిటీ స్పష్టం చేసింది. జపాన్ పార్లమెంటు ‘డైట్’ (Diet) నియమించిన ‘ఫుకుషిమా న్యూక్లియర్ యాక్సిడెంట్ ఇండిపెండెంట్ ఇన్వెస్టిగేషన్ కమిషన్’, తన అంతిమ నివేదికలో ఈ వాస్తవాన్ని వెల్లడించింది. ఏ ఒక్క వ్యక్తీ దీనికి కారణం కాదనీ,…

రాజకీయులను విమర్శించనిది ఇక ఎన్.సి.ఇ.ఆర్.టి పుస్తకాలే -కార్టూన్

అంబేద్కర్ కార్టూన్ పై రేగిన ‘అప్రజాస్వామిక రగడ’ చివరికి ఎన్.సి.ఇ.ఆర్.టి పాఠ్య పుస్తకాలనుండి కార్టూన్ లనూ, వివిధ పాఠ్య భాగాలనూ పూర్తిగా తొలగించాలనే దగ్గర తేలింది. ప్రభుత్వం నియమించిన ‘ఎస్.కె.ధోరట్’ ప్యానెల్ చర్చలు చేసి రాజకీయ శాస్త్ర పాఠ్య పుస్తకాల నుంది అనేక కార్టూన్ లను, పాఠ్య భాగాలనూ తొలగించాలని మెజారిటీ నిర్ణయం చేసింది. ఈ నిర్ణయాన్ని పలువురు స్కాలర్లు నిరసిస్తున్నారు. ప్రఖ్యాత చరిత్రకారుడు, జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ అయిన కె.ఎన్.ఫణిక్కర్ ప్యానెల్…

బ్యాంక్సీ వీధి చిత్రాలు… కాదు, కాదు, పెయింటింగ్స్ -ఫొటోలు

బ్యాంక్సీ, వీధి చిత్రాలకు చిరునామా అని పాఠకులకు తెలిసిన విషయమే. కులీన వర్గాల ‘అధారిటేరినియనిజం’ పై చాచి కొట్టేలా ఉండే బ్యాంక్సీ వీధి చిత్రాలకు ప్రపంచ వ్యాపితంగా, ముఖ్యంగా పశ్చిమ దేశాల్లో, లెక్కకు మిక్కిలిగా అభిమానులు ఏర్పడ్డారు. ఈ టపాలో ఇస్తున్నవి బ్యాంక్సీ వీధి చిత్రాలు కావు గానీ, వాటికి ఏ మాత్రం తగ్గనివి. కాసిన్ని గీతల్లో, స్టెన్సిల్ టెక్నిక్ తో అధికార మదానికి  బ్యాంక్సీ ఇచ్చే షాక్ ట్రీట్ మెంట్, అపహాస్యం, సునిశిత విమర్శ ఈ…

పశ్చిమ ఆంక్షలకు ఇరాన్ ప్రతిఘటన, ‘హోర్ముజ్’ లో ఆయిల్ రవాణా నిలిపివేతకు చర్యలు

అమెరికా, యూరోపియన్ యూనియన్ లు ఇరాన్ పై విధించిన ఆయిల్ ఆంక్షలు జులై 3 నుండి అమలులోకి రావడంతో ఇరాన్ ప్రతిఘటన చర్యలను ప్రారంభించింది. ప్రపంచంలోని ఆయిల్ రవాణాలో 20 శాతం రవాణా అయ్యే ‘హోర్ముజ్ ద్వీపకల్పం’ వద్ద పశ్చిమ దేశాల అంతర్జాతీయ ఆయిల్ రవాణా ట్యాంకర్లు వెళ్లకుండా నిరోధించడానికి చర్యలు చేపట్టింది. ఆయిల్ ట్యాంకర్లను అడ్డుకోవడానికి వీలుగా ఇరాన్ పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టారు. దీనితో ప్రపంచవ్యాపితంగా క్రూడాయిల్ ధరలు మళ్ళీ కొండెక్కనున్నాయని విశ్లేషణలు ఊపందుకున్నాయి. ఇరాన్…

అమెరికా ఆర్ధిక వృద్ధి ఆశావాహంగా లేదు -ఐ.ఎం.ఎఫ్

అమెరికా ఆర్ధిక ‘రికవరీ’ ఏమంత ప్రోత్సాహకరంగా లేదని ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ పేర్కొంది. 2012 సంవత్సరానికి అమెరికా జి.డి.పి వృద్ధి రేటు అంచనాని 2.1 శాతం నుండి 2 శాతానికి తగ్గించింది. యూరో జోన్ ఋణ సంక్షోభం, అమెరికా ఆర్ధిక వ్యవస్ధలోని అనిశ్చిత పరిస్ధితులు పరిస్ధితిని మరింత ప్రమాదకరంగా మార్చాయని తెలిపింది. అధ్యక్ష ఎన్నికలు పూర్తయ్యాక కొత్త అధ్యక్షుడు అధికారం చేపట్టే లోపు అప్పు పరిమితిని మరోసారి పెంచాల్సి ఉందని హెచ్చరించింది. 2012 సంవత్సరానికి గాను అమెరికా…

కూల్చిన మసీదులు కట్టాల్సిందే, మోడీకి సుప్రీం ఆదేశాలు

గోధ్రా రైలు దహనం అనంతరం గుజరాత్ లో కూల్చిన మసీదులను తిరిగి కట్టాలంటూ గుజరాత్ హై కోర్టు ఇచ్చిన తీర్పు పై స్టే విధించడానికి సుప్రీం కోర్టు తిరస్కరించింది. మతపరమైన మందిరాల నిర్మాణానికి ప్రభుత్వాలు డబ్బు ఖర్చు పెట్టడం ‘సెక్యులరిస్టు సూత్రాలకు విరుద్ధం’ అన్న గుజరాత్ ప్రభుత్వ వాదనను కోర్టు తిరస్కరించింది. గుజరాత్ మారణకాండ సందర్భంగా ముస్లింల ప్రార్ధనా స్ధలాలను కాపాడడంలో విఫలం అవడమే కాక కూల్చివేతకు గురయిన మసీదులను నిర్మించకూడదని రాష్ట్ర ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం…

తుఫానొస్తే అమెరికాలోనూ రోజులపాటు కరెంటు కష్టాలు తప్పవు

భారత దేశంలో తుఫానొచ్చి గట్టిగా గాలి వీస్తే విద్యుత్ స్తంభాలు, చెట్లు కూలిపోయి రోజుల తరబడి చీకట్లో మగ్గవలసి రావడం పరిపాటి. మనిషి అభివృద్ధి చేసుకున్న ఆధునిక సాధనాలు ప్రకృతిపై మనిషి పై చేయి సాధించేందుకు దోహదం చేశాయి. అయితే ప్రకృతి విలయతాండవానికి తెగిస్తే అమలాపురం అయినా అమెరికా అయినా ఒకటేననీ సాక్షాత్తూ అమెరికా రాజధాని వాషింగ్టన్ తో పాటు ఇంకా అనేక నగరాల కష్టాలే చెబుతున్నాయి. పెను తుఫాను ధాటికి 18 మంది మరణించడమే కాక…

స్పోర్ట్స్ లో పురుష దురహంకారం స్పష్టంగా ఉంది -దీపిక

ఆటల్లో పురుష దురహంకారం స్పష్టంగా కొనసాగుతోందని ఆసియన్ సీనియర్ స్క్వాష్ ఛాంపియన్ షిప్ సాధించిన దీపిక పల్లికల్ అభిప్రాయపడింది. సానియా మీర్జా, జ్వాలా గుత్తా ల అభిప్రాయాలకు దీపిక మద్దతు పలికింది. లండన్ ఒలింపిక్స్ లో పురుషుల టీం ఎంపికలో పురుష ఆటగాళ్ళ మధ్య తలెత్తిన వివాదాన్ని ఆల్ ఇండియా టెన్నిస్ అసోసియేషన్ (ఎ.ఐ.టి.ఎ) పరిష్కరించిన తీరు పట్ల సానియా తీవ్ర అసంతృప్తి ప్రకటించిన సంగతి విదితమే. సానియా మీర్జా అసంతృప్తికి జ్వాలా గుత్తా మద్దతు ప్రకటించిన…