ప్రపంచ వ్యాపితంగా విస్తరించిన అమెరికా వ్యతిరేక ప్రదర్శనలు

ఇస్లాంని అవమానిస్తూ అమెరికాలో రూపొందిన సినిమాను నిరసిస్తూ ప్రపంచ వ్యాపితంగా నిరసనలు జరుగుతున్నాయి. గత మంగళవారం బెంఘాజీ (లిబియా) లో అమెరికా రాయబారిని బలి తీసుకున్న ముస్లింల ఆగ్రహ ప్రదర్శనలు ఆసియా, ఆఫ్రికాలతో పాటు యూరోపియన్ దేశాలకు కూడా విస్తరించాయి. మహమ్మద్ ప్రవక్తను ‘స్త్రీ లోలుడు’ గా హంతకులకు నాయకుడుగా చిత్రీకరించడం పట్ల చెలరేగిన నిరసన పలు చోట్ల హింసాత్మక రూపం తీసుకున్నాయి. లిబియా, ఈజిప్టులతో పాటు ట్యునీషియా, సూడాన్ లలో కూడా అమెరికా రాయబార కార్యాలయాలపై…

అచ్చమైన ప్రజలే కూడంకుళం ఉద్యమ నిర్మాతలు -ఫోటోలు

కూడంకుళం అణు కర్మాగారం వల్ల తమ భద్రతకు, జీవనోపాధికీ ప్రమాదమని స్ధానిక ప్రజలు భయపడుతున్నారు. ఫుకుషిమా అణు ప్రమాదం జరిగాక వారి భయాలు నిజమేనని వారికి రూఢి అయింది. కూడంకుళం అణు కర్మాగారానికి వ్యతిరేకంగా, గత సంవత్సరం ఆగస్టు నుండి వారు శాంతియుత నిరసన ప్రారంభించారు. కర్మాగారానికి వ్యతిరేకంగా గ్రామ సభలో తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపారు. నెలల తరబడి నిరాహార దీక్ష చేశారు. వారి భయాలు పోగొట్టడానికి బదులు ప్రభుత్వం వందలమంది ప్రజలపై ‘దేశ ద్రోహం’…

అణు విద్యుత్ లేకపోయినా విద్యుత్ అవసరాలు గడిచిపోతాయి -అణు శాస్త్రవేత్త

ఇది ఈనాడులో సెప్టెంబర్ 1 తేదీన వచ్చిన ఆర్టికల్. భారత దేశానికి ఆ మాటకొస్తే ప్రపంచానికయినా అణు విద్యుత్ అవసరమా అన్న సమస్యను అణు శాస్త్రవేత్త బుద్ధికోట సుబ్బారావు గారు ఇందులో చర్చించారు. అణు విద్యుత్ విషయమై భారత దేశంలో లోతైన చర్చ జరగలేదని సుబ్బారావు గారు అభిప్రాయపడ్డారు. భారీ పెట్టుబడులు అవసరమైన అణు విద్యుత్ వల్ల ఇతర ఇంధనాల ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేయడానికి నిధులు మృగ్యం అవుతాయని తెలిపారాయన. అనేక అపోహలను తయారు చేసి…

చిల్లర వర్తకంలో 51% విదేశీ పెట్టుబడులకు కేబినెట్ అనుమతి

అమెరికన్ కంపెనీలకు ఇచ్చిన హామీని భారత ప్రభుత్వం నిలబెట్టుకుంది. దేశంలో ఇరవై కోట్లమందికి ఉపాధి నిస్తున్న చిల్లర వర్తకాన్ని తీసుకెళ్లి వాల్ మార్ట్ చేతుల్లో పెట్టింది. చిల్లర కొట్లు పెట్టుకుని స్వయం ఉపాధి కల్పించుకున్న ఐదు కోట్ల కుటుంబాలను వీధి పాలు చేస్తూ రిటైల్ వర్తకంలో 51 శాతం విదేశీ పెట్టుబడులకు అనుమతి ఇస్తూ నిర్ణయం తీసుకుందని ‘ది హిందూ’ తెలిపింది. ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం ఇంకా అధికారికంగా పత్రికలకు చెప్పలేదు. పేరు చెప్పవద్దని కోరుతూ ఒక…

నిన్నటి వరకు మమత, ఇపుడు ములాయం కూడా… -కార్టూన్

యు.పి.ఏ కి కష్టాలు ముమ్మరం అయినట్లు కనిపిస్తోంది. ‘మద్దతు ఉపసంహరిస్తా’ అంటూ మమతా బెనర్జీ తరచుగా బెదిరించే విషయం అందరికీ తెలిసిందే. తాజాగా ములాయం సింగ్ యాదవ్ కూడా ఆమెకు జత చేరినట్లు కనిపిస్తోంది. యు.పి.ఏ ప్రభుత్వం అవినీతి తో పంకిలమయిందని ఆయన చేసిన వ్యాఖ్య గురువారం పత్రికల పతాక శీర్షికలను ఆకర్షించింది. రిటైల్ వ్యాపారంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతించే నిర్ణయాన్ని మమత తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు చెబుతూ వచ్చింది. ఆమెను మేనేజ్ చెయ్యడానికి అమెరికా విదేశాంగ…

కూడంకుళం ఆందోళన: సముద్ర అలలపై కొత్తతరహా ఉద్యమం

కూడంకుళం అణు కర్మాగారంకి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న స్ధానిక ప్రజలు తమ పోరాటానికి సముద్రాన్ని తోడు తెచ్చుకున్నారు. ప్రభుత్వాలు తమ ఊళ్లను, రహదారులను, ఖాళీ స్ధలాలను పోలీసు మాయం చేసిన నేపధ్యంలో గురువారం సముద్రంలోకి దిగి ఆందోళన మొదలు పెట్టారు. మధ్య ప్రదేశ్ ‘జల్ సత్యాగ్రహ్’ తరహాలో సముద్రంలోకి దిగి మానవహారాన్ని నిర్మించి రోజంతా ఆందోళన తెలిపారు. ప్రభుత్వం యధావిధిగా పోలీసుల చేత సముద్రం ఒడ్డుని దిగ్భంధించింది. అదనపు పోలీసు బలగాలను రప్పించి ప్రజలపై వేధింపులు కొనసాగించింది.…

కూడంకుళం: ప్రజల భద్రతే అంతిమం -సుప్రీం కోర్టు

కూడంకుళం అణు కర్మాగారం (ఫొటో: ది హిందూ) తమిళనాడు కూడంకుళం అణు విద్యుత్ కర్మాగారానికి వ్యతిరేకంగా స్ధానిక ప్రజలు సాగిస్తున్న పోరాటానికి సుప్రీం కోర్టు నుండి ఒకింత మద్దతు లభించీంది. ఇంధనం నింపడంపై స్టే విధించడానికి నిరాకరించినప్పటికీ ప్రాజెక్టు వల్ల ప్రజలకు ఎదురుకానున్న ప్రమాదాన్ని పరిశీలించడానికి అంగీకరించింది. కర్మాగారం చుట్టూ ఉన్న ప్రజల భద్రతే అంతిమమని వ్యాఖ్యానించింది. ఇంధనం నింపినప్పటికీ రెండు నెలల వరకూ కర్మాగారాన్ని ప్రారంభించబోమన్న కేంద్రం హామీపై నమ్మకం ఉంచింది. మద్రాస్ హై కోర్టు…

రిజర్వేషన్లు కాదు, వ్యవస్ధాగత అణచివేతే అసలు సమస్య

(ఈ ఆర్టికల్ నిజానికి ‘గౌతమ్ మేకా’ గారి వ్యాఖ్య. “66 ఏళ్ల వెనుకబాటు భారతానికి సారధులు అగ్రకుల ప్రతిభా సంపన్నులే” అన్న టైటిల్ తో నేను రాసిన టపా కింద ఆయన రాసిన వ్యాఖ్య. విషయ ప్రాధాన్యత దృష్ట్యా, ఆంగ్లంలో రాసిన ఆయన వ్యాఖ్యను మరింతమంది పాఠకుల దృష్టికి తెచ్చే ఉద్దేశ్యంతో అనువదించి టపా గా మార్చుతున్నాను. ఇప్పటి వ్యవస్ధ పరిధిలోనే పరిష్కారం వెతికే ధోరణి ఉన్నప్పటికీ వ్యాఖ్యకు ఉన్న పరిమితి దృష్ట్యా, ఆయన వ్యక్తపరిచిన అభిప్రాయంతో…

కాంగ్రెస్ మార్కు అవినీతి వ్యతిరేక పోరాటం -కార్టూన్

అన్నా హజారే, ఆయన బృందం అవినీతికి వ్యతిరేకంగా పోరాటం మొదలు పెట్టాక వాళ్ళకి మద్దతు ఇవ్వని రాజకీయ పార్టీ లేదు. జాతీయ పార్టీలతో పాటు అనేకానేక ప్రాంతీయ పార్టీలు కూడా అన్నా పోరాటానికి మద్దతు ఇచ్చేందుకు క్యూలు కట్టారు. బి.జె.పి లాంటి పార్టీలు కార్యకర్తలను సరఫరా చేసి తెరవెనుక మద్దతు అందించాయి. అవినీతి సామ్రాట్టులుగా పేరుబడ్డవారు కూడా పత్రికా ప్రకటనలతో యధాశక్తి మద్దతు ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ అయితే ఏకంగా పార్లమెంటులోనే అన్నాకి మద్దతుగా గొప్ప గొప్ప…

9/11 వార్షికోత్సవ దినాన లిబియాలో అమెరికా రాయబారి హత్య

ఫొటో: ది హిందూ న్యూయార్క్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ జంట టవర్ల పై దాడులు జరిగి 11 సంవత్సరాలు పూర్తయిన రోజునే లిబియాలో అమెరికా రాయబారి చావును రుచి చూశాడు. అమెరికా రాయబార కార్యాలయాన్ని చుట్టుముట్టిన ఆందోళనకారుల్లోని ముస్లిం మత ఛాందస సలాఫిస్టు గ్రూపు కార్యకర్తలు ప్రయోగించిన రాకెట్ ప్రొపెల్లర్ గ్రేనేడ్ దాడిలో రాయబారి స్టీవెన్స్ దుర్మరణం చెందాడు. పాములకి పాలు పోసి పెంచే అమెరికా దుష్ట నీతికి స్టీవెన్స్ మరణం ఒక ప్రబల సాక్ష్యం. ఒక…

కూడంకుళం: ప్రధానికి సహాయపడితే విదేశీ నిధులు ఓ.కేనా? -అణు బోర్డు మాజీ చైర్మన్

కూడంకుళం అణు విద్యుత్ కర్మాగారం వల్ల ప్రజల భద్రతకు ప్రమాదం లేదనీ, తాము అన్నివిధాలుగా భద్రతా చర్యలు తీసుకున్నామనీ ప్రధాని మన్మోహన్, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం లతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్న కబుర్లు నిజం కాదని రుజువవుతోంది. భారత అణు శక్తి నియంత్రణ బోర్డు (Atomic Energy Regulatory Board -AERB) మాజీ అధిపతి గోపాల్ కృష్ణన్ స్వయంగా ఈ విషయాన్ని బట్టబయలు చేశాడు. ఫుకుషిమా అణు ప్రమాదం దరిమిలా, కూడంకుళం అణు…

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కుట్రలపై కూడంకుళం ప్రజల వీరోచిత పోరాటం

పర్యావరణంతో పాటు జీవనోపాధిని కూడా దెబ్బతీసే ‘కూడంకుళం న్యూక్లియర్ పవర్ ప్రాజెక్టు’ (కె.ఎన్.పి.పి) కి వ్యతిరేకంగా కూడంకుళం ప్రజల పోరాటం కీలక దశకు చేరుకుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా అమలు చేస్తున్న అణచివేత, దుష్ప్రచారం, పోలీసు నిర్బంధాలకు ఎదురోడ్డి సామాన్య ప్రజలు వీరోచిత పోరాటం సాగిస్తున్నారు. ఉద్యమ నాయకులు ఎస్.పి.ఉదయ్ కుమార్ తదితరులను పోలీసులు పట్టుకెళ్లకుండా నిరంతరం కాపలా కాస్తున్నారు. పోలీసుల తప్పుడు కేసుల్లో నిజాయితీ నిరూపించుకోవడానికి అరెస్టు అవుతానని ఎస్.పి.ఉదయ్ కుమార్ తదితరులు ప్రకటించినప్పటికీ…

పన్నులు ఎగవేయడానికి పౌరసత్వం త్యజించనున్న ఫ్రాన్సు సంపన్నుడు!

బెర్నార్డ్ ఆర్నాల్ట్. ఫ్రాన్సులో అత్యంత సంపన్నుడు. 41 బిలియన్ యూరోల (52.33 బిలియన్ డాలర్లు, 2.9 లక్షల కోట్ల రూపాయలు) ఆస్తులతో ప్రపంచంలోనే నాలుగో స్ధానంలో ఉన్న కుబేరుడు. ఈయనకి అర్జెంటుగా ఓ సమస్య వచ్చి పడింది. ఫ్రాన్సు నూతన అధ్యక్షుడు హాలండే, సూపర్ ధనవంతుల ఆదాయాలపైన 75 శాతం పన్ను వేయనున్నట్లు ప్రకటించడమే ఈయన సమస్య. అధ్యక్షుడు హాలండే, సంవత్సరానికి 1 మిలియన్ యూరోల కు మించి ఆదాయం పొందుతున్నవారిపై 75 శాతం పన్ను వేస్తానని…

ఆర్ధిక మాంద్యం కోరల్లో 17 దేశాల యూరోజోన్ -ఒఇసిడి

ఋణ సంక్షోభం ఫలితంగా, 17 యూరప్ దేశాల ద్రవ్య యూనియన్ అయిన ‘యూరో జోన్’ లో ఆర్ధిక మాంద్యం (recession) బలపడుతోందని ఒఇసిడి (Organisation for Economic Coperation and Development) నిర్ధారించింది. తాను మాంద్యంలో కూరుకుపోతూ ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధను కూడా అందులోకి ఈడుస్తోందని ప్యారిస్ లో విడుదల చేసిన మధ్యంతర నివేదికలో పేర్కొందని అసోసియేటెడ్ ప్రెస్ (ఎపి) వార్తా సంస్ధ తెలిపింది. యూరప్ నాయకురాలు జర్మనీ సైతం ఈ సంవత్సరాంతానికి మాంద్యంలోకి జారుతుందని ఒఇసిడి…

అవినీతి వ్యతిరేక కార్టూనిస్టు ‘అసీమ్ త్రివేది’ అరెస్టు, దేశవ్యాపిత నిరసన

రాజకీయ నాయకుల అవినీతికి వ్యతిరేకంగా కార్టూన్లు గీసినందుకు కాన్పూర్ కార్టూనిస్టు అసిమ్ త్రివేది ని మహారాష్ట్ర పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు.  గత నెలలో అసిమ్ త్రివేదికి వ్యతిరేకంగా నాన్ బెయిలబుల్ వారంట్ చేసిన స్ధానిక కోర్టు సోమవారం ఆయనని వారం రోజుల పోలీసు కస్టడీకి అప్పజెప్పింది. త్రివేది అరెస్టుపై దేశవ్యాపితంగా నిరసన తలెత్తింది. ప్రెస్ కౌన్సిల్ ఇండియా ఛైర్మన్, సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ మార్కండేయ కట్జు అరెస్టును తీవ్రంగా ఖండించాడు. రాజకీయ నాయకుల…