అమెరికాలో విలయం సృష్టించిన పెను తుఫాను సాండీ -ఫోటోలు

అమెరికా ప్రజలు గుండెలు చిక్కబట్టుకుని ఆందోళనతో ఎదురు చూసిన పెను తుఫాను సాండీ అనుకున్నట్లుగానే పెను విలయాన్ని సృష్టించింది. బోస్టన్ పత్రిక ప్రకారం సాండీ ధాటికి ఏడు రాష్ట్రాల్లో 100 మందికి పైగా మృత్యువాత పడ్డారు. మంగళవారం సాయంత్రానికి అట్లాంటిక్ తీరం వెంబడి 55 మంది చనిపోయారని ‘ది హిందూ’ తెలిపింది. ఐ.హెచ్.ఎస్ గ్లోబల్ ఇన్సైట్ ప్రకారం 20 బిలియన్ డాలర్ల మేరకు ఆస్తి నష్టం జరిగింది. 10 నుండి 30 బిలియన్ డాలర్ల మేరకు వ్యాపార…

హరికేన్ శాండి: ప్రమాదపు అంచున అమెరికా అణు కర్మాగారం!

అమెరికాలో పెను తుఫాను శాండీ విధ్వంసం సృష్టిస్తోంది. విద్యుత్ వ్యవస్ధ నాశనం కావడంతో పాటు వేలాది ప్రజల తరలింపును అమెరికా నెత్తిన రుద్దిన పెను తుఫాను అమెరికా తూర్పు తీరంలోని పాతికకు పైగా అణు కర్మాగారాలను కూడా భయపెడుతోంది. తుఫాను మార్గానికి దగ్గరగా ఉన్న ఈ అణు కర్మాగారాల్లో న్యూ జెర్సీ ఒడ్డున ఉన్న ఓయిస్టర్ క్రీక్ కర్మాగారంలో ఇప్పటికే అప్రమత్తత ప్రకటించినట్లు కార్పొరేట్ పత్రికలు తెలిపాయి. ఈ అణు కర్మాగారాన్ని శాండి నేరుగా తాకినట్లు తెలుస్తోంది.…

గ్వాంగ్జూ హత్యాకాండ నిర్మాతకు రాయబార హోదా, కొరియా చీకటిగాధ మరోసారి

దక్షిణ కొరియా ప్రజలు భయోత్పాతంతో గుర్తుకు తెచ్చుకునే గ్వాంగ్జూ సామూహిక హత్యాకాండ బాధ్యుడు ప్రభుత్వం ఇచ్చిన డిప్లొమేటిక్ ట్రావెల్ పాస్ పోర్ట్ తో దర్జాగా ప్రపంచాన్ని చుట్టేస్తున్నాడు. ప్రజాస్వామిక ఉద్యమకారులను చంపినందుకు కొరియా ప్రభుత్వం చేత మరణ శిక్ష కూడా విధించబడిన మాజీ కరకు నియంత ‘చున్ దూ-హ్వాన్’ ఇపుడు ప్రభుత్వ మర్యాదలు అనుభవిస్తున్నాడు. రిపబ్లిక్ ఆఫ్ కొరియాలో నియంతృత్వ పాలన అంతం కావడానికి కారణమయిన ప్రజాస్వామిక ఉద్యమాన్ని చున్ రక్తపుటేరుల్లో ముంచెత్తాడు. అమెరికా రాయబారి ప్రత్యక్ష…

రాహుల్ గాంధీ ఎందుకు కేంద్ర మంత్రి కాలేడు? -కార్టూన్

రాహుల్ గాంధీకి కేంద్ర మంత్రివర్గంలో స్ధానం ఇవ్వాలనీ, ఆయనకి ప్రభుత్వంలో కూడా నాయకత్వ పదవి అప్పజెప్పాలనీ కాంగ్రెస్ లో అనేకమంది చాలా కాలంగా శతపోరుతున్నారు. మంత్రివర్గ విస్తరణ ఉన్నప్పుడల్లా ఈసారి రాహుల్ కి సముచిత పదవి తధ్యమని కాంగ్రెస్ పెద్దలతో పాటు, పత్రికలు కూడా ఊహాగానాలు చేయడం ఒక రొటీన్ గా ఉంటూ వచ్చింది. 22 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేసిన తాజా విస్తరణలో కూడా రాహుల్ గాంధీ కేంద్ర మంత్రివర్గంలో స్ధానం పొందలేదు. ఎప్పటికప్పుడు…

బియ్యం బదులు తూకం రాళ్ళు మింగించేదే ‘నగదు బదిలీ పధకం’ -కార్టూన్

నగదు బదిలీ పధకం గురించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చాలా కాలంగా ఊదగరగొడుతూ వచ్చాయి. ఈ పధకాన్ని ఆచరణలోకి తెస్తున్నట్లు కొన్ని రోజుల క్రితం ప్రధాని మన్మోహన్ కూడా ప్రకటించాడు. పేదలకు సబ్సిడీ ధరలకు సరుకులను అందించే బదులు సదరు సబ్సిడీని నగదు రూపంలో నేరుగా పేదల ఖాతాల్లోకి తరలించడమే ఈ పధకం లక్ష్యం. అంటే గ్యాస్ సిలిండర్, బియ్యం, రేషన్ సరుకులు తదితర సరుకలకీ ఇచ్చే సబ్సిడీని ఆయా సరుకులు కొనే సమయంలో ఇవ్వకుండా, సదరు…

గూగుల్ ఇన్నాళ్లూ గుప్తంగా ఉంచిన డేటా సెంటర్స్ ఇవే -ఫోటోలు

వేలాది ఫైబర్ మైళ్ళు, మరిన్ని వేల సర్వర్లతో ఇంటర్నెట్ వినియోగదారుల సర్చింగ్, సర్ఫింగ్ దాహాల్ని తీరుస్తున్న గూగుల్, తన డేటా సెంటర్లను ఇన్నాళ్లూ గుప్తంగా ఉంచింది. పారదర్శకత గురించి తాను చెప్పే నీతులని ప్రదర్శన కోసమైనా పాటించదలిచిందో ఏమో తెలియదు గానీ తన డేటా సెంటర్ల ఫోటోలని గూగుల్ విడుదల చేసింది. వైర్డ్ డాట్ కామ్ ప్రకారం తన అత్యాధునిక ఇన్ఫ్రా స్ట్రక్చర్ సాయంతో రోజుకి 20 బిలియన్ల వెబ్ పేజీ లను గూగుల్ ఇండెక్స్ చేయగలుగుతోంది.…

‘ముస్లింల నరమేధం గుజరాత్ అంతర్గత వ్యవహారం’, అమెరికా రాయబారితో నరేంద్ర మోడి

(ఈ ఆర్టికల్ గత సంవత్సరం మార్చి నెలలో ఇదే బ్లాగ్ లో ప్రచురించబడింది. బ్లాగ్ ప్రారంభంలో రాసినందున పెద్దగా పాఠకుల దృష్టికి రాలేదు. ప్రధాన మంత్రి పదవి కోసం నరేంద్ర మోడి చేస్తున్న ప్రయత్నాలకు ఇంటా బయటా వస్తున్న మద్దతు, పోటీల దృష్ట్యా దీనికి ప్రాధాన్యత కొనసాగుతోంది. అందువలన పునర్ముద్రిస్తున్నాను. -విశేఖర్) 2002 సంవత్సరంలో గోధ్రా రైలు బోగీ దహనం అనంతరం నరేంద్ర మోడి ప్రభుత్వం నాయకత్వంలో ముస్లిం ప్రజలపై సాగించిన నరమేధానికి బాధ్యులైన వారిపై ఏం…

శ్రమ విలువను గుర్తించిన మేధావి ఆమె

ఆమె పేరు క్రాంతి (ట). అమెరికాలో సాఫ్ట్ వేర్ ఉద్యోగాన్ని వదిలి విజయనగరం జిల్లా ఇట్లమామిడి పల్లిలో వ్యవసాయం చేయడానికి వచ్చిన ఈమె అద్భుత మహిళగా తోస్తోంది. కొడవటిగంటి రోహిణీ ప్రసాద్ సంస్మరణ వ్యాసం కోసం రాజశేఖర రాజు గారి బ్లాగ్ లోకి వెళ్ళి, అక్కడి నుండి ఓ లింక్ పట్టుకుని జర్నలిస్టు అరుణ పప్పు గారి బ్లాగ్ లోకి వెళ్తే ఓ అపూర్వ కధనం కనిపించింది. ఆ కధనం ఆసాంతం చదివాక నిజంగా ఆశ్చర్యంతో ఏ…

రామాయణ విషవృక్షం – మతవిమర్శ

(రంగనాయకమ్మ గారి ఉద్గ్రంధాల్లో ఒకటి ‘రామాయణ విషవృక్షం’. ఆ పుస్తకంపై ప్రశంసలు ఎన్నివచ్చాయో, విమర్శలు అన్ని వచ్చాయి. ఆ పుస్తకం వలనే రచయిత్రిపై విద్వేషం పెంచుకున్నవారు అనేకులు. “మతమన్నది, నిజానికి, ఇంకా తనను తాను జయించలేని లేదా తనను తాను మరొకసారి కోల్పోయిన మనిషి యొక్క ఆత్మ-చేతన (self-consciousness) మరియు ఆత్మ-గౌరవం (self-esteem)” అనీ “మతం, ప్రపంచపు ప్రజాదరణ పొందిన రూపంలోని తర్కం. మతం, ప్రపంచపు అత్యాధ్మిక గౌరవాన్ని సమున్నతపరిచే అంశం” అనీ కారల్ మార్క్స్ అభివర్ణించాడు.…

సూడాన్ ఫ్యాక్టరీపై ఇజ్రాయెల్ యుద్ధవిమానాల దాడులు

దురహంకార ఇజ్రాయెల్ తమ రాజధాని నగరంపై బాంబు దాడులు చేసిందని సూడాన్ ప్రభుత్వం ప్రకటించింది. ఫైటర్ జెట్ యుద్ధ విమానాలతో దాడి చేసి మందుగుండు ఫ్యాక్టరీని ధ్వంసం చేసిందని సూడాన్ సమాచార మంత్రి అహ్మద్ బెలాల్ ఒస్మాన్ బుధవారం తెలిపాడు. పౌరనివాస ప్రాంతాలపై అక్టోబర్ 23 తేదీన  ఇజ్రాయెల్ చేసిన దాడుల వల్ల పెద్ద ఎత్తున పేలుడు సంభవించిందనీ, పేలుడులో ఇద్దరు పౌరులు చనిపోయారనీ మంత్రి తెలిపాడు. దాడులకు గురయిన చోట లభ్యమైన రాకెట్ శిధిలాల ద్వారా…

‘రివర్స్ స్టింగ్’ లో దొరికిపోయిన జీ న్యూస్ బ్లాక్ మెయిలింగ్

స్టింగ్ ఆపరేషన్లతో ఠారెత్తిస్తున్న మీడియా రివర్స్ స్టింగ్ ఆపరేషన్ లో బైటపడిపోయి నీళ్ళు నములుతోంది. జిందాల్ స్టీల్ పవర్ లిమిటెడ్ (జె.ఎస్.పి.ఎల్) ఛైర్మన్ నవీన్ జిందాల్ ను బొగ్గు కుంభకోణం స్టోరీతో బ్లాక్ మెయిల్ చెయ్యబోయిన జీ న్యూస్ ఎడిటర్లు రహస్య కెమెరాకి అడ్డంగా దొరికిపోయారు. కుంభకోణం స్టోరీని ప్రసారం చెయ్యకుండా ఆపడానికి మొదట 20 కోట్లు ఆ తర్వాత 100 కోట్లు కెమెరా ముందు డిమాండ్ చేసిన జీ న్యూస్ ఎడిటర్లు తాము స్టింగ్ ఆపరేషన్…

కాంబోడియా చరిత్ర: పోల్ పాట్ గురించి మరొకసారి -2

మొదటి భాగం తరువాయి… … ‘కమ్యూనిస్టు హోలోకాస్ట్’ కి సంబంధించిన పాపపు కధలన్నీ పశ్చిమ దేశాలు కనిపెట్టినవిగా నేను మాట్లాడిన కాంబోడియన్లు కొట్టిపారేశారు. నిజంగా ఏంజరిగిందో వారు నాకు గుర్తుచేశారు. 1970లో న్యాయబద్ధమైన తమ పాలకుడు యువరాజు సిహ్నౌక్ ని అమెరికన్లు వెంటపడి తరిమేసి అతని స్ధానంలో తమ కీలుబొమ్మ, మిలటరీ డిక్టేటర్ లోన్ నోల్ ను ప్రతిష్టించడంతో వారి కష్టాల చరిత్ర ప్రారంభం అయింది. లోన్ నోల్ మధ్య నామం అవినీతి. అతని అనుచరులు తమకు…

కాంబోడియా చరిత్ర: పోల్ పాట్ గురించి మరొకసారి 1

(ప్రఖ్యాత అంతర్జాతీయ రాజకీయ, సామాజిక విశ్లేషకుడు, మాస్కో నివాసి అయిన ఇస్రాయెల్ షమీర్ సెప్టెంబర్ 18 తేదీన ‘కౌంటర్ పంచ్’ పత్రికకు రాసిన వ్యాసానికి ఇది యధాతధ అనువాదం. కాంబోడియాలో అమెరికా సాగించిన నీచ హత్యాకాండలను కప్పి పుచ్చుకోవడానికీ, బైటికి రాకుండా చేయడానికీ కమ్యూనిస్టు విప్లవ నేత పోల్ పాట్ పై అనేక అబద్ధాలు సృష్టించి పశ్చిమ పత్రికలు, రాజ్యాలు ప్రచారంలో పెట్టాయి. తన ప్రజలను తానే మిలియన్ల సంఖ్యలో మట్టుపెట్టిన  రక్తపిపాసిగా ప్రపంచం అంతా గుర్తుకు…

ఐ.ఎం.ఎఫ్, ప్రపంచ బ్యాంకు వార్షిక సమావేశంలో వెల్లడయిన ప్రపంచ ఆర్ధికశక్తుల వైరుధ్యాలు

ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధ సంక్షోభంలో మరింతగా కూరుకుపోతున్న నేపధ్యంలో ప్రపంచ ఆర్ధిక శక్తుల మధ్య విభేదాలు క్రమంగా పెరుగుతున్నాయి. టోక్యోలో జరిగిన ఐ.ఎం.ఎఫ్ మరియు ప్రపంచ బ్యాంకుల వార్షిక సంయుక్త సమావేశంలో ఈ విభేధాలు ప్రస్ఫుటంగా వ్యక్తం అయ్యాయి. ప్రపంచ కాబూలీ సంస్ధలయిన ఐ.ఎం.ఎఫ్, ప్రపంచ బ్యాంకుల 2012 వార్షిక సమావేశాలు జపాన్ రాజధాని టోక్యో లో అక్టోబర్ 9 నుండి 14 వరకు జరిగాయి. పశ్చిమ దేశాల బహుళజాతి కంపెనీల ప్రయోజనాలను నిర్విఘ్నంగా నెరవేరడానికి సూత్రాలు,…

చదువు కోసం అడుక్కున్న ఐశ్వర్య, సమాజం బతికేఉందని నిరూపించిన దాతలు

కడుపు చూపిస్తూ అడుక్కునే భిక్షకులు కోకొల్లలు. పిల్లల్ని భిక్షక వృత్తిలో దింపి లక్షలు, కోట్లు సంపాదించే మాఫియా ముఠాలకు కొదవలేదు. పదవులు, కాంట్రాక్టులు అడుక్కోవడం రాజకీయ నాయకులు, సూపర్ ధనికుల జన్మహక్కు. కానీ పొట్ట కోసం అడుక్కుంటున్న నాయనమ్మకి తెలియకుండా పక్కనే నిలబడి చదువుకోసం రహస్యంగా సహాయం కోరిన ఐదేళ్ల ఐశ్వర్య కధ ఎవరూ విని ఉండరు. మతి చలించి తనను వదిలి వెళ్ళిపోయిన అమ్మ కోసమేనేమో తెలియదు గానీ డాక్టరీ చదువుకోవాలన్న బలమైన కోరిక ఐశ్వర్యను…