ఈ ఎం.ఎఫ్.హుస్సేన్ చిత్రంలో నగ్నత్వం ఉందా?

ప్రపంచ ప్రఖ్యాత భారతీయ చిత్రకారుడు ఎం.ఎఫ్.హుస్సేన్ ఈ చిత్రాన్ని గీశాడు. 2009 సంవత్సరంలో మార్చి 8 తేదీన అంతర్జాతీయ మహిళా దినం సందర్భంగా డెక్కన్ క్రానికల్ పత్రిక ఈ చిత్రాన్ని ప్రచురించింది. భారతదేశ మహిళల స్త్రీత్వం యొక్క సారం వారి శక్తే (Essence of Indian womenhood is shakti) అని ఎం.ఎఫ్.హుస్సేన్ ఈ చిత్రానికి శీర్షికగా పెట్టాడు. భారత దేశ మహిళల శక్తికి దుర్గా దేవిని ప్రతీకగా చూపిస్తూ హుస్సేన్ ఈ బొమ్మని గీసినట్లు చూస్తే…

కాగ్ ని బలహీనపరచడానికి ప్రభుత్వం ప్రయత్నం? -కార్టూన్

కంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్ (CAG – కాగ్) రాజ్యాంగ బద్ధ సంస్ధ. ఎకౌంటింగ్ లెక్కలతో పాటు ప్రభుత్వ విధానాల ఫలితాలను కూడా ఆడిట్ చేసే హక్కు (దీనినే పెర్ఫార్మెన్స్ ఆడిట్ అని పిలుస్తున్నారు) కూడా కాగ్ కి ఉంది. గత రెండు మూడేళ్లుగా కోర్టులతో పాటు కాగ్ కూడా క్రియాశీలకంగా వ్యవహరిస్తోంది. దానితో ప్రభుత్వాలు నడుపుతున్న పెద్దల అవినీతి ఘనకార్యాలు పచ్చిగా వెలుగులోకి వస్తున్నాయి. వ్యక్తుల అవినీతితో పాటు ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాల అసలు స్వరూపం కూడా…

యెడ్యూరప్ప కొత్త పార్టీకి బి.జె.పి ఆక్సిజన్ -కార్టూన్

అవినీతి ఆరోపణలతో ముఖ్యమంత్రి పదవిని కోల్పోయిన కర్ణాటక బి.జె.పి నాయకుడు యెడ్యూరప్ప కొత్త ప్రాంతీయ పార్టీకి ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. తాను కొత్త పార్టీ పెడుతున్నట్లు యెడ్యూరప్ప ప్రకటించినప్పటికీ ఆయనను బహిష్కరించలేని పరిస్ధితి బి.జె.పిది. బి.జె.పి ప్రభుత్వాన్ని పడగొట్టే ఆలోచనలేదని యెడ్యూరప్ప ప్రకటించినందుకే బి.జె.పి ఆయన పట్ల కృతజ్ఞతతో పడి ఉంటోంది. అలా కాదని ధైర్యం చేసి బెహిష్కరిస్తే ప్రభుత్వం పడిపోవడం ఖాయం. దానితో యెడ్యూరప్ప పార్టీలో ఉంటూనే కొత్త పార్టీ పనులను చక్కబెట్టుకునే అపూర్వ అవకాశం యెడ్యూరప్పకి…

సి.ఐ.ఎ బాస్ రాజీనామాకి అక్రమ సంబంధం కారణం కాదా?

సి.ఐ.ఎ బాస్ డేవిడ్ పెట్రాస్ నవంబర్ 10 (శుక్రవారం) న అకస్మాత్తుగా రాజీనామా చేశాడు. ఒక మహిళా విలేఖరితో ఆయనకి ప్రవేట్ అఫైర్ ఉన్న విషయం ఎఫ్.బి.ఐ విచారణలో బైటికి వచ్చిందనీ, అందువల్ల జాతీయ భద్రతకు ముప్పు వచ్చే పరిస్ధితిని తప్పించడానికి పెట్రాస్ రాజీనామా చేశాడని అమెరికా ప్రభుత్వం ప్రకటించింది. ఆయన రాజీనామాను ఒబామా మరోమాటకు తావులేకుండా ఆమోదముద్ర వేసేశాడు. యుద్ధాల్లో పెట్రాస్ సేవలను కార్పొరేట్ పత్రికలు ఒకపక్క కొనియాడుతూనే ఆయన చేసిన పిచ్చిపని క్షమార్హం కాదని…

‘ఇండియా ఎగైనెస్ట్ కరప్షన్’ దిశ ఎటు? -కార్టూన్

అన్నా హాజరే, అరవింద్ కేజ్రీవాల్ తదితరుల నేతృత్వంలో దాదాపు సంవత్సరం క్రితం అట్టహాసంగా ప్రారంభమయిన ‘అవినీతి వ్యతిరేక ఉద్యమం’ ఇపుడు క్రియాశీలక మద్దతుదారులు లేక మూలపడింది. నాయకత్వం చెరోదారి పట్టడంతో ఐ.ఎ.సి కి ఇపుడు దిశ లేకుండా పోయింది. దారులు చీలినప్పటికీ ఒకేవైపుకి ప్రయాణం కొనసాగితే లక్ష్యం వద్దనయినా కలుసుకోవచ్చు. చివరి పోరాటంలోనైనా భుజం భుజం కలపొచ్చు. ‘మార్గాలు వేరైనా లక్ష్యం ఒక్కటే’ అని చీలిక సమయంలో ప్రకటించిన ఇరు వర్గాలు ఇపుడా స్ఫూర్తిని ప్రదర్శించడం లేదు.…

రాముడు చెడ్డ బాలుడు -రాం జేఠ్మలాని

‘రాముడు మంచి బాలుడు’ అని చదవడమే ఇప్పటిదాకా మనకున్న అలవాటు. ఇకనుండి ‘రాముడు చెడ్డవాడు’ అనికూడా చదువుకోవచ్చు. బి.జె.పి రాజ్యసభ సభ్యుడు, జగన్ బెయిల్ కోసం తీవ్రంగా శ్రమించి విఫలం అయిన ప్రముఖ సుప్రీం కోర్టు లాయర్ రాం జేఠ్మలాని భారత ప్రజలకు ఆ అవకాశాన్ని కల్పించాడు. ఏ కారణంతో అయితే ఇన్నాళ్లూ ఆయన్ని నెత్తిన పెట్టుకున్నారో సరిగ్గా అదే కారణంతో రాముడు తాజాగా చెడ్డవాడు కావడమే ఓ ఆసక్తికర పరిణామం. స్త్రీ, పురుషుల మధ్య సంబంధాలపై…

‘మాదే స్నాన’ ఇపుడు ఎంగిలాకులపై కాదట!

కర్ణాటకలోని కుక్కే సుబ్రమణ్య దేవాలయంలో జరుగుతున్న కుల దురాచారంలో ఇక ఎంగిలాకులను ఉపయోగించరు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇకనుండి ‘ఎవరూ ఆరగించని’ ప్రసాదాన్ని ఆకుల్లో పెట్టి ఆరుబయట పరిస్తే ఆచారం పాటించదలిచినవారు వాటిపై పడి దొర్లొచ్చు. సుబ్రమణ్య ఆలయంలో కులాధిపత్య దురాచారాన్ని అడ్డుకోవాలని ఆలయంలో బ్రాహ్మణులు మాత్రమే ప్రసాదాన్ని ఆరగించే సౌకర్యాన్ని రద్దు చేయాలనీ హై కోర్టులో దాఖలయిన ఫిర్యాదుకు ఈ విధంగా పరిష్కారం లభించింది. పిటిషనర్లు కూడా సవరించిన దురాచారానికి ఆమోదం చెప్పడంతో వివాదాన్ని…

ధర్మపురి కుల హింస: బంగారం, డబ్బు దోచుకుని తగలబెట్టారు -ఫోటోలు

ధర్మపురి జిల్లాలో కులాంతర వివాహం వల్ల జరిగిన కుల హింసలో దాడి చేసినవారు ఒక పధకం ప్రకారం వ్యవహరించారు. ప్రతి ఇంటిని వెతికి విలువైన వస్తువులను దోచుకున్నాకనే ఇళ్లను తగలబెట్టారని ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ (టి.ఒ.ఐ) పత్రిక తెలిపింది. ఇళ్లతో పాటు ఇళ్లముందు ఉన్న వాహనాలను కూడా తగలబెట్టారని తెలిపింది. మొత్తం 268 ఇళ్ళను, 50 ద్విచక్ర వాహనాలను, నాలుగు వేన్లను తగలబెట్టారని డేషింగ్ టైమ్స్ పత్రిక తెలిపింది. దాదాపు 2500 మంది దాడిలో పాల్గొన్నారనీ, అప్పటికే…

దళితుడిని పెళ్ళాడితే దళిత కాలనీలు తగలబడతాయ్!

ఓ అగ్రకుల యువతి దళిత యువకుడిని వివాహం చేసుకున్నందుకు యువతి తండ్రి ఆత్మహత్య చేసుకోగా, యువతి కులస్ధులు మూకుమ్మడిగా దాడి చేసి దళితుల కాలనీని తగలబెట్టిన దుర్మార్గం తమిళనాడులో చోటు చేసుకుంది. కులం పరువుకోసం దళితుల ఇళ్లను తగలబెట్టిన ఈ సో కాల్డ్ అగ్రకులస్ధులు తగలబెట్టిన ఇళ్ళలో దోపిడీకి తెగబడి తమ పరువు ఎంత పాతాళంలోకి దిగబడి ఉందో చెప్పకనే చెప్పుకున్నారు. సాంస్కృతిక అభివృద్ధిలో ఉత్తరభారతం కంటే ముందున్నాయని చెప్పే దక్షిణ భారత రాష్ట్రాల్లోనూ అదే వెనుకబాటుతనం…

నితిన్ గడ్కారీ భవితవ్యం ఎటు వైపు? -కార్టూన్

భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ గడ్కారీ భవితవ్యం డోలాయమానంలో పడినట్లు కనిపిస్తోంది. వరుసగా రెండోసారి కూడా బి.జె.పి అధ్యక్షుడుగా ఎన్నిక కావాలని కోరుకుంటున్న గడ్కారీ ఆశలకు సాక్ష్యాత్తూ ఎల్.కె.అద్వానీ నుండే ప్రతిఘటన ఎదురవుతోంది. కొద్ది నెలల క్రితం ముంబైలో జరిగిన సమావేశంలో నరేంద్ర మోడి సహాయంతో రెండో పదవీకాలానికి అనుమతిని గడ్కారీ సంపాదించినప్పటికీ ఆ నిర్ణయం జాతీయ మహాసభలో ఆమోదం పొందవలసి ఉంది. కానీ ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అద్వానీ ముంబైలోనే అలకపాన్పు ఎక్కాడు.…

ముస్లింల వ్యతిరేకి వి ఎస్ నైపాల్ కి అవార్డా! ఎందుకు? -గిరీష్ కర్నాడ్ -2

మొదటిభాగం తరువాయి… ఇపుడు మళ్ళీ ఆయన చెప్పేదేమిటో ఊహించదగినదే. అదేమంటే, ముస్లింలు భారతీయ ఆర్కిటెక్చర్ ను నాశనం చేశారు; ప్రతీదీ కూలిపోయింది. వారు దోపిడీదారులు మరియు వినాశనకారులు. ముస్లింల హయాంలో ఏమి జరిగిందో తెలియాలంటే ఏ భవనాన్నైనా చూడవచ్చు. జనం ఆయనతో వాదించినపుడు ఆయన తాజ్ గురించి ఏమాన్నాడో చూడండి: “తాజ్ అనేది పెద్ద వృధా, క్షీణదశలో ఉన్నది. చివరికది ఎంత క్రూరమైనదంటే అక్కడ ఎక్కువసేపు ఉండడం నాకు చాలా కష్టంగా తోచింది. ప్రజల రక్తం గురించి…

ముస్లింల వ్యతిరేకి వి ఎస్ నైపాల్ కి అవార్డా! ఎందుకు? -గిరీష్ కర్నాడ్ -1

[సుప్రసిద్ధ నాటక రచయిత, సినీ నటుడు గిరీష్ కర్నాడ్ ముంబై గడ్డపై ఒక సాహితీ వేదికలో నిర్వాహకులపైనే కత్తి దూశాడు. ట్రినిడాడియన్-బ్రిటిష్ పౌరుడు, నోబెల్ సాహితీ బహుమతి స్వీకర్త విద్యాధర్ సూరజ్ ప్రసాద్ నైపాల్ కు ‘టాటా లిటరేచర్ లైవ్! ఫెస్టివల్’, లైఫ్ అఛీవ్మెంట్ అవార్డ్ ప్రకటించడంపై మండిపడ్డాడు. ‘నాటకరంగంలో తన ప్రయాణం’ పై ప్రసంగించడానికి నిర్వాహకులు గిరీష్ ను ఆహ్వానించగా ఆయన నైపాల్ రాతలపై, భావాలపై దాడి చేయడానికి అవకాశాన్ని వినియోగించాడు.బాబ్రీ మసీదు కూల్చివేతను సమర్ధించిన…

అమెరికా రాయబారి హత్యతో ఉనికిని చాటుకుని పురోగమిస్తున్న గడాఫీ అనుకూల ‘గ్రీన్ రెసిస్టెన్స్’ -2

లిబియా ప్రధాని తొలగింపు బెంఘాజీ దాడి తర్వాత రోజు లిబియా ప్రధానమంత్రి అబ్దుర్రహీమ్ ఎల్-కీబ్ పదవినుండి తొలగించబడ్డాడు. స్టీవెన్స్ హత్య విషయమై నాటో/అమెరికా చెప్పమన్నట్లు చెప్పకపోవడమే దానికి కారణం. స్టీవెన్స్ ను చంపింది గడాఫీ విధేయ గ్రీన్ రెసిస్టెన్సేనని మొదట లిబియా ప్రభుత్వ నేతలు ప్రకటించారు. అయితే గ్రీన్ రెసిస్టెన్స్ నీడలో లిబియా ప్రజలు ప్రతిఘటన ఇస్తున్నారన్న వాస్తవం నాటో పరువు తీస్తుంది. గడాఫీకి వ్యతిరేకంగా లిబియా ప్రజలు తిరుగుబాటు చేశారన్న పశ్చిమ దేశాల ప్రచారం అబద్ధమని…

అమెరికా రాయబారి హత్యతో ఉనికిని చాటుకుని పురోగమిస్తున్న గడాఫీ అనుకూల ‘గ్రీన్ రెసిస్టెన్స్’ -1

ప్రపంచ వాణిజ్య సంస్ధ జంట టవర్లపై దాడులు జరిగి సెప్టెంబర్ 11, 2012 తో 11 సంవత్సరాలు పూర్తయ్యాయి. అదే రోజు రాత్రి తొమ్మిదిన్నర గంటలకు లిబియాలో రెండో అతి పెద్ద పట్టణమైన బెంఘాజిలో అమెరికా రాయబారి కార్యాలయంపై విధ్వంసకర దాడులు జరిగాయి. దాడిలో అమెరికా రాయబారి క్రిస్టఫర్ స్టీవెన్స్ దుర్మణం చెందాడు. సంవత్సరం పైగా లిబియా ప్రజలపైనా, ప్రభుత్వంపైనా నాటో యుద్ధ విమానాల సాయంతో ముస్లిం టెర్రరిస్టు సంస్ధలు సాగించిన విధ్వంసకాండకీ, సామూహిక జనహననానికీ క్రిస్టఫర్…

మడత పేచీ: చిదంబరం వర్సెస్ ఆర్.బి.ఐ -కార్టూన్

రెండు రోజుల క్రితం భారత ఆర్ధిక మంత్రి పి.చిదంబరం ‘రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’ గవర్నర్ దువ్వూరు సుబ్బారావు పైన బహిరంగంగానే అక్కసు వెళ్ళగక్కాడు. భారత ఆర్ధిక వ్యవస్ధ తిరిగి అభివృద్ధి పట్టాలు ఎక్కించడానికి తాము (ప్రభుత్వం) ఒక రోడ్ మ్యాప్ గీసి మరీ శ్రమిస్తుంటే ఆర్.బి.ఐ తమకు సహకరించడం లేదని ఆయన ఆర్.బి.ఐ పైన యాష్టపోయాడు. ఆర్.బి.ఐ సహకారం లేకపోతే మాత్రం ఏమిటట? నేనొక్కడినే ఒంటరిగా శ్రమించడానికి వెనుకంజ వేసేది లేదు, అని కూడా సాక్ష్యాత్తూ…