హిందువుల కంటే నాస్తికులే ఎక్కువ!

నాస్తికులంటే … అదో తిట్టు పదంగా భావించినకాలముంది. దేవుడూ, భక్తీ, పూజలూ, మొక్కుబడులూ, స్తోత్రాలూ… వీటినిమారుమాటాడకుండా ఆమోదించాలనేమీ లేదనీ; వాటి ఉనికినీ, ప్రయోజనాన్నీ ప్రశ్నించొచ్చనీ, అలా చేసే నాస్తికులు అనేవారు కూడా ఉంటారనీ- ఇదేమీతెలియని తరం ప్రస్తుతం ఉంది! ఇలాంటి పరిస్థితుల్లో నిన్న ‘ఈనాడు’లో వచ్చిన ఒక వార్త విశేషంగా అనిపించింది! దీన్ని ఎంతమంది గమనించారో గానీ, దాని ముఖ్య విషయాలను ఇక్కడ ఇస్తున్నాను. ”ప్రపంచంలో ఏ మతాన్నీ ఆచరించని వారు ఉన్నారు. ఏ మతాన్నీ ఆచరించనివారు…

బడ్జెట్ 2013-14: వేతన జీవులకు 2000/- ముష్టి

ఆర్ధిక మంత్రి చిదంబరం 2013-14 బడ్జెట్ లో సాధారణ పన్ను చెల్లింపుదారులకు కాసింత ముష్టి విదిలించి మధ్య తరగతి ప్రజల పట్ల తనకు ఉన్న ఔదార్యం చాటుకున్నాడు. సంవత్సరానికి రు. 5 లక్షల లోపు ఆదాయం ఉన్నవారికి రు. 2,000/- పన్ను చెల్లింపులో మినహాయింపు ఇస్తున్నట్లు ప్రకటించాడు. అంటే మొదటి పన్ను శ్లాబ్ ను రు. 2 లక్షల నుండి 2.2 లక్షలకు పెంచినట్లు అర్ధం చేసుకోవచ్చు. నిజానికి ఇది పరిమితి పెంపు కాదు. ప్రభుత్వమే ఆయా…

బడ్జెట్ 2013-14: సబ్సిడీల్లో భారీ కోత

2013-14 ఆర్ధిక సంవత్సరానికి గాను గురువారం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ప్రభుత్వం సబ్సిడీలలో భారీ కోతలు ప్రతిపాదించింది. పార్లమెంటులో బడ్జెట్ ప్రసంగంలో ఆర్ధిక మంత్రి చిదంబరం ఈ కోతల గురించి ఒక్క ముక్క కూడా చెప్పకుండా దాచిపెట్టాడు. నిజానికి సబ్సిడీలను తగ్గించవలసిన అవసరం గురించి ప్రధాని, ఆర్ధిక మంత్రి, ప్రధాని ఆర్ధిక సలహా బృందం, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు తదితరులంతా వీలు దొరికినప్పుడల్లా బోధనలు, సలహాలు, హెచ్చరికలు చేస్తూ వచ్చారు. వాటిని అమలు చేసే సమయంలో మాత్రం…

బడ్జెట్ 2013-14: మాటలు సామాన్యుడికి, మూటలు కార్పొరేట్లకు

చిదంబరం బడ్జెట్ చిదంబర రహస్యాలతో నిండిపోయింది. ఆదర్శాలు వల్లించడానికే తప్ప ఆచరించడానికి కాదని కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. మాటలు సామాన్యుడికి మూటలు కార్పొరేట్లకు పంచి పెట్టింది. దొడ్డి దారిలో మూటల్ని దాటించి, సింహద్వారంలో ఆదర్శాల మాటలు వేలాడగట్టింది. ఆహార భద్రత చట్టం గురించి ఘనంగా చెప్పుకుని అందుకోసం ముష్టి 10 వేల కోట్లు విదిలించింది. దేశ ప్రజలకు పూర్తిస్థాయి ఆహార భద్రత కల్పించాలంటే 84,000 కోట్లు అవసరమని చెప్పిన తన మాటలు తానే ఉల్లంఘించింది.…

ఇరాన్, పశ్చిమ దేశాల అణు చర్చలు సానుకూలం?!

ఇది దాదాపు ఎవరూ ఊహించని పరిణామం! అప్పుడే ఒక అవగాహనకు రావడం తొందరపాటే అయినా ఈ మాత్రం సానుకూల వార్త రావడం కూడా అనూహ్యమే. కజకిస్తాన్ పాత రాజధాని అల్మాతిలో ఇరాన్, P5+1 దేశాల మధ్య జరుగుతున్న చర్చలు సానుకూల అవగాహనతో ముగిసాయని ఇరాన్ ప్రతినిధి ప్రకటించడం ఇప్పటి ప్రపంచ పరిస్ధితులలో ‘అమ్మయ్య’ అనుకోవాల్సిన వార్త. ఇరాన్ అణు బాంబు తయారు చేస్తోందని చెబుతూ పశ్చిమ రాజ్యాలు ఆ దేశంపై దశాబ్దాలుగా అక్రమ ఆంక్షలు విధించి పసిపిల్లలకు…

పొదుపు విధానాలకు తిరస్కరణ, ఇటలీలో హంగ్ పార్లమెంటు

ఐ.ఎం.ఎఫ్, యూరోపియన్ యూనియన్, యూరోపియన్ సెంట్రల్ బ్యాంకులు బలవంతంగా అమలు చేస్తున్న పొదుపు ఆర్ధిక విధానాలను తిరస్కరిస్తూ ఇటలీ ఓటర్లు తీర్పు చెప్పారు. ఆది, సోమ వారాల్లో జరిగిన ఓటింగ్ ఫలితాలు ఏ పార్టీకి మెజారిటీ ఇవ్వలేదు. కనీసం కూటములు కూడా స్పష్టమైన మెజారిటీ సాధించలేకపోయాయి. యూరోపియన్ మానిటరీ యూనియన్ (యూరోజోన్) నుండి వైదొలగాలని ప్రచారం చేసిన కొత్త పార్టీకి మొదటి ప్రయత్నంలోనే పెద్ద ఎత్తున ఓట్లను కట్టబెట్టి ఇటలీ ప్రజలు తమ ఉద్దేశాలు చాటారు. సెంటర్-లెఫ్ట్…

ఈ తుఫాను గాలులు ఎక్కడివి? -కార్టూన్

“ఈ విప్లవాగ్నులు ఎచటివి అని అడిగితే నగ్జల్బరి వసంత మేఘ గర్జనవైపు వేలు చూపండి” ప్రముఖ విప్లవ కవి చెరబండరాజు రాసిన ఒక కవితలోని పాదాలివి. ఒక కాలంలో కాలేజీలు, యూనివర్శిటీలను ఒక్క ఊపు ఊపి బహుళ ప్రసిద్ధి చెందిన పాదాలివి. భారత ప్రజలు మార్పుని కోరుకుంటున్నారు అన్న నిజానికి సంకేతంగా 1960ల చివర్లో పశ్చిమ బెంగాల్ లో నగ్జల్బరి గ్రామంలో పుట్టిన రైతాంగ సాయుధ పోరాటాన్ని ప్రస్తావిస్తూ చెరబండరాజు ఈ మాటలు రాశాడు. నగ్జల్బరిలో వసంత…

సమాచార సేకరణకు చక్కని దారులు -ఈనాడు ఆర్టికల్ రెండో భాగం

ఈనాడు పత్రికలో ప్రచురించబడిన నా ఆర్టికల్ రెండో భాగం ఇది. సమాచార సేకరణ ఎలా చేయవచ్చు అన్న అంశం ఈ భాగంలో వివరించబడింది. జాతీయ అంతర్జాతీయ పరిస్ధితులపై అవగాహన సాధించడమెలా? -2 బొమ్మ పైన క్లిక్ చేస్తే మేటర్ ను పి.డి.ఎఫ్ ఫార్మాట్ లో చూడవచ్చు. నెట్ లో చూడాలనుకుంటే ఇక్కడ ఈ లంకెను క్లిక్ చేయండి. – –

కంపెనీలకు బ్యాంకులు, జనానికి చిల్ల పెంకులు

ప్రజల కష్టార్జితాన్ని కార్పొరేట్ కంపెనీల స్పెక్యులేటివ్ ఆటలకు అప్పజెప్పడానికి ఆర్.బి.ఐ గేట్లు బార్లా తెరిచింది. ప్రైవేటు రంగంలో కొత్త బ్యాంకులు నెలకొల్పడానికి బడా కార్పొరేట్ కంపెనీలకు అవకాశం ఇవ్వడానికి నిర్ణయించినట్లు శుక్రవారం అంతిమ మార్గదర్శక సూత్రాలను జారీ చేసింది. ఈ సూత్రాల ప్రకారం కార్పొరేట్ కంపెనీలు, ఎన్.బి.ఎఫ్.సి లు (నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు), NOHFCలు (Non-Operative Financial Holding Company) ఇకనుండి యథేచ్ఛగా బ్యాంకులు పెట్టుకోవచ్చు. నూతన మార్గదర్శక సూత్రాల ప్రకారం కొత్త బ్యాంకులకు లైసెన్సుల కోసం…

పాలుగారే పసికూనలు వాళ్ళు; అత్యాచారం చేసి చంపేశారు

ఆకలితో ఉన్న తండ్రి లేని ముగ్గురు పేద పసి బాలికలను ఆకర్షించి దారుణంగా అత్యాచారం చేసి చంపేసిన దారుణం మహారాష్ట్ర, భండారా జిల్లాలో జరిగింది. ఇళ్ళలో పాచి పని చేసుకుని బతికే తల్లికి పుట్టినవారు కావడంతో వారి ఊరి వాళ్లని తప్ప దేశ ప్రజలని పెద్దగా కదిలించలేకపోయింది. ఫలితంగా ఘటన జరిగి పది రోజులు కావస్తున్నప్పటికీ దోషులు ఇంతవరకు కనీసం అరెస్టు కాలేదు. స్టేషన్ ఎస్.ఐ ని సస్పెండ్ చేసి రాష్ట్ర ప్రభుత్వం చేతులు దులుపుకోగా, బాధిత…

దిల్‌షుక్‌నగర్ పేలుళ్లు: ముఖ్యమంత్రి రాకతో సాక్ష్యాలు భంగం

ముఖ్యమంత్రి తదితరుల వి.వి.ఐ.పి ల సందర్శన వలన పోలీసుల పరిశోధన ముందుకు సాగని పరిస్ధితి ఏర్పడింది. వారితో పాటు ఉత్సుకతతో చూడడానికి వచ్చిన జనం పేలుడు జరిగిన చోట్ల ఇష్టం వచ్చినట్లు తొక్కిపారేయడంతో కీలక సాక్ష్యాలు లభ్యం కాకుండా పోయాయి. పేలుడు జరిగాక జనం హాహాకారాలతో అటు ఇటు పరుగులు పెట్టడం సహజమే. కానీ ఆ పరుగులు కూడా కీలక సాక్ష్యాలలో భాగంగా ఉండవచ్చు. వారు కాకుండా బైటివారు రావడం వలన పేలుడు జరిగిన తర్వాత పరిసరాలలో…

సమయస్ఫూర్తి ఆ అమ్మాయిని కాపాడింది…

ఢిల్లీ బస్సులో జరిగిన ఘోరం లాంటిది తృటిలో తప్పిపోయింది. చేతిలో ఉన్న పెప్పర్ స్ప్రే, మొబైల్ ఫోన్, అన్నింటికీ మించి ఆమె సమయస్ఫూర్తి… వెరసి ఇంకో అఘాయిత్యం జరగకుండా అడ్డుకున్నాయి. హైదరాబాద్ సైతం అమ్మాయిలకు క్షేమకరం కాని నగరాల జాబితాలో ఉన్నదని నిరూపిస్తున్న ఈ ఘటనలో 22 సంవత్సరాల యువతి కిడ్నాప్ వల నుండి బైటికి దుమికి తప్పించుకుంది. ఇతర ప్రయాణీకులు అందరూ తమ తమ స్టేజీలలో దిగిపోయాక ఒంటరిగా దొరికిన అమ్మాయిని ఏం చేయదలుచుకున్నారో గానీ,…

హైదరాబాద్ బాంబు పేలుళ్లు, ముందే సమాచారం?!

హైదరాబాద్ మళ్ళీ బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. అత్యంత రద్దీగా ఉండే దిల్ షుక్ నగర్ బస్ స్టాండ్ ప్రాంతంలో రెండు చోట్ల అమర్చిన సైకిల్ బాంబులు పేలడంతో అనేకమంది మరణించగా మరెంతోమంది గాయపడ్డారు. 11 మంది చనిపోయారని, మరో 80 మంది గాయపడ్డారని, గాయపడినవారిలో ఐదు లేక ఆరుగురు తీవ్రంగా గాయపడినందున వారి పరిస్ధితి ప్రమాదకరంగా మారిందని రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పత్రికలు, ఛానళ్లతో క్యాంపు కార్యాలయంలో మాట్లాడుతూ చెప్పాడు. ముఖ్యమంత్రి పత్రికలతో…

జలియన్‌వాలా బాగ్: క్షమాపణకు బ్రిటిష్ ప్రధాని నిరాకరణ

అమృత్ సర్ లోని జలియన్‌వాలా బాగ్ ను సందర్శించిన బ్రిటిష్ ప్రధాని కామెరూన్ నాటి మారణకాండకు క్షమాపణ చెప్పడానికి మాత్రం నిరాకరించాడు. మాజీ బ్రిటిష్ ప్రధాని చర్చిల్ చెప్పినట్లే మొక్కుబడిగా విచారం ప్రకటించి ఊరుకున్నాడు. కుంటిసాకులు చెప్పి క్షమాపణ చెప్పడానికి నిరాకరించాడు. తాను బ్రిటన్ దేశ ప్రభుత్వానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రధానమంత్రి అన్న విషయం మరిచి ‘జలియన్‌వాలా బాగ్ దుర్మార్గం’ జరిగినప్పటికి తాను అసలు పుట్టనే లేదని అసందర్భ వ్యాఖ్యలు చేసి తప్పించుకున్నాడు. హిల్స్ బరో ఫుట్…

సైబర్ దాడుల వెనుక చైనా సైన్యం పాత్ర!

అమెరికాకి చెందిన కంప్యూటర్ సెక్యూరిటీ కంపెనీ ఒకటి మంగళవారం ఓ జోకు పేల్చింది. గొంగట్లో అన్నం తింటూ వెంట్రుకలు ఏరుకోవడానికి తంటాలు పడింది. ప్రపంచ వ్యాపితంగా జరుగుతున్న సైబర్ దాడుల వెనుక చైనా ‘పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ’ హస్తం ఉందని కనిపెట్టినట్లు వర్జీనియా నుండి పని చేసే ‘మాండియంట్’ కంపెనీ ప్రకటించింది. షాంఘై నగరంలో ఎందుకు ఉపయోగిస్తున్నారో తెలియని ఒక భవంతి నుండి ‘Advanced Persistent Threat’ (ఎపిటి) వస్తున్నట్లు కనుగొన్నామని తెలిపింది. సైబర్ దాడుల గురించి…