అమెరికా నిఘాపై పిటిషన్ స్వీకరించిన సుప్రీం కోర్టు

భారత ప్రజల వ్యక్తిగత వివరాలను అక్రమంగా సేకరిస్తూ, వారి రోజువారీ సంభాషణలపై నిఘా పెడుతున్న అమెరికా పైన భారత సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ కు అర్జెంటు హియరింగ్ ఇవ్వడానికి సుప్రీం కోర్టు అంగీకరించింది. అమెరికా మిలట్రీ గూఢచార సంస్ధ ఎన్.ఐ.ఏ భారతీయుల ఇంటర్నెట్ కార్యకలాపాల డేటాను ‘ప్రిజమ్’ అనే ప్రత్యేక ప్రోగ్రామ్ ద్వారా సేకరించడానికి ఇంటర్నెట్ కంపెనీలు అంగీకరించడం వలన భారత జాతీయ భద్రతకు ప్రమాదం పొంచి ఉందని పిటిషనర్ ఆరోపించారు. ఢిల్లీ…

మోడి వేవ్? అది కార్పొరేట్ సృష్టి! -నితీష్ కుమార్

దేశంలో మోడి వేవ్ అనేదేమీ లేదని అది కార్పొరేట్ కంపెనీలు సృష్టించింది మాత్రమేనని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తేల్చేశారు. అనేకమంది బి.జె.పి కార్యకర్తలు దేశంలో మోడి వేవ్ ఉందని భావిస్తున్నారనీ, 2014 ఎన్నికల్లో అది ఒక ఊపు ఊపేస్తుందని నమ్ముతున్నారనీ కానీ అది వాస్తవంగా లేదని వారు గ్రహించాలని నితీష్ కోరారు. కార్పొరేట్ కంపెనీలు సృష్టించిన ఈ వేవ్ త్వరలోనే సమసిపోతుందని, అదేమీ మాజిక్కులు చేయబోవడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. బీహార్ శాసన సభలో ప్రభుత్వం…

గాంధీల ఆత్మను మోసి అలసిన మన్మోహన్ దేహం -కార్టూన్

కార్టూనిస్టులు ఎంత సున్నితంగా -కానీ శక్తివంతంగా- ఆలోచించగలరో ఈ కేశవ్ సురేంద్ర కార్టూన్ మరొక ఉదాహరణ. “రాహుల్ గాంధీ నా చెప్పుల్లో తన కాళ్ళు దూర్చవచ్చు” (Rahul Gandhi can step into my shoes) అని మన్మోహన్ గాంధీ, క్షమించాలి, మన్మోహన్ సింగ్ నిన్న (మంగళవారం) చేసిన ప్రకటనను వాస్తవాలకు అన్వయించిన విధానం అద్వితీయం! రాహుల్ గాంధీని మన్మోహన్ ఆహ్వానించడం ఇదే మొదటిసారి కాదు. బహుశా చివరిసారీ కాదేమో. ఈయన ఆహ్వానం పలకడం ఆయన సున్నితంగా…

దురన్ ఆదం: టర్కీలో వినూత్న నిరసన

టర్కీ ప్రధాని రెసిప్ తయ్యిప్ ఎర్డోగన్ నియంతృత్వ విధానాలకు, ఆయన అనుసరిస్తున్న ఆర్ధిక విధానాలకు వ్యతిరేకంగా మూడు వారాలుగా ఆందోళన చేస్తున్న టర్కీ ప్రజలు సోమవారం నుండి వినూత్న నిరసన చేపట్టారు. ప్రముఖ టర్కీ నాట్య కళాకారుడు ఎర్దెమ్ గుండుజ్ ప్రారంభించిన ఈ నిరసన రూపం కొద్ది గంటల్లోనే దేశ వ్యాప్తంగా బహుళ ప్రజాదరణ పొందడమే కాక అనేకమంది ఆయనను అనుసరించడానికి దారి తీసింది. ఇది ఎంతగా ప్రజాదరణ పొందిందంటే శరవేగంగా ఆదరణ పొందిన ఈ నిరసన…

కాంగ్రెస్, బి.జె.పి ల తేడా? -ఇలస్ట్రేషన్

భారత దేశంలో వివిధ రాజకీయ పార్టీల మధ్య తేడా క్రమంగా కనుమరుగవుతున్న సంగతి అంతకంతకూ ప్రస్ఫుటం అవుతోంది. జె.డి(యు) కేంద్రంగా జరిగిన, జరుగుతున్న పరిణామాలు అందుకు ఒక సాక్ష్యం మాత్రమే. కాంగ్రెస్, బి.జె.పిల మధ్య వారు చెప్పుకునే సైద్ధాంతీక విభేదాలే ఉన్నట్లయితే జె.డి(యు) ఆ రెండు పార్టీలకూ ఉమ్మడి మిత్రుడు ఎలా కాగలుగుతుంది? నిన్న, ఈరోజు అన్న ఒక్క తేడాయే తప్ప జె.డి(యు)-బి.జె.పి, జె.డి(యు)-కాంగ్రెస్ సంబంధాల్లో ఉన్నదంతా పోలికే. దేశంలోని పార్లమెంటరీ పార్టీలన్నీ ఒక తానులోని ముక్కలే.…

బీహార్ కాంగ్రెస్: కిం కర్వ్తవ్యం? -కార్టూన్

జనతా దళ్ (యునైటెడ్) బీహార్ కాంగ్రెస్ కి పెద్ద చిక్కే తెచ్చిపెట్టినట్లుంది! ఆ పార్టీ మీదా, పార్టీ నాయకుల మీదా కాంగ్రెస్ పార్టీ అధినాయకులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నప్పటికీ బీహార్ వరకు చూసుకుంటే ఒక సమస్య కాంగ్రెస్ ముందు నిలబడి ఉంది. ఎన్.డి.ఏ నుండి చీలిన జనతాదళ్ (యు)తో సఖ్యత పెంచుకోవడమా లేక ఎప్పటి నుండో కేంద్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇస్తున్న రాష్ట్రీయ జనతా దళ్ తోనే స్నేహం కొనసాగించడమా? పోనీ రెండింటితో సఖ్యత నెరుపుదామంటే ఒకే…

సిరియా యుద్ధరంగంలోకి దూకనున్న ఇరాన్

సిరియా కిరాయి తిరుగుబాటులో స్టేక్స్ పెరుగుతున్నాయి. సౌదీ అరేబియా, కతార్, టర్కీ, అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, ఇజ్రాయెల్ దేశాలు ఇప్పటికే ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ సిరియా తిరుగుబాటులో భాగస్వామ్యం వహిస్తున్నాయి. ఈ దేశాల మద్దతుతోనే ఆల్-ఖైదా టెర్రరిస్టులు సిరియా ప్రజలపై మారణహోమం సాగిస్తున్నారు. అమెరికా, ఐరోపా దేశాలు అందిస్తున ధన, ఆయుధ సహాయంతో అధ్యక్షుడు బషర్ ఆల్-అసద్ కూల్చివేతకు రెండేళ్లుగా సాయుధంగా తలపడుతున్నారు. ఇరాన్, రష్యాల మద్దతుతో కిరాయి తిరుగుబాటును ఎదుర్కొంటున్న సిరియా ప్రభుత్వానికి ప్రత్యక్షంగా సహకరించడానికి ఇప్పుడు…

జి20 సమావేశాల్లో దేశాల నాయకులపై నిఘా పెట్టిన బ్రిటన్

తమ దేశంలో జి20 సమావేశాలు జరిగినప్పుడు సమావేశాలకు హాజరయిన సభ్య దేశాల నాయకులపై కూడా నిఘా వేసిన దురాగతానికి బ్రిటన్ పాల్పడింది. 2008లో ప్రపంచ ఆర్ధిక సంక్షోభం సంభవించిన తర్వాత, సంక్షోభ పరిష్కారానికి జి20 కూటమి వరుస సమావేశాలు నిర్వహించింది. 2009లో లండన్ లో జరిగిన జి20 సమావేశాల సందర్భంగా అధునాతమైన టెక్నిక్ లను ఉపయోగించి సభ్య దేశాల తరపున హాజరైన మంత్రులు, ప్రధాన మంత్రులు, అధ్యక్షులు వారీ మందీ మార్బలం అందరి ఫోన్ లను, ఈ…

రెండు నివేదికలు -కార్టూన్

కార్టూనిస్టు శ్రీధర్ ని తెలియనివారు తెలుగు దేశంలో ఎవరైనా ఉంటారా అన్నది అనుమానమే. నాకైతే ఈనాడు పత్రిక తెలిసినప్పటి నుండీ ఆయన తెలుసు. సాదాసీదా మాటల్లో రాష్ట్ర, జాతీయ నాయకులకు చురకలు అంటించడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. అలాంటి కార్టూన్ లలో ఇది ఒకటి. నివేదికలు ఇచ్చే హక్కు, పరిజ్ఞానం ఒక్క ప్రభుత్వాలకు మాత్రమే సొంతమైన హక్కు కాదు. అది ప్రజలు కూడా చేయగలరు. కాకపోతే ప్రజల తరపున ఒక ఆర్.కె.లక్ష్మణ్, ఒక శ్రీధర్… ఇలాంటివారు…

వైట్ హౌస్ కంచె మరమ్మతు -జోక్ కాదు

అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్ ప్రాంగణంలో ఒక చోట కంచెను మరమ్మత్తు చేయడానికి టెండర్లను ఆహ్వానించారు. వచ్చిన దరఖాస్తులను పరిశీలించి చివరికి ముగ్గురిని ఎంపిక చేశారు. ఒకరు బంగ్లాదేశ్, మరొకరు చైనా, మూడో వ్యక్తి భారతదేశానికి చెందిన వాడు. ముగ్గురూ వైట్‌హౌస్ అధికార ప్రతినిథితో కలిసి కంచెను పరీక్షించడానికి వెళ్ళారు. బంగ్లాదేశీయుడు బ్యాగ్ లోఉన్న టేప్ తీసుకుని స్థలాన్ని, కొలిచి కొన్ని లెక్కలు వేసి చివరికి 900 డాలర్లు ఖర్చవుతుందని తేల్చాడు. 400 డాలర్లు సామగ్రికి, 400…

ఎన్.డి.ఎ కి జె.డి(యు) రామ్ రామ్

పత్రికలు ఊహించినట్లే జరిగింది. జనతాదళ్ (యునైటెడ్) పార్టీ జాతీయ ప్రజాస్వామిక కూటమి (ఎన్.డి.ఎ) కి రామ్ రామ్ చెప్పేసింది. గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడి ప్రధాని అభ్యర్ధిగా బి.జె.పి పరోక్షంగా ప్రకటించిన వారం రోజులకి ఆ పార్టీ ప్రతిపక్ష కూటమి నుండి బిచాణా ఎత్తేసింది. ప్రస్తుత పాలక్ష కూటమి లోకి ఇప్పుడు కాకపోతే భవిష్యత్తులోనైనా చేరుతుందో లేదో గానీ ఇప్పటికైతే బీహార్ లో పరిస్ధితిని సవరించుకునేలో పడింది. బి.జె.పి మంత్రులను మంత్రివర్గం నుండి తొలగించి జూన్ 19…

టర్కీ: సిరియా తిరుగుబాటు ఎగదోస్తూ, సొంత ప్రజలపై ఉక్కుపాదం

సిరియా సెక్యులర్ పాలకుడు బషర్ అసద్ ను గద్దె దింపడానికి టర్కీ మతతత్వ పాలకుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ చేయని ప్రయత్నం లేదు. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ తదితర పశ్చిమ రాజ్యాలతో కుమ్మక్కై సిరియా కిరాయి తిరుగుబాటుదారులకు తమ భూభాగం పైనే శిక్షణా శిబిరాలు నెలకొల్పి సిరియాకు పంపుతున్న ఘనత ఎర్డోగాన్ సొంతం. సిరియాలో ప్రజలపైనా, ప్రభుత్వ వ్యవస్ధల పైనా మారణ హోమం సృష్టిస్తున్న ఆల్-ఖైదా టెర్రరిస్టులకు టర్కీ ద్వారా పశ్చిమ దేశాలు అనేక మారణాయుధాలు సరఫరా…

ఎడ్వర్డ్ స్నోడెన్, అందుకో వందనం! -ది హిందూ సంపాదకీయం

ప్రతి చారిత్రక క్షణమూ కొద్ది మంది వ్యక్తులను పతాక శీర్షికల్లో ఉంచుతుంది. ప్రభుత్వము, అధికారాల దుర్వినియోగం.. అలాంటి వారి నుండే అసాధారణ సాహసకృత్యాలను ప్రేరేపించి వెలికి తీస్తాయి. ప్రభుత్వాల ఉద్దేశ్యపూర్వక దుష్ట కార్యాల పట్ల –తమ పౌరులకు అబద్ధాలు చెప్పడం కావచ్చు, వారి ప్రైవేటు వ్యవహారాల్లోకి చొరబడడం కావచ్చు లేదా స్వార్ధ ప్రయోజనాలతో కుమ్మక్కవ్వడం కావచ్చు– విజిల్ ఊదడం ద్వారా ఈ దృఢచిత్తులు ప్రజలకు మంచి జరగడం కోసం తమ వ్యక్తిగత ప్రయోజనాలను పక్కన పెట్టేస్తారు. ఒక…

విచ్ఛిన్నం దారిలో ఎన్.డి.ఎ -కార్టూన్

జాతీయ ప్రజాస్వామిక కూటమి (నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్) విచ్ఛిన్నం దారిలో పయనిస్తున్నట్లు స్పష్టమైన సూచనలు కనిపిస్తున్నాయి. బి.జె.పితో సంబంధాలు అంత బాగా లేవని ఎన్.డి.ఎ కన్వీనర్ శరద్ యాదవ్ శుక్రవారం స్పష్టం చేసేశారు. ఇప్పటిడైతే ఎన్.డి.ఎ ఉనికిలోనే ఉంది అని చెబుతూనే ఎన్.డి.ఎ స్ధాపన సమయంలో అంగీకరించిన కనీస కార్యక్రమానికి, అవగాహనకి భిన్నంగా పరిస్ధితులు పోతున్నాయి అని ఆయన అభిప్రాయపడ్డారు. నరేంద్ర మోడిని ప్రధాని అభ్యర్ధిగా ప్రకటించడాన్ని ఆయన ఉద్దేశించారని స్పష్టమే. ఎన్.డి.ఎ స్ధాపన సమయంలో బి.జె.పి…

దేనికైనా సిద్ధపడే లీక్ చేశాను -స్నోడెన్ ఇంటర్వ్యూ

మొదటి భాగం తరువాయి…………. – మీరు దీనికోసం పధకం వేస్తున్నారని మీ కుటుంబానికి తెలుసా? లేదు. ఏం జరుగుతోందో నా కుటుంబానికి తెలియదు. ప్రధానంగా నా భయం ఏమిటంటే వారు కుటుంబం వెంటపడతారు. నా మిత్రులు, నా భాగస్వామి… ఇలా నా సంబంధీకులను అందర్నీ వేధిస్తారు… నా మిగిలిన జీవితంలో ఈ వాస్తవంతో నేను బతకాల్సి ఉంటుంది. వారితో సంభాషించే అవకాశం నాకు ఇక ఉండదు. వాళ్ళు (అధికార వర్గాలు) నేను తెలిసిన ప్రతి ఒక్కరిపైనా తీవ్ర…