అణు పరిహార చట్టం: గదిలో ఏనుగు! -కార్టూన్

“Elephant in the room” అనేది ఆంగ్లంలో ఒక సామెత. ‘చర్చించడానికి, మాట్లాడుకోవడానికి ఇష్టం లేని సమస్య, కానీ విస్మరించలేని సమస్య’ ను సూచించడానికి ఈ ‘గదిలో ఏనుగు’ సామెతను వాడతారు. భారత అణు పరిహార చట్టం విదేశీ కంపెనీలకు ఈ సామెతను గుర్తుకు తెస్తోంది(ట)! గదిలో ఏనుగు ఉన్నపుడు, భారీ ఆకారంతో ఉంటుంది గనక ఆ గదిలో ఉన్నవారికి ఒక సమస్యగా ఉంటుంది. కానీ దాన్ని వదిలించుకోడానికి వారికి మార్గం లేని పరిస్ధితి వారికి ఉంటుంది.…

ద్రవ్య సమీక్ష: ధనిక వర్గాలకు కొత్త ఆర్.బి.ఐ గవర్నర్ షాక్

కొత్త ఆర్.బి.ఐ గవర్నర్ గా రఘురాం రాజన్ నియమితుడయినప్పుడు ఆయన చెప్పిన మాటల్ని బట్టి పరిశ్రమల వర్గాలు తెగ ఉబ్బిపోయాయి. ఆర్.బి.ఐ పరపతి విధానం ద్వారా తమ పరపతి ఇక ఆకాశంలో విహరించడమే తరువాయి అన్నట్లుగా ఆనందోత్సాహాలు వ్యక్తం చేశారు. తీరా చర్యల విషయానికి వచ్చేసరికి బ్యాంకు వడ్డీ రేటు తగ్గించడానికి బదులు పెంచేసరికి వాళ్ళకు గట్టి షాకే తగిలింది. ఆ షాక్ ఎంత తీవ్రంగా ఉందంటే ద్రవ్య విధాన సమీక్ష ప్రకటించాక భారత స్టాక్ మార్కెట్లు…

పోల్: రూపాయి పతనానికి కారణం?

పాఠకులకు విజ్ఞప్తి! రూపాయి పతనం గురించి ఈ బ్లాగ్ లో వివిధ టపాలు పోస్ట్ చేశాను. అందులో ఇచ్చిన సమాచారం ఆధారంగా రూపాయి వ్యవహారం గురించి పూర్తి అవగాహనకు రాకపోవచ్చు గానీ ఒక ఐడియా అయితే దాదాపు వచ్చే ఉంటుంది. ఆ ఐడియాను ఈ పోలింగ్ లో వ్యక్తం చేయవచ్చు. ఇచ్చిన ఆప్షన్స్ కాకుండా సొంత ఐడియా ఏమన్నా ఉన్నట్లయితే అది కూడా ఇవ్వొచ్చు. —

తీవ్రమైన ది హిందు, డిజిపిల వివాదం

పాత బస్తీలోని ఒక బాబాను రాష్ట్ర అత్యున్నత పోలీసు అధికారి దినేష్ రెడ్డి సందర్శించడం గురించి రాసిన వార్తపై రేగిన రగడ తీవ్రరూపం దాల్చుతోంది. పాతబస్తీలో నివసించే ముస్లిం మత బాబా హబీబ్ ముస్తఫా ఇద్రాస్ బాబాను డిజిపి దినేష్ రెడ్డి సందర్శించడం గురించి ది హిందు పత్రిక వార్త ప్రచురించగా ఈ వార్తను దురుద్దేశంతో ప్రచురించారని డిజిపి ఆరోపిస్తున్నారు. ఇతర పత్రికలన్నీ ఈ వార్తకు పెద్ద ప్రాముఖ్యత ఇవ్వకుండా లోపలి పేజీల్లో వేయగా ది హిందు…

అవును! టెంప్లేట్ మళ్ళీ మార్చాను

టెంప్లేట్ ని మళ్ళీ మార్చాల్సి వచ్చింది. క్రితం టెంప్లేట్ లో ప్రధానమైన లోపం నేవిగేషన్ కష్టంగా ఉండడం. ‘పాత టపాల’ లోకి వెళ్లడానికి హోమ్ పేజీలో ఎక్కడా సౌకర్యం లేదు. ఇది నేవిగేషన్ కు బాగా ఇబ్బందిగా మారింది. దీనిని కవర్ చేయడానికి ‘ఈ బ్లాగ్ లో విహరించడం ఎలా?’ అన్న పేరుతో వివరణ ఇచ్చాను గానీ అదొక చాట భారతంలా కనిపించింది. కేవలం ‘స్లైడర్’ లో 20 టపాలను చూపించవచ్చు అనుకున్నాను గానీ అవి వెంటనే…

అమెరికన్ ఉత్తరాఖండ్? కనీవినీ ఎరగని కొలరాడో వరదలు -ఫోటోలు

మెరుపులాంటి ఉధృతితో వానలు కురిస్తే, అందునా కొండల వెంబడి బండలను కిందికి తోసుకుంటూ పోయే ప్రవాహాల్ని సృష్టించే వానలు కురిస్తే ఆ ఉత్పాతం ఎలాంటిదో ఉత్తరాఖండ్ వరదలు మనకి రుచి చూపించాయి. సరిగ్గా అదే నైసర్గిక స్వరూపం కలిగి ఉన్న కొలరాడో రాష్ట్రంలో వారం రోజుల పాటు కురిసిన వానలు కనీవినీ ఎరుగని మహోత్పాతాన్ని సృష్టించాయి. ఎప్పటిలానే కొలరాడో వరదలకు కూడా గ్లోబల్ వార్మింగే కారణం అని శాస్త్రవేత్తలు నిర్ధారిస్తున్నారు. కొలరాడో వరదల్లో ఇప్పటివరకూ 6గురు చనిపోయారని…

అమెరికా మబ్బులు, ఇండియనోడి ఉబ్బులు

ఆంధ్ర ప్రదేశ్ లో, బహుశా కోస్తా ప్రాంతంలో, ఒక ముతక సామెత ఉంది. ఒక నిమ్న కులం యొక్క ఆర్ధిక వెనుకబాటుతనాన్ని, సామాజిక అణచివేతను పట్టిచ్చే సామెత అది. మరో విధంగా ఆ కులాన్ని న్యూనతపరిచే సామెత కూడాను. గురువారం ఎగిరెగిరి పడిన భారత స్టాక్ మార్కెట్లను గమనిస్తే ఈ సామెత గుర్తుకు రాక మానదు. అమెరికా ద్రవ్య పరపతి విధానాన్ని సమీక్షిస్తూ ఆ దేశ సెంట్రల్ బ్యాంకు ‘ఫెడరల్ రిజర్వ్’ ఛైర్మన్ అయిన బెన్ బెర్నాంక్,…

అమెరికాకు చట్టవిరుద్ధ రాయితీ ఇవ్వడానికి ప్రధాని రెడీ?

భారత పార్లమెంటు విస్తృతంగా చర్చించి ఆమోదించిన ‘న్యూక్లియర్ లయబిలిటీ’ చట్టానికి విరుద్ధంగా అమెరికా అణు కంపెనీలకు రాయితీలు ఇవ్వడానికి ప్రధాని మన్మోహన్ సిద్ధపడినట్లు తెలుస్తోంది. ఒబామా ప్రభుత్వం నుండి తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్న మన్మోహన్, అమెరికా కంపెనీలు సరఫరా చేయనున్న అణు పరికరాలు నాసిరకం అయినప్పటికీ, వాటివల్ల ప్రమాదం జరిగినప్పటికీ నష్టపరిహారం చెల్లించే అవసరం లేకుండా రాయితీ ఇచ్చేవైపుగా అడుగులు వేస్తున్నట్లు ‘ది హిందు’ పత్రిక తెలిపింది. ఇందుకోసం భారత ప్రభుత్వ అటార్నీ జనరల్ జి.ఇ.వాహనవతి అమెరికాకు…

రేపిస్టు అ(వ)సరం కోసం బాలికకు జబ్బు అంటగట్టిన జేఠ్మలాని

భారత దేశ న్యాయ వ్యవస్ధ ఎంత గబ్బు పట్టిందో రాం జెఠ్మలానీ రుజువు చేశాడు. దేశంలోనే అతి భారీ క్రిమినల్ లాయర్ గా పేరు మోసిన ఈ పెద్ద మనిషి తన రేపిస్టు క్లయింటు కోసం ఒక నిస్సహాయ పేద బాలికకు బహుశా వైద్య శాస్త్రానికి కూడా తెలియని జబ్బు అంటగట్టాడు. ఈ పేరు మోసిన క్రిమినల్ లాయర్ క్రిమినల్ డాక్టర్ గా కూడా అవతరించి అమ్మాయిల్ని ఒంటరిగా ఉండే ముసలి ముదురు పీనుగలవైపుకి ఆకర్షించే సరికొత్త…

యువరాజా నాయకత్వ విలువ! -కార్టూన్

ఉల్లి, తదితర ఆహార సరుకుల ధరలు ఎలా పెరుగుతున్నాయి? తరుగు ఉత్పత్తిని పసిగట్టిన వ్యాపారులు సదరు సరుకులను అక్రమంగా నిల్వ చేసి కృత్రిమంగా ధరలు పెంచి తద్వారా లబ్ది పొందాలని చూసినపుడు వాటి ధరలు పెరుగుతాయి. ఇది పై నుండి కింది వరకూ అందరికీ తెలిసిన నిజమే. ఈ సంగతి తెలిసి కూడా ధరల పెరుగుదల పైన ప్రధాని తదితర ఢిల్లీ నాయకుల నుండి ఛోటా మోటా గల్లీ నాయకుల వరకు ధరల పెరుగుదల పైన ఒకటే…

ఒళ్ళు జలదరించే విమాన విన్యాసాలు -ఫోటోలు

ప్రపంచంలోని వివిధ దేశాల్లో ఇటీవల రోజుల్లో జరిగిన విమాన ప్రదర్శనల ఫొటోలివి. పక్షిని చూసి అలాగే ఎగరడానికి మొదట్లో తంటాలు పడిన మనిషి చివరికి ఆ పక్షిని దాటిపోయి ఆకాశం మొత్తం ఆక్రమించేశాడు. మనిషి శక్తి, యుక్తులకు సజీవ సాక్ష్యాలుగా నిలిచేవాటిలో విమానాలు బహుశా ముఖ్య స్ధానంలో ఉంటాయేమో. అయితే కానిబాల్స్ తరహాలో స్వజాతి భక్షణ కోసం మనిషి తెగించడంతో ప్రయాణ విమానాలకు తోడుగా యుద్ధ విమానాలు వచ్చి చేరాయి. యుద్ధాలు వస్తే తప్ప పని దొరకని…

దారికొచ్చిన అద్వానీ

“చూశావా మరి! వాళ్ళ మధ్య విభేదాలని ఇస్త్రీ చేసేసుకుంటారని నేను ముందే చెప్పలేదా?” మొత్తం మీద అద్వానీ దారికొచ్చారు. ఛత్తీస్ ఘడ్ పర్యటనలో నరేంద్ర మోడిపై ప్రశంసలు కురిపించడం ద్వారా బి.జె.పి వృద్ధాగ్ర నేత లాల్ కృష్ణ అద్వానీ మోడి ప్రధాని అభ్యర్ధిత్వానికి ఆమోదం తెలిపారు. మోడికి ప్రధాన మంత్రి అభ్యర్ధిత్వం కట్టబెట్టడం ద్వారా బి.జె.పి చేసిన ప్రయత్నం సఫలం అయితే దేశం అంతా గుజరాత్ నమూనా విస్తరిస్తుందన్న ఆశాభావాన్ని కూడా అద్వానీ వ్యక్తం చేశారు. ‘బోడి,…

వాషింగ్టన్ లో విచ్చలవిడి షూటింగ్, 7గురు ఆహుతి

అమెరికాలో మరోసారి తుపాకుల మోత మోగింది. మిలట్రీ తరహా డ్రస్సులో ఉన్న ముగ్గురు వ్యక్తులు వాషింగ్టన్ డి.సిలోని నావల్ డాక్ యార్డ్ లో యధేచ్ఛగా షూటింగుకు పాల్పడ్డారని పత్రికలు తెలిపాయి. ఈ కాల్పుల్లో ఆరుగురు పౌరులు మరణించగా కాల్పులకు దిగినవారిలో ఒకరిని పోలీసులు కాల్చి చంపారని తెలుస్తోంది. కనీసం మరో ఇద్దరు షూటర్లు ఉన్నారనీ, వారికోసం వెతుకుతున్నామని పోలీసులు చెబుతున్నారు. వెతుకుతున్నవారిలో ఒకరు తెల్లజాతి వ్యక్తి కాగా మరొకరు నల్లజాతి వ్యక్తి అని వారు తెలిపారు. కాల్పులకు…

అమెరికన్లను ఉద్దేశిస్తూ పుతిన్ రాసిన లేఖ -అనువాదం

(ఈ లేఖను సెప్టెంబర్ 11 తేదీన న్యూయార్క్ టైమ్స్ పత్రిక ప్రచురించింది. సిరియా తిరుగుబాటుదారులు ఆగస్టు 21 తేదీన సౌదీ అరేబియా అందించిన రసాయన ఆయుధాలు ప్రయోగించి వందలాది మంది పౌరులను బలిగొన్న దుర్మార్గాన్ని సిరియా ప్రభుత్వంపై మోపి ఆ దేశంపై దాడికి అమెరికా సిద్ధపడుతున్న నేపధ్యంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ ఈ లేఖ రాశాడు. లేఖ రాసేనాటికి సిరియా రసాయన ఆయుధాలను ఐరాస పర్యవేక్షణలోకి తేవడానికి రష్యా ప్రతిపాదించడం, సిరియా అందుకు అంగీకరించడం జరిగిపోయింది. అమెరికా…

ఐనా… … మనిషి మారలేదు -ఫోటోలు

గత మే నెలలో మూడు దేశాల ఆస్ట్రోనాట్ సిబ్బంది సాగించిన 36వ అంతర్జాతీయ విశ్వ ప్రయాణం 166 రోజుల పాటు సాగింది. అమెరికా, రష్యా, ఇటలీలకు చెందిన సిబ్బంది విజయవంతంగా ముగించిన ఈ ప్రయాణానికి ఇంకా జపాన్, కజకిస్ధాన్ లాంటి దేశాలు కూడా సహకరించడం విశేషం. ఇండియాలో కుంకుమ బొట్లతో రాకెట్ ప్రయోగం ప్రారంభం అయితే అమెరికాలో క్రైస్తవ ప్రార్ధనలతో ప్రారంభం అవుతుందని ఈ ఫోటోలు తెలియజేస్తున్నాయి. అభివృద్ధి, మూఢత్వం పెనవేసుకుపోయిన విచిత్రం ఇది. 166 రోజుల…