అమెరికా మబ్బులు, ఇండియనోడి ఉబ్బులు

ఆంధ్ర ప్రదేశ్ లో, బహుశా కోస్తా ప్రాంతంలో, ఒక ముతక సామెత ఉంది. ఒక నిమ్న కులం యొక్క ఆర్ధిక వెనుకబాటుతనాన్ని, సామాజిక అణచివేతను పట్టిచ్చే సామెత అది. మరో విధంగా ఆ కులాన్ని న్యూనతపరిచే సామెత కూడాను. గురువారం ఎగిరెగిరి పడిన భారత స్టాక్ మార్కెట్లను గమనిస్తే ఈ సామెత గుర్తుకు రాక మానదు. అమెరికా ద్రవ్య పరపతి విధానాన్ని సమీక్షిస్తూ ఆ దేశ సెంట్రల్ బ్యాంకు ‘ఫెడరల్ రిజర్వ్’ ఛైర్మన్ అయిన బెన్ బెర్నాంక్,…

అమెరికాకు చట్టవిరుద్ధ రాయితీ ఇవ్వడానికి ప్రధాని రెడీ?

భారత పార్లమెంటు విస్తృతంగా చర్చించి ఆమోదించిన ‘న్యూక్లియర్ లయబిలిటీ’ చట్టానికి విరుద్ధంగా అమెరికా అణు కంపెనీలకు రాయితీలు ఇవ్వడానికి ప్రధాని మన్మోహన్ సిద్ధపడినట్లు తెలుస్తోంది. ఒబామా ప్రభుత్వం నుండి తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్న మన్మోహన్, అమెరికా కంపెనీలు సరఫరా చేయనున్న అణు పరికరాలు నాసిరకం అయినప్పటికీ, వాటివల్ల ప్రమాదం జరిగినప్పటికీ నష్టపరిహారం చెల్లించే అవసరం లేకుండా రాయితీ ఇచ్చేవైపుగా అడుగులు వేస్తున్నట్లు ‘ది హిందు’ పత్రిక తెలిపింది. ఇందుకోసం భారత ప్రభుత్వ అటార్నీ జనరల్ జి.ఇ.వాహనవతి అమెరికాకు…

రేపిస్టు అ(వ)సరం కోసం బాలికకు జబ్బు అంటగట్టిన జేఠ్మలాని

భారత దేశ న్యాయ వ్యవస్ధ ఎంత గబ్బు పట్టిందో రాం జెఠ్మలానీ రుజువు చేశాడు. దేశంలోనే అతి భారీ క్రిమినల్ లాయర్ గా పేరు మోసిన ఈ పెద్ద మనిషి తన రేపిస్టు క్లయింటు కోసం ఒక నిస్సహాయ పేద బాలికకు బహుశా వైద్య శాస్త్రానికి కూడా తెలియని జబ్బు అంటగట్టాడు. ఈ పేరు మోసిన క్రిమినల్ లాయర్ క్రిమినల్ డాక్టర్ గా కూడా అవతరించి అమ్మాయిల్ని ఒంటరిగా ఉండే ముసలి ముదురు పీనుగలవైపుకి ఆకర్షించే సరికొత్త…

యువరాజా నాయకత్వ విలువ! -కార్టూన్

ఉల్లి, తదితర ఆహార సరుకుల ధరలు ఎలా పెరుగుతున్నాయి? తరుగు ఉత్పత్తిని పసిగట్టిన వ్యాపారులు సదరు సరుకులను అక్రమంగా నిల్వ చేసి కృత్రిమంగా ధరలు పెంచి తద్వారా లబ్ది పొందాలని చూసినపుడు వాటి ధరలు పెరుగుతాయి. ఇది పై నుండి కింది వరకూ అందరికీ తెలిసిన నిజమే. ఈ సంగతి తెలిసి కూడా ధరల పెరుగుదల పైన ప్రధాని తదితర ఢిల్లీ నాయకుల నుండి ఛోటా మోటా గల్లీ నాయకుల వరకు ధరల పెరుగుదల పైన ఒకటే…

ఒళ్ళు జలదరించే విమాన విన్యాసాలు -ఫోటోలు

ప్రపంచంలోని వివిధ దేశాల్లో ఇటీవల రోజుల్లో జరిగిన విమాన ప్రదర్శనల ఫొటోలివి. పక్షిని చూసి అలాగే ఎగరడానికి మొదట్లో తంటాలు పడిన మనిషి చివరికి ఆ పక్షిని దాటిపోయి ఆకాశం మొత్తం ఆక్రమించేశాడు. మనిషి శక్తి, యుక్తులకు సజీవ సాక్ష్యాలుగా నిలిచేవాటిలో విమానాలు బహుశా ముఖ్య స్ధానంలో ఉంటాయేమో. అయితే కానిబాల్స్ తరహాలో స్వజాతి భక్షణ కోసం మనిషి తెగించడంతో ప్రయాణ విమానాలకు తోడుగా యుద్ధ విమానాలు వచ్చి చేరాయి. యుద్ధాలు వస్తే తప్ప పని దొరకని…

దారికొచ్చిన అద్వానీ

“చూశావా మరి! వాళ్ళ మధ్య విభేదాలని ఇస్త్రీ చేసేసుకుంటారని నేను ముందే చెప్పలేదా?” మొత్తం మీద అద్వానీ దారికొచ్చారు. ఛత్తీస్ ఘడ్ పర్యటనలో నరేంద్ర మోడిపై ప్రశంసలు కురిపించడం ద్వారా బి.జె.పి వృద్ధాగ్ర నేత లాల్ కృష్ణ అద్వానీ మోడి ప్రధాని అభ్యర్ధిత్వానికి ఆమోదం తెలిపారు. మోడికి ప్రధాన మంత్రి అభ్యర్ధిత్వం కట్టబెట్టడం ద్వారా బి.జె.పి చేసిన ప్రయత్నం సఫలం అయితే దేశం అంతా గుజరాత్ నమూనా విస్తరిస్తుందన్న ఆశాభావాన్ని కూడా అద్వానీ వ్యక్తం చేశారు. ‘బోడి,…

వాషింగ్టన్ లో విచ్చలవిడి షూటింగ్, 7గురు ఆహుతి

అమెరికాలో మరోసారి తుపాకుల మోత మోగింది. మిలట్రీ తరహా డ్రస్సులో ఉన్న ముగ్గురు వ్యక్తులు వాషింగ్టన్ డి.సిలోని నావల్ డాక్ యార్డ్ లో యధేచ్ఛగా షూటింగుకు పాల్పడ్డారని పత్రికలు తెలిపాయి. ఈ కాల్పుల్లో ఆరుగురు పౌరులు మరణించగా కాల్పులకు దిగినవారిలో ఒకరిని పోలీసులు కాల్చి చంపారని తెలుస్తోంది. కనీసం మరో ఇద్దరు షూటర్లు ఉన్నారనీ, వారికోసం వెతుకుతున్నామని పోలీసులు చెబుతున్నారు. వెతుకుతున్నవారిలో ఒకరు తెల్లజాతి వ్యక్తి కాగా మరొకరు నల్లజాతి వ్యక్తి అని వారు తెలిపారు. కాల్పులకు…

అమెరికన్లను ఉద్దేశిస్తూ పుతిన్ రాసిన లేఖ -అనువాదం

(ఈ లేఖను సెప్టెంబర్ 11 తేదీన న్యూయార్క్ టైమ్స్ పత్రిక ప్రచురించింది. సిరియా తిరుగుబాటుదారులు ఆగస్టు 21 తేదీన సౌదీ అరేబియా అందించిన రసాయన ఆయుధాలు ప్రయోగించి వందలాది మంది పౌరులను బలిగొన్న దుర్మార్గాన్ని సిరియా ప్రభుత్వంపై మోపి ఆ దేశంపై దాడికి అమెరికా సిద్ధపడుతున్న నేపధ్యంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ ఈ లేఖ రాశాడు. లేఖ రాసేనాటికి సిరియా రసాయన ఆయుధాలను ఐరాస పర్యవేక్షణలోకి తేవడానికి రష్యా ప్రతిపాదించడం, సిరియా అందుకు అంగీకరించడం జరిగిపోయింది. అమెరికా…

ఐనా… … మనిషి మారలేదు -ఫోటోలు

గత మే నెలలో మూడు దేశాల ఆస్ట్రోనాట్ సిబ్బంది సాగించిన 36వ అంతర్జాతీయ విశ్వ ప్రయాణం 166 రోజుల పాటు సాగింది. అమెరికా, రష్యా, ఇటలీలకు చెందిన సిబ్బంది విజయవంతంగా ముగించిన ఈ ప్రయాణానికి ఇంకా జపాన్, కజకిస్ధాన్ లాంటి దేశాలు కూడా సహకరించడం విశేషం. ఇండియాలో కుంకుమ బొట్లతో రాకెట్ ప్రయోగం ప్రారంభం అయితే అమెరికాలో క్రైస్తవ ప్రార్ధనలతో ప్రారంభం అవుతుందని ఈ ఫోటోలు తెలియజేస్తున్నాయి. అభివృద్ధి, మూఢత్వం పెనవేసుకుపోయిన విచిత్రం ఇది. 166 రోజుల…

అద్వానీ స్ధానం అదే! -కార్టూన్

“చివరికి ఈ పరిస్ధితి వచ్చిందా! మన గురువుగారు అద్వానీజీని గురువు స్ధానంలోనే ఉండమని నచ్చజెప్పడానికి ఒక రధయాత్ర చేయాల్సివచ్చిందన్నమాట!” మొత్తం మీద బి.జె.పి పార్టీకి ఒక యజ్ఞం పూర్తయింది. ప్రధాన మంత్రి పదవి కుర్చీలో కూర్చోవాలన్న అద్వానీ కలను నరేంద్ర మోడి గద్దలా వచ్చి తన్నుకుపోయారు. రధయాత్రతో మత ఘర్షణల మంటలు రేపి పార్లమెంటులో సీట్ల చలి కాచుకున్న గురువు గారికి, దేశచరిత్రలో మచ్చగా మిగలాల్సిన కరసేవకుల దహనాన్ని ముస్లింల దహనకాండతో మాపుకున్న శిష్యుడు! గురువును మించిన…

సమైక్యగీతిక అనబడు బిస్కెట్టు కవిత

(రచన: అవ్వారి నాగరాజు) ఈ రోజు ముఖంలో ముఖం పెట్టి అంటోంది ప్రేమించవేం ప్రియా ? “సమైక్యం” గా ఉందామని ఫ్రెండ్స్, మనకిక పాట కావాలి ఒక ధూమ్ ధాం లాగా ఒక గద్దర్ గోరటోని లాగా అన్నీ కుదిరాయి కానీ అదొక్కటే కదా ఇక- చచ్చుపుచ్చు గెంతులు గావుకేకలూ వయస్సు మళ్ళీ ఎముకలు కుళ్ళీ ఒక్కటీ ఇమడక జవజవలాడక తెర మీద ప్రణయం మాదిరి ఒక చేత యాసిడ్ సీసా మరో చేత వేట కొడవలి…

నిర్భయ: నిందితులందరికీ ఉరి

నిర్భయ హంతకులు నలుగురుకి సత్వర న్యాయస్ధానం (fast-track court) ఉరిశిక్ష విధించింది. జరిగిన ఘోరం ఖచ్చితంగా అరుదయిన కేసుల్లోకెల్లా అరుదైనదేనని కనుక నిందితులకు మరణ శిక్షే సరైనదనీ న్యాయస్ధానం తీర్పు చెప్పింది. తీర్పు విన్న వెంటనే నిర్భయ తల్లిదండ్రులు, సోదరులు హర్షాతిరేకాలు ప్రకటించారు. తమ కూతురికి న్యాయం దక్కిందని చెబుతూ, తమ వెన్నంటి నిలిచిన దేశ ప్రజలకు, మీడియాకు కృతజ్ఞతలు తెలిపారు. తీర్పు ప్రకటించిన తర్వాత నిందితుల్లో ఒకరు ఏడుపు మొదలు పెట్టగా, ఇతరులు తమ పాపాన్ని…

సీమాంధ్ర ఉద్యమానిది కేవలం సెంటిమెంటు కాదు

(ఇది అవ్వారి నాగరాజు గారి వ్యాఖ్య.) తెలంగాణాకు అనుకూలంగా నేనూ, వ్యతిరేకంగా నా మిత్రులూ మాట్లాడుకుంటున్నప్పుడు కొన్ని ఆసక్తికరమైన విషయాలు ప్రస్తావనకు వచ్చాయి. వాటిని పాఠకులతో పంచుకోవాలనే ఉద్దేశంతో ఇది రాస్తున్నాను. నా మిత్రుల వాదనలలో ప్రధానంగా ప్రస్తావనకు వచ్చినవి నదీ జలాలను పంచుకోవడం, కొత్త రాష్ట్రాన్నీ, కొత్త రాజధానినీ నిర్మించుకోవడానికి కావలసిన నిధులు, ఆదాయాలూ- ఆస్తులూ వాటి పంపకాలూ ప్రస్తావనకు వచ్చాయి. నదీ జలాల విషయం ఒక్కొక్క నదినీ సోదాహరణంగా తీసుకొని అవి కేవలం ఒక్క…

అద్వానీ ఆవిరై న.మోగా ఘనీభవనం

హాలీవుడ్ యాక్షన్ ధ్రిల్లర్ ‘టెర్మినేటర్ 2: జడ్జిమెంట్ డే’ సినిమాలో హీరో, విలన్ ల విన్యాసాలు సంభ్రమాశ్చర్యాలు కలిగిస్తాయి. ఇప్పుడంటే అలాంటి గ్రాఫిక్ సీన్లు మామూలయ్యాయి గాని రెండు దశాబ్దాల క్రితం ఆ తరహా గ్రాఫిక్స్ ప్రేక్షకుల్ని నిజంగానే భవిష్యత్తుకి తీసుకెళ్ళాయి. ముఖ్యంగా ఆ విలన్ ఏ పాత్రలోకయినా ఇట్టే పరకాయ ప్రవేశం చేస్తుంటాడు. రంధ్రాల గుండా, సందుల గుండా ఎక్కడికంటే అక్కడికి పాదరసంలా జారిపోతూ కావలసిన రూపంలోకి మారిపోతూ ప్రేక్షకుల్ని కట్టి పడేస్తాడు. ఇప్పుడు బి.జె.పిలో…

కేబినెట్ నిర్ణయం దేశానికి, ప్రధాని సంతకం అమెరికాకి

భారత ప్రభుత్వ కేబినెట్ నిర్ణయాన్ని పక్కకు నెట్టి విదేశాలకు మేలు చేసే నిర్ణయాలను అంతర్జాతీయ వేదికలపై ఒప్పుకుని వచ్చే దేశాధినేతలు ఎక్కడయినా ఉంటారా? మనం ఆ అదృష్టం చేసుకున్నాం. గ్లోబల్ వార్మింగ్ కు దారి తీస్తున్న వాయువుల విడుదలను అరికట్టే విషయంలో ‘అంతర్జాతీయ ధరిత్రి వేదిక’లపై అమెరికా, ఐరోపాల పెత్తనాన్ని ఎదుర్కొంటున్నట్లు కనిపించే ప్రధాని మన్మోహన్ తీరా ఆచరణలోకి వచ్చేసరికి అమెరికా ఒత్తిడికి లొంగి దేశ ప్రయోజనాలను గంగలో కలిపే ఒప్పందంపైన సంతకం చేసిన దారుణానికి ఒడిగట్టారు.…