లక్షల దళిత నాయకుల్ని సృష్టించే మంత్రదండం! -కార్టూన్

రాహుల్: ఒకరో ఇద్దరో కాదు, దళితుల కోసం లక్షల నాయకులు ఉద్భవించాలి… రాహుల్ నీడలోని కాంగ్రెస్ నేత: ఆ సూత్రం మనక్కూడా వర్తించడం ఎలాగో… – ఒకరూ, ఇద్దరూ కాదు; పదులూ, వందలూ కూడా కాదు; వేలు అసలే కాదు; ఏకంగా లక్షలాది దళిత నాయకుల్ని తయారు చేసే మంత్రదండం ఉన్న సంగతి ఎవరికైనా తెలుసా? తెలియకపోతే తెలుసుకోండి. ఆ మంత్రదండం మన యువ రాజా రాహుల్ గాంధీ వద్ద భద్రంగా ఉంది. ఆయన దాన్ని త్వరలో…

లిబియాలో అమెరికాకు మరో ఎదురు దెబ్బ?

లిబియాలో సెక్యులర్ నేత గడ్డాఫీ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని కూల్చివేసి ఆ దేశాన్ని ఆల్-ఖైదా టెర్రరిస్టులకు ఆవాసంగా మార్చినందుకు అమెరికా తగిన ప్రతిఫలం అనుభవిస్తోంది. గత సంవత్సరం సెప్టెంబర్ 11 తేదీన తాము మద్దతు ఇచ్చి అధికారంలోకి తెచ్చిన ముస్లిం ఉగ్రవాద తిరుగుబాటు సంస్ధల చేతుల్లోనే తమ రాయబారి క్రిస్టఫర్ స్టీవెన్ దారుణ హత్యకు గురి కావడాన్ని చూడవలసి వచ్చిన అమెరికా తాజాగా తమ నమ్మిన బంటు అయిన లిబియా ప్రధాన మంత్రి ఆలీ జీదన్ అరెస్టు కావడంతో…

రాష్ట్ర విభజన: గతితర్క వివరణ –కార్టూన్

రాహుల్ గాంధీకి ప్రధాని పదవిని పళ్లెంలో పెట్టి అప్పగించడానికే సోనియా గాంధీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజనకు తలపెట్టిందని కానీ సీమాంధ్ర ఉద్యమం వలన అది ఆమెకు కష్టంగా మారిందని ఈ కార్టూన్ సూచిస్తోంది. రాష్ట్రాన్ని విభజించిన తర్వాత టి.ఆర్.ఎస్ తో పొత్తు లేదా విలీనం ద్వారా తెలంగాణలో, వైకాపాతో పొత్తు లేదా విలీనం లేదా ఎన్నికల అనంతర కూటమి ద్వారా సీమాంధ్రలోనూ మెజారిటీ లోక్ సభ స్ధానాలను గెలుచుకోవచ్చని, తద్వారా రాహుల్ గాంధీ ని ప్రధానిగా…

సి.ఎం పై మాజీ డి.జి.పి దినేష్ రెడ్డి సంచలన ఆరోపణలు

తన పదవీ కాలాన్ని పొడిగించాలని విజ్ఞప్తి చేసి విఫలమయిన మాజీ డి.జి.పి దినేష్ రెడ్డి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పైన సంచలన రీతిలో ఆరోపణలు చేశారు. పదవీ కాలాన్ని పొడిగించలేదన్న అక్కసుతోనే అబద్ధపు ఆరోపణలకు దిగారని మంత్రులు దినేష్ ఆరోపణలను తిప్పి కొట్టడానికి ప్రయత్నించినప్పటికీ వారి సమాధానాల్లో పెద్దగా విషయం లేదు. దానితో కిరణ్ కుమార్ రెడ్డి పనితీరుపై పలు అనుమానాలు ముసురుకున్నాయి. ఇప్పటిదాకా తెలంగాణ ఉద్యమాన్ని అణచివేయడానికి దినేష్ కృషి చేశారని తెలంగాణ వాదులు…

ఉగ్రవాదం కాదు స్వార్ధం కోసమే అమెరికా గూఢచర్యం -బ్రెజిల్

ప్రపంచంలో ఉగ్రవాద ప్రమాదాన్ని అరికట్టడానికే తాను ప్రపంచ ప్రజలందరిపైనా గూఢచర్యం సాగిస్తున్నానని అమెరికా అధ్యక్షుడు ఒబామా చెప్పుకున్నాడు. వాస్తవంలో అమెరికా బహుళజాతి కంపెనీల వాణిజ్య, ఆర్ధిక ప్రయోజనాల కోసమే అమెరికన్ ఎన్.ఎస్.ఏ గూఢచర్యం జరుగుతోందని తాజా స్నోడెన్ పత్రాలు స్పష్టం చేశాయి. అమెరికాతో పాటు కెనడా కూడా ఈ గూఢచర్యంలో భాగం పంచుకుందని, ముఖ్యంగా బ్రెజిల్ లోని మైనింగ్ పరిశ్రమలో తమ కంపెనీల ప్రయోజనాల కోసం ఎన్.ఎస్.ఏ గూఢచర్యాన్ని కెనడా వినియోగించుకుందని బ్రిటిష్ పత్రిక ది గార్డియన్…

ఓ సమైక్య మిత్రుడి ఆక్రోశం!

ప్రొద్దుటూరి అప్పారావు గారి వ్యాఖ్య ఇది. ‘పిట్ట కధ: తెలంగాణ – నదిలో దుప్పటి’ అన్న టపా కింద రాశారు. ఆంగ్లంలో రాసిన వ్యాఖ్యను తెనుగీకరించి ప్రచురిస్తున్నాను. మనం సమైక్యాంధ్ర కోసం పోరాడొచ్చు. కానీ మార్గం సరైనది కాదు. రాజకీయ నాయకులు (ఎం.ఎల్.ఏలు, ఎం.పిలు) అందరూ తమ జీత భత్యాలను వినియోగించుకుంటున్నారు. ఒక ఎం.పి గారు (ఉద్యమంలో) పాల్గొంటూనే తిరుమల ఛైర్మన్ గా పదవిని అనుభవిస్తున్నారు. రాజకీయ నాయకుల వ్యాపారాలన్నీ ఆటంకం లేకుండా చక్కగా నడుస్తూనే ఉన్నాయి.…

ఇంత రాక్షసత్వమా? -వసంత్ కుంజ్ కేసులో కోర్టు

ఢిల్లీ పోష్ లోకాలిటీ ‘వసంత్ కుంజ్’ లో ఒక మైనర్ బాలిక ను పనిలో పెట్టుకుని హింసించిన కేసులో నిందితురాలికి కోర్టు బెయిలు నిరాకరించింది. నోయిడాలో ఒక పేరు పొందిన బహుళజాతి సంస్ధలో కమ్యూనికేషన్ విభాగాని అధిపతిగా పని చేస్తున్న వందన ధీర్ కు బెయిల్ నిరాకరిస్తూ ఢిల్లీ కోర్టు ఘాటైన వ్యాఖ్యలు చేసింది. 18 సంవత్సరాల జార్ఖండ్ బాలిక ఆర్తనాదాలు విని పొరుగువారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఒక స్వచ్ఛంద సంస్ధ, పోలీసుల సాయంతో బాలిక…

తెలంగాణ షో -కార్టూన్

కాంగ్రెస్ పార్టీ ఎలాగో ధైర్యం చేసి తలపెట్టిన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ఆ పార్టీని ఎక్కడ ముంచి ఎక్కడ తేల్చనున్నదో తెలియని పరిస్ధితి. అధిష్టానం మాటకు కట్టుబడి ఉంటామని చెప్పిన పెద్ద మనుషులంతా ఆ మాట తీసి గట్టున పెట్టి తలో దారి పడుతున్నారు. సీమాంధ్ర జనం కోసం రాజీనామాలు నటించలేక అలాగని పార్టీలో కొనసాగుతూ ప్రజల ఆగ్రహానికి నిలవలేక ఆపసోపాలు పడుతున్నారు. తెలంగాణ మ్యాజిక్ ద్వారా ‘anti-incumbency’ ఫ్యాక్టర్ ని ఎదుర్కోవచ్చని కాంగ్రెస్ భావించిన…

పిట్ట కధ: తెలంగాణ – నదిలో దుప్పటి

విజయనగరంలో ‘కనిపిస్తే కాల్చివేత’ ఉత్తర్వులు జారీ అయ్యాయని ది హిందు పత్రిక ఒక వార్త ప్రచురించింది. ఆ వార్త కింద సయ్యద్ మునిరుద్దీన్ అనే ఒక పాఠకుడు వ్యాఖ్యానంగా ఈ కింది పిట్టకధ రాశారు. ఈ పిట్టకధని ఆయన చిన్నప్పుడు విన్నారట. తెలంగాణ-సమైక్యాంధ్ర ఉద్యమాలను చూసి తనకా కధ గుర్తుకొస్తోంది అని చెబుతూ రాశారు. చాలా తమాషాగా ఉంది చదవండి! అనగనగా ఇద్దరు మిత్రులు ఉండేవారు. వారు ఒక రోజు ఒక నది ఒడ్డున నడుచుకుంటూ వెళ్తున్నారు.…

విజయనగరంలో కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో భాగంగా కేంద్ర కేబినెట్, నోట్ ఆమోదించడానికి నిరసనగా విజయ నగరం అట్టుడుకుతోంది. ఏ.పి.ఎన్.జి.ఓ సంఘం ఇచ్చిన 48 గంటల బంద్ పిలుపు ముగిసినప్పటికీ మూడో రోజు కూడా అక్కడ ప్రజలు ఆగ్రహంతో వీధులకెక్కారు. కర్ఫ్యూ ప్రకటించినప్పటికి పరిస్ధితి అదుపులోకి రాకపోవడంతో ‘కనిపిస్తే కాల్చివేత’ ఉత్తర్వులు జారీ అయినట్లు ది హిందు తెలిపింది. ప్రజల ఆగ్రహం ప్రధానంగా రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణపై కేంద్రీకృతం అయింది. పి.సి.సి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ సోనియా…

డిప్రెషన్ బాధితురాలిని కాల్చి చంపిన అమెరికా పోలీసులు -ఫోటోలు

ఆమె డిప్రెషన్ బాధితురాలు. సంవత్సరంన్నర వయసు పాపకు తల్లి. డెంటల్ హైజీన్ నిపుణురాలు. బాలింతలకు వచ్చే డిప్రెషన్ తో బాధపడుతోంది. డిప్రెషన్ వల్లనే యేమో అక్టోబర్ 3 తేదీన వాషింగ్టన్ కేపిటల్ హిల్ ఏరియాలో వేగంగా కారు నడుపుతోంది. అధ్యక్ష భవనం దరిదాపుల్లో ఇలా ఓ కారు వేగంగా వెళ్ళడంతో పోలీసుల అప్రమత్తం అయ్యారు. ఒక పోలీసు కారును పక్కకు మళ్లించి ఆపాలని కోరాడు. ఆమె ఆగలేదు. ఇక మొదలైంది వేట. పోలీసులు వీరావతారం ఎత్తారు. కారును…

తెలంగాణ: 10 మంది మంత్రుల కమిటీ, నెలన్నర గడువు

  తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం 10 మంది కేంద్ర మంత్రులతో ‘మంత్రుల కమిటీ’ ని ఏర్పాటు చేయనున్నట్లు హోమ్ మంత్రి సుశీల్ కుమార్ షిండే తెలిపారు. ఆర్ధిక, న్యాయ, మానవ వనరుల అభివృద్ధి శాఖల మంత్రులతో పాటు ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కూడా ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. సరిహద్దుల నిర్ణయం, ఆస్తులు-అప్పుల పంపకం, నీటి పంపకం తదితర అంశాలను ఈ కమిటీ పరిశీలించి ప్రభుత్వానికి తగిన సూచనలు, సిఫారసులు చేయాలి. ఆరు వారాల గడువులో…

ఒబామా కేర్ – అమెరికా మూసివేత -కార్టూన్

అక్టోబర్ 1 తేదీ నుండి అమెరికా ప్రభుత్వం పని చేయడం లేదు. బారక్ ఒబామా ప్రభుత్వం 2010లో ఆమోదించిన ఆరోగ్య భద్రతా చట్టం అమలు మరో సంవత్సరం వాయిదా వేయాలని ప్రతిపక్ష రిపబ్లికన్ పార్టీ పట్టుబడుతోంది. దానికి పాలక డెమోక్రటిక్ పార్టీ ససేమిరా అంటోంది. అమెరికా ఆరోగ్య రంగానికి ఆక్సిజన్ అందకుండా అడ్డం పడుతూ తాను మాత్రం అన్ని సౌకర్యాలు అనుభవిస్తోందని రిపబ్లికన్ పార్టీని ఈ కార్టూన్ విమర్శిస్తోంది. చట్టం అమలు వాయిదా వేయడం గానీ లేదా…

కేబినెట్ ఆమోదంతో తెలంగాణ ప్రక్రియ ప్రారంభం

ఎట్టకేలకు తెలంగాణ ప్రజల కోరిక నెరవేర్చే ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రారంభించింది. గురువారం సాయంత్రం సమావేశమయిన కేంద్ర కేబినెట్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై హోమ్ మంత్రి ప్రవేశ పెట్టిన నోట్ ను తీర్మానంగా ఆమోదించింది. టి.వి ఛానెళ్లు చెబుతున్నదాని ప్రకారం సి.డబ్ల్యూ.సి తీర్మానాన్ని కేబినెట్ యధాతధంగా ఆమోదించింది. హైద్రాబాద్ 10 యేళ్లపాటు ఇరు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా ఉంటుంది. కొత్త రాజధాని ఎక్కడన్నదీ కేబినెట్ నియమించే మంత్రుల బృందం నిర్ణయిస్తుందని హోమ్ మంత్రి సుశీల్ కుమార్…

కొత్త బట్టలు కాదు, కొత్త రాజునే నేయగల నేర్పరులు! -కార్టూన్

కొత్త బట్టలా? కాదులే – ఇది మన కొత్త మహారాజు గారిని తయారు చేయడానికి… – మహారాజు గారి కొత్త బట్టల కధ అందరికీ తెలిసిందే. తమ పదవులకు, హోదాకు తగని వ్యక్తులకు తప్ప అందరికీ కనిపించే బట్టలు నేసి తెస్తామన్న నేతగాళ్ల చేతిలో రాజు, మంత్రి, వారి పరివారం అంతా ఫూల్స్ అయిన కధను కార్టూనిస్టు జ్ఞప్తికి తెస్తున్నారు. అయితే ఇక్కడ కాంగ్రెస్ నేతలు నేస్తున్నది యువరాజు వారి కొత్త బట్టలను కాదు. పాత మహారాజు…