పన్నులు ఎగవేయడమే కార్పొరేట్ నీతి!

బహుళజాతి కార్పొరేట్ కంపెనీలు సంక్షోభ కాలాల్లో కూడా లాభాలు ఎలా సాధిస్తాయి? డబ్బు లేదు మొర్రో అంటూ ప్రభుత్వాలు అప్పుల మీద అప్పులు తెచ్చేది ఈ కార్పొరేట్ కంపెనీల దగ్గర్నుండే. దేశ ఆర్ధిక వ్యవస్ధ మొత్తాన్ని నిర్వహించే ప్రభుత్వం దగ్గర లేని డబ్బు పెట్టుబడిదారీ కంపెనీలకు ఎక్కడి నుండి వస్తుంది? కార్మికుల వేతనాలనూ, సౌకర్యాలను నానాటికీ కుదిస్తూ లాభాలు పోగేసుకోవడం కంపెనీల ప్రధాన మార్గం. లాభాలు పోగేసుకోవడంలో వాటికి ఉన్న రెండో ప్రధాన మార్గం పన్నులు ఎగవేయడం.…

కారుతోలే హక్కుకోసం సౌదీ మహిళల పోరాటం

ప్రజల చైతన్యం ‘వెర్రి’ తలలు వేస్తే తన బతుకు ఏమవుతుందో సౌదీ రాచరికానికి బాగానే తెలుసు. ప్రపంచంలోనే సుదీర్ఘ ప్రజాస్వామ్య చరిత కలిగిన అమెరికా తోడు నిలవగా రాచరిక ప్రజాస్వామ్యం అనబడే విచిత్ర వ్యవస్ధను నెట్టుకొస్తున్న సౌదీ రాచరికానికి మహిళల ‘గొంతెమ్మ’ కోరికల పట్ల ఈ మధ్య మహా దిగులు పట్టుకుంది. రెండేళ్ల క్రితం ప్రారంభం అయిన ‘Women2Drive’ ఉద్యమాన్ని అరెస్టులతో అణచివేసిన సౌదీ ప్రభుత్వం అది మళ్ళీ తలెత్తడంతో గంగ వెర్రులెత్తుతోంది. సోషల్ నెట్ వర్క్…

మన్మోహన్ సి.బి.ఐ ని ఆహ్వానించారు -కార్టూన్

బొగ్గు కుంభకోణం విషయంలో సి.బి.ఐ తనను విచారించదలుచుకుంటే దానికి అడ్డంకులేమీ లేవని ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ తొట్ట తొలిసారి నిన్న ప్రకటించారు. 2జి కుంభకోణంలో అనుమానాలు కమ్ముకున్నా ‘నాకు తెలియదు, నాకు సంబంధం లేదు’ అంటూ తప్పించుకున్న ప్రధాని బొగ్గు కుంభకోణంలో ‘విచారణకు సిద్ధం’ అని ప్రకటించినందుకు దేశ ప్రజలు సంతోషించాలా లేక ఎన్ని ఆరోపణలు వచ్చినా చూరు పట్టుకుని వేలాడుతున్నందుకు సిగ్గుపడాలా? మన్మోహన్ సింగ్, భారత దేశపు అత్యున్నత నేర విచారణ సంస్ధకు సమర్పించిన…

విభజన ‘గీత’ -మరిన్ని శ్లోకాలు

రచన: తెరేష్ బాబు పైడి (పైడిశ్రీ) “బల్బో బస్సాహి సమ్మ్యామ్యహం దీక్షో భగ్నాయ వినిర్గతీ!!!” అపార్థా…! ఆరే ప్రతి బల్బు వెలగక తప్పదు ఆగే ప్రతి బస్సు కదలక తప్పదు జరిపే ప్రతి సమ్మె ఆపక తప్పదు చేసే ప్రతి దీక్ష భగ్నం కాక తప్పదు ఇవన్నియు ఢిల్లీ వలననే సంభవించుచున్నవి టీ టిటిటి ట్యూం టుయ్ [ఇది వీణా నాదము] ***                ***                *** కోతోహి చింపాంజీ నక్కస్య గోతో! మంత్రామ్యహి ముఖ్యోతి! జీవస్య ఎంజీవం…

అబద్ధాలాడొద్దు! -అమెరికాతో జర్మనీ

జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా సెల్ ఫోన్ సంభాషణలను తాము వినడం లేదన్న అమెరికా వాదనను జర్మనీ కొట్టిపారేసింది. ‘అబద్ధాలాడొద్దు’ అని కసిరినంత పని చేసింది. తమ ఛాన్సలర్ ఫోన్ సంభాషణలను అమెరికన్లు వింటున్నారని చెప్పడానికి తమ వద్ద ‘నూతన సాక్ష్యాలు’ ఉన్నాయని తేల్చి చెప్పింది. జర్మనీ చట్టాలను ఉల్లంఘించడం లేదని చెబుతున్న ఎన్.ఎస్.ఏ వాస్తవం చెప్పడం లేదని జర్మనీ ఛాన్సలర్ వ్యవహారాల మంత్రి రొనాల్డ్ పొఫల్లా తెలిపారు. అమెరికా గూఢచార సంస్ధ ఎన్.ఎస్.ఏ అనేక దేశాల అధినేతల…

ఆ గ్రామాలకు సూర్యరశ్మి ఇచ్చేది అద్దాలే -ఫోటోలు

నార్వే, ఇటలీ లలో ఉన్న రెండు గ్రామాలకు సంవత్సరంలో ఆరు నెలలు మాత్రమే సూర్యుడు కనిపిస్తాడు. మిగిలిన ఆరు నెలలూ వారు చీకటిలో మగ్గాల్సిందే. ఆ రెండు గ్రామాలూ లోతైన లోయల్లో ఎత్తైన కొండలతో చుట్టుముట్టబడి ఉండడమే దానికి కారణం. వణికించే చలికి తోడు సూర్యరశ్మి లేకపోవడం ఆ గ్రామాలకు శాపంగా మారింది. ఈ సమస్యకు వారు ఓ వినూత్నమైన పరిష్కారం కనిపెట్టారు. కొండలపై పెద్ద పెద్ద ఉక్కు అద్దాలు అమర్చి సూర్య రశ్మిని గ్రామాలపైకి పరావర్తనం…

ఎన్.ఎస్.ఎ గూఢచర్యం: 10 దిగ్భ్రాంతికర మార్గాలు -వీడియో

అమెరికా గూఢచార సంస్ధ ‘నేషనల్ సెక్యూరిటీ ఏజన్సీ’ ని అమెరికా, ఐరోపాల్లో ‘నో సచ్ ఏజన్సీ’ అని కూడా అంటారు. దానర్ధం అంత లో ప్రొఫైల్ లో ఉంటుందా సంస్ధ అని. ప్రపంచ వ్యాపితంగా అది సాగిస్తున్న విస్తారమైన గూఢచర్యం (స్నోడెన్ పుణ్యమాని) లోకానికి తెలిసాక ఎన్.ఎస్.ఎ అంత లో ప్రొఫైల్ లో ఎందుకు ఉంటుందో జనానికి తెలిసి వచ్చింది. ఎన్.ఎస్.ఎ గూఢచర్యంలోని దిగ్భ్రాంతికరమైన 10 పద్ధతులను ఈ వీడియో వివరిస్తోంది. ఈ వీడియో ప్రధానంగా గూగుల్…

ఏంజెలా ఫోన్ ట్యాపింగ్, అమెరికా రాయబారికి సమన్లు

అమెరికా గూఢచార సంస్ధ ఎన్.ఎస్.ఏ, జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ సెల్ ఫోన్ ను ట్యాప్ చేసి సంభాషణలను వింటోందని జర్మనీ ఆరోపించింది. ఎన్.ఎస్.ఏ చర్యలకు వివరణ ఇవ్వాలని కోరుతూ జర్మనీ ప్రభుత్వం తమ దేశంలోని అమెరికా రాయబారికి సమన్లు పంపామని తెలిపింది. గురువారం (అక్టోబర్ 24) సాయంత్రం కలిసి వివరణ ఇవ్వాల్సిందిగా అమెరికా రాయబారి జాన్ బి.ఎమర్శన్ ను కోరామణి జర్మనీ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. జర్మనీ ప్రకటనపై వ్యాఖ్యానించడానికి అమెరికా ఎంబసీ నిరాకరించిందని…

చిదంబరం దగ్గర ఉల్లి ఘాటు తగ్గించే చిట్కా -కార్టూన్

చిదంబరం: “పెరిగిపోతున్న కూరగాయల ధరలకు నేను బ్రహ్మాండమైన పరిష్కారం కనిపెట్టాను – 1000 టన్నుల ఉల్లిపాయలను ఎక్కడ పాతిపెట్టారో ఈయన గారు కలగన్నారట.” ***               ***                *** ఉల్లి పాయల రేట్లు మళ్ళీ ఊపిగొట్టేస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో కిలో ఉల్లిపాయల ధర వంద రూపాయలు దాటిపోయిందని ఆంగ్ల, హిందీ ఛానెళ్ళు అదే పనిగా మొట్టుకుంటున్నాయి. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శరద్ పవార్ మాత్రం ఉల్లిపాయలకు వాస్తవంగా కొరత లేదని చెబుతున్నారు. వాస్తవంగా కొరత లేకుండా…

విభజన ‘గీత’ -తమాషా శ్లోకం

ఇది ఫేస్ బుక్ లో లభించింది. చాలా తమాషాగా ఉంది. కొంత అరాచకం అనిపిస్తున్నప్పటికీ ఇందులో వ్యక్తమయిన సృజనాత్మకత మాత్రం బాగుంది. మీరే చదవండి! పేరెంట్సో జన్మహ పేమెంట్సో విద్యతి! వన్ బై వనేస్య వరసస్య సంభవామి దగే దగే! ఇంతోహి బతుకు ఇంటెనక మరణస్య! చర్చా ప్రహసనన కరిష్యాం జిల్ జిల్ జిగే!!!! అపార్థా! పేరెంట్స్ వలన జన్మము, పేమెంట్స్ వలన చదువు, చదువు వలన ఉద్యోగము, ఉద్యోగము వలన లంచము, లంచము వలన నేరము,…

ఇండియా చైనాల మధ్య 9 ఒప్పందాలు

చైనా పర్యటనలో ఉన్న ప్రధాని మన్మోహన్ సింగ్ చైనాతో ఏకంగా 9 ఒప్పందాలు కుదుర్చుకున్నారు. వాణిజ్య పరమైన ఒప్పందాలు మాత్రం ఏదీ కుదిరినట్లుగా పత్రికల్లో సమాచారం లేదు. అయితే తన చైనా పర్యటన గొప్పగా విజయవంతం అయినట్లు ప్రధాని ప్రకటించిచారు. ప్రధాని మన్మోహన్ సింగ్ కు రెడ్ కార్పెట్ పరిచి ఆహ్వానించారని, ఆయనను సంతోష పెట్టడానికి చైనా పెద్దలు వివిధ రకాలుగా ప్రయత్నించారని పత్రికలు రాశాయి. సరిహద్దు తగాదాల విషయంలో ఇరు దేశాలలో ఏదీ అవతలివారిపై మిలట్రీ…

పురచ్చి తలైవి రెండాకులు ఎక్కడ పూసేను? -కార్టూన్

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఇప్పుడు ఇతర రాజకీయ పార్టీలకు ‘అందని ద్రాక్ష’ ఆ ద్రాక్ష పండు భవిష్యత్తులో ఎవరికి తీపిని ఇస్తుందో ఎవరికి పుల్లదనాన్ని మిగుల్చుతుందో తెలియక జుట్టు పీక్కుంటున్నారు. 2జి కుంభకోణం దరిమిలా ఎ రాజా, దయానిధి మారన్ లపై నమోదయిన సి.బి.ఐ కేసులు డి.ఎం.కె పార్టీని అవాంఛనీయ పార్టీగా అందరూ చూస్తుండగా అన్నా డి.ఎం.కె ఆకర్షణీయంగా మారిపోయింది. పార్టీ అధినేత్రి, పురచ్చి తలైవి, జయలలిత తన రెండాకుల గుర్తును ఏ కూటమికి కానుకగా ఇస్తుందన్నది…

డ్రోన్ హత్యలు చట్టబద్ధమే -అమెరికా

డ్రోన్ హత్యలను అమెరికా సమర్ధించుకుంది. చట్టాలకు అనుగుణంగానే తాను డ్రోన్ హత్యలకు పాల్పడుతున్నానని స్పష్టం చేసింది. వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ జే కేర్ని ఈ మేరకు విలేఖరుల సమావేశం పెట్టి మరీ తమ హంతక చర్యలను సమర్ధించుకున్నాడు. అమలు చేయదగిన అన్ని చట్టాలకు అనుగుణంగానే తమ డ్రోన్ హత్యలు సాగుతున్నాయని ఆయన అన్నాడు. కానీ ఆ చట్టాలేమిటో ఆయన చెప్పలేదు. అమెరికా డ్రోన్ దాడులు అంతర్జాతీయ చట్టాలను, అమెరికా చట్టాలను ఉల్లంఘిస్తున్నాయని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్, హ్యూమన్…

వాయు బంధంతో రష్యా చైనాలు ఇంకా దగ్గరికి

బ్రిక్స్ కూటమిలో భాగస్వాములయిన రష్యా చైనా దేశాల మధ్య స్నేహ సంబంధాలు పరవళ్ళు తొక్కుతున్నాయి. అతి పెద్ద ఎనర్జీ మార్కెట్ గా చైనా శరవేగంగా అవతరిస్తున్న నేపధ్యంలో ప్రపంచంలోనే అతి పెద్ద సహజవాయువు ఉత్పత్తిదారయిన రష్యాకు భారీ మార్కెట్ అందుబాటులోకి వస్తోంది. ఈ మార్కెట్ ను సొమ్ము చేసుకునే ప్రక్రియలో భాగంగా ఇరు దేశాల మధ్యా భారీ వాణిజ్య ఒప్పందం కుదిరింది. రానున్న 7 సంవత్సరాల్లో 100 బిలియన్ డాలర్ల (10 వేల కోట్లు) చమురు, సహజవాయువును…

అమెరికా డ్రోన్ హత్యలు యుద్ధ నేరాలే -ఆమ్నెస్టీ

పాకిస్ధాన్ లో అమెరికా సాగిస్తున్న డ్రోన్ దాడులు యుద్ధ నేరాల కిందికి వస్తాయని బ్రిటన్ కి చెందిన అంతర్జాతీయ మానవ హక్కుల సంస్ధ ‘ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్’ నిర్ధారించింది. డ్రోన్ దాడులు చట్ట విరుద్ధమని వాటిలో కొన్ని యుద్ధ నేరాలు కూడానని సదరు సంస్ధ తెలిపింది. అమెరికా డ్రోన్ దాడులకు పాకిస్ధాన్ లోని కొందరు అధికారులతో పాటు ఆస్ట్రేలియా, జర్మనీ, బ్రిటన్ ప్రభుత్వాలు కూడా సహకారం ఇస్తున్నాయని చెప్పడం ద్వారా ఆమ్నెస్టీ చిన్నపాటి సంచలనానికి తెర తీసింది. అమెరికా…