రష్యాలో ఆత్మాహుతి దాడి, 16 మంది దుర్మరణం

రష్యాలోని వోల్వోగ్రాడ్ పట్టణ రైల్వే స్టేషన్ లో పట్ట పగలు ఆత్మాహుతి దాడి జరిగింది. ఒక మహిళా మిలిటెంటు తనను తాను పేల్చుకోవడంతో 16 మంది మరణించారని రష్యా టుడే పత్రిక తెలిపింది. మరో 37 మంది గాయపడ్డారని, వారిలో 8 మంది పరిస్ధితి ప్రమాదకరంగా ఉందని తెలుస్తోంది. ఆత్మాహుతి దాడికి పాల్పడిన మహిళ పేరు ఒక్సానా అస్లనోవా అని అనధికార వర్గాలను ఉటంకిస్తూ ఆర్.టి తెలిపింది. మరణాల సంఖ్యను రష్యా పరిశోధనా సంస్ధ ధృవీకరించింది. వోల్గోగ్రాడ్…

మోడి రాతలపై బాధితుల ఆగ్రహం

జకియా జాఫ్రీ పిటిషన్ ను మెట్రోపాలిటన్ కోర్టు కొట్టివేసిన అనంతరం నరేంద్ర మోడి తన బ్లాగ్ లో రాసిన రాతల పట్ల మారణకాండ బాధితుల్లో కొందరు ఆగ్రహం ప్రకటించారు. మోడి మొసలి కన్నీళ్లు కారుస్తున్నారని కొందరు వ్యాఖ్యానించగా ఆయన అనుభవించిన బాధ బైటపెట్టడానికి పన్నెండేళ్లు సమయం కావాలా అని మరి కొందరు ప్రశ్నించారు. ప్రధాన మంత్రి పదవి కోసమే మోడి కొత్తగా బాధ నటిస్తున్నారని వారు ఆరోపించారు. గోధ్రా రైలు దహనంలో కరసేవకుల దుర్మరణం చెందిన అనంతరం…

కోర్టుల పాత్రలో మీడియా!

(ఈ ఆర్టికల్ రాసి మూడు వారాలయింది. దిన పత్రిక కోసం ఇక్కడ ప్రచురించకుండా ఆపాను. ఇక ఆ సందర్భం దాటిపోయింది. అందువలన ప్రచురిస్తున్నాను.) కేసు ప్రస్తుతం ఫలానా కోర్టులో ఉంది అని చెప్పుకునే బదులు ‘మీడియా కోర్టులో ఉంది’ అని చెప్పుకునే రోజుల్లో ఉన్నామని అనేకమంది ఈ మధ్య తరచుగా వాపోతున్నారు. మీడియా దృష్టిని ఆకర్షించిన కేసుల్లో న్యాయమూర్తులు నిస్పక్షపాతంగా తీర్పు చెప్పలేని పరిస్ధితి వస్తోందన్నది విమర్శకుల అభిప్రాయం. న్యాయమూర్తి మీడియా ప్రభావం నుండి ఎంత దూరంగా ఉన్నా,…

కరెంటు వైరూ, చిరుగు బేనరూ … కాదేదీ గీతకనర్హం

అగ్గి పుల్లా కుక్క పిల్లా సబ్బు బిళ్ళ కాదేదీ కవితకనర్హం కవితామయమేనోయ్ అన్నీ…  అన్నారు మహాకవి శ్రీ శ్రీ శ్రీ శ్రీ అన్నది కవిత్వం గురించి. కవిత్వం అల్లడానికి అందమైన స్త్రీ మూర్తి మాత్రమే అర్హురాలని భావిస్తున్న రోజుల్లో, రచనా స్ఫూర్తి కోసం కావ్య ప్రబంధాలను బట్టీయం వేయాల్సిందేనని భావించే రోజుల్లో, మనో భావాలను అక్షరీకరించడానికి ఛందోబద్ధ సంకెళ్ళను విధించిన యుగంలో శ్రీ శ్రీ రాసిన ఈ కవిత ఒక పెద్ద సంచలనం! జన తత్వం వంటబట్టాలే…

ఢిల్లీ రాష్ట్ర పీఠంపై ఆమ్ ఆద్మీ

సామాన్య మానవుడి పేరుతోనే పార్టీ పెట్టిన అరవింద్ కేజ్రివాల్ బృందం దేశ రాజధానిలో అధికారం చేపట్టింది. సి.ఎం (కామన్ మేన్) స్వయంగా సి.ఎం (చీఫ్ మినిష్టర్) కుర్చీని అలంకరించిన దృశ్యం నేడు ఢిల్లీలో ఆవిష్కృతం అయింది. తాను నిజంగా కామన్ మేన్/ఆమ్ ఆద్మీ/సామాన్య మానవుడి నే అనీ, అధికారం మత్తు తాను ఎక్కించుకోనననీ, పదవీ దాహం తమ దరి చేరదని, ఢిల్లీ సామాన్య మానవుల సామాన్య కోర్కెలకు, సమస్యలకు, డిమాండ్లకు తాము కట్టుబడి ఉంటామని కేజ్రివాల్ బృందం…

గుజరాత్ అల్లర్లు ఆయన్ని మొదలంటా కదిలించాయట!

దాదాపు పన్నెండేళ్ళ నుండి గుజరాత్ అల్లర్లపై స్పందించడానికి నిరాకరించిన నరేంద్ర మోడి ఇప్పుడు నోరు విప్పారు. తన హయాంలో గుజరాత్ మారణకాండ చోటు చేసుకున్నందుకు కనీసం విచారం ప్రకటించడానికి కూడా మొండిగా తిరస్కరించిన మోడి, జకియా జాఫ్రీ విన్నపాన్ని మెట్రోపాలిటన్ కోర్టు తిరస్కరించిన అనంతరమే స్పందించారు. అల్లర్లపై విచారణ చేయడానికి సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు నియమించబడిన స్పెషల్ ఇనివేస్టిగేషన్ టీం (సిట్) నరేంద్ర మోడికి క్లీన్ చిట్ ఇవ్వడాన్ని జకియా జాఫ్రీ సవాలు చేశారు. ఆమె…

అవినీతి ఫైళ్ళు తగలబెడుతున్న ఢిల్లీ అధికారులు!

అరవింద్ కేజ్రివాల్ ఇంకా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనేలేదు. ఆయనింకా అధికార పీఠంపై కూర్చోనేలేదు. అప్పుడే ఢిల్లీ బ్యూరోక్రాట్ అధికారులకు చెమటలు కారిపోతున్నట్లున్నాయి. అవినీతి జరిగిన దాఖలాలను రుజువు చేసే ఫైళ్లను వారు తగలబెడుతున్నారని ఇండియా టుడే/ఆజ్ తక్ పత్రికా సంస్ధలు నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్ లో బైటపడింది. మరి కొందరు అధికారులు బదిలీ చేయించుకోడానికి ఉరుకులు పరుగులు పెడుతున్నట్లు తెలుస్తోంది. ప్రతి కుటుంబానికి రోజుకు 700 లీటర్ల మంచి నీరు ఉచితంగా సరఫరా చేస్తామన్న కేజ్రీవాల్…

కొత్త మలుపు: అరెస్టు నాటికి పూర్తి రక్షణకు దేవయాని అర్హురాలే

దేవయాని ఖోబ్రగదే అరెస్టు విషయం కొత్త మలుపు తిరిగింది. వియన్నా ఒప్పందం ప్రకారం కాన్సలార్ సిబ్బంది పూర్తి రాయబార రక్షణకు అర్హురాలు కాదని కాబట్టి ఆమె అరెస్టు, తదనంతరం ఆమె పట్ల వ్యవహరించిన తీరు చట్టబద్ధమే అని అమెరికా వాదిస్తున్న సంగతి తెలిసిందే. కానీ ఈ సంవత్సరం ఐరాస జనరల్ అసెంబ్లీ సమావేశాలను పురస్కరించుకుని దేవయానిని న్యూయార్క్ లోని ఐరాస శాశ్వత కార్యాలయానికి సలహాదారుగా నియమించింది. ఈ హోదాలో ఆమె పూర్తి రాయబార రక్షణకు అర్హురాలు అన్న…

మోడి మరియు మాధురి, ఒక అక్రమ నిఘా కధ

నరేంద్ర మోడి పై వచ్చిన స్నూపింగ్ ఆరోపణల కధ కేంద్ర ప్రభుత్వం చొరవతో రసకందాయంలో పడింది. ఒక అమాయక యువతి పట్ల మోహం పెంచుకున్న ‘సాహెబ్’ తన అనుంగు సహచరుడు అమిత్ షా కు ఆమెపై గూఢచర్యానికి పాల్పడమని ఆదేశాలు ఇవ్వడం, సదరు ఆదేశాలను అమిత్ తు.చ తప్పక పాటించడం, ఈ వ్యవహారాలన్నింటిని పరిశోధనాత్మక వార్తా పోర్టళ్ళు  కోబ్రా పోస్ట్, గులాయిల్ ఈక ఈక పీకి పెడుతుండడంతో గుజరాత్ ముఖ్యమంత్రిలోని మరో కోణం పచ్చిగా వెలుగు చూస్తోంది.…

కేజ్రివాల్, ఒక బహుమతి -కార్టూన్

“నేను ఒక విజయాన్నిగాని లేదా ఒక కేజ్రివాల్ ని గాని బహుమతిగా ఇమ్మని శాంతాను అడిగాను” – ఎ.ఎ.పి/కేజ్రివాల్ తో పొత్తు కాంగ్రెస్ కు లాభమా, నష్టమా? ఎ.ఎ.పి తో పొత్తు వద్దని కాంగ్రెస్ లో కొందరు నాయకులు మొదటి నుండి మొత్తుకుంటున్నారు. దానిక్కారణం ఆయన ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పై దాడి చేయడం ఒకటయితే, ముఖ్య కారణం కాంగ్రెస్ పాలనలో అవినీతిపై విచారణ జరిపిస్తానని వాగ్దానం చేయడం. కాంగ్రెస్ మద్దతు స్వీకరించడానికి కేజ్రివాల్ విధించిన 18 షరతుల్లో…

రెండు వాగ్దానాలు నెరవేర్చిన అరవింద్?

ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయకుండానే తాను ఇచ్చిన వాగ్దానాల్లో రెండింటిని అరవింద్ కేజ్రివాల్ నెరవేర్చినట్లు కనిపిస్తోంది. కోట్లాది కళ్ల పహారా మధ్య ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న అరవింద్ తనకు వ్యక్తిగత సెక్యూరిటీ అవసరం లేదని చెప్పి భద్రతా సిబ్బందిని వెనక్కి పంపేశారు. తద్వారా వి.ఐ.పి సంస్కృతిని నిర్మూలిస్తామన్న వాగ్దానం నెరవేర్చడానికి ఆయన నాంది పలికారు. అలాగే ప్రభుత్వ భవనంలోకి తన నివాసం మార్చుకోవడానికి కూడా ఆయన తిరస్కరించారని పత్రికలు తెలిపాయి. తాను గానీ, తన ఎమ్మేల్యేలు…

అమెరికా కాన్సలార్ సిబ్బంది ఐ.డి కార్డుల ఉపసంహరణ

ఇండియాలోని అమెరికా కాన్సలార్ సిబ్బందికి జారీ చేసిన ఐ.డి కార్డులను ఉపసంహరించుకున్నట్లు భారత ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. ఉపసంహరించుకున్న ఐ.డి కార్డుల స్ధానంలో సరిగ్గా అమెరికాలో భారత కాన్సలార్ సిబ్బందికి జారీ చేసిన కార్డుల తరహాలోనే కొత్త కార్డులు జారీ చేస్తామని ప్రభుత్వం తెలిపింది. అమెరికా కాన్సలార్ సిబ్బంది కుటుంబ సభ్యులకు ఇచ్చిన ఐ.డి కార్డులను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు తెలిపింది. అమెరికాలో భారత సిబ్బంది కుటుంబ సభ్యులకు ఐ.డి కార్డులేమీ ఇవ్వలేదనీ అందువలన అమెరికా సిబ్బంది…

ఎడారికి కూడా ఇంత అందమా? -ఫోటోలు

ఎడారి అంటే మనకి చులకన. అక్కడ ఏమీ పండదనీ, ఇసుక తప్ప మరేమీ కనపడదనీ, అక్కడ మనుషులు బ్రతకడం దుర్లభం అనీను. ఇవన్నీ కొంతవరకు నిజమే అయినా ఎడారి దేశాల్లోనూ నాగరికతలు విలసిల్లిన వాస్తవాన్ని చరిత్ర రికార్డు చేసింది. నీరు దొరకని ఎడారుల్లో ప్రయాణించడానికి ప్రకృతి మనకి ప్రసాదించిన వరం ‘ఎడారి ఓడ.’ ఒయాసిస్సులు ఎడారి దేశాలకు ఆభరణాలై వర్ధిల్లగా నాగరికతలు మాత్రం ఎందుకు వర్ధిల్లవు? ఈ ఫోటోలు ఈజిప్టు ఎడారి సహారాకు చెందినవి. పశ్చిమ ఈజిప్టులో…

ఎకె-47 సృష్టికర్త కలష్నికోవ్ మరణం

ఈ రోజుల్లో ఎకె-47 రైఫిల్ గురించి విననివారు బహుశా ఎవరూ ఉండరు. చిన్న పిల్లాడి దగ్గర్నుండి పండు ముదుసలి వరకూ ప్రపంచ వ్యాపితంగా ఈ రైఫిల్ సాధించుకున్న పేరు ప్రతిష్టలు అసామాన్యం. ఎటువంటి వాతావరణంలోనైనా తనను ధరించిన వారి అంచనాలను ఏ మాత్రం తప్పని లక్షణం వల్లనే ఎకె-47 రైఫిల్ అంతగా పేరు సంపాదించింది. అలాంటి ఎకె-47 సృష్టికర్త  మిఖాయిల్ కలష్నికోవ్ తన 94 వ యేట సోమవారం ఉద్ముర్తియా రిపబ్లిక్ రాజధాని ఇఝెవ్స్క్ లో మరణించారు.…

తెలంగాణ: వివక్ష లేనిదేక్కడ?

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర పునరుద్ధరణకు డిమాండ్ తలెత్తడానికి ముఖ్య కారణాలు రెండు. ఒకటి: వివక్ష రెండు: నిర్లక్ష్యం తెలంగాణ కంటే ముందుగా సంపన్నులైన సీమ, ఆంధ్ర భూస్వామ్య, దళారీ పెట్టుబడిదారీ వర్గాలు ఆంధ్ర ప్రదేశ్ అధికార పగ్గాలను తమ చేతుల్లో ఉంచుకోగలిగారు. తద్వారా నూతనంగా సంపన్నులవుతున్న తెలంగాణ భూస్వామ్య, దళారీ పెట్టుబడిదారీ వర్గాలకు అవకాశాలను వివిధ రూపాల్లో నిరాకరించారు. అవకాశం ఉన్న చోటల్లా వివక్ష చూపారు. అవకాశం లేనిచోట నిర్లక్ష్యం చూపారు. ఇందులో సీమ, ఆంధ్ర ప్రజలకు…