మరో ప్రతీకారం: అమెరికా రాయబారి వెళ్లిపోవాలని ఆదేశం

దేవయాని దేశం విడిచి వెళ్లాలని అమెరికా ఆదేశించడంతో ఇండియా మరో ప్రతీకార చర్య ప్రకటించింది. దేవయాని ర్యాంకుకు సమానమైన అమెరికా రాయబార అధికారిని ఇండియా విడిచి వెళ్లాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఐరాసలోని భారత శాశ్వత కార్యాలయంలో దేవయాని ప్రస్తుతం నియమితురాలయిన సంగతి తెలిసిందే. ఐరాసలో భారత తరపు అధికారిగా దేవయాని పూర్తిస్ధాయి రాయబార రక్షణకు అర్హురాలు. రెండు రోజుల క్రితమే (జనవరి 8) దేవయానికి ఈ హోదా ఇస్తూ అమెరికా ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. దేవయాని…

పూర్తయిన నేరారోపణ, ఇండియా వస్తున్న దేవయాని

దేవయాని సమస్య ఎట్టకేలకు పరిష్కారం అవుతోంది. గురువారం వరుసగా, వేగంగా జరిగిన నాటకీయ పరిణామాల మధ్య దేవయాని ఇండియాకు తిరిగి రావడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఓ వైపు న్యూయార్క్ ప్రాసిక్యూషన్ కోర్టులో దేవయానిపై అభియోగాలను మోపడం పూర్తి అవుతుండగానే ఆమెకు పూర్తి స్ధాయి రాయబార రక్షణ కల్పించే ఐరాస భారత శాశ్వత కార్యాలయం బదిలీని ఆమోదిస్తున్నట్లు అమెరికా విదేశాంగ శాఖ కార్యాలయం ప్రకటించింది. దానితో రాయబార రక్షణ ఆసరాతో దేవయాని ఇండియాకు తిరిగి రావడానికి మార్గం సుగమం…

సహారా: డబ్బెక్కడిదో చెప్పు లేదా సి.బి.ఐని పిలుస్తాం

సహారా కంపెనీల మోసం కేసులో సుప్రీం కోర్టు మళ్ళీ కొరడా విదిలించింది. సుప్రీం ఆదేశాల మేరకు మదుపుదారులకు 22,000 కోట్లు చెల్లించేశానని సహారా కంపెనీ చెప్పడంతో సుప్రీం కోర్టు మోసం శంకించినట్లు కనిపిస్తోంది. అంత డబ్బు ఎక్కడి నుండి తెచ్చి చెల్లించారో వివరాలు ఇవ్వాలని కోరింది. ‘డబ్బు ఎక్కడిదో మీకు అనవసరం’ అని సెబికి బదులు ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. డబ్బు ఎక్కడిదో చెప్పాలని లేదా సి.బి.ఐ విచారణకు ఆదేశిస్తామని సహారా అధినేత సుబ్రతో రాయ్…

ఎలక్షన్ కమిషన్: భద్రతా భయంతో గూగుల్ ఒప్పందం రద్దు

భారత ఎలక్షన్ కమిషన్ ఒక భేషయిన నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వాల వల్ల కాని పని తనకు చేతనవునని చాటుకుంది. ఓటర్ల సేవల నిమిత్తం గూగుల్ కంపెనీతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. జాతీయ భద్రతకు ప్రమాదం వాటిల్లుతుందని రాజకీయ పార్టీలు ఆందోళన వ్యక్తం చేయడంతో ఈ నిర్ణయం ప్రకటించింది. అమెరికా, బ్రిటన్ గూఢచార సంస్ధలు ఎన్.ఎస్.ఏ, జి.సి.హెచ్.క్యూ లు ప్రపంచ ఇంటర్నెట్ వినియోగదారులందరి పైనా గూఢచర్యం సాగిస్తున్నాయని, దీనికి గూగుల్, యాహూ, మైక్రోసాఫ్ట్ తదితర అమెరికన్ ఇంటర్నెట్…

కాశ్మీర్: ఎఎపి ఆఫీసు దాడి, హిందూ రక్షా దళ్ నేత అరెస్ట్

బుధవారం ఉదయం ఘజియాబాద్, కౌసాంబి లోని ఎఎపి ప్రధాన కార్యాలయం పైన హిందూ రక్షా దళ్ పేరుతో 40 మందితో కూడిన మూక దాడి చేసింది. అక్కడ ఉన్న పూల కుండీలను వాళ్ళు పగల గొట్టారు. పార్టీ ఫ్లెక్సీలను చించేశారు. తలుపులు, కిటికీలకు ఉన్న అద్దాలను పగల గొట్టారు. ఇక హిందూ మతాన్ని కాపాడుతాం… లాంటి నినాదాలు మామూలే. సుప్రీం కోర్టు ఎదురుగా ఉన్న తన కార్యాలయంలోకి రెండేళ్ల క్రితం జొరబడి దాడి చేసి కొట్టింది కూడా…

మోడీకి రామ్ దేవ్ మద్దతు, షరతులతో… -కార్టూన్

ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడు అందరికీ ఐడియాలు సమకూర్చిపెడుతోంది. బేషరతు మద్దతు ఇవ్వడానికి ముందుకు వచ్చిన కాంగ్రెస్ కు 18 షరతులు విధించిన ఆప్, అనంతరం కాంగ్రెస్ మద్దతు స్వీకరణకు కూడా ప్రజాభిప్రాయ సేకరణ జరిపి వినూత్న ప్రజాస్వామిక ఆచరణకు నాంది పలికింది. ఆప్ నుండి ‘క్లూ’ అందిపుచ్చుకున్నారేమో ఇప్పుడు బాబా రామ్ దేవ్ మోడీకి మద్దతు ఇస్తాను గానీ అందుకు కొన్ని షరతులు ఉన్నాయ్ అంటున్నారు. తాను మొదట కాంగ్రెస్ కు అవకాశం ఇచ్చాననీ కానీ…

ఎఎపి కాశ్మీరు (ద్వంద్వ) విధానం -కార్టూన్

“మన కాశ్మీరు పాలసీ పైన జనాభిప్రాయం ఏమిటో ఎస్.ఎం.ఎస్, ట్విట్టర్ ల ద్వారా తెలుసుకోవాల్సింది కాదా?” – కాశ్మీరు విషయంలో ఆమ్ ఆద్మీ పార్టీ తన సాధారణ విధానం నుండి పక్కకు తప్పుకుంది. ప్రతి పనికీ ప్రజల అభిప్రాయాన్ని కోరే ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు అటువంటి విధానం కాశ్మీరు ప్రజలకు మాత్రం వర్తించదని తన వింత విధానం ప్రకటించారు. అంటే ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ద్వంద్వ విధానం కలిగి ఉందన్నట్లే, ముఖ్యంగా కాశ్మీరు విషయంలో.…

పోలార్ వర్టెక్స్ అంటే?

పోలార్ వర్టెక్స్ వలన అమెరికాలో అత్యంత కనిష్ట స్ధాయికి ఉష్ణోగ్రతలు పడిపోయాయి. దానితో అక్కడ ప్రజా జీవనం దాదాపు స్తంభించిపోయింది. -56 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పడిపోయాయని పత్రికలు చెబుతున్నాయి. ది హిందూ పత్రిక ఈ ఉష్ణోగ్రతలను సెంటీ గ్రేడ్ లలో చెప్పగా రష్యా టుడే ఫారెన్ హీట్ లలో తెలిపింది. –50o C వరకు కనిష్ట ఉష్ణోగ్రత నమోదయిందని ది హిందూ తెలిపింది. రష్యా టుడే మాత్రం 56o F కనిష్ట ఉష్ణోగ్రత నమోదయినట్లు తెలిపింది.…

పోలార్ వొర్టెక్స్: అమెరికాపై చలి పులి పంజా

అమెరికా ప్రస్తుతం ‘పోలార్ వొర్టెక్స్’ చలి కౌగిలిలో వణికిపోతోంది. మధ్య పశ్చిమ (Midwest) అమెరికా రాష్ట్రాల నుండి ఈశాన్య రాష్ట్రాల వరకు ఆర్కిటిక్ చలిగాలులు వీస్తుండడంతో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. కొన్ని చోట్ల ఉష్ణోగ్రత -52o C వరకు నమోదయిందని పత్రికల ద్వారా తెలుస్తోంది. న్యూయార్క్, మిన్నెసోటా లాంటి రాష్ట్రాల్లో స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. అవసరం అయితే తప్ప రోడ్ల మీదికి రావద్దని ప్రభుత్వాలు కోరాయి. తీవ్ర చలిగాలులు ఉన్న చోట బైటికి వెళితే తెలియకుండానే గడ్డకట్టుకుని…

లైంగిక వేధింపులు: జస్టిస్ గంగూలీ రాజీనామా

లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎ.కె.గంగూలీ, పశ్చిమ బెంగాల్ మానవ హక్కుల కమిషన్ ఛైర్మన్ పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామా చేస్తారన్న ఊహాగానాలు నిజం అయ్యాయి. రాజీనామాపై తాను ఇంకా నిర్ణయించుకోలేదని ఈ రోజు ఉదయం పత్రికలకు చెప్పిన జస్టిస్ గంగూలీ సాయంత్రానికి రాజీనామా ఇచ్చేశారు. తనకు మద్దతుగా సుప్రీం కోర్టులో దాఖలయిన ‘ప్రజా ప్రయోజనా వ్యాజ్యం’తో తనకు సంబంధం లేదని కూడా గంగూలీ ఈ సందర్భంగా స్పష్టం…

జిఎస్ఎల్‌వి-డి5 విజయంతో క్రయో క్లబ్ లో ఇండియా

ఆదివారం జి.ఎస్.ఎల్.వి-డి5 ప్రయోగం విజయవంతం అయింది. దీనితో ఇండియా కూడా క్రయోజనిక్ ఇంజన్ సామర్ధ్యం గల దేశాల సరసన నిలిచింది. ఇప్పటివరకూ క్రయోజనిక్ సాంకేతిక పరిజ్ఞానం ఐదు దేశాలకు మాత్రమే సొంతం. జి.ఎస్.ఎల్.వి -డి5లో మూడో దశ కోసం అమర్చిన దేశీయ క్రయోజనిక్ ఇంజన్ విజయంవంతంగా పని చేయడంతో అమెరికా, రష్యా, జపాన్, చైనా, ఫ్రాన్స్, ఈ.యు ల సరసన ఇండియా కూడా చేరింది. గత సంవత్సరం ఆగస్టులో జరగవలసిన ప్రయోగం చివరి క్షణాల్లో ఇంధనం లీకేజీని…

బ్రిటన్ తీరాల్ని ముంచెత్తిన పెను తుఫాను

బ్రిటన్ ను పెను తుఫాను వణికిస్తోంది. తుఫాను ఫలితంగా 30 అడుగుల ఎత్తున అలలు విరుచుకుపడుతున్నాయి. దానితో తీర ప్రాంత నగరాలు నీటి సముద్రాలుగా మారాయి. అనేక చోట్ల రోడ్లు తెగిపోగా రేస్ కోర్సులు, మైదానాలు, స్టేడియంలు సైతం నీటితో నిండిపోయాయి. దక్షిణ, పశ్చిమ తీరాలు ప్రధానంగా పెను తుఫాను తాకిడికి గురవుతున్నాయి. తుఫాను తీవ్రత తగ్గలేదని సోమవారం వరకు కొనసాగుతుందని పర్యావరణ శాఖ తెలిపింది. ఇంగ్లాండ్ వ్యాపితంగా 100 కుపైగా వరద హెచ్చరికలు జారీ అయ్యాయి.…

రాహుల్ సిద్ధం, షరతులు వర్తించును -కార్టూన్

ప్రధాని మన్మోహన్ సింగ్ శుక్రవారం తన పదవీకాలంలో మూడోసారి పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన తన అధికార దండాన్ని రాహుల్ గాంధీకి అప్పగిస్తున్నట్లుగా పరోక్షంగా సూచించారు. ప్రధాన మంత్రి అభ్యర్ధిని తర్వాత ప్రకటిస్తాం అని చెబుతూనే కాంగ్రెస్ నాయకులలోకెల్లా రాహుల్ గాంధీకే ఆ పదవికి తగిన అర్హతలు ఎక్కువ ఉన్నాయని చెప్పారు. తద్వారా తన వారసుడు రాహుల్ గాంధీయే అని ఆయన స్పష్టం చేశారు. తన ప్రసంగంలో ప్రధాన మంత్రి పత్రికలపై విమర్శలు కురిపించారు. పత్రికల…

రైతుల భూములు లాక్కొని తిరిగివ్వని కోకొకోల

ఉత్తర ప్రదేశ్ లో రైతులపై కోకొకోల కంపెనీ సాగిస్తున్న దౌర్జ్యన్యం ఇది. గ్రామ రైతులు ఉమ్మడిగా వాడుకునే భూమిని అక్రమంగా ఆక్రమించిన కంపెనీ రైతులు ఆందోళన చేసినా ఆక్రమించిన భూమిని వెనక్కి ఇవ్వలేదు. చివరికి ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం కంపెనీకి నోటీసు ఇచ్చి గడువు విధించింది. గడువు ముగిసినా ప్రభుత్వ ఆదేశాలను లెక్క చేయని కోలా కంపెనీ రైతులపై ఎదురుదాడికి తెగబడింది. ఆక్రమించిన భూమిని కొన్న భూమిగా వాదిస్తోంది. కోకోకోలా నీటి చౌర్యానికి వ్యతిరేకంగా దాదాపు 15…

ఇరాక్: అమెరికా అంటించిన రావణ కాష్టం

అమెరికా, ఐరోపాలు నెలకొల్పిన ప్రజాస్వామ్యం ఇప్పుడు ఇరాక్ లో మూడు పేలుళ్లు, అరవై చావులుగా వర్ధిల్లుతోంది. పశ్చిమ దేశాల నుండి అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, స్పెయిన్… ఇత్యాది దేశాల సైనిక మూకలు మోసుకొచ్చిన ఆధునిక విలువలు ఇరాక్ ను ఆధునిక నరకంగా మార్చివేశాయి. 8 యేళ్ళ పాటు తిష్ట వేసిన నాటో కూటమి సైన్యాలు నాటిన సెక్టేరియన్ విద్వేషాలు ఇప్పుడక్కడ ఆత్మాహుతి దాడులుగా, బాంబు పేలుళ్లుగా, వేలాది హత్యలుగా పుష్పించి విరాజిల్లుతున్నాయి. 2008 తర్వాత అత్యంత…