మోడీకి నీతివంతులైన యువకులు కావాల్ట! -కార్టూన్

‘రాజకీయాలు ఎలా చేయాలో మేం వారికి నేర్పుతాం’ అని అరవింద్ కేజ్రీవాల్ కొన్ని నెలల క్రితం అన్నపుడు ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. కొంతమంది పైకే నవ్వితే చాలా మంది లోలోపలే నవ్వుకున్నారు. అరవింద్ ది అతి విశ్వాసం అని చాలామంది రాజకీయ పరిశీలకులు విశ్లేషించారు. కానీ ‘నవ్విన నాప చేనే పండుతుంది’ అన్నట్లుగా ఇప్పుడు ఎఎపి వల్ల ప్రభావితం కానీ పార్టీ అనేదే ఇండియాలో లేకుండా పోయింది. కాంగ్రెస్ అగ్ర యువ నేత రాహుల్ గాంధీ ఎఎపిని…

కవోష్ణ జ్వాలల జిమ్ము సినబాంగ్ అగ్నికొండ -ఫోటోలు

ఇండోనేషియాలోని ఉత్తర సుమత్ర రాష్ట్రంలోని సినబాంగ్ అగ్ని కొండ ఇంకా మండుతూనే ఉంది. తానే రగిలే వడగాలై అగ్ని కిలలు విరజిమ్ముతోంది. గత సంవత్సరం సెప్టెంబర్ నుండి భారీ పరిణామాల్లో బూడిద, లావా, మంటలు ఆకాశంలోకి ఊస్తున్న సినబాంగ్ కొండ ధాటికి గ్రామాలకు గ్రామాలు ఖాళీ చేసి వలస పోవాల్సిన పరిస్ధితి. సినబాంగ్ కొండ చిమ్ముతున్న బూడిద పరిమాణాలను చూస్తే అక్కడేదో అణు బాంబు పేలినట్లే కనిపిస్తోంది. పైరో క్లాస్టిక్ వాయువు, బూడిద, మంటలు అని పిలుస్తున్న…

రష్యా టెర్రర్ దాడులకు కారణం సౌదీ?!

మూడు వారాల క్రితం రష్యా పట్టణం వోల్గో గ్రాడ్ లో జరిగిన ఉగ్రవాద పేలుళ్లకు కారణం సౌదీ అరేబియా అయి ఉండవచ్చన్న అనుమానాలు బలపడుతున్నాయి. ఈ పేలుళ్లకు బాధ్యులుగా ఇంతవరకూ ప్రకటించుకోనప్పటికీ డోకు ఉమరోవ్ నేతృత్వంలోని చెచెన్ తీవ్రవాద సంస్ధే పేలుళ్లకు పాల్పడి ఉండవచ్చని ఇప్పుడు పలు పత్రికలు భావిస్తున్నాయి. చెచెన్ ఉగ్రవాద నేత డోకు ఉమరోవ్ ‘కాకసస్ ఎమిరేట్స్’ అనే సంస్ధకు నాయకత్వం వహిస్తున్నాడు. సౌదీ అరేబియా పాలక వంశం పోషించే వహాబిస్టు మత భావాలను…

ఎఎపి పాలన: చిల్లర వర్తకం ఎఫ్.డి.ఐకి నో

ఢిల్లీ ప్రభుత్వం పాత నిర్ణయాన్ని తిరగదోడింది. చిల్లర వర్తకంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతించాలన్న షీలా ప్రభుత్వ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చినట్లు తెలిపింది. తాము ఎఫ్.డి.ఐ లకు వ్యతిరేకం కాదని కానీ తమ పార్టీ ఇచ్చిన ఎన్నికల వాగ్దానానికి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన రిటైల్ వర్తకం ఎఫ్.డి.ఐ చట్టం ప్రకారం బహుళ బ్రాండుల చిల్లర వర్తకంలో విదేశీ పెట్టుబడులను అనుమతించేదీ లేనిదీ…

గొర్రెని చూసి పులి చారల్ని చెరిపేసుకున్నట్లు…

‘పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు’ అని సామెత! కానీ పులులకు పాడుకాలం దాపురించింది. పులుల వైభోగం చూసి నక్కలు వాటిని అనుకరించడానికి బదులు గొర్రెల వైభోగానికి పులులే ఈర్ష్య పడాల్సిన చేటుకాలం దాపురించింది. కాకపోతే విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం నడుపుతున్న కాంగ్రెస్ ఎమ్మేల్యేలు, ఎం.పిలే రిలయన్స్ ఎనర్జీ కంపెనీకి వ్యతిరేకంగా ఆందోళనకు దిగడం మనం ఎరుగుదుమా? ఎఎపి అనే గొర్రె ఢిల్లీ పీఠాన్ని అధిష్టించి విద్యుత్ ఛార్జీల్ని సగానికి తగ్గించేయడంతో…

ఆయన విప్లవ ద్రోహి, ఆమె అతని భార్య కాదు -మావోయిస్టులు

ఆంధ్ర ప్రదేశ్ పోలీసులకు లొంగిపోయిన గుడ్స ఉసెండి అలియాస్ సుఖదేవ్ అలియాస్ గుముడవెల్లి వెంకట కృష్ణ ప్రసాద్ ను విప్లవ ద్రోహి గా సి.పి.ఐ(ఎం-ఎల్-మావోయిస్టు) పార్టీ ప్రకటించింది. పార్టీతో ఆయనకు సైద్ధాంతీక విభేదాలు తలెత్తాయన్న ప్రచారం ఒట్టిదే అని పార్టీ తెలిపింది. నైతికంగా దిగజారిన సుఖదేవ్ విప్లవ ద్రోహిగా మారి పోలీసులకు లొంగిపోయాడు తప్ప రాజకీయ విభేదాల వల్ల కాదని తెలిపింది. ఆయన భార్య పార్టీలోనే కొనసాగుతున్నారని, బైటికి వెళ్ళేటప్పుడు కూడా వేరే మహిళను వెంటపెట్టుకుని వెళ్ళి…

చలికి చివికిపోతున్న అమెరికా దౌత్యం -కార్టూన్

తాజా రాజకీయ, ఆర్ధిక, సామాజిక పరిణామాలను ఉనికిలో ఉన్న వాతావరణంతో పోలిక పెట్టి పాఠకులకు గిలిగింతలు పెట్టడం కార్టూనిస్టులకు ఇష్టమైన విద్య. ది హిందూ కార్టూనిస్టు కేశవ్ కూడా ఈ కార్టూన్ లో ఈ విద్యనే ప్రదర్శించారు. పోలార్ వొర్టెక్స్ ప్రభావంతో గత వారం అంతా అమెరికా చలితో గజ గజ వణికిపోయింది. కొన్ని చోట్ల -56 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత పడిపోయేంతగా చలి గాలులు అమెరికాను పీడించాయి. ఆర్కిటిక్ చలి వాతావరణాన్ని సహజసిద్ధంగా పట్టి బంధించే…

నయాగరా జలపాతమే గడ్డకట్టిన కాలం… -ఫోటోలు

ప్రపంచంలో అత్యంత ఎత్తైన జలపాతం నయాగరా అని మనకి తెలిసిందే. గుర్రపు డెక్క ఆకారంలో ఉండే ఈ భారీ జలపాతం నిత్యం సందర్శకులను ఆకర్షిస్తూ ఎల్లప్పుడూ రద్దీగా ఉంటుంది. ఫొటోల్లో చూస్తేనే గుండెలు గుభిల్లుమానిపించే ఈ జలపాతం గడ్డ కడితే?! పోలార్ వొర్టెక్స్ పుణ్యమాని అటువంటి అరుదైన ప్రకృతి దృశ్యం మనిషి కళ్ల ముందు ఆవిష్కృతం అయింది. అమెరికా, కెనడాల సరిహద్దులో విస్తరించి ఉండే నయాగరా జలపాతం వద్ద చరిత్రలో అత్యంత కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో…

దేవయాని: అమెరికా ఆఫర్ తిరస్కరించిన ఇండియా

దేవయాని విషయంలో చివరి క్షణాల్లో అమెరికా ఇవ్వజూపిన ఒక ఆఫర్ ను భారత ప్రభుత్వం తిరస్కరించిన సంగతి వెల్లడి అయింది. దేవయానిపై మోపిన నేరారోపణల తీవ్రతను తగ్గించి నమోదు చేస్తామని, అందుకు సహకరించాలని అమెరికా అధికారులు కోరారు. అయితే తగ్గించిన ఆరోపణలు కూడా క్రిమినల్ ఆరోపణలే కావడంతో అందుకు భారత ప్రభుత్వం తిరస్కరించింది. ఆరోపణలను పూర్తిగా రద్దు చేయడం తప్ప మరో పరిష్కారం తమకు ఆమోదయోగ్యం కాదని ఇండియా స్పష్టం చేయడంతో అమెరికా తాను అనుకున్న పని…

ఎఎపి అనూహ్య పరిణామక్రమం -కార్టూన్

అసలది పార్టీయేనా అని ఈసడించుకున్నారు కొందరు. రాజకీయాలు చేయడం అంటే వీధుల్లో చేసేవి కావు అని సెలవిచ్చారు మరి కొందరు. ఎఎపి అసలు మా లెక్కలోనే లేదని హుంకరించారు బి.జె.పి నాయకులు. తనమీదనే పోటీ చేస్తున్న కేజ్రీవాల్ ని చూసి హేళనగా నవ్వి తీసిపారేశారు మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్! మరి ఇప్పుడో! ఎఎపి నుండి నేర్చుకోవాల్సింది మాకు చాలా ఉంది అని రాహుల్ గాంధీ లెంపలు వేసుకుంటున్నారు. అభ్యర్ధుల ఎంపికలో కూడా ఎఎపి ని అనుసరిస్తామని…

ఫుకుషిమా: 8 రెట్లు పెరిగిన రేడియేషన్

ఫుకుషిమా అణు కర్మాగారం వద్ద రేడియేషన్ ప్రమాద స్ధాయి కంటే 8 రెట్లు పెరిగిందని కర్మాగారాన్ని నిర్వహిస్తున్న టెప్కో (టోక్యో ఎలక్ట్రిక్ పవర్ కంపెనీ) కంపెనీ తెలిపింది. ప్రభుత్వం నిర్ణయించిన ప్రమాద స్ధాయి కంటే 8 రెట్లు పెరిగిందని అణు ధార్మికత నిండిన నీరు ట్యాంకర్ల నుండి లీక్ అవుతుండడమే దీనికి కారణం అని టెప్కో తెలిపింది. టోక్యో, జపాన్ ప్రజలకే కాకుండా అమెరికాకు కూడా వణుకు పుట్టిస్తున్న రేడియేషన్ లీకేజిని అరికట్టడానికి కంపెనీ వద్ద ఆధారపడదగిన…

మంచుతో శిల్పాలు చెక్కినారు…

మనిషి సృజనాత్మకతకు అవధుల్లేవు అనడానికి ఈ మంచు శిల్పాలు ఒక సూచిక. శిల్పాల సంగతి అటుంచి చైనాలో మంచుతో ఏకంగా భవనాలే నిర్మించడం ఫొటోల్లో చూడొచ్చు. ఉత్తరార్ధ గోళంలో ఉన్న దేశాల ప్రజలకే ఈ మంచు శిల్పాలు చెక్కే అవకాశం వస్తుందనుకుంటాను. అంటార్కిటికాకు దగ్గర్లో ఉన్న ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లలో కూడా శిల్పాలు చెక్కే మంచు అందుబాటులో ఉంటుందేమో. బిగ్ బెన్ గడియారం దగ్గర్నుండి వివిధ జంతువులు, వివిధ మైధాలజీల పాత్రలు, టైటానిక్ పడవలాంటి ఘటనల వరకూ భారీ…

ఎఎపి జనతా దర్బార్

ఆమ్ ఆద్మీ పార్టీ నేతృత్వంలోని ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు తన మొట్ట మొదటి జనతా దర్బార్ నిర్వహించింది. ఢిల్లీ సెక్రటేరియట్ ఎదురుగా రోడ్డుపైనే కూర్చుని దర్బార్ నిర్వహించగా జనం పోటెత్తారు. జనం భారీగా తరలి రావడంతో వారిని కట్టడి చేయడం పోలీసుల వల్ల కాలేదు. సమస్యలతో కూడిన విజ్ఞాపనలు ఇవ్వడానికి ప్రజలు తోసుకోవడంతో ముఖ్యమంత్రి అరవింద్ ఒక దశలో వేదికను వదిలి వేళ్లిపోవాల్సి వచ్చింది. తగిన ఏర్పాట్లు చేశామని చెప్పినప్పటికీ ఆ ఏర్పాట్లు కూడా…

ఎఎపి రాజకీయ అయస్కాంతం -కార్టూన్

ఎఎపి నేతృత్వంలోని ఢిల్లీ ప్రభుత్వం ఒక్కో రోజూ తీసుకుంటున్న పాలనా చర్యలు స్వతంత్ర పరిశీలకులను అయస్కాంతంలా ఆకర్షిస్తున్నాయి. అనేకమంది ప్రముఖులు తాము ఎఎపి లో చేరుతున్నామని ప్రకటింస్తున్నారు. వివిధ రంగాలలో లబ్ద ప్రతిష్టులయిన ప్రముఖులు వీరిలో ఉండడం విశేషం. మరోవైపు పెద్ద పెద్ద పార్టీలు నైరాశ్యపు చలికి మునగడ తీసుకుని ఎఎపి ఆకర్షక గాలికి తట్టుకోవడం ఎలాగా అని ఆందోళనలో పడిపోయాయని కార్టూన్ సూచిస్తోంది. నరేంద్ర మోడి రాష్ట్రం గుజరాత్ లో ప్రముఖ నర్తకి మల్లికా సారాభాయ్…

నాలుగేళ్ల ఆఫ్ఘన్ పిల్లాడిన చంపేసిన అమెరికా సైన్యం

‘టెర్రరిజంపై ప్రపంచ యుద్ధం’లో నిండా మునిగిన అమెరికా సైనికులు 4 సంవత్సరాల వయసుగల టెర్రరిస్టును కాల్చి చంపి కాలరెగరేశారు. ఆనక ప్రమాదవశాత్తూ చంపామని ప్రకటించారు. దుమ్ము దట్టంగా ఉండడంతో 4 యేళ్ళ పిల్లాడు తమ మీదికి దాడికి వస్తున్నాడని భావించి కాల్చి చంపామని సైనికులు చెప్పారని స్ధానిక ఆఫ్ఘన్ ప్రభుత్వం తెలిపింది. ఆఫ్ఘన్ పౌరుల ప్రాణాలకు హామీ ఇస్తే తప్ప అమెరికాతో ‘ద్వైపాక్షిక భద్రతా ఒప్పందాని’కి ఒప్పుకునేది లేదని చెబుతున్న అధ్యక్షుడు కర్జాయ్ తాజా ఘటనతో స్వరం…